Political News

మావోయిస్టు అగ్ర నేత‌.. ఆర్కే మృతి!

మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హ‌ర‌గోపాల్‌.. అలి యాస్‌ రామకృష్ణ.. అలియాస్ ఆర్కే తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాం తంలో అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే బాధపడుతున్నారని స‌మాచారం. ఆయన కరోనాతో మృతి చెందినట్లు, అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు అధికారులు పోలీసు లు ప్రకటించారు. ఆయన తుదిశ్వాస …

Read More »

ఉద్యోగులను ఊరిస్తున్న పీఆర్సీ

ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగులకు జీతాలు పెరగడమనేది పే రివిజన్ కమీషన్ (పీఆర్సీ) సిఫారసుల మీద ఆధారపడుంటుంది. ఇపుడా పీఆర్సీ అమలు విషయంపైనే ఉద్యోగులు, ఉద్యోగుల సంఘాల నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కమిషన్ సూచనల ప్రకారం పూర్తిస్ధాయి పీఆర్సీ అమలు చేసే ముందు ప్రభుత్వం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్) అమలు చేస్తుంది. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐఆర్ 27 శాతం 2019, జూలై నుంచి అమలు చేస్తోంది. …

Read More »

రేవంత్ కు ఢిల్లీలో తలంటు తప్పలేదా?

పని చేసే వాడి కంటే.. పని చేస్తున్న వాడి తప్పుల్ని వెతికే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని శక్తులు మరే రాజకీయ పార్టీలో కనిపించవు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల్లో మాత్రం.. మనం పని చేయటం.. చేసేవాడు ఎలా చేస్తేనేం అన్నట్లుగా ఫీల్ కావటం కనిపిస్తుంది. కానీ.. కాంగ్రెస్ లో మాత్రం.. కాస్త పని చేసినా.. దానికి ఏవో లెక్కల్ని తెర మీదకు తీసుకొచ్చి.. నెగిటివ్ అంశాన్ని చర్చకు తెచ్చి.. …

Read More »

క‌రెంటు క‌ష్టాల‌పై చౌద‌రి వ్యంగ్యాస్త్రాలు

రాష్ట్రంలో క‌రెంటు కోత‌లు త‌ప్ప‌వంటూ.. వస్తున్న వార్త‌ల నేప‌థ్యంలో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి ఆస‌క్తిగా స్పందించారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఎప్పుడూ.. ఆస‌క్తిగా కామెంట్లు చేసే బుచ్చ‌య్య ఈ సారి.. కూడా అంత‌కు మించి.. అన్న రేంజ్‌లో క‌రెంటు కోతల విష‌యంపై స్పందించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అన‌ధికార విద్యుత్ కోత‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. అధికారులు ఈ విష‌యంలో ఆల్ …

Read More »

మోడీ ఇంతగా భయపడుతున్నారా ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగా భయపడుతున్నారో జనాలందరికీ తెలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో రైతులపైకి వాహనాలు నడిపటంలో నలుగురు రైతులు మరణించిన విషయం దేశంలో ఎంతగా సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ర్యాలీ తీస్తున్న రైతులపైకి వెనక నుండి జీపు నడిపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాయే. సుప్రీంకోర్టు జోక్యంతో ఆశిష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు …

Read More »

ఏపీలో విద్యుత్ సంక్షోభం.. కారణం చెప్పిన ట్రాన్స్ కో

భారత్ కు తీవ్రమైన విద్యుత్ సంక్షోభం పొంచి ఉందనే మాట ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చెప్పినంత ఎక్కువగా ఏమీ కొరత లేదన్న మాటను ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. అందులో నిజం లేదన్న మాట తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థం కాక మానదు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ కంటే ఏపీకే విద్యుత్ సంక్షోభం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బలం …

Read More »

బీజేపీ అభ్యర్థికి ఒక్కటంటే ఒక్క ఓటే

భారతీయ జనతా పార్టీ.. ఏడేళ్ల నుంచి భారత దేశాన్ని పాలిస్తున్న పార్టీ. దాని బలం ముందు ఇండియాలో ఏ పార్టీ కూడా నిలవలేకపోతోంది. 2014-19 మధ్య పెద్ద తప్పులు చేసినా.. ఆ తప్పుల్ని మన్నించి మళ్లీ ఆ పార్టీకే అధికారం అధికారం కట్టబెట్టారు దేశ ప్రజలు. అలాంటి పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు వచ్చిందంటే నమ్మశక్యంగా అనిపించదు. ఏ రాష్ట్రమైనా కావచ్చు.. ఎన్నిక …

Read More »

బీసీలపై పవన్ గాలి ?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెల్లిగా బీసీలను లాగటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. బీసీల ఆందోళనలకు తాను మద్దతు ఇస్తానని ఇపుడు చెబుతున్నారు. అయితే పవన్ ఉద్దేశ్యం మాత్రం 2024 ఎన్నికల నాటికి బీసీలను తన వైపు తిప్పకోవటమే అని అర్ధమవుతోంది. తనకు కులం లేదని పదే పదే చెబుతున్న పవన్ ఆచరణలో మాత్రం కాపులను ఓన్ చేసేందుకు ఇటీవల బాగా …

Read More »

పోగొట్టుకున్న చోటే వెతుకుంటున్న చంద్రబాబు

ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతికితే ప్రయోజనం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. చంద్రబాబు ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. అందులో ఆయన విజయం సాధిస్తారో లేక ఆశాభంగానికి గురవుతారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోట. గుండ్లకుంట శివారెడ్డి మరణం తర్వాత టీడీపీ ప్రాభవం కోల్పోయింది. శివారెడ్డి వారసత్వాన్ని రామసుబ్బారెడ్డి అందుకున్నారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ …

Read More »

పవన్ టార్గెట్ లో క్లారిటీ పెరిగిందా?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఆ పార్టీ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు పవన్‌ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న మేధావుల అభిప్రాయాలను తన ట్విట్టర్ ఖాతాలో జత చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలను పవన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఉండవల్లి వంటి రాజకీయ ఉద్దండులు మాట్లాడిన మాటలను బట్టి.. ఆర్థిక …

Read More »

ఇంటిని చంద్రబాబు చక్కదిద్దుకుంటున్నారా ?

మూడు రోజుల చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిజానికి ఈ పర్యటన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే చేసుండాలి. కానీ అప్పట్లో నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో కరోనా వైరస్ సమస్య కూడా మొదలవ్వటం తో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. కరోనా దెబ్బకు దాదాపు రెండేళ్లకు పైగా చంద్రబాబు బయట తిరగలేకపోయారు. ఏదో పార్టీ అవసరార్ధం నేతలను పరామర్శించటం తప్ప పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు బయటతిరిగింది …

Read More »

యూపీలోనే కాదు, ఉత్తరాఖండ్ లోనూ బీజేపీకి చావు దెబ్బ

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ లో రైతుల గోల పెరిగిపోతుంటే పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ లో ముసలం మొదలైనట్లే ఉంది. రెండు రాష్ట్రాల్లోను బీజేపీనే అధికారంలో ఉండటంతో అధికార పార్టీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరాఖండ్ లో ఓ మంత్రి తన కొడుకుతో పాటు హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఒక మంత్రే ఓ ఎంఎల్ఏ తో కలిసి బీజేపీకి రాజీనామా ఇచ్చేసి కాంగ్రెస్ లో చేరిపోతారని …

Read More »