టీడీపీకి పెద్ద సమస్యే వచ్చి పడింది. పార్టీలో నేతలు.. క్రియాశీలకంగా లేరు. ఉన్నవారు కూడా అధినేత చెప్పిన మేరకు మాత్రమే నడుచుకుంటున్నారు. తప్ప.. తమకంటూ..ప్రత్యేక వ్యూహాలతో ముందుకుసాగుతున్న నేతలు కనిపించడం లేదు. ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలన్నా.. నిరసన వ్యక్తం చేయాలన్నా.. కూడా చంద్రబాబు స్వయంగా కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ పరంగా పుంజుకునే అవకాశాలు కనపడడం లేదు. పైగా.. చంద్రబాబుపైనే భారంపడుతోంది. పార్టీని ముందుకు నడిపించేందుకు అవసరమైన …
Read More »పాదయాత్రలతో ఫలితం దక్కేనా?
ఇప్పుడు తెలంగాణలో పాదయాత్రల సీజన్కు తెరలేచిందనే చెప్పాలి. ఇప్పటికే జన ఆశీర్వాద్ యాత్ర పేరుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో తిరిగేస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ చేపడుతోన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే అధిష్ఠానం ఆదేశాలతో కిషన్ రెడ్డి ఈ యాత్ర చేస్తున్నారు. ఆ క్రమంలోనే మాట్లాడిన చోటల్లా రాష్ట్రంలోని అధికార ప్రభుత్వంపై …
Read More »హుజూరాబాద్లో వెయ్యిమందితో నామినేషన్.. షర్మిల వ్యూహం ఇదే!
తెలంగాణలో రాజకీయాలన్నీ ఇప్పుడు హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయనడంలో సందేహం లేదు. అక్కడ ఎలాగైనా విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. వ్యూహాలను పదును పెడుతోంది. మరోవైపు టీఆర్ఎస్ను ఎదురించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తరపున హుజూరాబాద్ ఉప ఎన్నికలో బరిలో దిగనున్న ఈటల రాజేందర్ కూడా విజయం కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ను ఈ ఎన్నికలే …
Read More »చీకటి నిజాలు: అఫ్ఘాన్ ఎందుకు భయపడుతోంది? ఇది చదవండి!
తాలిబన్ సామ్రాజ్యం.. అఫ్ఘనిస్థాన్కు కొత్తకాదు. గత 20 ఏళ్ల కిందటి వరకు తాలిబన్లే.. అఫ్ఘాన్ను పాలించారు. అయితే.. అప్పట్లో 20 శాతం మంది మాత్రమే తాలిబన్లను సమర్థించగా.. ఇప్పుడు ఈ సంఖ్య 15 శాతానికి దిగజారింది. అంటే.. తాలిబన్ల పాలన కావాలని కోరుకునేవారు కూడా అఫ్ఘన్లో ఉన్నారు. ఇది ఎందుకు? నిజానికి తాలిబన్లంటే.. అఫ్ఘన్లకు భయమా? లేక.. వారు అనుసరించే పాలన అంటే.. భయమా? వెరసి.. అసలు ఎందుకు అఫ్ఘన్లు.. …
Read More »యాక్టివ్ అయిన సోనియా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాస్త యాక్టివ్ అయినట్లే ఉన్నారు. అనారోగ్యకారణంగా సోనియా పార్టీ కార్యక్రమాలకు కూడా కాస్త దూరంగా ఉంటున్నారు. అలాంటిది శుక్రవారం 19 పార్టీల అధినేతలతో వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు. దాదాపు 2 గంటలకు పైగా సాగిన సమావేశంలో పార్టీల వ్యక్తిగత అజెండాలను పక్కనపెట్టి కామన్ అజెండాతో నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపిచ్చారు. పార్లమెంటు వేదికగా పెగాసస్ సాఫ్ట్ వేర్ …
Read More »చినబాబు.. మీరు మారిపోయారా?
తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు ఎవరు? పార్టీని నడిపించే రథసారధి ఎవరు? వయసు మీద పడుతోన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానంగా లోకేశ్ పేరు చెప్తే.. ఆయన వల్ల ఏమీ కాదని రాజకీయ పరిజ్ణానం లేదని ఎప్పుడు ఏం మాట్లడతారో తెలీదని ఇలా మొన్నటివరకూ రకరకాల వ్యాఖ్యలు వినిపించేవి. సొంత పార్టీ నాయకులే లోకేశ్ను నమ్మే పరిస్థితిల్లో లేరు. …
Read More »సాయిరెడ్డి సైలెన్స్ వెనక ఇంత కథ ఉందా ?
వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి వ్యూహం మార్చుకున్నారా ? తనకు ఇప్పుడు కాలం కలిసిరాని పరిస్థితి నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం సాయిరెడ్డి పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఢిల్లీలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆయనకు ఇప్పుడు అదే ఢిల్లీలో కేంద్రం పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ …
Read More »ఈ లీకుల వెనుక వైసీపీ వాళ్లే ఉన్నారా?
మొన్న అంబటి రాంబాబు.. ఇప్పుడేమో అవంతి శ్రీనివాస్.. ఏపీలో అధికార పార్టీకి చెందిన నాయకులు రాసలీలల ఆడియో లీకులతో వరుసగా చిక్కుల్లో పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నపుడు ఆటోమేటిగ్గా అందరి చూపూ ప్రతిపక్ష పార్టీల మీద పడుతుంది. ఆ పార్టీల వాళ్లే ఆయా నేతల్ని టార్గెట్ చేసి ఉంటారని అనుకుంటారు. కానీ అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ల విషయంలో మాత్రం వేరే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార …
Read More »పాతుకుపోతున్న రేవంత్
తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాతుకుపోతున్నారు. అధ్యక్షునిగా నియమితులైనపుడు కూడా రేవంత్ కు పార్టీలోని సీనియర్లలో ఎంతమంది సహకరిస్తారు ? పార్టీ శ్రేణులు ఎలా రిసీవ్ చేసుకుంటాయో అని కొందరు సందేహాలు వ్యక్తంచేశారు. అయితే తాజాగా హైదరాబాద్ శివార్లలోని రావిర్యాల ప్రాంతంలో జరిగిన బహిరంగసభలో జనస్పందన చూసిన తర్వాత రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పాతుకుపోయినట్లు అర్ధమైపోయింది. రేవంత్ కు సోనియా, రాహుల్ తో పాటు ప్రియాంక ఆశీస్సులు కూడా …
Read More »కరోనా థర్డ్ వేవ్ పై ఎయిమ్స్ చీఫ్ హెచ్చరికలు..!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ మధ్య కాస్త కేసులు తగ్గినట్లే అనిపించినా.. మళ్లీ పెరుగుతుండటంతో.. థర్డ్ వేవ్ ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో.. థర్డ్ వేవ్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.కోవిడ్ మూడో వేవ్ వస్తుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గులేరియా అన్నారు. బయట …
Read More »హుజూరాబాద్లో వేడి చల్లబడిందా?
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరినప్పటి నుంచి హుజూరాబాద్లో మొదలైన వేడి ఇప్పుడు కాస్త చల్లబడినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికైన ఈ హుజూరాబాద్ ఎన్నికలో విజయం అధికార టీఆర్ఎస్ పార్టీ, ఈటల గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీంతో నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ గత కొన్ని నెలలుగా అక్కడ రాజకీయ వేడి కొనసాగింది. ఈటల పాదయాత్ర, కాంగ్రెస్కు రాజీనామ చేసిన కౌశిక్ …
Read More »బయట విమర్శలు.. ఇంటికెళ్లి సమావేశాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలోపేతం దిశగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జనఆశీర్వాద్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం ఏపీలోని తిరుపతి, విజయవాడల్లో ప్రసంగించారు. ఆ సందర్భంగా ఏపీలోని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే రాష్ట్రంలో ఆర్థిక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates