Trends

పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారా ?

దేశంలోని యువత అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా పెళ్ళి చేసుకునే విషయంలో పెద్ద ఆసక్తి చూపటం లేదట. చదవు, ఉద్యోగాలు, వృత్తులు లాంటి వ్యాపకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న కారణంగా పెళ్ళికాని ప్రసాదుల సంఖ్య బాగా పెరిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాలు చెబుతున్నాయి. పెళ్ళికాని ప్రసాదులు పెరిగిపోతున్నారంటే అర్ధం పెళ్ళికాని అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్లే అర్ధం. జాతీయ యువజన పాలసీ 2014 ప్రకారం 15-29 మధ్య వయసు …

Read More »

కోహ్లీపై దారుణమైన ట్రోలింగ్

భారత క్రికెట్ అనే కాక ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన విరాట్ కోహ్లికి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఒకప్పుడు అలవోకగా సెంచరీల మీద సెంచరీలు కొట్టేసిన అతను.. రెండున్నరేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ ఒక్కసారి కూడా మూడంకెల స్కోరు చేయలేదు. ఇటు అంతర్జాతీయ క్రికెట్లో, అటు ఐపీఎల్‌లో అతను విఫలమయ్యాడు. అందులోనూ ఈ మధ్య అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో, …

Read More »

తానా ఫౌండేషన్ కు చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి

తానా ఫౌండేషన్  ట్రస్టీలు గురువారం జున్  30వ తేదీ జరిగిన సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు.  చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారి గా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్ చైర్మన్ గా ఎన్నికైన శశికాంత్ వల్లేపల్లి సుదీర్ఘకాలంగా తానాలో తానా ఫౌండేషన్ లో సేవలందిస్తూ, కాంత్ ఫౌండేషన్ స్థాపించి ద్వారా కోట్లాది రూపాయలు విరాళాలుగా అందించారు. కోవిడ్ మహమ్మారి తీవ్రతతో ఇబ్బందులు పడిన …

Read More »

ఆ టైల‌ర్ హ‌త్య.. అంత‌ర్జాతీయ కుట్రా? కేంద్రం ఏమందంటే

రాజస్థాన్ లోని ఉద‌య్‌పూర్ ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ యువకుడిని అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. రాష్ట్రాన్ని అత‌లాకుతలం చేసింది. ఉదయ్‌పుర్‌లోని మల్దాస్ వీధిలో టైల‌ర్ షాపు నిర్వ‌హిస్తున్న క‌న్న‌య్య‌లాల్‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. వినియోగదారు ల మాదిరిగా వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకరు కన్నయ్యపై కత్తితో దాడి చేయ‌గా, మరో వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు. హత్య అనంతరం …

Read More »

91 ఏళ్లలో నాలుగో భార్యకు విడాకులు ఇచ్చిన మీడియా దిగ్గజం

తరచూ వార్తల్లో ఉంటారు ప్రముఖ మీడియా దిగ్గజం రూపక్ మర్దోక్. తన కన్ను పడిన ఏ సంస్థను అయినా తన సొంతం చేసుకోకపోతే ఒక పట్టాన నిద్ర పట్టని ఈ పెద్ద మనిషి వ్యాపారంలోనే కాదు వ్యక్తిగత అంశాల్లోనూ రోటీన్ కు భిన్నంగానే వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన తన నాలుగో భార్యకు విడాకులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. న్యూయార్కు టైమ్స్ కథనం ప్రకారం ప్రముఖ మోడల్ కమ్ నటి జెర్రీ హాల్ …

Read More »

అగ్నిపథ్ కు కార్పొరేట్ల మద్దతు

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి ఒకవైపు అభ్యర్థులు, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే, వ్యతిరేకిస్తుంటే మరోవైపు కార్పొరేట్ ప్రపంచం మద్దతిస్తోంది. అగ్నిపథ్ పథకాన్ని కార్పొరేట్ సంస్ధలు స్వాగతిస్తున్నాయి. అగ్నిపథ్ పథకంలో సైన్యంలోకి ప్రవేశించి, శిక్షణ తీసుకుని నాలుగేళ్ళ సర్వీసు తర్వాత రిటైర్ అయిన వారిని కార్పొరేట్ సంస్ధల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వివిధ సంస్ధల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, ఆర్పీజీ గ్రూపు ఛైర్మన్ హర్ష్ గోయెంక, బయోకాన్ …

Read More »

సికింద్రాబాద్‌లో ఉద్రిక్త‌త‌లు… రైళ్ల‌కు నిప్పు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిరసనకారులు గళమెత్తారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు… రైలుకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు …

Read More »

అగ్నిప‌థ్‌`పై దేశం భ‌గ‌భ‌గ‌… రైళ్ల‌కు నిప్పు.. తీవ్ర ఆందోళ‌న‌

ఆర్మీ నియామకానికి సంబంధించిన నూతన విధానం ‘అగ్నిపథ్’పై.. ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. బిహార్లో రెండు రైళ్లు తగులబెట్టారు. హరియాణాలోనూ ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ నియామక విధానంపై పెదవి విరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమ వుతున్నాయి. …

Read More »

HIV ఎయిడ్స్ కు చెక్ పెట్టే ఇంజెక్షన్

దశాబ్దాల పాటు ప్రపంచ ప్రజల్ని వణికించిన హెచ్ ఐవీ – ఎయిడ్స్ మహమ్మారి పీచమణిచే రోజులు దగ్గరకు వచ్చేసినట్లే. కొన్నేళ్ల పాటు ఈ వ్యాధికి చికిత్స ఏమీ లేని పరిస్థితుల్లో వేలాది మంది కన్నుమూయటం తెలిసిందే. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారిని రక్షించేందుకు వీలుగా శాస్త్ర అద్భుతాన్ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. చికిత్స లేని హెచ్ ఐవీ ఎయిడ్స్ ను కట్టడి చేసేందుకు వీలుగా ఇంజెక్షన్ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. …

Read More »

జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ నిందితుల‌కు 5స్టార్ హోట‌ల్ బిర్యానీ!

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితుల‌కు స‌క‌ల మ‌ర్యాద‌లు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఒక‌ప్ప‌టి దిశ రేప్ ఘ‌ట‌న‌లో నిందితులకు చర్లపల్లి జైలులో మొదటి రోజు మటన్‌ బిర్యానీ పెట్టిన ఉదంతం మ‌రిచిపోక‌ముందే..(అప్పట్లో ఆ విషయం తీవ్ర వివాదానికి దారితీసింది) తాజాగా ఇప్పుడు మ‌రోసారి.. రేప్ కేసు నిందితుల‌కు స్టార్ బిర్యానీ అందిన ఘ‌ట‌న తీవ్ర‌స్తాయిలో క‌ల‌క‌లం రేపుతోంది. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ …

Read More »

సెలబ్రిటీలకూ షాకిచ్చిన కేంద్రం

వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నియంత్రణకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం సరోగేట్ యాడ్స్ ని నిషేధించింది. సరోగేట్ యాడ్స్ అంటే ఏమిటి ? ఏమిటంటే ప్రచారం చేయటానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటిపేరుతోనే అదేరీతిలో ఉండేట్లుగా కనిపించేలాగ అడ్వర్టైజ్మెంట్లను చూపించటం. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు ఇపుడు కనబడుతున్న ప్రకటనలకు కూడా వర్తిస్తుందని కేంద్రం చెప్పింది. ఈ ప్రకటనల్లో కనబడుతున్న ప్రముఖులు, సెలబ్రిటీలపైన …

Read More »

ఇకనుండి 12 గంటలు పనిచేయాల్సిందేనా ?

కొత్త కార్మిక చట్టం అమల్లోకి వస్తే ఇకనుండి పనిగంటలు 12 గంటలుగా మారబోతోంది. ప్రస్తుతం ఎక్కడైనా పనిగంటలంటే 8 గంటలు మాత్రమే. ఎక్కడైనా ఉద్యోగులు, కార్మికులు సానుకూలంగా ఉంటే మరో గంటపాటు పెరుగుతుంది. కానీ కేంద్రప్రభుత్వం పాతచట్టం స్ధానంలో కొత్తచట్టాన్ని తయారుచేసింది. ఈ చట్టాన్ని జూలై 1వ తేదీనుండి అమల్లోకి తీసుకురావటానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్రం ప్రయత్నాలు గనుక సక్సెస్ అయితే పనిగంటలతో పాటు అనేక చట్టాలు మారిపోవటం ఖాయం. …

Read More »