Political News

దీదీకి క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

అవును మీరు చదివింది నిజమే. కాకపోతే క్షమాపణలు చెప్పింది మొదటినుండి బీజేపీలోనే ఉన్న నేతకాదు. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ నుండి కమలంపార్టీలో చేరిన సోనాలి గుహ అనే సీనియర్ నేత. నాలుగుసార్లు ఎంఎల్ఏగా ఎన్నికైన గుహ ఎన్నికలకు ముందు మమతాబెనర్జీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు. అయితే వివిధ కారణాల వల్ల గుహ అక్కడ ఇమడలేకపోయారట. అందులోను మమత హ్యాట్రిక్ విజయం సాధించారు కదా. ఇక చెప్పేదేముంది తాజాగా గుహ …

Read More »

కొవాగ్జిన్ వేసుకుంటే విదేశాలకు వెళ్లలేరా?

మీరు ఏ వ్యాక్సిన్ వేసుకుంటారన్నంతనే చాలామంది నోటి నుంచి కొవాగ్జిన్ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకలా? అంటే సూటి కారణం చెప్పలేరు కానీ.. చాలామంది అదే మాట చెబుతున్నారు కదా? అన్న అర్థం లేని సమాధానం చాలామంది నోటి నుంచి వస్తుంది. ఏ వ్యాక్సిన్ మంచిది.. ఏ వ్యాక్సిన్ కాదన్న దానిపై చర్చ పలు రకాలుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకునే వారికి ఇప్పుడు ఊహించని …

Read More »

ఆర్కే దగ్గర సాక్ష్యాలు ఉన్నాయట.. కావాలంటే కేసు పెట్టుకోమన్నారు

ప్రతి వారాంతంలో తనదైన కామెంట్ తో భారీ పొలిటికల్ వ్యాసాన్ని రాసే అలవాటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కేకు ఉందన్న విషయం తెలిసిందే. వారం మొత్తమ్మీదా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ఆయన విశ్లేషణ సాగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణతో పోలిస్తే.. ఏపీ మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. జగన్ ను విమర్శించటం.. తప్పు పట్టటం లాంటివి తాము చేస్తున్నామని.. ప్రభుత్వం చేసే తప్పుల్ని …

Read More »

ఫుడ్ డెలివరీ రచ్చ.. రంగంలోకి కేటీఆర్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ లో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఫుడ్ డెలివరీని అత్యవసర సేవల్లో పరిగణించడం తెలిసిందే. దీంతో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలు గత ఏడాది లాక్ డౌన్ టైంలో మాదిరే ఇప్పుడూ పని చేస్తూ వచ్చాయి. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. హోటళ్లన్నీ మూత పడ్డ నేపథ్యంలో ఇంట్లో వంట వండుకునే …

Read More »

మోడీపై ట్రోలింగ్ వీడియోలు వైరల్

ప్రధాని నరేంద్ర మోడీని మీడియా వాళ్లు, అటు సోషల్ మీడియా జనాలు మోసే రోజులు పోయినట్లే ఉంది. వరుసగా రెండు పర్యాయాలు ఎన్డీఏ సర్కారును అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానిగా ఏడేళ్ల పాటు ఎదురే లేకుండా సాగిపోయిన ఆయన.. ఇప్పుడు ఊహించని స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి కొత్తగా దేశంలోకి అడుగు పెట్టింది కాబట్టి మోడీ సర్కారు ఎవరూ పెద్దగా నిందించలేదు. ఈ అనుభవం అందరికీ కొత్త …

Read More »

కేరళలో సాధ్యమైంది మనకెందుకు కుదరదు జగన్?

వ్యాక్సిన్ కొనుగోలు చేయటానికి సిద్ధం.. కేంద్రం చెప్పినట్లే కొనుగోలు చేయాల్సి వస్తుందంటూ ఏపీ సర్కారు వినిపిస్తున్న వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రం ఇచ్చే కోటాతో సంబంధం లేకుండా.. కొన్ని రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తోంది ఏపీ సర్కారు. రాష్ట్రంలో టీకా అవసరం ఉన్న వారందరికి ఉచితంగా వేయాలన్న సంకల్పంలో ప్రభుత్వం ఉందని.. అయితే కేంద్రం మాత్రం45 …

Read More »

టీకాలు వేయించుకుంటే బీరు ఉచితం !

అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. టీకా వేయించుకుంటే బీరు ఉచితమే. కాకపోతే మన దగ్గర కాదు సమా అమెరికాలో. టీకాలు వేయించుకునేందుకు జనాలను ప్రోత్సహించేందుకు అమెరికాలో కొన్ని రాష్ట్రాలో అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ప్రోత్సాహకాలు ఎందుకంటే టీకాలు వేయించుకునేందుకు జనాలు ముందుకు రావటంలేదు కాబట్టే. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా వాస్తవం అయితే ఇదే. ఇంతకీ విషయం ఏమిటంటే అమెరికా జనాభా 33 కోట్లు. అందరికీ టీకాల కార్యక్రమాన్ని …

Read More »

కృష్ణపట్నం మందు వాడిన హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితి ఇలానా?

రెండు రోజుల క్రితం ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అందులో నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన రిటైర్డు హెడ్మాస్టర్ కోటయ్య కరోనా తీవ్రతతో ఇబ్బంది పడ్డారు. ఆయన ఆనందయ్య ఇచ్చిన మందును కళ్లల్లో వేసిన రెండు.. మూడు నిమిషాలకే లేచి కూర్చున్నానని.. తన ఆరోగ్యం బాగైందని చెప్పటం తెలిసిందే. ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న …

Read More »

కోడెల కోటల్లో సైకిల్ నిలబడుతుందా ?

దివంగత కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల పాటు సేవ చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి, అదే పార్టీ జెండా కప్పుకుని తనువు చాలించారు. ఊహించని విధంగా రాజకీయ ఒత్తిడిలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే కోడెల మరణం టీడీపీకి తీరని లోటు అని చెప్పొచ్చు. కోడెల‌ మరణించాక నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయినట్లు కనిపిస్తోంది. నరసారావుపేట నియోజకవర్గం …

Read More »

విశాఖ ఉక్కుపై ఇక‌, మోడీదే నిర్ణ‌యం.. జ‌గ‌న్ తీర్మానం చేశారుగా…!

ఆంధ్రుల హ‌క్కు.. విశాఖ ఉక్కు- నినాదంతో ఏర్ప‌డిన విశాఖ ఉక్కును న‌ష్టాలు చూపిస్తూ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అందిన కాడికి అమ్మేసేందుకు రెడీ అయిన విష‌యం తెలిసిందే. దాదాపు 39 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటైన ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తారా ? అంటూ.. విశాఖ స‌హా ఏపీ మొత్తం మోడీపై దండెత్తింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. కేంద్రం మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గిన సంద‌ర్భం లేదు. ఎట్టి …

Read More »

మరో పెద్ద రాష్ట్రం మోడీ చేజార‌నుందా ?

బీజేపీకి ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయాల్లో వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌, బెంగాల్‌, త‌మిళ‌నాడులో బీజేపీకి మామూలు ఎదురు దెబ్బ‌త‌గ‌ల్లేదు. ముఖ్యంగా బెంగాల్ ప‌రాజ‌యాన్ని బీజేపీ నేత‌లు ఇప్ప‌ట‌కీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో బెంగాల్లో కేవ‌లం మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు గెలిచిన బీజేపీ మొన్న ఎన్నిక‌ల‌కు ముందు అధికారం మాదే అని నానా హ‌డావిడి చేసేసింది. చివ‌ర‌కు ఫ‌లితాల్లో 75 …

Read More »

పాపం.. ఆ డాక్టర్ చనిపోయాడు

గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు మీద విమర్శలు చేసి వివాదాల్లోకెక్కిన డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా? ఆయన శుక్రవారం చనిపోయాడు. సుధాకర్ గుండెపోటుతో తనువు చాలించినట్లు తెలుస్తోంది. సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని.. ఆయన మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ …

Read More »