అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కాస్త కళ్లాలు వేసేందుకు వీలుగా.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోందని.. అలాంటి పరిస్థితి ఉంటుందన్న అంచనాలతో ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వెనుకా ముందు చూసుకోకుకండా బాదేస్తున్న పన్నుతో.. పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్న వేళ.. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ప్రభుత్వాలకు జరిగే ఆర్థిక నష్టం భారీగా ఉంటుందన్న వాదన బలంగా వినిపించింది. ఇందుకు …
Read More »అమిత్ షా గురి తప్పిందా ?
నిర్మల్ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలు వింటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు అమిత్ నిర్మల్ బహిరంగ సభలో ఎందుకు పాల్గొన్నారు ? ఎవరిని టార్గెట్ చేయడానికి వచ్చారు ? ఎవరిని టార్గెట్ చేశారు ? అనేది జనాలకు అర్థం కావట్లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని ఒకటికి పదిసార్లు గట్టి గట్టిగా అరిచి ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి ఆలయం …
Read More »8 నెలలకే చీఫ్ జస్టిస్ బదిలి
ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు తీసుకున్న ఏకే గోస్వామిని 8 నెలలకే బదిలీ చేస్తున్నారు. మామూలుగా ఇలా జరగదు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ గా నియమితులైన వ్యక్తి సీటులో సెటిల్ అవటానికే కనీసం ఆరు మాసాలు పడుతుంది. తాను బాధ్యతలు స్వీకరించేనాటికి హైకోర్టులో విచారణ జరుగుతున్న, పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కీలకమైన కేసుల గురించి తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. తాను విచారించాల్సిన …
Read More »దళితబంధు లబ్దిదారులకు షాక్?
ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసి, ప్రచారం చేస్తున్న దళితబంధు లబ్దిదారులకు కేసీయార్ ప్రభుత్వం పెద్ద షాకిస్తోంది. దళితబంధు పథకం పెట్టడం ద్వారా రాష్ట్రంలోని దళితులందరినీ ఉద్దరించేస్తున్నట్లు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు అండ్ కో ఒకటే ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారు. పథకంలో భాగంగా ఇప్పటికే కొందరు దళితులను గుర్తించి రు. 10 లక్షలు వాళ్ళు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కూడా జమచేశామని చెప్పుకుంటున్నారు. అయితే డబ్బులు జమైతే అవుతున్నాయి కానీ …
Read More »విమోచన దినంపై.. కేసీఆర్కు అమిత్ షా.. సవాల్..!
కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నాయకుడు.. అమిత్ షా.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు.. మజ్లిస్ పార్టీతో అంటకాగుతూ.. తెలంగాణ ఉద్యమం నాటి వాగ్దానాలను కేసీఆర్ మరిచిపోయారని.. విమోచనం దినం నిర్వహిస్తామని.. చెప్పి.. ఇప్పుడు పూర్తిగా పక్కకు తప్పుకొన్నారని.. దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో శుక్రవారం పర్యటించిన అమిత్ షా.. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ …
Read More »మమతపై బీజేపీ మైండ్ గేమ్ ?
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని డైరెక్టుగా ఎదుర్కోలేని బీజేపీ అగ్రనేతలు ఆమెపై మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. బెంగాల్లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలను కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి సాధారణ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీచేసి మమత ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో ఓపోయినా సీఎంగా మమత బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి ఆరుమాసాల్లోగా ఏదో ఒక నియోజకవర్గం నుండి గెలవాల్సిన అవసరం ఇపుడు మమతకు వచ్చింది. ఈ …
Read More »ఏపీ పాలిటిక్స్ దారెటు?
ఏపీ రాజకీయాలు ఎటు పోతున్నాయి? విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కావాల్సిన.. నాయకులు.. సంచలనాలకు.. బ్రేకింగులకు ఇస్తున్న ప్రాధాన్యం.. చివరకు దాడులకు.. దారితీస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సహజంగా ప్రతిపక్ష నాయకులు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు. ఇది ప్ర జాస్వామ్యంలో వారికి ఉన్న హక్కు. అయితే.. ఈ విమర్శలు కొన్నాళ్లుగా శృతి మించుతున్నాయి. నిబద్ధత కొరవడిన రాజకీయాల్లో.. పనిచేయడం వల్ల వచ్చే గుర్తింపును పక్కన పెట్టి.. సంచలన వ్యాఖ్యలు …
Read More »చంద్రబాబు ఇంటిపై రాళ్ల దాడి.. ఉద్రిక్తత.. ఏం జరిగింది?
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో టీడీపీ నేతలు సహా.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన వివరాలు.. ఇవీ.. గురువారం టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ స్పీకర్.. దివంగత కోడెల శివప్రసాదరావు వర్ధంతి జరిగింది. దీనిని పురస్కరించుకుని.. పలువురు నాయకులు గుంటూరు జిల్లా నకిరికల్లులో వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి …
Read More »రేవంత్కు రాహుల్ అండ.. ఇక తగ్గేదేలే!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా రేవంత్ రెడ్డి ఎంపికైన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ జోరందుకుంది. రేవంత్ పిలుపు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులు ఉత్సాహంగా కదిలి వచ్చి సభలు ర్యాలీలు నిరసనల్లో భారీ ఎత్తున పాల్గొంటున్నారు. మొత్తానికి రేవంత్ వచ్చాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందనే చెప్పాలి. ఇక రేవంత్ కూడా తనదైన దూకుడుతో అధికార కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా …
Read More »జగన్ కీలక నిర్ణయం
వైద్యరంగంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించటంలో ప్రతి ఎంబీబీఎస్ విద్యార్ధి ఏడాదిపాటు సేవలందించాలన్న జగన్ సూచన తొందరలోనే ఉత్తర్వులు రూపంలో రాబోతోంది. అలాగే ప్రతి పీజీ విద్యార్ధి ఏడాదిపాటు రెసిడెన్సీ చేయాల్సిందే. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష చేసినపుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం సూచనల ప్రకారం ఉన్నతాధికారులు ఫైల్ రెడీచేశారు. ప్రభుత్వ నిర్ణయం గనుక ఆదేశాల రూపంలో బయటకు …
Read More »ఏపీలో ముందస్తు ఎన్నికలా ?
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల జరగబోతున్నాయా ? మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అవుతున్న ప్రచారంచూస్తే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. క్యాబినెట్ సమావేశం నుండి ఉన్నతాధికారులు వెళిపోయిన తర్వాత జగన్ సహచర మంత్రులతో పిచ్చాపాటి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతు ఎన్నికల మూడ్ లోకి ఇప్పటినుండే షిఫ్ట్ అయిపోవాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి షెడ్యూల్ ఎన్నికలు 2024లో జరగాలి. అంటే షెడ్యూల్ …
Read More »జగన్ వీళ్లకు కేబినెట్ ఛాన్స్ ఇవ్వరా ?
ఏపీలో అధికార వైసీపీకి చెందిన నేతల్లో ఇప్పుడు ఒక్కటే ఉత్కంఠ పెరిగిపోతోంది. దసరాకు కాస్త అటూ ఇటూగా మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని తెలియడంతో ప్రస్తుతం కేబినెట్లో ఉన్న వారిలో ఎవరు అవుట్ అవుతారు ? కొత్తగా ఎవరు ఇన్ అవుతారు ? అన్నదానిపై రకరకాల లెక్కల్లో ఎవరికి వారు మునిగి తేలుతున్నారు. జగన్ ముందు నుంచి ఒకే మాట మీద నిలబడతారు. ఆయన రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్న …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates