సాదారణంగా మనం యూటర్న్ దూరంగా ఉంటేనో.. లేక తొందరగా పోవాలనో తప్పు అని తెలిసినా కొన్ని సందర్భాల్లో వాహనంపై రాంగ్రూట్లో వెళ్తుంటాం. ఆ సమయానికి అక్కడ ట్రాఫిక్ పోలీసులుంటే.. ఒకవేళ పట్టుబడితే మన వాహన చిట్టాను విప్పుతారు. చలానాలు పెండింగ్లో ఉన్నాయంటే చాలు.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసేస్తారు. ఎంత వేడుకున్నా ఊరుకోరు. మనకు కాస్త పలుకుబడి ఉందనుకో అప్పటికి సులభంగా బయటపడొచ్చు. అదే పలుకుబడి లేని కాస్త అమాయకంగా …
Read More »ఈటలకు వరుస షాక్లు
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. అధికారంలో ఉన్న పార్టీ తలుచుకుంటూ ప్రత్యర్థుల పని పట్టడం ఎంత సేపు! డబ్బు అధికారం హోదా ఇలా ఏదో ఒక ఆశ చూపించి ప్రత్యర్థి చుట్టూ ఉన్న వాళ్లను తమ వైపునకు తిప్పుకుని ప్రత్యర్థిని ఒంటరి చేయాలనే ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడీ విషయం ఎందుకు అంటారా? హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రాణం పెట్టి ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ఈటల …
Read More »గోదావరి సాక్షిగా జనసేనానికి జనం పోటెత్తారు..!
ఏపీలో రోడ్ల దారుణస్థితి నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండు జిల్లాల్లో రోడ్లపై శ్రమదానం చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ఉదయం రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు వస్తున్నా కూడా పవన్ మాత్రం పట్టు విడవకుండా రాజమండ్రిలో ఎంట్రీ ఇచ్చారు. పవన్కు అభిమానులు, జనసేన సైనికులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పవన్ …
Read More »బిగ్ బ్రేకింగ్: బద్వేల్ జనసేన అభ్యర్థి ఖరారు..?
ఏపీలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎలాంటి ట్విస్టులు ఉండవని అనుకుంటే… అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధ పోటీలో ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ మరోసారి బరిలో ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు …
Read More »ఎంఎల్ఏలను మార్చకపోతే కష్టమేనా ?
తాజాగా వెల్లడైన ఓ సర్వే రిపోర్టు ప్రకారం అధికార వైసీపీలో కొంతమంది ఎంఎల్ఏలను మార్చకపోతే గెలుపు కష్టమే. ఆత్మసాక్షి అనే గ్రూపు కోసమని ఐఐటి విద్యార్ధులు ఏపిలో ఓ సర్వే చేశారు. మార్చి-సెప్టెంబర్ మధ్య జరిగిన సర్వేలో 13 జిల్లాల్లోని 68,200 మందిని టచ్ చేశారు. ఈ సర్వే ఫలితాలు అధికారపార్టీకి వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. కాబట్టి సర్వే …
Read More »పాదయాత్రతో బండి ఏం సాధించారు ?
బీజేపీ తెలంగాణా చీఫ్ బండి సంజయ్ పాదయాత్రతో ఏమి సాధించారో అర్ధం కావటంలేదు. మామూలుగా ఎవరైనా పాదయాత్ర చేశారంటే ప్రజల బాధలు వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు, పరిష్కార మార్గాలు చర్చించేందుకే. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కారిస్తామని భరోసా ఇవ్వటం మామూలే. గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి చేసిందిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశారనేది వేరే విషయం. అయితే తాజాగా బండి సంజయ్ చేసిన …
Read More »ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మళ్లీ లగడపాటి పేరు
లగడపాటి రాజగోపాల్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి చెప్పిన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకున్న నాయకుడు. మరి ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా? ఆయనను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే దిశగా పరిణామాలు మారుతుండడమే అందుకు కారణం. 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నుంచి …
Read More »పవన్ కేం తెలుసు గోంగూర కట్ట.. మంత్రి బొత్స
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వరుసగా వైసీపీ మంత్రులు, ఆ పార్టీ కీలక నేతలు విరుచుకు పడుతూనే ఉన్నారు. పవన్ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ను టార్గెట్ చేసిన మరుక్షణం నుంచే వైసీపీ వాళ్లు తీవ్రస్థాయిలో పవన్పై ఎటాక్ చేస్తున్నారు. పోసాని కృష్ణమురళీ విమర్శలతో అది తారాస్థాయి వెళ్లింది. ఇప్పటికే పవన్ను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పవన్పై భారీగా విరుచుకుపడ్డారు. ఇక ఇప్పుడు బొత్స, …
Read More »ఆప్ కి ఇదే గోల్డెన్ ఛాన్సా ?
చూడబోతే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఇంకా మంచి రోజులు వస్తున్నట్లే ఉంది. ఇప్పటికే మూడుసార్లు వరుసగా ఢిల్లీలో అధికారంలోకి వస్తున్న ఆప్ తాజాగా పంజాబ్ మీద కూడా కన్నేసింది. అరవింద్ కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ తో ఢిల్లీ జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీలో బాగా పాతుకు పోవటంతో పొరుగు రాష్ట్రాలపై కేజ్రీవాల్ కన్ను పడింది. ఇందులో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ …
Read More »పార్టీలను వణికిస్తున్న ఎంఐఎం
తొందరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం మిగిలిన పార్టీలను వణికించేస్తోంది. ముస్లిం ఓట్లను దక్కించుకోవటమే టార్గెట్ గా ఎన్నికల్లో పోటీచేయబోతున్న ఎంఐఎం వల్ల ఏ పార్టీకి దెబ్బపడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ప్రతి పార్టీ కూడా ఎంఐఎం వల్ల తమకేమీ నష్టం జరగదని చెప్పుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే యూపీలో చాలా కులాలకు ప్రత్యేకించి పార్టీలున్నాయి, గట్టి నేతలూ ఉన్నారు. కానీ ముస్లింలకు మాత్రం ఏకీకృతపార్టీకానీ లేదా అందరినీ …
Read More »నానీ మాటలకు అర్ధమేమిటో ?
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తాజాగా చేసిన వ్యాఖ్యలకు అర్ధమేమిటి ? అనే సందేహం పెరిగిపోతోంది. ‘మంత్రిపదవి మీద ప్రేమ ఎందుకుంటుంది ? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. దాంతో మరోసారి తొందరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు పెరిగిపోయాయి. ఈ మధ్యనే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తొందరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో నూరుశాతం కొత్తవారు వస్తారని …
Read More »వైసీపీ నేతల్లో కట్టలు తెగిన అసహనం… ఆపినా ఆగరా ?
ఒకరిలో ఆగ్రహం వస్తే.. సరే.. ఏదైనా లోపం జరిగి ఉంటుదని అనుకోవచ్చు. కానీ, ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అసహనంతో రగిలిపోతున్నారు. దీంతో ఇప్పుడు వారిని సర్దుబాటు చేయడం.. పరిస్థితిని చక్కదిద్దడం వంటివి అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నెల్లూరు జిల్లా నుంచి అనంతపురం వరకు చాలా మంది ఎమ్మెల్యేలు.. పనులు జరగడం లేదని.. నిధులు ఇవ్వడం లేదని.. రగిలిపోతున్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates