Trends

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. భారత్ అభ్యంతరం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా జరగనున్న ఈ ట్రోఫీపై ఇప్పటికే పలు రకాల వివాదాలు హైలెట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో కొత్త వివాదం చెలరేగింది. భారత జట్టు జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు ఉండాలన్న ఐసీసీ నిబంధనకు బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జెర్సీలపై పాకిస్థాన్ పేరు ముద్రించడం తగదని …

Read More »

తెలంగాణలో దారుణం.. పట్టపగలే కత్తితో పొడిచి..

తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి చేసి చంపడం షాక్ కు గురి చేసింది. ఈ సంఘటన సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా జరిగింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మడికొండకు చెందిన ఆటోడ్రైవర్ రాజ్‌కుమార్‌పై మరో ఆటోడ్రైవర్ వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేయడంతో, రాజ్‌కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు …

Read More »

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు కిలోమీటర్లు లేదంటే పది కిలోమీటర్లు ఇలా.. మారథాన్ పేరుతో మనుషులు పరుగులు తీయటం తెలిసిందే. కానీ.. మనుషులు.. ఆ మనిషి క్రియేట్ చేసిన రోబోలు పాల్గొనే సిత్రమైన పోటీకి చైనా వేదిక కానుంది. ఏప్రిల్ లో చైనా రాజధాని బీజింగ్ పరిధిలోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించే 21 కి.మీ. …

Read More »

ఏపీఎస్ఆర్టీసీకి సంక్రాంతి డబుల్ బొనాంజా

ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు భారీ ఎత్తున తమ సొంతూళ్లకు తరలి వెళ్లారు. ఫలితంగా ఏపీకి దారి తీసే రహదారులన్నీ రద్దీతో కిటకిటలాడాయి. అదే సమయంలో జనాన్ని తమ సొంతూళ్లకు చేరవేసేందుకు శ్రమించిన ఏపీఎస్ఆర్టీసీకి డబుల్ లాభాలు దక్కాయి. ఈ ఏడాది …

Read More »

రూ.500లతో కోటీశ్వరుడుగా మారిన లారీ డ్రైవర్!!

నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో దుబాయిలోనే, లేదంటే… ఇంకే దేశంలోనో కాదు… మన దేశంలోని వ్యవసాయ రాష్ట్రం పంజాబ్ కు చెందిన లారీ డ్రైవర్ ఒకరు రాత్రికి రాత్రి ఇలా కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఆ లారీ డ్రైవర్ కేవలం రూ.500 పెట్టి కొన్న ఓ లాటరీ టికెట్ అతడికి ఏకంగా రూ.10 కోట్లను ఆర్జించి …

Read More »

ట్రంప్ లెగ్గు మయం.. 7 లక్షల కోట్లు ఆవిరి!

ప్రపంచ స్టాక్ మార్కెట్ పై అమెరికా కొత్త అధ్యక్షత ప్రభావం గట్టిగానే ఉంటుందని ముందు నుంచే సంకేతాలు వచ్చాయి. ఇక భారత స్టాక్ మార్కెట్ ట్రంప్ ప్రభావం గట్టిగానే పడింది. అతని రాకతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. వివిధ కారణాల ఎన్ని ఉన్నా కూడా ట్రంప్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. దాదాపు రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా …

Read More »

నెంబర్ వన్ రికార్డుకి సిద్ధమైన ఇండియన్ బౌలర్

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు అర్ష్‌దీప్‌ సింగ్‌ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ తన కెరీర్‌లో అత్యున్నత ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడానికి అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ప్రస్తుతం ఈ రికార్డ్ లెగ్‌ స్పిన్నర్ …

Read More »

ఇదేం పద్ధతి?.. ట్రంప్ నిర్ణయంపై చైనా విసుర్లు!

అగ్ర రాజ్యం అమెరికాకు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆదిలోనే అదిరిపోయే నిర్ణయాలతో యావత్తు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నారు. సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో దేశ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసిన మరుక్షణమే తనదైన శైలి దూకుడును మొదలుపెట్టిన ట్రంప్…ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా వైదొలగుతున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ …

Read More »

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రదాడి: ఏపీ జవాను వీరమరణం

జమ్మూకశ్మీర్‌ లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడి భారత్‌ ఆర్మీకి తీరని నష్టాన్ని కలిగించింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాను పంగల కార్తీక్‌ (29) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, మంగళవారం ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలోని రాగి మానుపెంట గ్రామానికి …

Read More »

ఎలాన్ మస్క్ : అప్పుడు ట్విట్టర్… ఇప్పుడు టిక్ టాక్…

అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు వేస్తున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాను విశ్వవ్యాప్తం చేసే దిశగా చురుగ్గా కదులుతున్న మస్క్… ఎక్కడా కూడా వెనక్కు తగ్గని రీతిలో సాగుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా సోమవారం రాత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు ఆది నుంచి వెన్నుదన్నుగా …

Read More »

మృగాడికి జీవిత ఖైదు…హంతకురాలికి మరణ దండన

భారత న్యాయ వ్యవస్థలో సోమవారానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. సోమవారం ఒకే రోజు రెండు కీలక కేసుల్లో దేశ కోర్టుల నుంచి సంచలన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోల్ కతా ఆర్డీ ఖర్ ఆసుపత్రి వైద్యురాలిపై జరిగిన హత్యాచార కేసు కాగా… మరొకటి కేరళలో ప్రేమించిన యువకుడిని వంచించి అతడిపై విష ప్రయోగానికి పాల్పడి అతడిని దారుణంగా అంతమొందించిన ప్రియురాలి …

Read More »

అమెరికాలోకి టిక్ టాక్ రీ ఎంట్రీ పక్కా!!

టిక్ టాక్… చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా రికార్డులకెక్కింది. చాన్నాళ్లుగా అగ్ర రాజ్యం అన్న ట్యాగ్ ను అలా అలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్న అమెరికా గుత్తాధిపత్యం సాగిస్తోందంటూ చైనా ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ వ్యాఖ్యలతో ఆ దేశం అమెరికాకు తాను యాంటీ అని కూడా చెప్పకనే చెప్పింది. …

Read More »