Political News

బీజేపీలో టెన్షన్ పెంచేస్తున్న ‘క్విట్ మోడి’ ఉద్యమం

వచ్చే ఏడాదిలో జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అంత వీజీ కాదన్న విషయం అర్ధమైపోతోంది. వివిధ కారణాల వల్ల నరేంద్ర మోడీ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతుండటం ముఖ్యమైన కారణం. అయితే ఇతర కారణాలు ఎన్నున్నా రైతుల్లో పెరుగుతున్న వ్యతిరేకత మాత్రం చాలా కీలకమని చెప్పాలి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్న తొమ్మిది నెలల ఆందోళన తీవ్రంగా మారబోతోంది. …

Read More »

కాందహార్లో తాలిబన్ల జెండా

యావత్ ప్రపంచం అనుమానిస్తున్నట్లే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయిపోతోంది. తాజాగా దేశంలోనే రెండు అతిపెద్ద నగరాలైన కాందహార్ ను తాలిబన్లు స్వదీనం చేసుకున్నారు. మిలిట్రీ, సివిల్ పోలీసులకు తాలిబన్ల సైన్యంతో గురు, శుక్రవారాల్లో పెద్ద యుద్ధమే జరిగింది. చివరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మొత్తం నగరమంతా తీవ్రవాదుల వశంలోకి వెళ్ళిపోయింది. దీనికి ఆధారంగా కాందహార్ లోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై తాలిబన్ల జెండాలు రెపరెపలాడుతున్నాయి. దేశంలోని 440 జిల్లాల్లో …

Read More »

ధర్మాన నిర్ణయం తీసేసుకున్నట్లేనా ?

జగన్మోహన్ రెడ్డి పై అలకో లేకపోతే వారసుడి కోసం తాను సైడైపోవాలని అనుకున్నారో తెలీదు కానీ శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన ధర్మాన ప్రసాదరావు కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. ప్రసాదరావు కొడుకు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తండ్రి తరపున మొత్తం రాజకీయమంతా చక్కబెట్టేస్తున్నారు. నియెజకవర్గంలో ప్రధానంగా శ్రీకాకుళం మున్సిపల్ పరిధిలో కొడుకే సుడిగాలి లాగ పర్యటనలు చేసేస్తున్నారు. శభ, అశుభ కార్యక్రమాలు, కార్యకర్తల పరామర్శ, పార్టీ …

Read More »

జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ పత్రికా ప్రకటన

ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు ఆవేదనను, బాధను కలిగిస్తున్నాయి. కొత్త పాలకవర్గం గురించి కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాను. కొత్త పాలకవర్గానికి సభ్యులు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? గత 15 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే కదా? ఈ విషయం …

Read More »

మోడీ తెచ్చిన‌.. ‘స్క్రాప్’ పాల‌సీ.. అభివృద్ధికి ముంద‌డుగట‌!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తుక్కు(స్క్రాప్) ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టారు. ఈ ప‌థ‌కం దేశాన్ని మ‌రింత వేగంగా ముందుకు న‌డిపిస్తుంద‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే తెచ్చిన ప‌థ‌కాలు.. దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తున్నాయో.. అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్ర‌క‌టించిన తుక్కు ప‌థ‌కం.. దేశానికి మేలు చేస్తుంద‌ని మోడీ చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లో ఈ పాలసీని ప్రారంభిచారు. దీనితో అభివృద్ధి పరంగా భారత్ మరో కీలక మైలురాయిని …

Read More »

పవన్ మౌనం వెనక భారీ ప్లాన్ ఉందా… ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయన జనసేనను ఏర్పాటు చేసి రాజకీయాలలో చురుకుగా ఉంటానని అప్పట్లో గట్టిగానే చెప్పారు. కానీ ఆయన ఇపుడు సడెన్ గా రూట్ మార్చేశారు. సినిమాల మీద సినిమాలు చేస్తూ సెట్స్ మీదనే ఉంటున్నారు. అయితే పవన్ హీరోగా వేషం కడుతున్నా ఆయన మనసు అంతా ఏపీ రాజకీయాల మీదనే ఉంది అంటున్నారు. ఆయన ఎప్పటికపుడు ఏపీ …

Read More »

కాంగ్రెస్ ట్విట్ట‌ర్ ఖాతాల ర‌ద్దు.. తెర‌వెనుక మోడీ.. నిజ‌మేనా?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 5 వేల మంది ట్విట్ట‌ర్ ఖాతాల‌ను ఆ సంస్థ ర‌ద్దు చేసింది. దీంతో ఈ ఘ‌ట‌న వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తమ పార్టీ అధికారిక ఖాతా సహా.. 5 వేల మంది నేతల ట్విట్టర్ ఖాతాలు నిలిచిపోయినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే ట్విట్టర్ ఈ మేరకు వ్యవహరించిందని ఆరోపించింది. నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ పార్టీ …

Read More »

జగన్ నిర్ణయం బూమరాంగ్ అవుతుందా ?

కరోనా వైరస్..ఒకరికి ఉంటే వందమందికి చాలా తేలిగ్గా సోకేస్తుంది. ఈ లక్షణం వల్లే ప్రపంచంలో కొన్ని కోట్లమంది వైరస్ భారినపడ్డారు. మనదేశంలో కూడా కొన్ని వేలమరణాలకు కరోనా వైరస్సే కారణమవ్వటం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ప్రాణంతాక వైరస్ ను ఇంటిముందే పెట్టుకుని ఈనెల 16వ తేదీనుండి స్కూళ్ళు తెరవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఎంతమాత్రం శ్రయేస్కరంకాదు. గతంలో కూడా కొన్ని సార్లు స్కూళ్ళు తెరవటానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే …

Read More »

టీడీపీని ఓడించింది బీజేపీనేట !

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము చేస్తున్న ప్రకటనలను జనాలు నమ్ముతారా ? లేదా నవ్వుకుంటారా ? అనే వెరుపు కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. మీడియాతో వీర్రాజు మాట్లాడుతు వైసీపీకి గట్టి వార్నింగే ఇచ్చారు. తమతో పెట్టుకుంటే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుందని చాలా ఘాటుగా వార్నింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ బీజేపీతో పెట్టుకున్నందు వల్ల టీడీపీకి ఎలాంటి గతిపట్టింది …

Read More »

జగన్ను అసలు మోడి పట్టించుకోవటం లేదా ?

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే డౌటు పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాదు కదా కనీసం రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిలయ్యారనే చర్చ పెరిగిపోతోంది. తాజాగా కేంద్రం న్యాయశాఖ మంత్రిని కిరణ్ రిజుజును వైసీపీ ఎంపిల బృందం కలిసి చేసిన విన్నపాలను చూసిన తర్వాత అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపిల బృందం కొన్ని విజ్ఞప్తులు చేసింది. అందులో …

Read More »

హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లే లేనట్లేనా ?

తెలంగాణాలో రోజు రోజుకు టెన్షన్ పెంచేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇఫ్పట్లో జరిగేట్లు లేదు. ఉపఎన్నిక నిర్వహించేందుకు అనువైన పరిస్ధితులు ఉన్నాయా ? లేవా ? అనే విషయమై నివేదిక ఇవ్వాలంటు కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ను కోరింది. అలాగే రాష్ట్రప్రభుత్వానికి కూడా మరో లేఖ రాసింది. రెండు నివేదికలు అందిన తర్వాత గానీ హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక గురించి నిర్ణయం తీసుకోదు. గతంలో కరోనా వైరస్ …

Read More »

‘యే..దోస్తీ’…ఆ సీఎం పాడిన పాట వైరల్

దేశంలోని బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు పేరున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా మధ్యప్రదేశ్ లో బీజేపీకి పట్టుపెరగడానికి శివరాజ్ శింగ్ కారణంటే అతిశయోక్తి కాదు. ఇక, పార్టీతో పాటు మధ్యప్రదేశ్ ప్రజలు కూడా శివరాజ్ సింగ్ ను మామా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే మామ….ముగ్గురు అమ్మాయిలన దత్తత తీసుకొని వారికి …

Read More »