కుప్పం నియోజకవర్గ ఇన్చార్జి, ఎంఎల్సీ భరత్ చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి స్పందన రెండూ విచిత్రంగానే ఉంది. కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గంలో నీటి సమస్య తీర్చేందుకు హంద్రీ-నీవా ప్రాజెక్టు చాలా కీలకం. ప్రాజెక్టులోని కెనాల్ అంటే కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తిచేస్తే చాలావరకు నీటి సమస్య తీరిపోతుంది. ఇదే విషయమై కార్యకర్తలతో జరిగిన సమావేశంలో భరత్ మాట్లాడుతు ఇరిగేషన్ కాంట్రాక్టర్ సీఎం రమేష్ కావాలనే కెనాల్ పని …
Read More »కలిసివచ్చే కాలం.. కమలానిదా.. కారుదా..
తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్కు దూరం కావడం.. మరో 12 మంది వరకు నాయకులు తమతో టచ్లో ఉన్నారని.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కామెంట్లు చేయడంతో తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు.. మోడీపై యుద్ధాలు.. అంటూ ఆయన చేస్తున్న కామెంట్ల నేపథ్యంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాజకీయాలపై జోరుగా …
Read More »జగన్ సర్.. మోడీ మీరు అనుకున్నట్టు లేరుగా!
రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారో అనేది ఆసక్తికర విషయమే. అవకాశం.. అవసరం .. అనే రెండు పట్టాలపైనే రాజకీయాలు ముందుకు సాగుతాయి. కేంద్రంతోతాను సఖ్యతగా ఉంటే.. ఏపీకి అన్నీ సమకూరుతాయనేది సీఎం జగన్ ఆలోచన. ఎందుకంటే.. ఏపీ అనేక ఇబ్బందులలో ఉందని.. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. కేంద్రం నుంచి సాయం లేకపోతే.. రాష్ట్ర ముందుకు సాగదని.. జగన్ నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రాన్ని మచ్చిక చేసుకుని …
Read More »గోరంట్ల మాధవ్.. కథ ముగిసినట్లేనా?
ఇప్పుడు తెలుగు నెటిజన్ల దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్న అంశం.. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారమే. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో నేతల రాసలీలల గురించి వార్తలు రావడం తొలిసారేమీ కాదు. ఆ పార్టీకి ఒకప్పుడు మద్దతుదారుగా ఉన్న కమెడియన్ పృథ్వీ ఒక మహిళతో జరిపినట్లుగా ప్రచారం జరిగిన సరస సంభాషణ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్లు సైతం …
Read More »చనిపోయినా పింఛను.. పథకాలు.. దటీజ్ వైసీపీ?
అయ్యా.. మేం కష్టాల్లో ఉన్నాం.. మాకు ఆదరువు లేదు.. పింఛను ఇచ్చి పుణ్యం కట్టుకోండి..అంటూ.. చాలా మంది వృద్ధులు..అర్హులైన పేదలు.. సర్కారుకు మొర పెట్టుకుంటున్న విషయం తరచుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న గడపగడపకు కార్యక్రమంలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. దీనిపై ప్రభుత్వం మాత్రం చూస్తాం..చేస్తాం..అంటూకాలం గడిపేస్తోంది. ఇదిలావుంటే.. తాజాగా.. ఓ సంచలన విషయం వెలుగు చూసింది. ఓ చనిపోయిన వ్యక్తికి మూడేళ్లుగా …
Read More »ఏపీ-తెలంగాణ.. సేఫ్ పాలిటిక్స్
పై ఫొటోలో ఉన్నది.. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు. ఇటు వైపు.. ఏపీ సీఎం జగన్ దంపతులు. ఇద్దరూ చూడముచ్చటగా.. ఇక ఇకలు.. పకపకలు.. కనిపిస్తున్నాయి. పువ్వాడ కుమారుడి వివాహం ఈ నెల 20న ఉన్న నేపథ్యంలో పువ్వాడ దంపతులు.. జగన్ దంపతులను ఆహ్వానించారు. అయితే.. ఇక్కడ విషయం ఏంటంటే.. నిన్న గాక మొన్న.. జగన్పైనా.. ఆయన పాలనపైనా.. పువ్వాడ విరుచుకుపడ్డారు. పోలవరం ఎత్తును …
Read More »‘మీరు’ అని అంటారా? రేవంత్ సారీ చెప్పాల్సిందే!
‘మీరు’ అన్న మాటలో ఎంత తప్పు ఉందన్న విషయం కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అడిగితే ఇట్టే చెప్పేస్తారు. తాజాగా ఆయన చాలా ఆగ్రహంతో ఉన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి.. బీజేపీలో చేరేందుకు సిద్దమన్న ప్రకటన చేసిన నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లోని ‘మీరు’ పద ప్రయోగంపై ఆయన అభ్యంతరం వ్యక్తం …
Read More »ఈ దేశంలో ఏమైనా జరిగే వీలు: విజయసాయి
మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. ప్రజాస్వామ్య భారతంలో ఏమైనా జరిగే వీలుంది. అది ఈ దేశానికి మాత్రమే సాధ్యమన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. అందుకు నిబంధనలు.. విధానాలు సాయం చేస్తుంటాయి. తాజాగా ఏపీ అధికార పక్షం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఆయన ఈ రోజు రాజ్యసభ సభాపతి స్థానంలో కూర్చొని.. పెద్దల సభను నిర్వహించే వీలు లభించింది. ఈ పరిణామాన్ని కొందరు …
Read More »హైకోర్టు విషయంలో మేం జోక్యం చేసుకోం: కేంద్రం
ఏపీ హైకోర్టును మార్చే విషయంపై కేంద్రం మళ్లీ మళ్లీ అదే మాట చెబుతోంది. గత పార్లమెంటు సమావేశాల్లో.. ఈ విషయం తమ పరిధిలో లేదని చెప్పిన కేంద్రం.. తాజాగా కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం-ఏపీ హైకోర్టు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకుని.. తమకు పంపిస్తే.. దానిపై చర్చించి.. రాష్ట్రపతికి ప్రతిపాదిస్తామని.. హైకోర్టు పరిధిలో తాము జోక్యం చేసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, …
Read More »ఇప్పుడు జగన్ ఏం చేస్తారు?
ఔను! ఇప్పుడు హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియో కాల్ విషయం.. దేశవ్యాప్తంగా చర్చ కు వస్తోంది. ఈ విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎలాంటి చర్యలకు దిగుతారనేది ప్రధాన టాపిక్. పార్టీలోను, పార్టీ నేతల విషయంలోనూ.. జగన్.. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారనేది ఎవరు ఔనన్నా.. కాదన్నా.. నిజం. అందుకే.. నాయకులు జగన్ తో మాట్లాడాలంటే.. కొన్ని కొన్ని విషయాల్లోచాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక, నాయకుల క్రమశిక్షణ …
Read More »మరో 15 మందిపై బీజేపీ కన్ను
తెలంగాణ బీజేపీ మరో 15 మంది కీలక నేతలపై కన్నేసిందా? వారిని కూడా త్వరలోనే పార్టీలోకి ఆహ్వానిం చనుందా? వారుకూడా సిట్టింగు ఎమ్మెల్యేలేనా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ చీఫ్ బండి సంజయ్. దీనికి సంబంధించి తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంకా చాలా ఉప ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. తమతో 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. చెప్పారు. అధికార టీఆర్ ఎస్ నాయకులే …
Read More »వైసీపీ ఎంపీ వికృత చేష్ఠలు
వైసీపీ ఎంపీలపై ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అవన్నీ.. ఇప్పుడు కాకపోతే.. మరో రోజైనా సరిదిద్దుకునేందుకు అవకాశం ఉన్నవే. కానీ, ఇప్పుడు వెలుగు చూసిన ఘటన మాత్రం సరిదిద్దుకు నే అవకాశం లేనిది. అదే.. హిందూపురం వైసీపీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ గోరంట్ల మాధవ్కు సంబంధించిన ఒక సంచలన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎవరు దీనిని చూసినా.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం జరిగిందంటే.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates