Political News

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌` గుర్తింపు ఇచ్చింది. `అల్లూరి సీతారామ‌రాజు` అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు నిర్ధారించిన ఈ విమానాశ్ర‌యాన్ని.. ఇమ్మిగ్రేష‌న్ అండ్ ఫారిన్ యాక్ట్‌-2025లో చేర్చింది. త‌ద్వారా.. ఈ విమానాశ్ర‌యం అంత‌ర్జాతీయ కేట‌గిరీలో తొలిస్థానం ద‌క్కించుకున్న‌ట్టు అయింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతోపాటు గెజిట్ ప్ర‌క‌ట‌న చేసింది. …

Read More »

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ ఉంటాము. ఇందుకు భిన్నంగా అభిమాన రాజకీయ నేతను కలుసుకునేందుకు ఏకంగా రైలు ఎక్కి వచ్చేశాడు ఈ బాలుడు. సీఎంతో ఫోటో దిగాలని సాహసం చేశాడు. రైలెక్కి ఏకంగా తాడేపల్లికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరి 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడికి …

Read More »

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న సోమ‌వారం.. రాజ‌మండ్రిలోని ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టుకు కొత్త గేట్ల‌ను ఏర్పాటు చేసే ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. దాదాపు 50 ఏళ్ల కింద‌ట ఒకసారి ఈ గేట్లు మార్చ‌గా.. వాటిలో సుమారు 64 గేట్లు తుప్పుప‌ట్టాయి. మ‌రికొన్నింటికి వైరింగ్ దెబ్బ‌తింది. దీంతో వాటిని మార్చే కార్య‌క్ర‌మానికి కూట‌మి స‌ర్కారు న‌డుం బిగించింది. …

Read More »

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ బ్లెడ్ పాలిటిక్స్‌(ర‌క్త రాజ‌కీయం) కు తెర‌దీసింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల ర‌క్తం చ‌విచూస్తున్నార‌ని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. సీఎంకు కావాలంటే త‌మ ర‌క్తం ఇస్తామ‌ని, రైతుల‌ను ఆదుకోవాల‌ని ఆదివారం ఎక్స్ వేదిక‌గా కామెంట్లు చేశారు. అనంత‌రం.. సోమ‌వారం జూబ్లీహిల్స్‌లోని …

Read More »

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణకుమారి పేరు గుంటూరు నగర ఓటరు జాబితాలో కనిపించకపోవడంతో ఆమె అధికారులను ఆశ్రయించారు. ఒక మాజీ మంత్రి ఓటే లేకపోతే సామాన్య ఓటర్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓటరు జాబితాలో తన పేరు లేదని ఎన్నికల అధికారులు …

Read More »

నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణమా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్ పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని చేసిన దారుణమైన వ్యాఖ్యల కారణంగా మనస్తాపానికి గురైన నిరంజన్ మరణించారని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. పవన్ ను వాడు, వీడు అంటూ నాని చేసిన వ్యాఖ్యలు నిరంజన్ ను బాగా ఇబ్బంది పెట్టాయని, అదే …

Read More »

పొరబడ్డారు… నేనలాంటి వాడిని కాదు: ఏబీవీ

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయన పదవీ విరమణ చేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో కూటమి ప్రభుత్వానికి సూచనలు చేసిన సందర్భాల్లోనూ ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఉపా చట్టం (యూఏపీఏ) వినియోగంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఏబీవీ, ఒక కార్యక్రమంలో మాజీ …

Read More »

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ కూడా చేరిపోయారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చౌకబారు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నాగార్జునపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నాగార్జున యాదవ్ కోసం హైదరాబాద్ నుంచి …

Read More »

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది. ప్రతిగా ఇరాన్ కూడా ఎదురు దాడులకు దిగింది. పరస్పర దాడుల్లో ఆ రెండు దేశాలకు ఏ మేర నష్టం వాటిల్లిందన్న విషయాన్ని పక్కనపెడితే…ఇరాన్ దాడుల్లో భారత్ కు చెందిన ఓ వాణిజ్య నౌక ధ్వంసం కాగా… అందులోని ఓ భారతీయుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య …

Read More »

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం పవన్ కు శస్త్ర చికిత్స జరగగా…ఆ మరునాడే ఆదివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా ముంబై వెళ్లి మరీ పవన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన బాబు… పవన్ త్వరగా …

Read More »

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్ (ఎక్స్‌కవేటర్‌)ను స్వయంగా నడిపి హంద్రి–నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. భారీ యంత్రాన్ని నడుపుతూ మట్టిని తొలగించిన బాలయ్య తీరు అక్కడికి వచ్చిన ప్రజలు, రైతులు, కార్యకర్తలను ఆకట్టుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా రైతులకు సాగునీటి భరోసా కల్పించే లక్ష్యంతో రూ.790 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హంద్రి–నీవా …

Read More »

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన బూత్ లెవిల్  కార్య‌క‌ర్త‌లు జ‌న‌సేన‌కు కొర‌వ‌డ్డారు. ఆది నుంచి కూడా క్షేత్ర‌స్థాయిలో బూత్ క‌మిటీల ఏర్పాటు, కార్య‌క‌ర్తల నియామ‌కంపై పార్టీ ఎప్పుడూ దృష్టి పెట్ట‌లేదు. దీంతో క్షేత్ర‌స్థాయిలో డెవ‌ల‌ప్ అయ్యేందుకు పార్టీకి ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి. దీనికితోడు త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో …

Read More »