Political News

కాంగ్రెస్ ఎదగాలని కోరుకుంటున్న బీజేపీ సీనియర్ నేత

కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపేమో నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను దేశం నుండి పారదోలాలని పిలుపిస్తున్నారు. ఇదే సమయంలో ముంబాయ్ లో గడ్కరీ మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతమవ్వాలని సూచించారు. ఓటములు ఎదురువుతున్నాయని నీరసపడి పోకుండా మళ్ళీ బలోపేతమవ్వటానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేయాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ పిలుపుకు గడ్కరీ పిలుపు పూర్తి విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ …

Read More »

నష్టపోయిన ఏపీని పునర్నిర్మించేది టీడీపీనే..: చంద్ర‌బాబు

టీడీపీ సీనియ‌ర్ నేత‌ కంభంపాటి రామ్మోహనరావు రాసిన ‘‘నేను.. తెలుగుదేశం’’ పుస్తకాన్ని పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు, హ‌రియాణ గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ‌లు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సభలో  టీడీపీ అధినేత చంద్రబాబు, చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. ప్రజల ప్రయోజనాల కోసం తాను పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. ‘‘ నష్టపోయిన ఏపీని పునర్నిర్మించేది టీడీపీనే. ఎన్టీఆర్ శత జయంతి, మహానాడును వైభవంగా నిర్వహిస్తాం. ప్రాంతీయ పార్టీతో దేశ రాజకీయాలను వాదించింది ఎన్టీఆరే.. …

Read More »

ప్రజలకు జగన్ సర్కారు విన్నపం !

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విచ్చ‌ల‌విడిగా.. డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తూ.. సంక్షేమం పేరిట పందేరం చేసిన‌.. ప్ర‌భుత్వానికి అనూహ్యంగా `పొదుపు` గుర్తుకు వ‌చ్చింది. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా వాయిదా వేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా.. ప్ర‌జ‌లే పొదుపు పాటించాలంటూ.. పిలుపునిచ్చింది. దీనికి కార‌ణం.. విద్యుత్ డిమాండ్‌కు స‌ర‌ఫ‌రాకు, డిమాండ్‌కు మ‌ధ్య భారీ వ్య‌త్యాసం రావ‌డంతో స‌ర్కారు తాజాగా ప్ర‌జ‌ల‌కు ఒక బ‌హిరంగ …

Read More »

ప్ర‌ధానికి ఎంపీ RRR లేఖ‌.. సీఎంను ప్ర‌శ్నించాల‌ని డిమాండ్‌

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోడీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అలియాస్ ఆర్ ఆర్ ఆర్ సంచ‌ల‌న‌ లేఖ రాశారు. ఒక పనికోసం తెచ్చిన అప్పులు ఇతర పనులకు వాడటం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు, అధికారులపై చర్చలు తీసుకోవాలని ప్రధానిని కోరానని తెలిపారు. సీఎం జగన్, సీతయ్యలాగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఎవరి మాట వినరని విమర్శించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖలో స్థలాలకు కన్నాలు వేస్తున్నారని లేఖలో …

Read More »

20 లక్షలలో సున్నా లేపేసిన జగన్: లోకేష్ పంచ్

Lokesh

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. సీఎం జగన్ మాటలు కోటలు దాటుతాయేకానీ.. ఆయన చేతలు తాడేపల్లి ప్యాలెస్ కూడా దాటవని ఆయ‌న ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా బస్సు ప్రమాదంలో మరణించినవారికి రూ.2 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. అందుకే జగన్ మోసపు రెడ్డి మాటలు కోటలు దాటతాయే కానీ.. చేతలు తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని …

Read More »

అమిత్ షా ఆప‌రేష‌న్ తెలంగాణ‌!

Amit Shah Corona

ఇటీవ‌ల నాలుగు రాష్ట్రాల్లో తిరిగి అధికారం నిల‌బెట్టుకున్న బీజేపీ జోష్‌లో ఉంది. ఇదే ఊపులో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించ‌నుంది. ముఖ్యంగా తెలంగాణ‌లో బ‌లోపేతం దిశ‌గా సాగుతున్న బీజేపీ అధికార‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. బీజేపీ అగ్ర నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఆప‌రేష‌న్ తెలంగాణ‌తో రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని స‌మాచారం. స్వ‌యంగా అమిత్ …

Read More »

అఖిల ప్రియ‌ను దూరం పెట్టిన కుటుంబం!

దివంగ‌త రాజ‌కీయ నాయ‌కులు భూమా శోభ‌, నాగిరెడ్డి దంప‌తుల త‌న‌య‌గా రాజ‌కీయాల్లో ముద్ర వేసిన భూమా అఖిల ప్రియ ఇప్పుడు ఒంట‌రిగా మిగిలిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా కోర్టు కేసులు, వివాదాలు ఇలా ఆమె ఏదో ఒక స‌మ‌స్య‌లో చిక్కుకుంటూనే ఉన్నారు. మ‌రోవైపు భూమా కుటుంబంతోనే విభేదాలు కొన‌సాగిస్తున్నారు. దీంతో భూమా కుటుంబం, వారి బంధువ‌ర్గం ఇప్పుడు అఖిల ప్రియ‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల …

Read More »

`48 వేల కోట్ల‌`కు రాజ‌కీయ రంగు.. ఏం తేలిన‌ట్టు!

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మ‌రో కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ల్తీసారా, జేబ్రాండ్స్ అంటూ.. పెద్ద ఎత్తున టీడీపీ, వైసీపీల మ‌ధ్య రాజ‌కీయం సాగిన విష‌యం తెలిసిందే. దీని పై.. ఇరు పార్టీల నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అసెంబ్లీ ముగియ‌డంతో .. ఈ వివాదం కూడా ముగిసిపోయింది. అయితే.. ఇప్పుడు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు మ‌రో సంచ‌ల‌న …

Read More »

జ‌న‌సేన దూర‌దృష్టి కోల్పోతోందా?  గ్రౌండ్ టాక్‌

ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. వైసీపీ కొమ్ములు విరిచేస్తామ‌ని.. ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎందుకంటే.. ఒక పార్టీ అధికారంలోకి రావ‌డం అంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో తేలికేమీ కాదు. ఏదో నాలుగు డైలాగులు.. ప‌ది విమ‌ర్శ‌లు చేసేసి.. ప్ర‌జ‌ల దృష్టిని మళ్లించే ప్ర‌య‌త్నం చేసే ప‌రిస్థితి ఇప్పుడు …

Read More »

ప‌సుపు ద‌ళంలో పండు వెన్నెల‌..

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆవిర్భ‌వించి రేప‌టికి(మంగ‌ళ‌వారం) 40 వ‌సంతాలు నిండుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అంగ‌రంగ వైభ‌వంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు.. ప‌సుపుద‌ళం సిద్ధ‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. జాతీయ‌స్థాయిలోనూ.. పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా అమెరికా.. బ్రిట‌న్‌, దుబాయ్ దేశాల్లోనూ.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. పసుపు పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. అదేస‌మ‌యం జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని.. చంద్ర‌బాబు ఇప్ప‌టికే పిలుపు నిచ్చారు. …

Read More »

కాపులపై బీజేపీ కన్ను పడిందా?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాపుల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లా అహోబిలంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలకు చెందిన బలిజల సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో కాపులని, రాయలసీమ జిల్లాల్లో బలిజలని అంటారు. కొద్దిరోజులుగా కాపుల ఓట్లన్నింటినీ బీజేపీ వైపు మళ్లించేందుకు కమలనాథులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం నేతలు కానీ ఓటర్లు …

Read More »

40 వసంతాల వేదిక‌గా.. ఆత్మ‌స్థుతేనా.. ఆత్మావ‌లోక‌నం ఉంటుందా?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆవిర్భ‌వించి.. మ‌రో మూడు రోజుల్లో.. 40 ఏళ్లు పూర్తికానున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో ప్ర‌స్తుతం ఉన్న‌వాటిని గ‌మ‌నిస్తే.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న త‌మిళ‌నాడు అధిక‌కార పార్టీ త‌ర్వాత టీడీపీనే ఉంది. మ‌రీ ముఖ్యంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీనే సీనియ‌ర్ మోస్ట్‌. తెలంగాణ‌లో ఉన్న టీఆర్ ఎస్ కానీ, ఏపీలో ఉన్న వైసీపీ కానీ.. టీడీపీ ముందు.. జూనియ ర్లే. ఈ …

Read More »