కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద నిరసన తెలుపుతామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిరసనలో పాల్గొన్నారు. ఇక, ఈ నిరసనకు తొలుత అనుమతి లేదని పేర్కొన్న ఢిల్లీ …
Read More »మమత శపథం: అసెంబ్లీలో అడుగు పెట్టను.. !
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరా జయం పాలైన మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా భీషణ ప్రతిజ్ఞ చేశారు. తాను ఇప్పట్లో అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని చెప్పారు. తనను, తన పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓడించిన కేంద్రంపైనే తన పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. అయితే.. అసెంబ్లీలోకి మాత్రం …
Read More »బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏపీకి చెందిన బొల్లా బ్రహ్మనాయుడికి హైదరాబాద్లోని ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు.. ఆయనపై రిమాండ్ రిపోర్టును కోర్టుకు వివరించారు. ఈ సమయంలో బొల్లా తరఫు న్యాయవాది, పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపించారు. చివరకు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. …
Read More »తెలంగాణలో అప్పుడు, ఇప్పుడు కేటీఆర్ పాలనే: కవిత
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలోను.. ఇప్పుడు కూడా కేటీఆర్ పాలనే సాగుతోందని అన్నారు. దీంతో ప్రజలకు మేలు జరగడం లేదని.. పెద్దలే గద్దలుగా మారి.. ప్రజల ధనాన్ని, ఆస్తులను కూడా పోగేసుకుంటున్నారని చెప్పారు. నాడు కేసీఆర్ హయాంలో కేటీఆర్ పాలన కారణంగానే.. ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని తెలిపారు. ఇప్పుడు కూడా అదే కేటీఆర్ పాలన జరుగుతోందన్నారు. …
Read More »ముగ్గురు ఫైనల్… ఇంకొకరు తేలాలి!
ఏపీ నుంచి ఈ దఫా రాజ్యసభ సభ్యత్వాలను దక్కించుకునే నేతలు ఎవరన్న విషయంపై ఓ స్పష్టత అయితే వచ్చిందనే చెప్పాలి. ఈ దఫా ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా… ఆయా పార్టీల నుంచి అభ్యర్థిత్వాలు కూడా దాదాపుగా ఖరారు అయ్యాయి. ఏపీ నుంచి నలుగురు కొత్తగా రాజ్యసభకు ఎన్నిక కానుండగా… ఈ నాలుగూ …
Read More »నాగేశ్వర్ సార్… ఒక డౌట్ అడగొచ్చా?
తెలుగు రాష్ట్రాల్లోని మేధావుల తీరు భలేగా ఉంటుంది. సాపేక్షంగా విశ్లేషణలు చేసే కంటే.. స్వార్థంతో చేసినట్లే కనిపించేటోళ్లు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే.. లెఫ్ట్.. లేదంటే రైట్ కాకుండా.. ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు విషయాల్ని వివరించరు? అన్నది పెద్ద ప్రశ్న. అయితే చంద్రబాబు.. పవన్ ను తిట్టాలి. లేదంటే కేసీఆర్.. జగన్ ను నోటికి వచ్చినట్లు అనేయాలి. వీరిలో కొందరు రేవంత్ ను వెనకేసుకొస్తే.. మరికొందరు విరుచుకుపడుతుంటారు. మొత్తంగా సాపేక్షంగా పరిణామాల్ని …
Read More »కుటుంబ వివాదాల్లో ప్రాంతీయ పార్టీలు!
ప్రాంతీయ పార్టీల్లో చాలా మటుకు.. కుటుంబ సభ్యుల ప్రమేయం కొనసాగుతోంది. ఇది ఆయా పార్టీలకు కత్తిమీద సాముగా మారింది. తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్.. ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కుటుంబ సభ్యులే ఇబ్బందిగా మారుతున్నారు. అధికారంలో ఉండి.. ప్రభుత్వాలను కూలదోసుకునే పరిస్థితికి కూడా కారణమవుతున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. వాస్తవానికి సీఎం స్టాలిన్మరోసారి విజయం దక్కించుకుంటారని …
Read More »‘కేసీఆర్… చెల్లని వెయ్యి నోటుతో సమానం’
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పని అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఆయన సహా.. ఆయన పార్టీ బీఆర్ ఎస్కు కూడా.. గతమే తప్ప.. భవిష్యత్తు లేదన్నారు. చెప్తున్న కదా.. కేసీఆర్.. చెల్లని వెయ్యి నోటుతో సమానం. రద్దయిన వెయ్యి రూపాయల నోటుకు విలువ ఉందా? .. అట్లే.. కేసీఆర్కు కూడా విలువ లేదు. ఇంక ఆ పార్టీ నాయకులు చేసే వ్యాఖ్యలకు కూడా అంతే …
Read More »ఢిల్లీలో వైసీపీ చక్రం విరిగినట్టేనా?
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన వైసీపీ ఇప్పుడు.. 11 మంది ఎమ్మెల్యేలతోనే కునుకుపాట్లు పడుతోంది. రాష్ట్ర స్థాయిలో వైసీపీ పరిస్థితి డీలా పడిపోయిన దరిమిలా.. ఇప్పుడు ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి మాత్రమే …
Read More »1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.1500కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ భూమిని కొట్టేసేందుకు కొందరు ప్రభుత్వ అధికారుల సంతకాలను కూడా బ్రహ్మనాయుడు ఫోర్జరీ చేశారని ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది. ఈ …
Read More »జగన్పై ఈడీ కన్ను… విచారణేనా? అరెస్టా?!
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఆస్తులు సంపాయించారని. వ్యాపారాలు చేపట్టారన్న వాదన కూడా ఉంది. దీనిపై కేసులు నమోదు కావడం.. ప్రస్తుతం అవన్నీ కోర్టుల విచారణ పరిధిలో ఉండడం తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాలకు పైగానే..జగన్ బెయిల్పై ఉన్నారు. అయితే.. తాజాగా మరో కేసు జగన్ మెడకు చుట్టుకునే పరిస్థితి …
Read More »అన్నామలై బీజేపీని ఎందుకు వీడినట్టు?
అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ పార్టీని వీడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీని తాను వీడుతున్నట్లుగా అన్నామలై ప్రకటించారు. అంతేకాకుండా తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న తదుపరి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ఆ ఎన్నికల్లో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీతో బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. తమిళనాడులో బీజేపీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates