కృష్ణా జిల్లా గుడివాడ పోలీసుల అష్టదిగ్బంధంలోకి జారిపోయింది. ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నా రు. నగరంలో 144 సెక్షన్ కూడా విధించారు. దీనికి కారణం ఏంటి? అంటే.. సంక్రాంతి సందర్భంగా గుడివా డను అడ్డాగా చేసుకుని మంత్రి కొడాలి నాని..కేసినో సహా ఇతర జూదాలు ఆడించారు. గోవా తరహా కేసినో క్రీడను.. ఆయన తన సొంత కె-కన్వెన్షన్లోనే ఏర్పాటు చేశారు. ఎంట్రీఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు. దీనికి రాష్ట్రం నుంచే …
Read More »ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాక్..జీతాలకు బ్రేక్
కొత్త పీఆర్సీ పద్దతిలో జీతాల బిల్లలు రెడీ చేసేది లేదని చెప్పి ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగులు పెద్ద షాకే ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలాఖరులో బిల్లులు రెడీ చేస్తేనే బ్యాంకుల ద్వారా జీతాలు అందుతాయి. అదే పద్దతిలో ఇపుడు కూడా కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు రెడీ చేయమంటే అందుకు ట్రెజరీ సిబ్బంది నిరాకరించారు. పీఆర్సీ విషయమై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. …
Read More »ఇండియా టు డే సర్వే… మోడీకి తిరుగులేదు, జగన్ కు తగ్గలేదట
తాజాగా ఒక ఆశ్ మూడ్ ఆప్ ది నేషన్ పేరుతో సీ ఓటర్-ఇండియా టు డే జరిపిన తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డిదే విజయమని పేర్కొంటూ ఫలితాలు విడుదల చేసింది . మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అనే విషయమై పై రెండు సంస్ధలు దేశవ్యాప్తంగా సర్వే జరిపాయి. ఈ సర్వేలో …
Read More »నరసాపురం ఫైట్.. వైసీపీ తరఫున మాజీ ఐఏఎస్ ఎందుకంటే?
త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి 5న తన పదవిని వదులు కుంటానని వెల్లడించారు. అయితే..ఆయన ఆ సమయానికి రాజీనామా చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. అప్పటికి బడ్జెట్ సమావేశాలు మంచి పీక్ …
Read More »కేటీఆర్ ట్వీట్ కాపీ.. కామెడీ అయిన ఏపీ ఎమ్మెల్యే
ఇండియాలో తమ కార్ బ్రాండును తీసుకురావడానికి భారత ప్రభుత్వంతో ఇబ్బందులున్నట్లుగా ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ జవాబు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని, తమతో కలిస్తే సవాళ్లపై కలిసి పని చేసి పరిష్కారం కనుగొందామని కేటీఆర్ ట్వీట్ వేశారు. అసలు టెస్లా ఇండియాకు రాకపోవడానికి కారణాలేంటో తెలియకుండా చాలామంది సెలబ్రెటీలు కేటీఆర్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ …
Read More »ఏపీ సర్కారుకు మరింత సెగ
ఏపీ ప్రభుత్వానికి మరింత సెగ తగలనుందా? ఇప్పటికే తమకు పీఆర్సీతో తీవ్ర నష్టం చేకూర్చారంటూ.. తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు.. తాజాగా మరింత తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని వేడెక్కించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలని.. అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని అభిప్రాయపడ్డాయి. శుక్రవారం నాటి సమావేశంలో విధివిధానాలను నిర్ణయిస్తామని జేఏసీ నేతలు …
Read More »‘గుడివాడలో గోవా’ నిజాలు తేల్చనున్న టీడీపీ!
‘గుడివాడలో గోవా’.. ఇటీవల సంక్రాంతి సందర్భంగా.. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నానికి చెందిన సొంత కె-కన్వెన్షన్లో గోవా తరమా కేసినో నడిచిందనే వార్తలు వచ్చాయి. ఎక్కడెక్కడి నుంచో జూద ప్రియులను ఇక్కడకు ఆహ్వాననించి.. భారీ స్థాయిలో జూదాలు నిర్వహించారని. ఆధారాలతో సహా.. కొన్ని మీడియా సంస్థలు వెలుగులోకి తెచ్చాయి. అయితే.. దీనిపై అటు ప్రభుత్వం కానీ.. ఇటు ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానీ కానీ.. ఇప్పటి …
Read More »మూడు రాజధానుల మాదిరే.. పీఆర్సీ కూడా!
ఏపీ సీఎం సంచలన నిర్ణయం తీసుకుంటారా? ఉద్యోగుల ఉద్యమ తీవ్రత పెరుగుతున్ననేపథ్యంలో ప్రభుత్వం వెనుకడుగు వేయాలని నిర్ణయించుకుందా? ప్రస్తుతం తీసుకున్న పీఆర్సీ నిర్ణయాన్ని సర్కారు వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కొన్ని కారణాల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కొన్నాళ్లు పట్టుబట్టిన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన సర్కారు.. తర్వాత.. దీనిని వెనక్కి తీసుకుంది. అదేవిధంగా …
Read More »ఐదు రాష్ట్రాల్లో కనిపించని కామ్రెడ్ల రాజకీయం
దేశం మొత్తం ఎంతో ఆసక్తితో చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు అన్ని పక్షాలు.. తమ సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నాయి. పొత్తుల చర్చలు, సీట్ల కేటాయింపులతో బిజీబిజీగా గడుపుతూ.. ఆయా పార్టీల నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే దశాబ్దాల చరిత్ర, ఓటు బ్యాంకు కలిగి ఉన్న వామపక్షాల సందడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వామపక్షాల్లో కీలకంగా చెప్పుకునే సీపీఐ, …
Read More »రైతుల ఉద్యమానికి మద్దతిచ్చి ఉంటే..
ఏపీలో ఇప్పుడు ఉద్యోగులు రోడ్డెక్కారు. తమకు పీఆర్సీ మాటన జీతాలుతగ్గించారంటూ.. వారు ఆందోళన బాట పట్టారు. అంతేకాదు.. ప్రబుత్వం ఇచ్చిన చీకటి జీవోను రద్దుచేయాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఉద్యోగులు ఈ రేంజ్లో రోడ్డెక్కడం అనేది జగన్ మోహన్రెడ్డి రెండున్నరేళ్ల కాలంలో ఇదే అని చెప్పాలి. ఎందుకంటే. సీఎంకు భయపడ్డారో.. లేక.. వైసీపీని గతంలో పొగడ్తలతో ముంచెత్తి… సీఎం జగన్పైనా.. మెచ్చుకోళ్ల మాటలతో తబ్బిబ్బు చేసిన.. ఉద్యోగులకు ఆ మొహమాటం …
Read More »కాంగ్రెస్ లేకుండా శివసేన – ఎన్సీపీ పొత్తు
జాతీయ రాజకీయాల్లో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అవసరమైన కసరత్తులు చేయడం లేదన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అవకాశాలను వదులుకుని కాంగ్రెస్ తప్పు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న పంజాబ్లోనూ దాన్ని నిలబెట్టుకునే దిశగా అవసరమైన చర్యలు పార్టీ అధినాయకత్వం తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలను హైకమాండ్ పట్టించుకోవడం లేదని.. ఇలా అయితే ఎన్నికల్లో దెబ్బ తప్పదని అంటున్నారు. …
Read More »T బీజేపీలో సీక్రెట్ మీట్.. హై కమాండ్ సీరియస్!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసిన బీజేపీ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. అక్కడ పార్టీ విజయానికి మంచి అవకాశాలున్నాయని భావించిన అధిష్ఠానం కూడా నాయకులకు అండగా నిలుస్తోంది. కానీ ఈ పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీలో నెలకొన్న లుకలుకల ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాలు తెరపైకి వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓ వర్గం రహస్య సమావేశాలు నిర్వహించడమే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates