Political News

నిమిషాల వ్యవధిలో మూడుసార్లు వ్యాక్సిన్..చివరకు..!

దేశంలో కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా నిర్వహిస్తారు. అయితే.. ఈ వ్యాక్సినేషన్ సమయంలో పలు చోట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. ఓ మహిళకు కేవలం నిమిషాల వ్యవధిలో.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ 28ఏళ్ల మహిళ గత శుక్రవారం తన …

Read More »

భారత్ లో మరో వ్యాక్సిన్ కి గ్రీన్ సిగ్నల్..!

భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో..ప్ర‌పంచంలో అందుబాటులో ఉన్న న‌మ్మ‌క‌మైన వ్యాక్సిన్ల‌ల‌లో ఒక‌టిగా గుర్తింపు ఉన్న మెడెర్నా వ్యాక్సిన్ ఇండియాకు రానుంది. ఇండియాలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని మెడెర్నా ఔష‌ధ నియంత్ర‌ణ మండ‌లి అనుమ‌తి కోరింది. 18 సంవ‌త్స‌రాలు నిండిన వారికి అత్య‌వ‌స‌ర వ్యాక్సినేష‌న్ కు అనుమ‌తి ఇవ్వాల‌ని మెడెర్నా కోరింది. అమెరికా నుండి వ్యాక్సిన్ ను దిగుమ‌తి చేసుకొని… ఇండియాలో తాము వ్యాక్సిన్ …

Read More »

మంత్రులకు షర్మిల మద్దతిస్తున్నట్లేనా ?

Sharmila

తెలంగాణా-ఏపి మధ్య జరుగుతున్న జల జగడాలపై వైఎస్ షర్మిల స్పందన చూస్తుంటే మంత్రుల వాదనకు మద్దతిస్తున్నట్లే ఉంది. తెలంగాణాకు సంబంధించిన ఒక్క నీటిచుక్కను కూడా వదులుకునేది లేదని షర్మిల చాలా స్పష్టంగా చెప్పారు. ట్విట్టర్ వేదికగా జలజగడాలపై ఆమె స్పందించారులేండి. అవసరమైతే ఎవరితో అయినా పోరాడేందుకు సిద్ధమే అని ప్రకటించేశారు. జల వివాదాలేమిటి ? వివాదం నిజంగానే రాజుకుంటున్నదా అన్న విషయాలను పక్కనపెట్టేస్తే తెలంగాణా మంత్రులు వైఎస్సార్+జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు …

Read More »

రేవంత్ రెడ్డికి మేయర్ స్పెషల్ విషెస్.. ఫోటోలు వైరల్..!

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం కాదు.. స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి మరీ స్పెషల్ గా విషెస్ తెలియజేయడం ఇక్కడ విశేషం. ఆమె అలా శుభాకాంక్షలు తెలియడం పట్ల అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. విజయలక్ష్మీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. మేయర్ గా గెలుపొందారు. ఆమె.. కాంగ్రెస్ నేత రేవంత్ …

Read More »

మోడికి మరీ ఇంత చిన్నచూపా ?

ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుండి నరేంద్రమోడి ఏపి విషయాల్లో నిర్లక్ష్యంగానే ఉన్నారు. నిర్లక్ష్యం అనేకన్నా చిన్నచూపంటే సరిగ్గా సరిపోతుందేమో. తొందరలో జరుగుతుందని అనుకుంటున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఆ పేర్లలో చాలా రాష్ట్రాల నుండి చాలా పేర్లున్నా ఏపి నుండి ఒక్కపేరు కూడా పరిశీలనలో లేదట. మొదటేమో ప్రత్యేకహోదాను రాష్ట్రానికి ఎగ్గొట్టారు. తర్వాత విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ హుష్ కాకీ అయిపోయింది. ఆ తర్వాత …

Read More »

ఏపీలోనూ మార్పు త‌ప్ప‌దా.. కాంగ్రెస్‌లో గుబులు..!

ఏపీ కాంగ్రెస్‌లోనూ మార్పు త‌ప్ప‌దా ? పీసీసీ చీఫ్‌ను మార్చ‌డం ఖాయ‌మేనా ? ఇదీ.. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ను మార్చిన నేప‌థ్యంలో అక్క‌డ పార్టీలో భారీ మార్పుల దిశ‌గా పార్టీ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో ఏపీలోనూ మార్పు ఖాయ‌మ‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీకి సార‌థ్యం వ‌హిస్తున్న సాకే శైల‌జానాథ్ ప‌నితీరు …

Read More »

‘రాత్రి జీసస్ తో మాట్లాడా.. వైరస్ లేదన్నారు’- జగన్ స్పందన

రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఏదో ఒక కారణం చూపించి ఇమేజ్ డ్యామేజ్ చేయటం కనిపిస్తుంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. రివ్యూ మీటింగ్ వేళ.. ఆయన తీరు ఇలా ఉంటుందా? అని సామాన్య ప్రజానీకం అనుకునేలా రాసే రాతలపై తాజాగా ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఒక కాలమ్ లో సీఎం జగన్ గురించి రాసిన రాతల్ని.. అధికారులు జగన్మోహన్ రెడ్డికి …

Read More »

కేసీఆర్ మనమడికి ప్రతిష్టాత్మక అవార్డు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు హిమాన్షు మరోసారి వార్తల్లోకి వచ్చారు. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించటం లేదు. కరోనాకు ముందు వరకు అడపాదడపా వార్తల్లో మెరిసే వారు. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు అతడి ఊసే కనిపించని పరిస్థితి. ఇలాంటివేళ.. తాజాగా ఒక స్వీట్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. ‘సోమా’ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు ప్రతిష్టాతమ్మక డయానా పురస్కారాన్ని సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. …

Read More »

రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ఆలస్యమెందుకు?

తెలంగాణ కాంగ్రెస్ కి బాస్ ఎవరు అనేది తేలి పోయింది. కొన్ని నెలలుగా టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి కట్టపెడుతున్నారనే విషయంపై చాలానే చర్చలు జరిగాయి. టీ కాంగ్రెస్ నేతలు ఈ పదవి కోసం.. ఇక్కడ రాష్ట్రాన్ని వదిలేసి మరీ.. ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు. చివరకు అందరూ ఊహించినట్లుగానే.. రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 26వ తేదీన ఆయనను టీపీసీసీ చీఫ్ గా ప్రకటించారు. …

Read More »

జ‌గ‌న్ సార్‌.. విన్నారా? ఎమ్మెల్యేలు, ఎంపీల ఘోష‌

జ‌గ‌న్ సార్‌.. వ‌న్ మినిట్‌.. మాకు గుర్తింపు ఎప్పుడు?.. మమ్మ‌ల్ని ప‌ట్టించుకునేదెప్పుడు ? ఇదీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు.. ఎంపీలు అడుగుతున్న ప్ర‌శ్న‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం జ‌గ‌న్ తీసుకున్న కీల‌క నిర్ణ‌య‌మే. ప్ర‌జ‌ల‌కు – ప్ర‌భుత్వానికి మ‌ధ్య ప్ర‌జాప్ర‌తి నిధులే కీలకం. ప్ర‌భుత్వం అమ‌లు చేసే ప్ర‌తి కార్య‌క్ర‌మానికి, ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కానికి ప్ర‌జా ప్ర‌తినిధులు కీల‌కం. వీరే ప్ర‌జ‌ల్లోకి వాటిని తీసుకువెళ్లేవారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. …

Read More »

వైఎస్‌-జ‌గ‌న్‌ల‌ను తిడుతున్నా వైసీపీ నేత‌ల మౌనం వెన‌క ?

ఏపీ రాజ‌కీయాల్లో ఇదో చిత్ర‌మైన ప‌రిస్థితి. సీఎం జ‌గ‌న్‌కు, ఆయ‌న తండ్రికి అత్యంత ప్రియ‌మైన నేత‌లు.. నిత్యం వారి స్మ‌ర‌ణ‌తోనే నిద్ర లేచే నేత‌లు ఇప్పుడు ఒక విష‌యంలో చాలా మౌనంగా ఉన్నారు. నిజానికి జ‌గ‌న్‌ను కానీ, వైఎస్‌ను కానీ.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసినా.. ప‌రుష ప‌దాల‌తో దూషించినా.. ఫైర్ బ్రాండ్ నేత‌లు వెంట‌నే రియాక్ట్ అవుతారు. లైన్‌లోకి వ‌చ్చేసి మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేస్తారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు …

Read More »

కోవీషీల్డ్ వ్యాక్సిన్.. ఆ దేశాలకు నో ఎంట్రీ..!

కరోనా మహమ్మారి అంతమొందించేందుకు మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా మహమ్మారిని తరమికొట్టవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో.. అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం మన దేశంలో కోవీషీల్డ్, కో వ్యాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. కాగా.. వ్యాక్సిన్లలో ఒకటైన కోవీషీల్డ్ పై యూరప్ కంట్రీలు ఆంక్షలు విధిస్తున్నాయి. కోవీషీల్డ్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించమని తేల్చి చెబుతున్నాయి. కోవీషీల్డ్ …

Read More »