మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే అభ్యర్ధిని అధిష్టానం ప్రకటించింది. సీనియర్ నేత పాల్వాయ్ స్రవంతిని పార్టీ చీఫ్ సోనియాగాంధి ప్రకటించారు. అభ్యర్ధిగా స్రవంతిని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుకున్నట్లే ప్రకటించింది. అంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డేమో కృష్ణారెడ్డి అనే నేతను అభ్యర్ధిగా ప్రతిపాదించారు. ఇదే సమయంలో వెంకటరెడ్డేమో స్రవంతిని ప్రతిపాదించారు. సో వెంకటరెడ్డి ఛాయిస్ ప్రకారమే అధిష్టానం స్రవంతిని ఎంపికచేసింది. అంటే …
Read More »ఏ క్షణమైనా.. విశాఖ నుంచే పాలన: ఏపీ మంత్రి
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే.. చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. మూడు రాజధానులకు సంబంధించిన స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు. గతంలో …
Read More »కుప్పంపై జగన్ వ్యూహం.. ఏకంగా ఎన్ని కోట్లు ఇచ్చారంటే!
రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయి. ఇక, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అయితే.. సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. చిన్నపాటి వైద్యానికి కూడా నోచని తండాలు.. ప్రాంతాలు మన రాష్ట్రంలో కోకొల్లలు. అరకు, పాడేరు.. వంటి గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఏదైనా అత్యవసర వైద్యం అవసరమైతే.. డోలీలు కట్టుకుని.. మరీ ఏరియా ఆసుపత్రులకు తీసుకువస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గర్భిణులకు సరైన సమయానికి వైద్యం అందక.. మరణాలు సంభవిస్తున్నపరిస్థితి కూడా ఉంది. …
Read More »చంద్రబాబు ఆస్తులపై మీకేంటి అంత ఆసక్తి?: సుప్రీం ఫైర్
ఉమ్మడి ఏపీనే కాకుండా.. నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆస్తులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు ఆసక్తిగా స్పందించింది. “చంద్రబాబు ఆస్తులగురించి మీకెందుకు ఆసక్తి? అసలు మీకు ఎందుకు చెప్పాలి?” అని నిలదీసింది. అంతేకాదు.. ఎవరెవరో .. సంపాయించుకున్న ఆస్తుల వివరాలు తెలుసుకుని.. మీరు ఏంచేయాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించింది. ఇవన్నీ కూడా.. వైసీపీ నాయకురాలు.. ప్రస్తుత తెలుగు అకాడమీ చైర్పర్సన్.. లక్ష్మీపార్వతి గురించే. తరచుగా …
Read More »ముందస్తుఎన్నికలు తప్పదా ?
తెలంగాణాలో మధ్యంతర ఎన్నికలు తప్పేట్లు లేదు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అనుకుంటున్న కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలంటే అప్పటికి తాను ఫ్రీగా ఉండాలని అనుకుంటున్నారట. అప్పటికి తాను ఫ్రీగా ఉండాలంటే తెలంగాణాలో ఎన్నికలు ఉండకూడదు. ఎంఎల్ఏ, ఎంపీ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే రెండు ఎన్నికల్లో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే అసెంబ్లీ ఎన్నికలు ముందుగా …
Read More »మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ఎవరంటే!
తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ ముసుగు వీడిపోయింది. ఇప్పటి వరకు నువ్వానేనా.. అన్నట్టుగా ఉన్న ఇక్కడి నాయకుల తీరుకు తెరదించుతూ.. కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసింది. ఆది నుంచి ఇక్కడ పోటీకి.. నలుగురు కీలక నాయకులు రంగంలో ఉన్నారు. దీంతో అభ్యర్థిని ఖరారు చేయడం స్థానిక నాయకత్వానికి కత్తిమీద సాములాంటి పరిణామమే ఎదురైంది. ఈ నేపథ్యంలో …
Read More »వారి బూతులే వారికి శ్రీరామరక్షనా?
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదు. శాఖల మీద పట్టు పెంచుకోవటంతో పాటు రాజకీయంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చాలామంది మంత్రులు ఫెయిలయ్యారనే భావన జగన్లోనే కనిపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనతో పాటు తన భార్యపైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా మంత్రుల్లో చాలామంది స్పందించకపోవటంపై జగన్ ఫుల్లుగా ఫైర్ …
Read More »అమరావతిపై మరో గందరగోళం.. ప్రభుత్వం ఏం చేసిందంటే!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఆది నుంచి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మూడు రాజధానులు అంటూ తెరమీదికి తెచ్చి.. ఇక్కడి రైతులతో కన్నీరు పెట్టించింది. ఇప్పుడు ఇదే పరంపరలో మరో గందరగోళానికి తెరలేపింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామపంచాయతీలతో.. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు …
Read More »కేసుల నుంచి జగన్కు కొంత రిలీఫ్ వచ్చింది.. కానీ, టెన్షనే
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహరంలో కొంత రిలీఫ్ వచ్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న టెన్షన్లో కొంత మేరకు తగ్గిందని అంటున్నారు. అయినప్పటికీ.. పూర్తిగా టెన్షన్ అయితే పోలేదని చెబుతున్నారు. దీంతో అసలు ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టులో విచారణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల …
Read More »జగన్ ఆణిముత్యమట.. లోకేష్ పప్పుసుద్ద అట!!
ఏపీలో వైసీపీ నేతల భజన పరాకాష్టకు చేరిందని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ను, ఆయన తండ్రి.. మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆకాశానికి ఎత్తేయడం.. పార్టీలో ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే.. ఎవరి పంథాలో వారు.. ఈ భజన విషయంలో మరింత దూకుడుగా ఉన్నార నేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఎందుకంటే.. మంత్రి పదవులు కాపాడుకోవాలనే కోరికో.. లేక.. అధినేతను మచ్చిక చేసుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో …
Read More »ఆంధ్రా ‘తమిళిసై’ ఎక్కడ?
ఇది కొంత చిత్రమైన విషయం. తరచుగా చర్చకు కూడా వస్తున్న విషయమే! దేశవ్యాప్తంగా బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు.. దూకుడుగా ఉన్నారు. అంతేకాదు.. అక్కడి ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తున్నారనే చెప్పాలి. ఉదాహరణకు.. ఢిల్లీని తీసుకుంటే.. అక్కడి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పులు పెడుతున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఇటీవల కేజ్రీవాల్ సర్కారును డిఫెన్స్లో పడేసిన.. లిక్కర్ కుంభ కోణాన్ని గవర్నర్ స్వయంగా సీబీఐకి అప్పగించారు. అంతేకాదు.. …
Read More »టీఆర్ఎస్-కాంగ్రెస్ కలుస్తాయా ?
ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో టీఆర్ఎస్-కాంగ్రెస్ చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే పై బలమైన పోరాటం చేయాలంటే నాన్ ఎన్డీయేపార్టీలు+యూపీయే చేతులు కలపాల్సిన అవసరం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొన్నటి భేటీలో కేసీయార్ కు చాలా గట్టిగా చెప్పారట. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ తో చేతులు కలపకుండా ఎన్డీయే మీద పోరాటం ఎప్పటికీ సక్సెస్ కాదని కూడా నితీష్ స్పష్టంగా చెప్పారట. నితీష్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates