రాజకీయ నాయకులు ప్రసంగాలు ఇచ్చేటపుడో.. ప్రెస్ మీట్లలోనో మాటలు తడబడితే.. అవి పట్టుకుని సోషల్ మీడియా జనాలు ఎంతగా ట్రోల్ చేసేస్తుంటారో తెలిసిందే. వాటి ఆధారంగా కొందరి మీద ఒక ముద్ర వేసి అదే పనిగా కామెడీ చేస్తుంటారు. జాతీయ నాయకుల్లో రాహుల్ గాంధీ.. ఏపీ వరకు తీసుకుంటే నారా లోకేష్ ఇలాగే లక్ష్యంగా మారిపోయారు. కొంచెం ఛాన్సిచ్చేసరికి దాన్ని ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థులు వాళ్లను దారుణంగా ట్రోల్ చేసి …
Read More »రెండు పార్టీల నేతలు హడావుడి మొదలుపెట్టేశారు
ఆలులేదు చూలులేదు..అల్లుడి పేరు సోమలింగం అన్న సామెతలాగ తయారైపోయింది అధికార టీఆర్ఎస్-బీజేపీల వ్యవహారం. హుజూరాబాద్ లో ఎప్పుడు జరుగుతుందో తెలీని ఉపఎన్నికల కోసం ఇప్పటి నుండే రంగంలోకి దిగేశాయి రెండు పార్టీలు. అనవసరంగా టెన్షన్ పెంచేసుకుంటున్నారు పై పార్టీల నేతలు. ఎంఎల్ఏ పదవికి మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈటల రాజీనామా చేశారు కానీ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఎవరు చెప్పలేకున్నారు. ఈ విషయంలో …
Read More »తెలంగాణ ప్రభుత్వం తొందరపడిందా?
అనుకున్నదే అయింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తేసింది. ముందుగా ఉదయం 10 నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ పెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత మధ్యాహ్నం 2 వరకు సడలింపులు ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా లాక్డౌన్ను ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు, మరణాలు బాగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. …
Read More »రాహుల్ @ 51.. దశ తిరుగుతుందా?
వందేళ్ల సీనియార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 51వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. నిజానికి గాంధీల కుటుంబం పరంగా చూస్తే.. ఇందిర, రాజీవ్గాంధీలు.. ఈ వయసులోపే.. అంటే ఫార్టీల్లోనే ప్రధానమంత్రి పీఠాలను అధిరోహించారు. అలాంటి రికార్డు ఉన్న గాంధీల వారసుడుగా రాహుల్ కు ఇప్పుడు పెద్దబాధ్యతే ఉంది. ప్రస్తుతం 51వ ఏడులోకి అడుగు పెట్టిన రాహుల్.. కరోనా నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలకు …
Read More »ఆ పట్టుదలకు 550 రోజులు.. సపోర్ట్ చేయాల్సిందే!
ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 550 రోజులుగా సాగుతున్న ఉద్యమం. అది కూడా ఐదుకోట్ల మంది కోసం చేస్తున్న ఉద్యమం..మరి దీనిలో మన పాత్ర ఎంత? అనేది తరచి చూసుకోవాలి.. అది కలల రాజధాని. ప్రపంచ స్థాయి నగరంగా వర్థిల్లాల్సిన రాజధాని. అయితే.. మారిన పాలకుడి కారణంగా.. ఈ ప్రభ సన్నగిల్లిపో యింది. ప్రపంచ స్థాయి నగరం.. ఇప్పుడు కన్నీరు పెడుతోంది. అదే నవ్యాంధ్ర రాజధాని …
Read More »టీడీపీలో ఈ అంచనాలు.. కర్ర విడిచి సాముచేస్తున్నారే!
ఔను! ఈ లెక్కలేంటి? ఈ లోకం ఏంటి? ఇదీ.. ఇప్పుడు టీడీపీ గురించి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం ఎవరు కాదన్నా.. ఔనన్నా.. టీడీపీకి జీవితకాల మద్దతు దారులు సైతం అంగీకరిస్తున్న కీలక విషయం.. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని! దీనిని ఎవరూ కాదనరు. మరి పార్టీని పుంజుకునేలా చేసేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అంటే.. మాత్రం వేళ్ల మీదనే లెక్కించుకోవాల్సి వస్తోంది. అదేసమయంలో పార్టీ పరిస్థితి ఇలా …
Read More »రూటు మార్చిన అసమ్మతి
కర్నాకటలో అసమ్మతి నేతలు రూటు మార్చినట్లున్నారు. యడ్యూరప్పను సీఎం పదవిలో నుండి తొలగించే విషయంలో అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీ నుండి అరుణ్ సింగ్ అనే దూతను అగ్రనేతలు పంపిన విషయం తెలిసిందే. ఎలాగైనా యడ్డీని పదవిలో నుండి దింపేయాలనే ఉద్దేశ్యంతో వ్యతిరేక వర్గాలన్నీ ఏకమవుతున్న విషయం తెలిసిందే. అరుణ్ తో భేటీ అయిన మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు యడ్డీ విషయమై తమ అభిప్రాయాలను స్పష్టంగానే చెప్పారు. అయితే అభిప్రాయసేకరణ …
Read More »ట్విట్టర్ పై వేటు తప్పదా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులుగా కేంద్ర్రప్రభుత్వానికి, సోషల్ మీడియా నెట్ వర్క్ యాజమాన్యాలకు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో నిర్వహించే ఏ సోషల్ నెట్ వర్కయినా దేశ చట్టాలకు లోబడే పనిచేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా యాజమాన్యాలు మనదేశ చట్టాలను అంగీకరించాయి. అయితే ట్విట్టర్ మాత్రం అంతిమంగా తమ విధానాలే తమకు ముఖ్యమని వాదిస్తోంది. ఇదే విషయమై …
Read More »బీజేపీ ఓవర్ యాక్షన్
బీజేపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతున్నట్లుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశంపై పట్టణంలో బీజేపీ నేతలు నానా గోల చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రొద్దుటూరులో ఆందోళనలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపిచ్చారు. దాంతో లోకల్ కమలం నేతలు నానా గోల చేశారు. ప్రొద్దుటూరులో అసలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకు …
Read More »ఊకకు .. ధాన్యానికి తేడా తెలీని బాబు..: కొడాలి
కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్న ఏపీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి శ్రీవేంకటేశ్వర రావు.. ఉరఫ్ నాని..తాజాగా మళ్లీ రెచ్చిపోయారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్పై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి నాని.. సీఎం జగన్ పై విమర్శలు చేస్తే.. తాట తీస్తామని హెచ్చరించారు. రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయారంటూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. …
Read More »ఏపీ సర్కారు పంతం.. ఎంసెట్కు పచ్చజెండా
“మా కొద్దీ..పరీక్షలు.. కరోనాతో అల్లాడిపోతున్నా.. పరీక్షలేంటి?” “మా పిల్లలకుచదువులు ముఖ్యమే.. అంతకన్నా.. వారి ప్రాణాలూ ముఖ్యమే. ప్రభుత్వం ఆలోచించాలి!” ఇదీ.. చదువులు-పరీక్షలపై ఏపీలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు.. కొన్నాళ్లుగా చేస్తున్న వ్యాఖ్యలు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వర్చువల్ భేటీలు నిర్వహించి.. వారి అభిప్రాయాలు కూడా సేకరించారు. ఈ సందర్భంగా తమకు పిల్లల ప్రాణాలే ముఖ్యమని తల్లిదండ్రులు.. ముక్తకంఠంతో …
Read More »హైదరాబాద్ లో బాబును కలిసిన వైసీపీ నేత ఎవరు?
వరుస ఎదురుదెబ్బలతో కిందా మీదా పడిపోతూ.. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు..ఆయన పార్టీ నేతలకు కాసింత ఊరట కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates