ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలం ప్రారంభం కాకముందే, అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను అందించాల్సి ఉంది. ముందుగానే ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రిషభ్ పంత్ను రూ.18 కోట్లకు, అక్షర్ పటేల్ను రూ.14 కోట్లకు, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను రూ.11 కోట్లకు రిటైన్ చేయనున్నట్లు …
Read More »రిలయన్స్ జియో బడ్జెట్ ఫోన్లు చూశారా..
రిలయన్స్ జియో తాజాగా రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ‘జియో భారత్ వి3’ మరియు ‘వీ4’ పేరిట వచ్చిన ఈ ఫోన్లు ఇప్పుడు సాధారణ మధ్యతరగతి జానాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రూ. 1,099 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫోన్లు 2జీ యూజర్లను 4జీకి మారే అవకాశాన్ని కల్పిస్తాయి. పాత మోడల్ అయిన ‘జియో భారత్ వి2’ విజయవంతమయ్యాక, జియో డిజిటల్ డివైస్లతో మరింత …
Read More »రఫెల్ నాదల్ చివరి ఆట: మైండ్ బ్లాక్ అయ్యేలా టికెట్ రేట్లు
ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక త్వరలోనే ఈ స్పెయిన్ బుల్ తన కెరీర్కు వీడ్కోలు చెప్పబోతున్నాడు. నవంబర్లో స్వదేశంలో జరగనున్న డేవిస్ కప్-2024 టోర్నమెంట్ తర్వాత ఆట నుంచి విరమించుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. ఈ టోర్నీ నాదల్ చివరి మెగా ఈవెంట్ కావడంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అభిమానులు అతని ఆటను చివరిసారి ప్రత్యక్షంగా …
Read More »36 ఏళ్ళుగా విజయం లేదా.. మరి టీమిండియాతో గెలుస్తారా?
బుధవారం నుంచి ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో తిరిగి ఫామ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, కివీస్కు భారత్ గడ్డపై గత 36 ఏళ్లుగా విజయం దక్కలేదన్న ఆసక్తికర విషయం. చిన్నస్వామి స్టేడియంలో 2012లో న్యూజిలాండ్తో భారత్ చివరిసారి తలపడ్డప్పుడు టీమ్ఇండియా విజయాన్ని నమోదు …
Read More »ధోని కోసమేనా.. ఐపీఎల్ అన్క్యాప్డ్ రూల్ పై వివాదం
ధోనీ ఐపీఎల్లో మరొక సీజన్ ఆడటానికి బీసీసీఐ ప్రత్యేకంగా అన్క్యాప్డ్ రూల్ను తెచ్చిందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అన్క్యాప్డ్ నిబంధన ప్రకారం, గత అయిదేళ్లలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ఆటగాడు అన్క్యాప్డ్ కేటగిరీలోకి వస్తాడు. ఇది 2008లో ప్రవేశపెట్టినప్పటికీ, 2021లో రద్దయ్యింది. అయితే, ఈ ఏడాది 2025-27కి సంబంధించిన కొత్త నిబంధనలలో మళ్లీ దాన్ని తీసుకొచ్చారు. ఈ నిబంధనపై అభిమానులు, విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ధోనీని …
Read More »క్రాష్ టెస్టులో 5 పాయింట్లు కొల్లగొట్టిన టాటా కొత్త కారు
ఒక కారు మంచిదా? చెడ్డదా? అన్న దానికి సాంకేతిక అంశాలు ఎంత ముఖ్యమో.. అలానే క్రాష్ టెస్టులో సదరు కారుకు వచ్చే పాయింట్లు కూడా అంతే ముఖ్యం. కారు దృఢత్వాన్ని తెలిపే ఏకైక పరీక్ష ఇది. చాలా కార్లు జనాదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ.. క్రాష్ టెస్టులో మాత్రం అడ్డంగా ఫెయిల్ అవుతుంటాయి. ఇంతకూ ఈ క్రాష్ టెస్టు లెక్క ఎందుకంటే.. కారు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు.. మరో వాహనం ఢీ …
Read More »ఎవరీ సంజయ్ కుమార్ వర్మ? కెనడా తీవ్ర ఆరోపణలు ఎందుకు చేసింది?
ఒక దౌత్యాధికారి మీద తీవ్ర ఆరోపణలు రావటం.. ఒక సంపన్న దేశం వేలెత్తి చూపటం.. దానికి భారతదేశం తీవ్రంగా స్పందించటమే కాదు.. ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం.. ఈ సందర్భంగా సదరు హైకమిషనర్ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ.. 35 ఏళ్లు ఆయనకు అనుభవం ఉంది.. అలాంటి వ్యక్తి మీద వేలెత్తి చూపుతారా? మీకెంత ధైర్యం? అంటూ విరుచుకుపడే భారత్ ను గతంలో ఎప్పుడూ చూసి ఉండరేమో? అలాంటి తీరును …
Read More »డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ బూస్ట్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులకు మరో పెద్ద సౌలభ్యం కల్పించింది. యూపీఐ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు తీసుకున్న తాజా నిర్ణయాల్లో భాగంగా, యూపీఐ లైట్ మరియు యూపీఐ 123పే లావాదేవీ పరిమితులను గణనీయంగా పెంచింది. ఈ ప్రకటనను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు ఒక్కో లావాదేవీకి …
Read More »అజయ్ జడేజా.. ఇక మహారాజు.. నిజం!!
అజయ్ జడేజా. భారత క్రికెట్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆయన మహారాజు కానున్నారు. నిజమే.. నిజంగానే మహారాజు. ఒక రాజ్యానికి ఆయన మహారాజుగా వెలుగొందనున్నారు. ఇదెలా అంటే.. గుజరాత్లోని జామ్నగర్ ప్రాంతం.. ఒకప్పుడు ప్రిన్స్ లీస్టేట్. అంటే.. ఇది రాచరికంలో ఉన్న ప్రాంతం. నిజానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. రాచరికాలు రద్దయ్యాయి. అంతా.. కూడా ప్రజాస్వామ్యమే కొనసాగుతోంది. అయితే.. కొన్ని అనూహ్యమైన కారణాల …
Read More »ఈసారి 48 లక్షల పెళ్లిళ్లు.. మార్కెట్ లో అంతకుమించిన బిజినెస్
మూడు నెలల విరామం తర్వాత పెళ్లిళ్లకు మళ్లీ శుభ సమయం వచ్చేసింది. కొత్త ఏడాది వచ్చే వరకు ఇది పెళ్లి పండగల సమయమే అని పండితులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు ప్రతి రోజు పెళ్లిళ్ల కోసం పండుగ వాతావరణం నెలకొననుంది. శుభ ముహూర్తాలు తిరిగి రావడంతో బజా భజంత్రీలు మోగే సమయం దగ్గరపడింది. పెళ్లి టైమ్ లో ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా, అసలు తంతు మాత్రం …
Read More »ప్రశ్నల శిఖరం అస్తమయం.. ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ప్రశ్నించేవారు లేకపోతే… ప్రజాస్వామ్యమే లేదని అంటారు అరిస్టాటిల్. కానీ, రాను రాను.. ప్రశ్నించే గళాలు తగ్గిపోతున్నాయి. అంతేకాదు.. ప్రశ్నించేవారిని అణిచేస్తున్న పరిస్థితులు ప్రపంచ దేశాల్లో తరచుగా కనిపిస్తూనే ఉంది. ఈ చర్చను పక్కన పెడితే.. భారత దేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడున్నంత భావ ప్రకటనా స్వేచ్ఛ మరెక్కడా లేదని కూడా అంటారు(?). అయితే.. ఇక్కడ కూడా ఇప్పుడు పరిణామాలు మారుతున్నాయి. ఇదిలావుంటే.. గత మూడు దశాబ్దాలుగా తనదైన …
Read More »ట్రంప్ వారి ‘ఉచితాలు’.. అగ్రరాజ్యంలో మారిన రాజకీయం!
అందరూ విద్యావంతులే. దేశంలో తాజా లెక్కల ప్రకారం 80 శాతం మంది చదువుకున్న వారే ఉన్నారు. దీనికితోడు వారంతా రాజకీయంగా కూడా చైతన్యం ఉన్నవారే. దీంతో ఎన్నికల సమయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దేనినీ ఒక పట్టాన ఒప్పుకోరు. ఇక, ఉచితం అన్న మాటే దాదాపు అమెరికాలో వినిపించదు. ఎవరూ ఉచితాలు కూడా కోరుకోరు. సహజంగానే పాశ్చాత్య దేశాలు.. మర్కట కిశోర న్యాయాన్ని పాటిస్తాయి. అంటే.. కొంత ఎదుగుదల …
Read More »