Political News

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. స‌మాజంలో ప్రాత‌మికంగా.. నాలుగు వ‌ర్గాలు ఉంటాయి. పేద‌లు, సాధార‌ణ ప్ర‌జ‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఉన్న‌త‌స్థాయి వ‌ర్గం. వీరిలో రాజ‌కీయాలకు.. రాజ‌కీయ నేత‌ల‌కు.. పేద‌లు, సాధార‌ణ ప్ర‌జ‌లు అత్యంత కీల‌కం. వీరిని సెంట్రిక్‌గా చేసుకునే నాయ‌కులు, పార్టీలు కూడా వ్య‌వ‌హ‌రిస్తాయి. గ‌తంలో వైసీపీ …

Read More »

నిఘా ఏమైంది: వైసీపీ కలివిడి రాజకీయం..!

రాష్ట్రంలో ప్రభుత్వానికి పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంది. ఇక తరచుగా సీఎం చంద్రబాబు పలు అంశాలపై సర్వేలు కూడా చేయిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ వరకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దీంతో ప్రజల నాడి ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమేరకు అమలవుతున్నాయి, ఎలాంటి సంతృప్తి వ్యక్తమవుతోంది వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. …

Read More »

వైసీపీ నిర‌స‌న‌లు పెద్ద `డ్రామా` అంటున్న దువ్వాడ

వైసీపీ నేతలు చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంపై అదే పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస‌రావు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “వైసీపీ నేత‌లు చేపట్టిన నిర‌స‌న‌లు పెద్ద డ్రామా. వాటిని ప్ర‌జ‌లు న‌మ్మ‌రు. కేవ‌లం రాజ‌కీయ ప‌బ్బం కోసమే ఈ నిర‌స‌న‌లు చేప‌ట్టారు. వీటిలో ప‌స‌లేదు. ప్ర‌జ‌లు న‌మ్మొద్దు.“ అంటూ దువ్వాడ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాదు.. సొంత …

Read More »

ట్యాంక్ బండ్ హీరోకు సీఎం ఆపన్న హస్తం

ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ ఇచ్చాం… అమలు సంగతి తర్వాత చూద్దాం అనే ఫక్తు రాజకీయ నేతల మాదిరిగా కాకుండా చేయాలనుకున్న సాయాన్ని రేవంత్ రెడ్డి అప్పటికప్పుడే చేసేస్తున్నారు. రేవంత్ లోని ఈ తరహా వైఖరితో ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి పూర్తి స్థాయి భరోసా దక్కింది. శివ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇంటిని …

Read More »

జ‌న‌సేన ఎమ్మెల్యేకు బాబు కితాబు

సాధార‌ణంగా త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి ప‌నితీరు మెచ్చుకుంటాయి. మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని కూడా సూచిస్తాయి. త‌ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. అయితే.. దీనికి భిన్నంగా కూట‌మిలోని మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన ఎమ్మెల్యేపై సీఎం చంద్ర‌బాబు బ‌హిరంగ వేదిక‌గానే ప్ర‌శంస‌లు కురిపించారు. ఎమ్మెల్యే ప‌నితీరును ఆయ‌న మెచ్చుకున్నారు. తాజాగా నాయుడుపేట‌లో పార్టీకార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయిన చంద్ర‌బాబు.. నాయ‌కుల ప‌నితీరు ముఖ్యంగా ఎమ్మెల్యేల ప‌నితీరుపై …

Read More »

ఈ జల జగడానికి కారణమెవరు…?

తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు నీటి పంచాయతీ నెలకొంది. ఈ సందర్భంగా ఏపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసిన తెలంగాణ ఏకంగా ధర్నాకు దిగిందట. పొరుగు రాష్ట్రం ధర్నాకు దిగిన తర్వాత గానీ ఏపీ తన తప్పును తెలుసుకుని వ్యవహరించిందట. ఈ మేరకు తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన టీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏపీకి ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చారు. తమకు అన్యాయం జరిగితే ఇకపై …

Read More »

భార్యకు భయపడి తండ్రిని వదిలేసిన మాజీ మంత్రి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఇప్పుడో అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆదివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారాయి. తల్లిదండ్రుల రక్షణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. భార్యకు భయపడి ఒక మాజీ మంత్రి తన …

Read More »

విజ‌య్.. వేల‌ కోట్ల ఆస్తి, మరి అప్పులు?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒంట‌రిపోరాటం చేస్తున్న త‌మిళ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీ అధ్య‌క్షుడు, ద‌ళ‌ప‌తి విజ‌య్ రెండు స్థానాల‌నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. పెరుంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఆయ‌న ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పెరుంబూరు స్థానానికి సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. దీనికి జోడించిన అఫిడ‌విట్‌లో విజ‌య్ త‌న ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ వివ‌రాల‌ను బ‌ట్టి.. 404 కోట్ల రూపాయ‌లకు …

Read More »

రూపాయి పతనంపై నిర్మలమ్మ మాటలో నిజమెంత?

అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ అంతకంతకూ తగ్గుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో రూపాయి జీవన కాలంలోనే అత్యంత కనిష్ఠాలను నమోదు చేస్తూ.. కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. కొద్ది నెలల క్రితం డారల్ తో రూపాయి మారకం విలువ రూ.90 దాటేయటం తెలిసిందే. చూస్తుండగానే రూ.90 కాస్తా రూ.95 దగ్గరకు వచ్చేసింది. కేవలం నెలల వ్యవధిలోనే రూ.5 పతనాన్ని చూస్తున్న పరిస్థితి. నిజానికి డాలర్ …

Read More »

కాళేశ్వ‌రంలో `ల‌క్ష కోట్లు` తిన్నారు: కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ‌లో తీవ్ర రాజ‌కీయ వివాదానికి దారి తీసిన `కాళేశ్వ‌రం` ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్ల‌డించారు. ఈక్ర‌మంలో ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను తినేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి మంత్రి చెప్పిన‌ప్ప‌టికీ.. ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. పైగా కీల‌క‌మైన‌ జ‌ల‌శ‌క్తిశాఖ‌కు మంత్రిగా ఉన్నారు. దీంతో మంత్రి ప్ర‌క‌ట‌న కేంద్రం చేసిన …

Read More »

బ్యాంకు `లాక‌ర్` సొమ్ము పోతే బాధ్య‌త ఎవ‌రిది?!

బ్యాంకుల్లోని ఖాతాల్లో సొమ్ము నిల్వ చేసుకోవ‌డం కామ‌నే. అయితే.. మ‌రింత విలువైన వ‌స్తువులు.. బంగారం, ఆస్తిప‌త్రాలు వంటివాటిని కూడా బ్యాంకుల్లో భ‌ద్ర ప‌రుచుకునేందుకు `లాక‌ర్ వ్య‌వ‌స్థ‌` అందుబాటులో ఉంది. గ‌త 55 సంవ‌త్స‌రాలుగా ఈ సేవ‌లు బ్యాంకులు అందిస్తున్నాయి. ఒక‌ప్పుడు పెద్ద‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న లాక‌ర్లు.. ఇటీవ‌ల కాలంలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. ఓ మాదిరి వార్షిక అద్దెతో ఈ లాక‌ర్ల‌ను బ్యాంకులు సాధార‌ణ వ్య‌క్తుల‌కు …

Read More »

విల్లాల‌ను త‌ల‌పించేలా ఇళ్లు.. పేద‌ల ఇంటి క‌ల నెర‌వేర్చిన బాబు

సాధార‌ణంగా పేద‌లకు ప్ర‌భుత్వాలు క‌ట్టించి ఇచ్చే ఇళ్లు.. అన‌గానే ఎలాంటి వ‌స‌తులు ఉండ‌వ‌ని.. ఇరుకు ఇరుగ్గా ఉంటాయ‌ని భావిస్తారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు ఇలాంటి ఇళ్ల‌నే పేద‌ల‌కు క‌ట్టించి ఇస్తాయ‌న్న వాద‌న కూడా ఉంది. కానీ, ఏపీలో దీనికి భిన్నంగా తొలిసారి .. విల్లాల‌ను త‌ల‌పించేలా పేద‌ల‌కు ఇళ్ల‌ను నిర్మించారు. కేవ‌లం 18 మాసాల వ్య‌వ‌ధిలోనే తిరుప‌తిలోని పుదూరులో వీటిని నిర్మించారు. వీటిలో ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించారు. సాధార‌ణంగా …

Read More »