Political News

ఇండిగో సంక్షోభంపై చంద్ర‌బాబు ఫ‌స్ట్ రియాక్ష‌న్‌!

దేశాన్ని కుదిపేస్తున్న ఇండిగో విమానాల సంక్షోభంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి స్పందించారు. సోమ‌వారం రాత్రి ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విష‌యంలో ఏపీ సీఎంగా కానీ.. టీడీపీ అధినేత‌గా కానీ.. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అస‌లు ఇది ఇండిగో సృష్టించిన స‌మ‌స్య‌గా ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, డీజీసీఏ(డైరెక్ట‌రేట్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌) విధించిన నిబంధ‌న‌లను ఇండిగో పాటించ‌లేద‌న్నారు. వాస్త‌వానికి గ‌త …

Read More »

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25 మంది ఎంపీల‌లోనూ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎంపీగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 8.9 స్కోర్ తో పెమసాని చంద్రశేఖర్ ఫస్ట్ స్థానాన్ని దక్కించుకున్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది అనేది ఆసక్తికర విషయం. గత ఎన్నికల్లో మొదటిసారి విజయం దక్కించుకున్న పెమ్మసాని ఎన్నారై నాయకుడిగా టిడిపిలో తొలిసారి …

Read More »

గాడిన పడిన రాష్ట్ర జీఎస్‌డీపీ, అసలేంటిది?

రాష్ట్ర స్టేట్‌ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ‌క్ట్‌(జీఎస్‌డీపీ)లో వృద్ధి మ‌రింత పెరిగిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. 2025-26 తొలి అర్ధ సంవత్సరం, 2వ త్రైమాసికం గ్రోత్ రేట్లో వృద్ధి న‌మోదైన‌ట్టు వివ‌రించారు. 2025-26 తొలి అర్ధ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్)… అలాగే, 2వ త్రైమాసి(జూలై నుంచి సెప్టెంబర్)కానికి సంబంధించిన జీఎస్‌డీపీ ఫలితాలను స్వ‌యంగా ఆయ‌న  విడుదల చేశారు. రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్డీపీ మొత్తంగా 11.28 శాతం …

Read More »

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వీరి క‌ష్టాలు తీర్చేందుకు పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. విమాన యాన సంస్థ‌ల‌తో భేటీ అవుతున్నారు. ఇండిగో ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌యాణికుల‌కు రుసుములు తిరిగి చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇంకో వైపు రాజ్య‌స‌భ‌లోనూ …

Read More »

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ చేపట్టారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వందేమాతరం స్ఫూర్తిని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తి కర పరిణామం జరిగింది. వందేమాతరం రూపకర్త బంకిమ్ చంద్ర ఛటర్జీని పలుమార్లు ప్రధాని మోదీ.. బంకిమ్ దా అంటూ సంబోధించారు. దీనిపై సభలో ఉన్న తృణమూల్ …

Read More »

‘జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదలిపోయింది’

వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది. దీనిని మళ్లీ పునరుద్ధరిస్తున్నాం. ఒక వ్యవస్థను ఎంతగా ధ్వంసం చేయాలో అంతా చేశారు. అదే వ్యవస్థను బాగు చేసేందుకు తిరిగి గాడిలో పెట్టేందుకు ఎంతో శ్రమిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఒకవైపు గత పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను బాగు చేస్తూనే మరోవైపు కొత్త వ్యవస్థలను తీసుకువస్తున్నామని తెలిపారు. అదే సమయంలో …

Read More »

‘వందేమాతరం – నెహ్రూ’ : ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో సోమ‌వారం.. జాతీయ గేయం వందేమాత‌రంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ గేయానికి 150 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని చేప‌ట్టిన‌ చ‌ర్చ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న తొలుత వందేమాత‌రం గొప్ప‌ద‌నాన్ని, నాటి బ్రిటీష్ హ‌యాంలో ఈ గేయం ఎలాంటి అవ‌మానాల‌కు, నిర్బంధాల‌కు గురైందో వివ‌రించారు. అనంత‌రం… ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల్లో ప‌దును పెంచారు. తొలి ప్ర‌ధాన మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ …

Read More »

బీఆర్ఎస్ `విజ‌య్ దివ‌స్‌`… ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తొలిసారి `విజ‌య్ దివ‌స్‌` పేరుతో కీల‌క కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న‌(మంగ‌ళ‌వారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా బీఆర్ ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ప్ర‌తి ఒక్క‌రికీ తెలియ‌జేయాల‌ని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ రోజు(9న‌) అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ కార్యక్ర‌మాలు నిర్వ‌హించాల‌ని …

Read More »

అమెరికాలో లోకేష్… టీ-11 కు నిద్ర పట్టట్లేదా?

పెట్టుబ‌డులు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అమెరికా స‌హా పొరుగున ఉన్న‌ కెన‌డా దేశాల‌ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. 5 రోజుల పాటు ఆయా దేశాల్లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. తొలుత అమెరికాకు చేరుకున్న నారా లోకేష్‌కు డ‌ల్లాస్‌లో ఏపీ ఎన్నార్టీ నాయ‌కులు, స్థానిక ప్ర‌వాసాంధ్రుల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అనంత‌రం.. ఆయ‌న తెలుగు ప్ర‌వాసుల‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అండ‌గా ఉన్న …

Read More »

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, ప్రతి గందరగోళం, ప్రతి మానసిక సమస్యకు పరిష్కారంగా మనల్ని నడిపించే ఙ్ఞానం భగవద్గీత అని …

Read More »

మ‌నిషి వైసీపీలో – మ‌న‌సు కూట‌మిలో..!

రాష్ట్రంలోని ఒక్కొక్క‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. ఆ పార్టీల నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షంగా అయినా ఉన్న వైసీపీలో నాయకులు వ్యవహరిస్తున్న తీరు చిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం పరిస్థితిని తీస్తే ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన …

Read More »

తమ్మినేని తనయుడి పొలిటికల్ పాట్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం కాదు. గత ఎన్నికల్లోనూ టీడీపీకి చెందిన అనేక మంది వారసులు విజయం సాధించారు. శ్రీకాళహస్తి, నగరి, మంగళగిరి వంటి నియోజకవర్గాలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయి. ఇక వచ్చే ఎన్నికల్లోనూ వారసుల ప్రభావం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ మాజీ …

Read More »