Political News

అమరావతి రైతులపై మరోసారి వైసీపీ కక్ష సాధింపు

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు, మహిళలు ఈ మహా పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావంగా కొందరు వారికి సహాయం చేస్తున్నారు. అయితే, పాదయాత్ర చేస్తున్న రైతులను నిబంధనల పేరుతో పోలీసులు, వైసీపీ నేతలు ఇబ్బందులు …

Read More »

జయ ఆస్తులు తీసుకుంటే సరిపోదు: IT ట్విస్ట్

తమిళనాడు హైకోర్టు దివంగత ముఖ్యమంత్రి మేనల్లుడు, మేనకోడలు విషయంలో విచిత్రమైన ఆదేశాలు జారీచేసింది. తమ మేనత్త ఆస్తులు తమకే రావాలని పట్టుబట్టిన మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపలకు హైకోర్టు ఒక విధంగా షాకి ఇచ్చింది. ఆస్తులే కాదు బకాయిలు కూడా వారసులు తీర్చాల్సిందే అని తాజాగా తీర్పిచ్చింది. జయలలిత మరణించిన తర్వాత ఆమె పేరుతో ఉన్న ఆస్తులపై పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఆమెకున్న ఆస్తులు …

Read More »

టీ కాంగ్రెస్‌ గ‌ప్‌చుప్‌… ఆ ఎన్నిక వ‌దిలేశారా?

స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ వ‌దిలేసిందా..? పార్టీ బ‌ల‌మున్న చోట కూడా కాడి కింద ప‌డేసిందా..?  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే ఇవే అనుమానాలు క‌లుగుతున్నాయి. పార్టీకి పెద్ద పెద్ద లీడ‌ర్ల‌మ‌ని.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను తామే శాసిస్తున్నామ‌ని చెప్పుకునే న‌ల్ల‌గొండ నేత‌లు ఎమ్మెల్సీ ఎన్నిక‌ను కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం పార్టీ దుస్థితికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. కాంగ్రెస్ కంచుకోట‌కు బీట‌లు వారుతున్నాయా..?ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట నిన్న‌టి వ‌ర‌కు. …

Read More »

కేసీఆర్ తో మోడీ డీల్… అందుకే రేపు ఎంపీలు డుమ్మా – రేవంత్

టీఆర్‌ఎస్ ఎంపీలు ఉభయసభల్లో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని తప్పుబట్టారు. కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన పేరుతో గాంధీ విగ్రహం వద్ద పదినిమిషాలు.. లోక్ సభలో పోడియం వద్ద పదిహేను నిమిషాలు చేస్తున్నారనే తప్ప… వీరి నిరసనలో నిజాయతీ లేదని విమర్శించారు. దున్నపోతు మీద వానపడితే …

Read More »

జ‌గ‌న్ ఇలా చేశాడేంటి? తెలంగాణ నేత‌ల విస్మ‌యం!!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై ఇటు నెటిజ‌న్లు, అటుతెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు నివ్వెర పోతున్నారు. శ‌నివా రం ఉద‌యం స్వ‌ర్గ‌స్తులైన మాజీ ముఖ్య‌మంత్రి, త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య‌కు నివాళులు అర్పించేందుకు ఎక్క‌డెక్క‌డ నుచో అనేక మంది నాయ‌కులు హైద‌రాబాద్‌కు క్యూక‌ట్టారు. ఆరోగ్యం బాగోక పోవ‌డంతో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం.. త‌న త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేను పంపించి.. నివాళులర్పించారు. …

Read More »

కేసీఆర్‌కు ఆ ఎన్నిక‌ల భ‌యం?

ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో విజ‌యంతో కేసీఆర్ తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత రాష్ట్రంలో జ‌రిగిన దాదాపు ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌కే విజ‌యాలు ద‌క్కాయి. ఇక 2018లో ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం కేసీఆర్ సొంత‌మైంది. దీంతో రాష్ట్రంలో త‌న‌కు త‌న పార్టీకి తిరుగులేద‌ని ఆయ‌న అనుకున్నారు. కానీ గ‌త రెండేళ్లుగా ప‌రిస్థితి తారుమారైంది. ఒక‌ప్పుడు ఎలాంటి ఎన్నిక అయినా భ‌యం …

Read More »

ఆర్ ఆర్ ఆర్‌ పై వైసీపీ క‌త్తి!

లోక్‌సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ‌రాజును వైసీపీ ఎంపీలు.. తీవ్రంగా టార్గెట్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఆర్ ఆర్ ఆర్ కు మధ్య పెద్ద వారే జరిగింది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాటల యుద్ధం చేశారు. జీరో అవర్‌లో ఏపీలో జ‌రుగుతున్న అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర విష‌యాన్ని ర‌ఘురామ లేవ‌నెత్తారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని రైతులు రెండేళ్లుగా చేస్తున్న ఉద్య‌మాన్ని వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే …

Read More »

జగన్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో సీఎం జగన్ విచారణ ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన జగన్ బెయిల్ పై బయట ఉన్నారని, సీఎం హోదాలో ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు కొట్టవేసింది. ఇక, ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న జగన్ …

Read More »

జ‌గ‌న‌న్న ఓటీఎస్ – ఉరితాడు ప‌థ‌కం: CBN

ఏపీ ప్ర‌భుత్వంపైనా.. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పైనా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు భ‌గ్గుమ‌న్నారు. ఇదేం ప్ర‌భుత్వం అంటూ.. ఆయ‌న నిల‌దీశారు. జ‌గ‌న‌న్న ఓటీఎస్-ఉరితాడు ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారంటూ.. ముఖ్య‌మంత్రిపై విరుచుకుప‌డ్డారు. ఇళ్లకు ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని  చంద్రబాబు ఆరోపించారు. తప్పనిసరి కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు వసూళ్లను విమర్శిస్తే.. కేసులు …

Read More »

ఆ బూతుతో తిడతారా? వైసీపీ ఎంపీలపై రఘురామ ఫైర్

వైసీపీ నేతలకు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, మీడియా సమావేశాల్లో, ప్రెస్ మీట్ లలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, దూషణలకు దిగడం చూశాం. కానీ, ఈ రోజలు లోక్ సభలో రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం పెను వివాదానికి దారి తీసింది. పార్లమెంటు సాక్షిగా తనను అసభ్య పదజాలంతో …

Read More »

ట్రూ అప్ చార్జీలపై యూటర్న్

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి కూడా నెలకు దాదాపు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు రావడంతో జనానికి షాక్ తగిలినట్లయింది. ఇలా హఠాత్తుగా కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ ఎందుకు కొడుతోందని అడిగితే…ట్రూ ఆప్ ఛార్జీలంటూ ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు కట్టలేక…చేసేదేమీ లేక జనం …

Read More »

జగన్ హిట్ సాంగ్ ను తెగ వాడేస్తోన్న టీడీపీ

ఏపీలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓ పాట మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’ అంటూ వైసీపీ నేతలు ఆ పాటతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక పొలిటికల్ చార్ట్ బస్టర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. వాస్తవానికి కూడా, జనానికి జగన్ …

Read More »