ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు, మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి. ఈ అంబులెన్సుల్లో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స …
Read More »స్వామివారి చెంతనా మీ కీచులాట?
దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా నిర్వహించే పవిత్ర కార్యక్రమం. అలాంటి వేడుకల్లో రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణంలో దైవనామ స్మరణ తప్ప మరే వివాదానికీ స్థానం ఉండకూడదని పెద్దలు చెప్పే మాటలు తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో జరిగిన ఘటనతో మరోసారి చర్చకు …
Read More »కాంగ్రెస్ నాయకులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి
రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ పార్టీ అగ్రనేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్గాంధీ కీలక సూచనలు చేశారు. ఇగోలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇగోల కంటే కూడా పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పారు. నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఒక్కొక్క జిల్లా కమిటీ అధ్యక్షుడికీ పార్టీపై పట్టు అవసరమని, ఆదిశగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ …
Read More »సిట్ అధికారులకు లంచమా?
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఏపీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులకు ఆయన లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు.. ఏపీ ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మాజీ మంత్రితో పాటు ఆయన కుమారుడు సునీల్ పైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎందుకు? ఏపీలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం …
Read More »స్టాలిన్ తరఫున వైసీపీ ప్రచారం.. బీజేపీ సహిస్తుందా?
తమిళనాట త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అధికార పార్టీ డీఎంకేకు.. అత్యంత కీలకంగా మారున్నాయి. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మరోవైపు డీఎంకే, ఇంకోవైపు నటుడు విజయ్ సొంత పార్టీ వెరసి.. మొత్తంగా ఈ ఎన్నికలు అత్యంత సంక్లిష్టంగా.. అదేసమయంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు.. దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద సంఖ్యలో అసెంబ్లీస్థానాలు ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. …
Read More »పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?
అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇరాన్ యుద్ధం సహా పాకిస్థాన్ – అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ పరిణామాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద జనాభా ఉన్న దేశంలో చమురు వినియోగం తారస్థాయిలో ఉంది. …
Read More »సామర్లకోట షాక్ తర్వాత శివకాశీ దారి పట్టిన బాబు
తమిళనాడులోని శివకాశీ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. దీపావళి వచ్చిందంటే.. శివకాశీ పటాకుల కోసం ఎదురు చూస్తారు. వాటికి డిమాండ్ కూడా ఎక్కువే. దేశంలో పటాకులు తయారయ్యే మెజారిటీ ప్రాంతంగా కూడా శివకాశీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. శివకాశీని అధికారికంగా తమిళనాడు రాష్ట్రం పటాకుల తయారీ కేంద్రంగా కూడా గుర్తించింది. ఇక్కడ అనేక వసతులు కూడా కల్పించారు. మందుగుండు సామగ్రి నిల్వ నుంచి భద్రత వరకు ఇక్కడ పలు చర్యలు …
Read More »శారదా భూముల పై రేవంత్ యూటర్న్..
కోకాపేటలో అత్యంత ఖరీదైన 2 ఎకరాల భూములను శారదా పీఠానికి కట్టబెట్టడం సరైంది కాదంటూ తెలంగాణ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో శారదా పీఠానికి ఇచ్చిన భూములను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బీఆర్ ఎస్ హయాంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అప్పటి …
Read More »ఖమేనీ హతం.. అయినా మారని ఇరాన్ తీరు!
కరడుగట్టిన మత ఛాందసవాదిగా, అమెరికా వ్యతిరేకిగా ముద్రపడిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఈ పరిణామం అనంతరం ఇరాన్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. తమకు భారమైన పాలన తొలగిపోయిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇంత జరిగినా ఇరాన్ తీరు ఏమాత్రం మారలేదు. పైగా అదే దూకుడు ప్రదర్శిస్తామని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు ఖమేనీ చూపించిన బాటలోనే నడుస్తామని అధ్యక్షుడు మసూద్ …
Read More »కొడాలి నాని.. మళ్ళీ మొదలు?
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. బూతుల నేతగా టీడీపీ నాయకులు ముద్దుగా పిలుచుకుని కొడాలి నాని సుదీర్ఘ కాలం తర్వాత.. మీడియా ముందుకు వచ్చారు. గత ఎన్నికల్లో గుడివాడలో ఓడిపోయిన తర్వాత..ఆయన అజాలేకుండా పోయారు. కొన్నాళ్లు అనారోగ్యం అని చెప్పారు. ఆ తర్వాత.. హైదరాబాద్లో చికిత్స తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత .. అక్కడెక్కడో కనిపించినా.. ఆయన మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా మాజీ …
Read More »ఖమేనీని ఎందుకు చంపేశారు?.. ప్రపంచం శోధించిన ప్రశ్న!
ఇరాన్ సుప్రీం లీడర్(ఒకరకంగా ప్రధానమంత్రి) అయతొల్లా అలీ ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో హతం చేశాయి. అయితే.. అసలు ఖమేనీ చేసిన తప్పేంటి? ఎందుకు ఆయనను హత మార్చారు? అమెరికాకు-ఇరాన్కు మధ్య వివాదం ఏంటి? ఒకప్పుడు ఒకే కంచం, ఒకే మంచం అన్న ట్టుగా ఉన్న ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎందుకు చోటు చేసుకుంది? ఇవీ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గూగుల్ లో శోధించిన ప్రశ్నలు. వీటికి …
Read More »హనుమంతన్న నోట ఒక్క ఛాన్స్ మాట
“ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం పోతది.. పార్టీకి ఏం నష్టం వస్తది. అందుకే తేల్చుకునేటందుకు వచ్చా“ అంటూ.. కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చడీచప్పుడు లేకుండానే ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో వాలిపోయారు. ఆయన ఢిల్లీకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాకపై ఎలాంటి సమాచారం లేదని తెలిసింది. ఇప్పటికే.. రాజ్యసభ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates