Political News

తెలంగాణ‌, ఏపీల్లో ఆర్థిక దారుణాలు

ఉచిత పథకాలకు రాష్ట్రాలు భారీగా ఖర్చు చేస్తున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. పలు రాష్ట్రాలు పన్ను ఆదాయంలో దాదాపు 63 శాతం ఉచితాలకు వెచ్చిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో రెవెన్యూలో 35 శాతం ప్రజాకర్షక పథకాల కోసం వినియోగిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్లో ఇది 5-19 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలా చేయ‌డం ద్వారా. ఆయా రాష్ట్రాలు త్వ‌ర‌లోనే దివాలా దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఇది ఆర్థిక దారుణాల‌కు.. అత్య‌వ‌స‌ర …

Read More »

`కుప్పం` కోట‌పై వైసీపీ ఎత్తులు..

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం కన్నా కూడా వ‌చ్చే ఎన్నిక ల్లో విజ‌య‌మే.. పార్టీకి ప్ర‌తిష్ట‌గా మారింది. ఈ నేప‌థ్యంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంపై జ‌గ‌న్ దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిని మున్సిపాలిటీగా కూడా తీర్చిదిద్దారు. అంతేకాదు.. గ‌త మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ …

Read More »

రేవంత్ ను మించిన దుర‌దృష్ట‌వంతుడు ఎవ‌రుండ‌రు!

రేవంత్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ చీఫ్. రాజ‌కీయాల్లో స్వ‌ల్ప‌కాలంలోనే ఈ ప‌ద‌వి పొందిన యువ‌నేత‌. ప‌ద‌వి చేప‌ట్టింది మొద‌లు కేసీఆర్ టార్గెట్గా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా, ఆయన ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జిల్లాలు చుట్టేస్తూ కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. రేవంత్ స్పీడ్ తో ఆయన వర్గీయులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే …

Read More »

కొత్త మంత్రులు- పదవిస్తే పార్టీకే తలనొప్పిగా మారారే

ఏపీలో కొత్త మంత్రుల దూకుడు ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారిందని అధికార పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో బాధ్య‌త‌లు తీసుకున్న మంత్రులు త‌ల‌కోర‌కంగా.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సీనియ‌ర్ నాయ‌కుడు.. శ్రీకాకుళం ఎమ్మెల్యే మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. బాధ్య‌త‌లు తీసుకున్న వెంట‌నే.. అవినీతి వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రెవెన్యూ శాఖ‌లో అవినీతి పెరిగిపోయింద‌ని.. అవినీతి లేని పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు అందిద్దామ‌ని.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. అటు పార్టీని.. …

Read More »

బ్లాక్‌మెయిల్ చేసేవారికే ఏపీలో మంత్రి ప‌ద‌వులు.. చంద్ర‌బాబు

ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా స్పందించారు. మంత్రి వ‌ర్గం ఏర్ప‌డి.. దాదాపు వారం అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రియాక్ట్ కాలేదు. అయితే.. తాజాగా స్పందించిన చంద్ర‌బాబు హాట్ కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల్లో బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యం తాను చెప్ప‌డం లేద‌ని.. వైసీపీలోనే రాజ‌కీయ …

Read More »

జ‌గ‌న్‌కు దెబ్బ‌కు దెబ్బ కొడ‌తా.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్య‌లు

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నివారి అసంతృప్తి త‌గ్గుతోంద‌ని అనుకుంటున్న త‌రుణంలో ఒక్క‌సారిగా మ‌ళ్లీ అసంతృప్తి జ్వాల‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇటీవ‌ల త‌న త‌ఢాకా చూపిస్తానంటూ.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విశాఖ జిల్లా రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్ల‌బాబూరావు.. తాజాగా మ‌రోసారి వైసీపీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. జ‌గ‌న్‌ను దెబ్బ‌కు దెబ్బ కొడ‌తానంటూ తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవ‌స‌ర‌మైతే.. త‌న‌ను జైల్లో పెట్టాలంటూ.. …

Read More »

ఎంపీగా ఇళయరాజా?

సంగీత దర్శకుడిగా అసాధారణ పేరు ప్రఖ్యాతులు సంపాదంచిన ఇళయరాజా.. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాజకీయాల జోలికి వెళ్లలేదు. తమిళ నాట గతంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆయన్ని రాజకీయాల్లోకి దించడానికి ప్రయత్నాలు చేశాయి. ఆయన పాపులారిటీని వాడుకుని, పదవులు ఇవ్వజూపాయి. కానీ తనకు సంగీతమే ప్రధానం అని ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు పంపబోతున్నట్లుగా వార్తలు వస్తుండటం …

Read More »

ఊపిరి పీల్చుకున్న వైసీపీ నేతలు

నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఒకవైపు మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మరోవైపు మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ సభలు ఒకేసారి ఒకే ప్రాంతంలో జరగటమే. దీనికన్నా ముఖ్యమైన కారణం ఏమిటంటే వీళ్ళద్దరికీ అసలు పడకపోవటమే. ఇద్దరిలో ఎవరుముందు సభ నిర్వహించాలని అనుకున్నారో తెలీదు కానీ నేతల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోయింది. ఇద్దరికీ కావాల్సిన నేతలు కొందరు ఒకరిని సభ రద్దుకానీ లేదా …

Read More »

ప్రతిపక్షాలు కేసీయార్ కు హ్యాండిచ్చాయా ?

జాతీయస్ధాయిలో తాజాగా మొదలైన రాజకీయ పరిణామాల్లో ఇపుడిదే హాట్ టాపిక్ అయ్యింది. దేశంలో పెరిగిపోతున్న మత విద్వేషాలు, విద్వేష ప్రకటన తదితరాలపై దేశంలోని ప్రతిపక్షాల అధినేతలు నరేంద్రమోడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో 13 పార్టీల అధినేతల సంతకాలున్నాయి. అందులో కేసీయార్ సంతకం మాత్రం ఎక్కడా కనబడలేదు. దీనికి కారణం ఏమిటంటే అన్నీ పార్టీలు కేసీయార్ ను అసలు సంప్రదించనే లేదని తాజా సమాచారం. నరేంద్రమోడి ప్రతిపాదిస్తున్న …

Read More »

నాకు నేనే .. పోటీ.. మాజీ మంత్రి అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నెల్లూరు వైసీపీలో తారస్థాయికి చేరిన గ్రూపు రాజకీయాలు.. ఎవరికి వారు బలప్రదర్శన చాటుకునే వరకూ వెళ్లింది. తాజాగా మంత్రి పదవి చేపట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డి.. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళే జిల్లాకు చేరుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అటు.. ఇటీవలే మాజీగా మారిపోయిన అనిల్ కుమార్ సైతం.. ఇదే రోజున కార్యకర్తలతో “ఆత్మీయ సభ” నిర్వహించారు. దీంతో.. రెండు రోజులుగా నెల్లూరు వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఏం జరగబోతోందా? అని …

Read More »

నాలుగు చోట్లా బీజేపీకి నిరాశేనా ?

తాజాగా వెల్లడైన పార్లమెంట్, అసెంబ్లీల ఉపఎన్నికలన్నింటిలోను బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం అన్నీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే విజయం సాధించాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి శత్రుజ్ఞ సిన్హా గెలవటం. బాబూల్ సుప్రియో బీజేపీ ఎంపీగా రాజీనామా చేసి తృణమూల్ లో చేరారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక …

Read More »

సీఎం వస్తుంటే గృహ నిర్బంధాలేనా ?

రాష్ట్రంలో పరిస్థితులు రానురాను విచిత్రంగా తయారవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించినా ముందుగా గృహ నిర్బంధాలు ఎదురవుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. మామూలుగా అయితే ప్రతి పక్షాల నేతలను నిర్బంధించటం జరుగుతున్నదే. అయితే మామూలు జనాలను నిర్బంధించటం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మామూలు జనాలజోలికి వెళ్ళరు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మామూలు జనాలు రావటం కలిసి విజ్ఞాపనలు చేసుకోవటం …

Read More »