టీడీపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజాబలం ఉన్న నాయకులు పనిచేయడం లేదు. ప్రజల బలం లేనివారు… ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని వారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. పోనీ.. వీరిని నమ్ముకుని చంద్రబాబు ముందుకు నడిచే పరిస్థితి ఉందా? అంటే.. అది కూడా లేదు. దీంతో పార్టీ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిత్యం మీడియాలో కనిపిస్తున్న మొహాలను చూస్తే.. టీడీపీ తరఫున బాగా మాట్లాడుతున్నారు. మంచి …
Read More »రూ.7వేలు ఉండే దుబాయ్ టికెట్ రూ.40వేలు ఎందుకైంది?
హైదరాబాద్ నుంచి ఢిల్లీ టికెట్ రూ.6వేలు వరకు ఉంటుంది. మరి.. హైదరాబాద్ నుంచి దుబాయ్ టికెట్ ధర ఎంత ఉంటుంది? సాధారణ రోజుల్లో రూ.7వేలకు వచ్చేస్తుంది. ఒక వెయ్యి అటు ఇటు తప్పించి మరి మార్పు ఉండదు. అందుకు భిన్నంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చేందుకు రూ.40వేలు చెల్లిస్తే తప్పించి టికెట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకిలా? అంటే.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులేని చెప్పాలి. తాజాగా పెరిగిపోతున్న …
Read More »ఆ విషయం లో మాత్రం జగన్ చాలా సీరియస్
వారాంతంలో తనకు తెలిసిన సమాచారాన్ని.. తాను అనుకున్న విషయాన్ని.. తనకు తానుగా ఎంపిక చేసుకున్న ఎజెండాను తన అక్షరాల రూపంలో సంధించే ఆంధ్రజ్యోతి యజమాని ఆర్కే.. ఒక వారం తన ఆర్టికల్ కు విశ్రాంతి ఇచ్చారు. ఆయన కుటుంబంలోని వారి ఆరోగ్య సమస్యల కారణంగా.. ఆయన దేని మీదా ఫోకస్ చేయలేకపోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తాను రాసిన వీకెండ్ కామెంట్ లో ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. …
Read More »టీడీపీ పై ఫ్రైడే ఎఫెక్ట్.. అన్నదే జరిగిందా ?
టీడీపీ ఏమని విమర్శలు గుప్పించిందో .. జగన్ ఇప్పుడు అదే చేస్తున్నారా ? టీడీపీ నేతలు.. ఏయే విషయాలపై తనను విమర్శించారో.. ఖచ్చితంగా ఆయా అంశాలపైనే .. వారిపై జగన్ కసి తీర్చుకుంటున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ అధికారంలో ఉన్పప్పుడు.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసేవి. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ను ఆటపట్టించేందుకు టీడీపీ నేతలు వరుస …
Read More »మోడీదే తప్పు.. నిప్పులు చెరిగిన ఇంటర్నేషనల్ మీడియా!
దేశంలో కరోనా 2.0 తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచస్థాయి రికార్డులను నమోదు చేస్తూ.. కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 3లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్న దేశంగా అమెరికా తర్వాత భారత్ ఉండడం గమనార్హం. అంతేకాదు.. కేసుల తీవ్రతకు తోడు ఆక్సిజన్ కొరత, వైద్య సదుపాయాల లేమి వంటివి దేశ ప్రజలను మరింత కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మీడియా విషయాన్ని పక్కన పెడితే.. అంతర్జాతీయ మీడియా భారత్లో నెలకొన్న పరిణామాలపై …
Read More »“నూతలపాటి వెంకట రమణ అనే నేను..”..
“నూతల పాటి వెంకట రమణ అనే నేను”.. అంటూ.. తెలుగు తేజం, ఏపీలోని కృష్ణాజిల్లా పొన్నవరం ప్రాంతానికి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది ప్రముఖులను మాత్రమే …
Read More »ఏపీలో మరో ఉప ఎన్నిక హీట్ స్టార్ట్ ?
ఏపీలోనూ.. తెలంగాణలోనూ వరుస ఎన్నికలతో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణలో గత సాధారణ ఎన్నికల నుంచి మొదలైన ఎన్నికల వేడికి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. తాజాగా ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి, తెలంగాణలో నాగార్జునా సాగర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు స్థానిక సంస్థలకు పెండింగ్ ఉన్న ఎన్నికలు కూడా ఈ సమ్మర్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల పరంపరలోనే ఏపీలో …
Read More »రత్నప్రభకు ఏపీ బీజేపీ నేతలే దెబ్బేశారా ?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి తామిచ్చిన వినతి ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఆందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. …
Read More »పరీక్షలా ? విద్యార్ధుల ప్రాణాలా ?
జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎంత ఉదృతంగా ఉన్నా, కేసులు ఎన్ని వేలు నమోదవుతున్నా 10వ తరగతి పరీక్షలను మాత్రం యధాతథంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. జగన్ తాజా నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో వాస్తవాలు తెలిసికూడా జగన్ 10వ తరగతి పరీక్షల నిర్వహణలో జగన్ ఎందుకింతగా పట్టుదలకు పోతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. నిజానికి 10వ తరగతి పరీక్షలు …
Read More »కొంచెం వెయిట్ చేయండి.. రంగంలోకి జగన్..!
“కొంచెం వెయిట్ చేయండి.. సీఎం సార్ జగనే రంగంలోకి దిగుతున్నారు”- ఇదీ రెండు రోజులుగా వైసీపీ నేతలకు సర్కారువారి కీలక సలహాదారు.. వైసీపీ కీలక నేత నుంచి ఫోన్లో అందుతున్న సమాచారం. ఈ జిల్లా ఆ జిల్లా అనే కాదు.. దాదాపు 11 జిల్లాల్లోని వైసీపీ నేతలతో ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు వైసీపీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. మరో రెండు నెల్లలోనే వైసీపీ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు …
Read More »‘పంపకాల’ కలవరం.. బాబుకు సెగ పెడుతుందా ?
టీడీపీలో సరికొత్త విషయం చర్చకు వస్తోంది. తమ్ముళ్లు ఈ విషయాన్ని తలుచుకుని కలవరపడుతున్నారు కూడా..! ఆ విషయం ఏంటి అంటారా ? అదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. అయితే.. ఓడిపోయినప్పటికీ.. ఒక విషయం మాత్రం తమ్ముళ్లకు పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా స్పష్టంగా తెలిసింది. అదేంటంటే.. పార్టీ ఓడిపోయింది.. కానీ.. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చారు. …
Read More »కన్నాకు అదృష్టం వరించేనా ? బీజేపీలో కీలక పదవులు..!
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్.. కన్నా లక్ష్మీనారాయణకు త్వరలోనే అదృష్టం వరించనుందా ? ఆయనను వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా పంపించాలని లేదా.. కేంద్ర పార్టీలోకి తీసుకోవాలని.. యోచిస్తున్నట్టు బీజేపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. కాంగ్రెస్లో సుదీర్ఘ అనుభవం గడిచింన కన్నాపై ఎన్నో ఆశలతోనే బీజేపీ పెద్దలు ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వచ్చీరావడంతోనే ఆయనకు ఏపీ బీజేపీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates