Political News

రఘురామ గన్ మెన్ వర్సెస్ జనసైనికులు

2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ అక్కడక్కడ, అప్పుడప్పుడు చిన్న చిన్ని ఇష్యూలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేనకు చెందిన కొందరు నేతల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాటిని వెంటనే పరిష్కరించి గ్యాప్ రాకుండా చేస్తున్నారు. చిన్నచిన్న ఇబ్బందులుంటే …

Read More »

తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ స్ట్రాంగ్ వార్నింగ్‌…?

తెలంగాణ బీజేపీలో ఆధిప‌త్య పోరు, వ‌ర్గ విబేధాల‌తో పార్టీ జాతీయ నాయ‌క‌త్వం సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ నబీ ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చి మ‌రీ రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేశారు. నితిన్ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్లాక కొంద‌రు పెద్ద‌ల‌ను ఇక్క‌డ‌కు పంపి ఇక్క‌డ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త పెంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ త‌ర్వాత రాష్ట్ర పార్టీలో కొంద‌రు కీల‌క నేత‌ల‌ను ఢిల్లీకి …

Read More »

ఒకడు పకోడీ గాడు.. మరొకడు నత్తి పకోడీగాడు…

డిఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల వివాదం విజయవాడ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. గురువారం జరిగిన గందరగోళం మీద ఇరు పక్షాలు ఒకరిమీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందెందుకే ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు ప్రశాంతంగా జరుగుతున్న దీక్షలను భగ్నం చేసేందుకు ప్రయత్నించారని వైసీపీ ఆరోపణలు చేయగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు పారేసుకుంటే ఎక్కడికైనా వస్తాం, …

Read More »

సెంటిమెంటుతో వర్కవుట్ కావట్లేదా కవిత గారు?

తెలంగాణ రక్ష‌ణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్న మాజీ ఎంపీ, మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత‌.. ఇప్పుడు వ్యూహం మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ సెంటిమెంటు, ఉద్యమ కారులు.. వారి హ‌క్కులు, ఉద్యోగాలు అంటూ.. రాజ‌కీయ నినాదాలు చేసిన క‌విత‌.. వీటి వ‌ల్ల వ‌ర్కవుట్ కాద‌ని అర్ధం చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆమె.. త‌న పంథాను సమూలంగా మార్చుకు న్న‌ట్టు క‌నిపిస్తున్నారు. బీసీల …

Read More »

డీఎస్సీపై వైసీపీది అక్క‌సే… క‌దిలిన టీచ‌ర్లు!

కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు గ‌త ఏడాది మెగా డీఎస్సీ-2025ను నిర్వ హించి 16 వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మ‌రోసారి కూడా డీఎస్సీ నిర్వ‌హించేందుకు రెడీ అయింది. వ‌చ్చే నెల‌లో దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ రానుంది. అయితే.. కూట‌మి స‌ర్కారును బ‌ద్నాం చేస్తూ.. వైసీపీ నాయ‌కులు డీఎస్సీ-2025కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు కూడా రోడ్డెక్కారు. వైసీపీ …

Read More »

అజ్ఞాత వ్యక్తి ఎవరో ఉన్నారు.. సునీత అనుమానం!

Sunitha

త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డిని దారుణంగా చంపేసిన వాళ్లు ఫ‌స్ట్ ఫ‌స్ట్ ఆ విష‌యాన్ని జ‌గ‌న్‌కే చెప్పార‌ని అందుకే జ‌గ‌న్‌పై త‌న‌కు అనుమానం ఉంద‌ని వివేకా కుమార్తె డాక్ట‌ర్ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ స‌రిగా జ‌ర‌గ‌లేద‌న్నారు. దీని వెనుక అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రో చ‌క్రం తిప్పుతున్నార‌ని విచార‌ణ‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని సందేహం వ్య‌క్తం చేశారు. అందుకే ప‌దే ప‌దే కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. …

Read More »

కీలక విషయాలను చంద్రబాబు దగ్గర ఎందుకు దాస్తున్నారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డి నిర్మాణాల తొలిద‌శ‌ను 2028నాటికి పూర్తి చేసి.. 2029లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యిం చుకున్నారు. ఈ నేప‌థ్యంలో నిరంత‌రం ఇక్క‌డి కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంద‌ర్శించి.. ప‌నులు త్వ‌ర‌గా జ‌రిగేలా చూడాల‌ని కూడా ఆదేశిస్తున్నారు. ఇక‌, అమ‌రావతిలో మౌలిక స‌దుపాయాల నిర్మాణానికి ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ప్ర‌పంచ బ్యాంకు …

Read More »

వైసీపీ ఎత్తుగ‌డ‌: బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా…?

కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ క‌య్యానికి సుముఖంగా లేమ‌ని వైసీపీ స్ప‌ష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా ఈ పార్టీ అదే పంథాను అనుస‌రిస్తోంది. అయితే.. బీజేపీ కేంద్రంలో ఒక విధంగా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం కొంద‌రు నాయ‌కులు వైసీపీని విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు వారిని కూడా అదుపు చేసేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది. ఈ క్ర‌మంలోనే తాజాగా కేంద్ర మంత్రి అమిత్‌షాను వైసీపీ ఎంపీలు క‌లిశారు. …

Read More »

నోరు అదుపులో పెట్టుకోక‌పోతే… కోడిగుడ్లే ప‌డ‌తాయి: సుప్రీంకోర్టు

“దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చేందుకు మ‌న వాళ్లు తుపాకీ తూటాల‌కే వెనుకాడ‌లేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్ల‌కు భ‌య‌ప‌డ‌తారా?“అంటూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌హిళా ఎంపీ మొహ‌వా మెయిత్రీని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న‌ల‌కు కూడా ప్రాధాన్యం ఉంద‌ని పేర్కొంది. ఎంత‌సేపు.. పూలు మాత్ర‌మే కోరుకునే నాయ‌కులు క‌నిపిస్తున్నార‌ని.. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే అన్నింటినీ భ‌రించాల‌ని వ్యాఖ్యానించింది. ఆమెకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌న్న వాద‌న‌ను కూడా తిర‌స్క‌రించింది. ప్ర‌జ‌ల …

Read More »

`టార్గెట్ లోకేష్‌`… సింప‌తీ రాదు జ‌గ‌న్‌… !

ప్ర‌స్తుతం వైసీపీ పెట్టుకున్న ల‌క్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించ‌డం. గ‌త వారం రోజులుగా ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు బాహాటంగానే చెబుతున్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేన‌ని జ‌గ‌న్ మిన‌హా ఇత‌ర నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు కూడా చేప‌ట్టారు. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు మంచిది?  లోకేష్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటే ఏమేర‌కు సింప‌తీ వ‌స్తుంది?  అని ఆలోచించేవారు కూడా వైసీపీలోనే …

Read More »

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. మ‌రో వారంలో స‌భా కార్య‌క్ర‌మాలు ముగియ‌నున్నాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్య‌వ‌హారంపై జ‌రిగిన క‌స‌ర‌త్తు ఒక కొలిక్కి రాక‌పోవ‌డం.. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించేందుకు రెడీగా లేక‌పోవ‌డంతో డీలిమిటేష‌న్‌పై ప్ర‌భుత్వం దాదాపు వెన‌క్కి త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తోంది. వాస్త‌వానికి త్వ‌ర‌లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో …

Read More »

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కుమారుడి వ్యవహారం రచ్చ రచ్చ కాగా ఇప్పుడు రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ కుమారుడి ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కాకపొతే బండి సంజయ్ కుమారుడికి అండగా నిలవగా ప్రకాష్ గౌడ్ విలన్ గా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే …

Read More »