Political News

వైసీపీకి ర‌ఘురామ మ‌రో పంచ్‌..

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. అధికారంలో ఉన్నార‌నే కానీ.. ఆ పార్టీ నేత‌ల‌కు అన్ని వైపుల నుంచి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దీనికి ఆపార్టీ నేత‌లు చేసుకుంటున్న నిర్వాక‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉంది క‌దా.. అని నోటికి అడ్డు అదుపు లేకుండా చేస్తున్న వ్యాఖ్య‌లు.. దూష‌ణ‌లు.. అనుచిత కామెంట్లు.. వంటివి ఆ పార్టీ కీల‌క నేత‌ల‌ను పోలీస్ స్టేష‌న్ల బాట ప‌ట్టిస్తున్నాయి. కోర్టుల్లో …

Read More »

ఫ‌స్ట్ టైమ్‌: కేసీఆర్ పేషీలోకి ద‌ళిత అధికారి.. హుజూరాబాద్ ఎఫెక్ట్‌?

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం.. సీఎం కేసీఆర్‌.. కొన్నాళ్లుగా ద‌ళిత జ‌పం చేస్తున్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌ను త‌న ప‌క్షానికి తిప్పుకోవ‌డం.. త‌ను దూరం చేసిన ఈట‌ల రాజేందర్ ను ఘోరంగా ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ద‌ళిత బంధు.. ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టారు. హుజూరాబాద్‌కు ఏకంగా 2000 కోట్ల రూపాయ‌ల‌ను అభివృద్ధి కోసం కేటాయించారు. …

Read More »

పెగాసస్ పై కేంద్రం దొరికిపోయిందా ?

‘పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వాడిందా ? లేదా’ ? అన్న ప్రశ్నతో నరేంద్రమోడి సర్కార్ దొరికిపోయింది. పెగాసస్ స్పైవేర్ ఉపయోగించటం ద్వారా ప్రతిపక్ష నేతలు, దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇదే అంశంపై పార్లమెంటు ఉభయసభల్లో ఎంత గందరగోళం రేగిందో అందరు చూసిందే. ప్రతిపక్షాలు, ప్రముఖులు ఎంత గోల చేసినా కేంద్రం పెద్దగా స్పందించలేదు. తమ ఆరోపణలపై స్వయంగా నరేంద్రమోడినే …

Read More »

ఉనికి కోసం అవస్తలు పడుతున్నదా ?

తెలంగాణా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపధ్యంలో రాజకీయాలు చాలా హాటు హాటుగా మారిపోయిన విషయం తెలిసిందే. తొందరలో జరగబోయే ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఒకవైపు కేసీయార్ మరోవైపు ఈటల రాజేందర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ కూడా తన బలాన్ని చాటుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫుల్లు జోరుమీదున్నాయి. ప్రధాన పార్టీలు …

Read More »

జీవోల విష‌యంలో ర‌చ్చ‌…జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల తెర‌మీద‌కు వ‌చ్చి బ్లాంక్ జీవోల వివాదంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జీవోలు ఇకపై ఆన్ లైన్లో పెట్టకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అన్న దానికే అర్ధాన్ని మార్చేసి గోల్ మాల్ ఆర్డర్ అన్న విధంగా బ్లాంక్ జీవోలను జారీ చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన …

Read More »

ఆఫ్ఘన్లో మొదలైన అరాచకాలు

గడచిన వారం రోజులుగా ఆఫ్ఘనిస్ధాన్ దేశంలో విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు మూడో వారంలో యావత్ దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళిపోతుందని అందరు అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా 15వ తేదీకే దేశంలో నాయకత్వం మారిపోయింది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పదవికి రాజీనామా చేసి అధికారాన్ని తాలిబన్లకు అప్పగించేసి దేశంవదిలి పారిపోయారు. ఈయనతో పాటు కొందరు మంత్రులు, గవర్నర్లు, ముఖ్యనేతలు కూడా దేశంనుండి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. …

Read More »

డబ్బు మూటలతో పారిపోయిన ఆప్ఘాన్ అధ్యక్షుడు..!

ఆప్ఘనిస్తాన్ ని పూర్తిగా తాలిబన్లు ఆక్రమించుకున్నారు. తాలిబన్లు ఎంటర్ కావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు అఫ్రాఫ్ గని పరారయ్యాడన్నసంగతి కూడా తెలిసిందే. దేశానికి ఆపద వస్తే.. అధ్యక్షుడు అలా పారిపోయాడనే వార్త ఇప్పటికే ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అంతకుమించి ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. అష్రాఫ్ గని పోతూ పోతూ.. డబ్బల మూటలు కట్టుకొని మరీ వెళ్లిపోవడం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని, నాలగు కార్ల …

Read More »

ఆప్ఘాన్ కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ నాయకుడు..?

ఆప్ఘనిస్తాన్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. దేశాధ్యక్షుడు పారిపోయాడు. దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో… దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే రాజధాని కాబూల్‌ను ఆక్రమించడంతో ప్రభుత్వం లొంగిపోయింది. అలాగే శాంతియుతంగా అధికార బదిలీ వుంటుందని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అధ్యక్షుడిగా ఆశ్రఫ్‌ ఘనీ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త దేశాధ్యక్షుడు ఎవరన్న దానిపై ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దేశ నూతన …

Read More »

తాలిబన్ల దెబ్బ అంత గట్టిగా పడిందా ?

ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబన్ల అరాచకాలను విదేశాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రాజధాని కాబూల్ నుండి తమ రాయబార కార్యాలయాల్లోని ఉన్నతాధికారులను, ఉద్యోగులందరినీ తిరిగి వచ్చేయాలంటు ఆయా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. అన్నీ దేశాలకన్నా ముందుగా అమెరికా, ఇండియాలు తమ సిబ్బందిని వెనక్కు పిలిపించేస్తున్నాయి. అమెరికా అయితే తమ మిలిట్రీని దగ్గరుండి మరీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారందరినీ విమానాలెక్కించేస్తోంది. విమానాల్లో ప్రయాణించటానికి కుదరని ఉద్యోగుల కోసం ప్రత్యేకించి హెలికాప్టర్లలో సమీప …

Read More »

వెంకయ్యపై కేంద్రమంత్రుల ఒత్తిడి ?

రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపిలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై ఏడుగురు కేంద్రమంత్రులు బాగా ఒత్తిడి తెస్తున్నట్లే ఉంది చూస్తుంటే. మొన్నటి 11వ తేదీన రాజ్యసభలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు ఎంపిలు పోడియం దగ్గర ఉద్యోగులు కూర్చునే బెంచీల మీదకు ఎక్కి అల్లరి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగానే మార్షల్స్ కు …

Read More »

ఆప్ఘాన్ అధ్యక్షుడి పరారీ..దేశం తాలిబన్ల స్వాధీనం..!

తాలిబనన్లు.. ఆప్ఘనిస్తాన్ ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆప్ఘాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. ఈ క్రమంలో.. దేశ ప్రజలకు అండగా నిలవాల్సిన ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని.. అక్కడి నుంచి పరారు కావడం గమనార్హం. అష్రఫ్ ఘని తజకిస్తాన్ పరారయ్యాడని.. అక్కడి అధికారులు స్వయంగా చెప్పడం గమనార్హం. అష్రఫ్ ఘనీ ఆచూకీని ఈ బృందం తనిఖీ చేస్తోందని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. సెప్టెంబర్ 11 న …

Read More »

ఏపీలో ముంద‌స్తు.. ఢీల్లీ వ‌ర్గాల చ‌ర్చ‌లు…!

రాష్ట్ర ప్ర‌భుత్వ సార‌థి.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌రిస్థితి ఇబ్బందిగా మారిందా? ఆయ‌న కేంద్రంగా.. ఢిల్లీలో రాజ‌కీయాలు మారుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వివిధ కేసుల విష‌యంలో జ‌గ‌న్ బెయిల్ పొంది.. సీఎంగా గెలిచి.. పాల‌న సాగిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. జాతీయ స్తాయిలో మారుతున్న ప‌రిణామాలు.. జ‌గ‌న్‌ను ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా.. మ‌రో ఏడాదిలోనే రాష్ట్రంలో ముందస్తుకు …

Read More »