రాజకీయాల్లో ఆయన సీనియర్. మాజీ మంత్రి కూడా. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లి.. తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చి.. తర్వాత.. వైసీపీ పంచన చేరారు. అయితే.. ఇటీవల కాలంలో మాత్రం ఆయన జాడ ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు ఒక వెలుగు వెలిగిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి రాజకీయాలు ఇక ముగిసినట్టేనా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విభజన సమయంలో కాంగ్రెస్లో ఉన్న …
Read More »అనుమానం ముందు.. తర్వాతే అడుగు
రాజకీయాలు మారుతున్నాయి. ఓ పాతికేళ్ల కిందటి రాజకీయాలకు ఓ పదేళ్ల కిందటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఇక, ఇప్పు డు జరుగుతున్న సంచలన రాజకీయాలకు.. ఓ పదేళ్ల కిందటి రాజకీయాలకు మరింత తేడా ఉంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా.. నాయకులు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణా మాలు.. ప్రజానాడికి అనుగుణంగా నాయకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాహసాలు చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది తర్వాత.. ముందు …
Read More »జగన్ ఇగో కొంప ముంచుతోందా?
ఆంధ్రప్రదేశ్లో మరే సమస్యా లేనట్లు సినిమా టికెట్ల వ్యవహారాన్ని నెత్తికెత్తుకుంది అక్కడి ప్రభుత్వం. ఇటు మంత్రుల, అటు అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై పెడుతున్న శ్రద్ధ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రి కూడా ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు ఏమనుకుని ఈ వ్యవహారంలో ప్రభుత్వం వేలు పెట్టిందో కానీ.. ఇప్పుడది ప్రభుత్వం మెడకు …
Read More »బీసీలపై బాబు ఫోకస్
దూరమైన బీసీలను మళ్ళీ దగ్గరకు చేర్చుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలంతా టీడీపీతోనే ఉన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనేంతగా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంతటి ముద్ర వేసేశారు. అలాంటిది 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వ్యవహార శైలి కారణంగా బీసీల్లో చీలికొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు తమ సంఘాల నేతలతో చంద్రబాబు వ్యవహరించిన తీరుతో మండిపోయిన బీసీలకు ఒళ్ళుమండిపోయింది. చంద్రబాబు మీద కోపాన్ని బీసీలు …
Read More »నన్ను చంపడానికి రెక్కీ: వంగవీటి రాధ
వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. హత్య చేసేందుకు రిక్కీ కూడా నిర్వహించారని తెలిపారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధా ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రాధా గుర్తుచేసుకున్నారు. రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యం, పదవులపై తనకు ఆశ లేదని స్పష్టం చేశారు. తనను …
Read More »అమరావతిలో అడుగు పెట్టనున్న జస్టిస్ రమణ..
రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రరాజధాని ప్రాంతం అమరావతిలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం పర్యటించనున్న ఆయనపై ఇక్కడి రైతులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో 700 రోజులకు పైగా రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న రైతులు.. జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికేం దుకు రెడీ అయ్యారు. వాస్తవానికి విజయవాడకుచేరుకున్న సమయంలోనే(శుక్రవారం) …
Read More »సుపరిపాలనలో తెలంగాణ, ఏపీ స్థానాలు ఇవే!
సుపరిపాలన(అంటే.. ప్రజలకు అందుతున్న మంచిపాలన) సూచీలో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. పాలనా బాగా అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 9వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో నిలిచింది. సామాజిక సంక్షేమం, ప్రజారోగ్యం, అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగం వంటి 10 కీలక రంగాల్లో ఈ రెండు రాష్ట్రాలు పురోగతి సాధించినట్టు ఈ సూచీ పేర్కొంది. ఈ మేరకు 2020-21 సంవత్సరానికి సంబంధించి గుడ్ …
Read More »పోలీసుల అష్టదిగ్భందంలో TRS భవన్
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ కేంద్ర కార్యాలయం వద్ద వేల మంది పోలీసులతో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించారు. హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లోని తెలంగాణభవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దారిలో వెళ్లే వాహనాలనుకూడా పక్క దారి గుండా.. మళ్లిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ నేతలను కూడా టీఆర్ ఎస్ భవన్ ఇంచార్జ్ అనుమతి లేకుండా అటు వైపు రానివ్వడం లేదు. ఇది ఆకస్మికంగా తీసుకున్ననిర్ణయమని …
Read More »రైతన్నల కొత్తపార్టీ.. పంజాబ్ ఎన్నికల్లో పోటీ!
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన.. నూతన వ్యవసాయ చట్టాలపై నిర్విరామ కొనసాగిన ఆందోళన నుంచి రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. ఆందోళన సమయంలో రాజకీయ పార్టీ ఊసెత్తని రైతు సంఘాల నేతలు.. సాగు చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అనంతరం రాజకీయ పార్టీ ప్రకటన చేయడం గమనార్హం. అంతే కాదు, రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలో పోటీలో ఉంటుందని ఈ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. 22 …
Read More »ఒకే వేదికపై సీజేఐ, ఏపీ సీఎం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు రాష్ట్ర పర్యటన నిమిత్తం సతీమణి శివమాలతో కలిసి వచ్చిన ఆయన ఈ రోజు.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీరమణ, ఏపీ సీఎం జగన్లు ఒకే వేదికను పంచుకున్నారు. ఒకే వేదికపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, …
Read More »మోడీ జీతం నుంచి రూ.1000 విరాళం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. స్వయంగా తన జీతం నుంచి 1000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన రశీదును కూడా ఆయన తీసుకున్నారు. మరి అంత పెద్దాయన విరాళం ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అనే సందేహం కామన్ కదా.. ఇది.. చదవండి.. భారతీయ జనతా పార్టీ “మైక్రో డొనేషన్స్“ వసూలు చేస్తోంది. అంటే.. సూక్ష్మ స్తాయి విరాళాలు అన్నమాట. దీనిలో 5 రూపాయల నుంచి ఎంతైనా స్వీకరిస్తారు. …
Read More »JD vs JP: ఇలా మిగిలిపోవాల్సిందేనా…?
తాజాగా సోషల్ మీడియాలో ఈ తరహా చర్చ ఆసక్తిగా మారింది. జేడీ వర్సెస్ జేపీ ఇద్దరికీ పెద్దగా తేడా లేదని అంటున్నారు. జేడీ అంటే.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలు పెద్దగా పుంజుకున్న దాఖలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ నుంచి పోటీ చేసిన.. ఆయన.. ఓడి పోయారు. తర్వాత.. పార్టీకి దూరమయ్యారు. అయితే.. ఇప్పుడు ఆయన ఊసుఎక్కడా వినిపించడం లేదు. పైగా.. విశాఖలోనూ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates