Political News

బెయిల్‌పై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకే

ఏపీ బీజేపీ నాయ‌కులు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్‌నేత ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. ప‌రోక్షంగా మ‌రింత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బెయిల్‌పై ఉన్న‌వారు.. ఎప్పుడైనా.. జైలుకు వెళ్లొచ్చ‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఏపీలో చాలామంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. వాళ్లు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని జావదేకర్‌ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నా …

Read More »

త‌న‌య‌ను రంగంలోకి దించుతున్న నారాయ‌ణ‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో టీడీపీ దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత ఆ పార్టీలోని చాలా మంది సీనియ‌ర్ నేత‌లు తెర‌మీద‌కు రావ‌డం లేదు. అందులో మాజీ మంత్రి నారాయ‌ణ కూడా ఒక‌ర‌నే అభిప్రాయాలున్నాయి. ఆయ‌న చాలా కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఓట‌మి త‌ర్వాత పూర్తిగా త‌న విద్యా సంస్థ‌ల వ్య‌వ‌హారాల్లోనే త‌ల‌మున‌క‌లై ఉంటున్నార‌ని స‌మాచారం. నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ఆయ‌న క‌నిపించ‌లేదు. తెర‌వెన‌క ఆర్థిక …

Read More »

మోడీకి రూ.12 కోట్ల కారు.. ఎందుకంటే?

ప్రధాని నరేంద్ర మోడీ భద్రతకు రూ.12 కోట్ల ఖరీదైన ‘మెర్సిడీస్‌-మేబాక్ ఎస్‌-650 గార్డ్‌’ను వినియోగిస్తున్నారు. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ హైసెక్యూరిటీ ఎడిషన్‌‌, రేంజ్రోవర్‌ వోగ్‌, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ను వినియోగించారు. అయితే.. ఇప్పుడు ప్ర‌ధాని భ‌ద్ర‌తా విధులు నిర్వ‌హిస్తున్న‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ …

Read More »

సంజ‌య్ దీక్ష అందుకేనా?

తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌నే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేప‌ట్టారు. నెల రోజుల్లోగా ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోతే వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల‌ను అడ్డుకుంటామ‌ని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఈ దీక్ష‌లో సంజ‌య్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య ప్ర‌ధానంగా ఉంది. ఎవైనా ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఉద్యోగాల నోటిఫికేష‌న్ల‌ను తెర‌పైకి తెస్తున్న ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత వాటిని మ‌రిచిపోతుంద‌నే …

Read More »

వంగ‌వీటి రాధాకు స‌ర్కారు భ‌ద్ర‌త‌..

కాపు నాయ‌కుడు వంగ‌వీటి రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఏపీ ప్ర‌భుత్వం 2+2 గన్‌మెన్లతో భ‌ద్ర‌త క‌ల్పించింది. ఇటీవ‌ల రంగా వ‌ర్ధంతి సంద‌ర్భంగా.. వంగవీటి రాధా సంచ‌లన వ్యాఖ్య లు చేశారు. త‌నను చంపేందుకు రెక్కీ నిర్వ‌హించార‌ని అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో మంత్రి కొడాలి నాని ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్‌.. కు చేర‌వేశారు. ఈ నేప‌థ్యంలో రాధాకు భ‌ద్రత …

Read More »

చెరోవైపు KCRను వాయించేస్తున్నారుగా ?

కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇద్దరికి ఇద్దరే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక ఆందోళన పేరుతో  చెరో వైపు కేసీయార్ కు ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు. ఇద్దరు సోమవారం ఒకేసారి వేర్వేరు అంశాలపై ఆందోళనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం పేరుతో రేవంత్ ఎర్రవెల్లిలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. అయితే జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులకు, రేవంత్+ కాంగ్రెస్ …

Read More »

బీజేపీకి బంపరాఫర్ ఇచ్చిన కొడాలి

మంత్రి కొడాలి నాని బీజేపీకి చాలా పెద్ద సవాలే విసిరారు. మంత్రి విసిరిన ఛాలెంజ్ అలాంటిలాంటి చాలెంజ్ కాదు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 నుంచి 20 సీట్లలో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటుందా ? అంటూ నిలదీశారు. నాని చెప్పినట్లు 20 శాతం సీట్లంటే మొత్తం 175 సీట్లలో 35 సీట్లు మాత్రమే. అంటే నాని చెప్పినట్లుగా బీజేపీ 35 సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు కమలం పార్టీని గొప్ప …

Read More »

మంగ‌ళ‌గిరి సీటుపై లోకేష్ ఫోకస్

టీడీపీ యువ‌నేత‌, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గ‌త ఎన్నిక‌ల్లోనే తొలిసారిగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. పార్టీలో కీల‌క ప‌ద‌విలో ఉండి.. మంత్రిగా కూడా ఉన్న లోకేష్‌కు తొలి ఎన్నిక‌లే పీడ‌క‌ల‌గా మారాయి. ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో పాటు లోకేష్ కూడా 6 వేల ఓట్ల తేడాతో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. వైసీపీ త‌న‌ను ఓడించేందుకు ప్ర‌త్యేకంగా ప‌న్నిన వ్యూహంలో లోకేష్ …

Read More »

జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టులో ఊర‌ట‌

ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు చాలా నాళ్ల త‌ర్వాత‌.. హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం కావ‌డం.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో ఎవ‌రో ఒక‌రు కోర్టుకు వెళ్ల‌డం.. అక్క‌డ హైకోర్టు ముందు ప్ర‌భుత్వం డీలా ప‌డుతుండ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల కింద‌ట‌.. హైకోర్టును , న్యాయ‌మూర్తుల‌ను కూడా వైసీపీ నేత‌లు దూషించ‌డం.. దీనిపైనా కేసులు న‌మోదు కావ‌డం.. సీబీఐ విచార‌ణ కూడా కొన‌సాగుతుండ‌డం …

Read More »

జ‌గ‌న్ బెయిల్.. వాద‌న‌లు స‌మాప్తం

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జగన్ బెయిల్‌ రద్దు చేయాలంటూ.. దాఖ‌లైన‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వైసీపీ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ తరఫున న్యాయవాది శ్రీ వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో జగన్‌కు నోటీసులు ఇవ్వాలని కోరారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై వైఖరి ఏమిటని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ …

Read More »

జగన్ ప్రభుత్వం చేస్తోంది కరెక్టే కానీ..

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు థియేటర్ల మీద ఉక్కు పాదం మోపుతోంది. ఇప్పటికే టికెట్ల రేట్ల మీద నియంత్రణ తెచ్చిన సర్కారు.. తాజాగా థియేటర్లలో నిబంధనల అమలుపై నిఘా పెట్టింది. లైసెన్సులు రెన్యువల్ చేసుకోని, సేఫ్టీ నిబంధనలు పాటించని థియేటర్లపై కొరడా ఝులిపిస్తోంది. వరుసబెట్టి థియేటర్లను సీజ్ చేస్తోంది. ఇప్పటికే ఏపీలో 170-180 మధ్య థియేటర్లు క్లోజ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఐతే ఈ విషయంలో జగన్ సర్కారుకు విమర్శలు …

Read More »

ర‌చ్చ‌బండ‌కు దారి బంద్‌: రేవంత్‌రెడ్డి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఈ రోజు చేప‌ట్టాల‌ని భావించిన ర‌చ్చ‌బండ్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించ‌లేదు. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఈ రోజు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమయ్యారు. వరి సాగుతో పాటు అన్నదాతల సమస్యలపై గళమెత్తాలని నిర్ణయించారు.  అయితే.. దీనికి అనుమ‌తించ‌ని పోలీసులు రేవంత్ ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆయ‌న‌ ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. …

Read More »