తెలంగణ రాష్ట్ర కాంగ్రెస్ లో పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ల పంచాయితీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రేవంత్ పీసీసీగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఓ వర్గం నేతలు ఆయనతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. సీనియర్ నేత జగ్గారెడ్డి ఎపిసోడ్ తో అస్త్రం దొరికినట్టుగా భావించారు. ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమితో అక్కడ పీసీసీ …
Read More »చిక్కుల్లో బెంగాలీ అక్క.. రిలీఫ్ లో తెలుగు తమ్ముళ్లు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పెగాసస్ వ్యవహారంలో ఇరికించాలి అని భావిస్తున్న వైసీపీకి అనూహ్య పరిణామాలే ఎదురవుతున్నాయి. అదేవిధంగా సభలో సభ్యుల మాట తీరుపై కూడా మీడియాలో కథనాలు వస్తుండడంతో ఇంకా విషయం తీవ్ర తరం అవుతూ వస్తోంది.ఇదే దశలో తాము ఏ నిఘా సంబంధ వ్యవహారాలను ప్రొత్సహిస్తూ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని పదే పదే టీడీపీ చెబుతుండడం, అదేవిధంగా సభా సంఘానికి పట్టుబట్టడంతో ఒక్కసారిగా ఈ విషయంలో …
Read More »లోక్ సభలో ఏపీ కల్తీ మద్యంపై రచ్చ
ఏపీలో నాటు సారా, కల్తీ మద్యం బ్రాండ్ల వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. జంగారెడ్డి గూడెం మృతుల అంశంపై అసెంబ్లీ గత వారం రోజులుగా అట్టుడుకుతోంది. తాజాగా ఈ వ్యవహారం లోక్ సభలోనూ అగ్గి రాజేసింది. ఏపీలో మద్యం నాణ్యతపై ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్ సభలో ప్రస్తావించారు. అలా లేఖ రాసినందుకు తనపై వైసీపీ …
Read More »మోడీ సార్కు ఆ జబ్బు మంచిది కాదు: ప్రకాశ్ రాజ్
బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కేంద్రంలోని బీజేపీని, ముఖ్యంగా ప్రదాని మోడీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తూ.. జాతీయస్థాయి రాజకీయాల్లో.. విమర్శకుడిగా నిలిచారు. అనేక అంశాలపై ఆయన స్పందించారు. రాజకీయ అసహనం, మత అసహనం, తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన.. హిజాబ్ అంశం.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇలా, అనేక అంశాలపై మోడీపై.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఇప్పుడు కూడా మరోసారి మోడీని టార్గెట్ …
Read More »క్లైమాక్స్ లో సీపీఎస్ ? బుగ్గన చెబితే వినాలి!
త్వరలో సీపీఎస్ రద్దు నిర్ణయం ఉంటూనే, అందరికీ ఆమోదయోగ్యం అయిన రీతిలోనే సంబంధిత నిర్ణయాలు కూడా వెలువరిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన అంటున్నారు. ఇప్పటికే దీనిపై పలు మార్లు సీఎంతో చర్చలు జరిపామని, త్వరలో ఉద్యోగులు శుభవార్త వింటారని చెబుతున్నారు. ఈ దశలో సీపీఎస్ ఉద్యోగులు సైతం తమ వంతు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సర్కారు నిర్ణయాలు కొన్నింటిని తెలుసుకుని వాటిని మార్చేందుకు తమదైన దారిలో మంత్రులతో సీఎంకు …
Read More »తప్పుచేసి దిద్దుకుంటున్న ప్రభుత్వం
తప్పులు చేయటం తర్వాత తీరిగ్గా దిద్దుకోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. గతంలో ప్రభుత్వం నియమించిన స్మార్ట్ సిటి ఛైర్మన్లతో ఇపుడు రాజీనామాలు చేయించటం ఇందులో భాగమే. తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకోవటం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం తర్వాత సమస్య ఎదురైతే తల పట్టుకోవటం మామూలైపోయింది. దేశంలోని కొన్ని నగరాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్నింటిని స్మార్ట్ సిటి …
Read More »పోలవరం ఆగిందా ? కారణం ఇదే !
పోలవరం నిర్మాణం పూర్తి అన్నది తమతోనే సాధ్యం అని వైసీపీ చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇసుక తరలింపునకు సంబంధించి రెండు పెద్ద కంపెనీల మధ్య రగులుతున్న రగడను నివారించే, నిలువరించే ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్ మాత్రమే చేయగలరు. ఇదే దశలో కేంద్రం నుంచి వచ్చే నిధులు తరువాత పనులు వీటిపై కూడా జగన్ ఒక్కరే తేల్చగలరు.కానీ ఆగిపోయిన పనుల ఊసెత్తితే వైసీపీ …
Read More »పెగాసస్పై వైసీపీ దూకుడేలా? తేడా వస్తే దెబ్బే!
ప్రత్యర్థి పార్టీ నాయకులపై ఆరోపణలు వస్తే వెంటనే రంగంలోకి దిగి పట్టు సాధించాలని అధికార పార్టీలు అనుకోవడం రాజకీయాల్లో సాధారణమే. ఇక ఏపీలో అయితే ప్రతిపక్ష టీడీపీని ఖాళీ చేయాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ.. బాబును దెబ్బ కొట్టే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు పెగాసస్ వ్యవహారంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పెగాసస్ …
Read More »ఎంత రెచ్చగొట్టినా.. బాబు పొత్తులతోనే!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. పొత్తులకు ఏదో అవినాభావ సంబంధం ఉందనేది విశ్లేషకుల మాట. ఎన్నికల వస్తే చాలు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే సంప్రదాయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ వస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణానంతరం బాబు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే పరిస్థితే లేకుండా పోయింది. 2019లో పైకి ఒంటరిగానే పోటీ చేసినట్లు కనిపించినా.. రహస్యంగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారని …
Read More »వంశీకి టికెట్ ఇచ్చారో.. అంతే సంగతి
2019 ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీని కాదని వైసీపీకి మద్దతుగా నిలబడ్డ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం.. ఒకవేళ ఎన్నికల్లో నిలబడ్డా వైసీపీ తరపున గెలవడం అంత సులభంగా కనిపించడం లేదు. గన్నవరంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ వర్గం వంశీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. వంశీ చేరికతో గన్నవరంలో వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. …
Read More »ఢిల్లీకి రేవంత్.. సీనియర్లకు చెక్ పెట్టేందుకేనా?
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం ఓ వైపు తాను ప్రయత్నాలు చేస్తుంటే.. తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నేతలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సపరేటుగా సమావేశాలు పెట్టుకుంటున్న సీనియర్లపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్ను కలిసి సీనియర్ నేతల వైఖరిపై రేవంత్ ఫిర్యాదు చేస్తారని సమాచారం. ఇటీవల …
Read More »చినజీయర్తో గ్యాప్ లేదు.. కేసీఆర్
చినజీయర్ స్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ముచ్చింతల్లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంపై కేసీఆర్ సీరియస్గా రియాక్టయ్యారు. ‘‘చినజీయర్తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates