టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. కోహ్లీకి లండన్ ప్రత్యేకంగా ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. క్రికెట్ పర్యటనలలో భాగంగా కాకుండా, కుటుంబంతో కలిసి కూడా లండన్ వెళ్లడం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుందట. తాజాగా కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత లండన్లో స్థిరపడాలని భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ …
Read More »భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహిస్తారని ఐసీసీ పేర్కొంది. భద్రతా కారణాల వల్ల పాక్లో భారత జట్టు ఆడడం ఇబ్బందిగా మారడంతో, టోర్నీ నిర్వహణలో …
Read More »డాలర్ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో తగ్గింపు సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ, భారత రూపాయి క్షీణత ఆగలేదు. పెట్టుబడుల లోటు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కరెన్సీపై అదనపు ఒత్తిడి తెచ్చాయి. గత కొన్ని నెలలుగా రూపాయి విలువ సార్వత్రికంగా పడిపోతోంది. రూ. 83 …
Read More »బైడెన్ వర్సెస్ ట్రంప్.. నలిగిపోతున్న విదేశీయులు!
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే పదవి నుంచి దిగిపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయం.. అనేక సందేహాలకు.. అదేసమయంలో అనేక సమస్యలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఎన్నికైన నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గం సదరు నిర్ణయాలపై నిప్పులు చెరుగుతుండడం గమనార్హం. అంతేకాదు.. ‘బైడెన్ మోసకారి’ అంటూ ట్రంప్ అనుచరులు …
Read More »ఆ ఖైదీ జైలు శిక్ష ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భారత్, బ్రిటన్ ఒప్పందం!
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి ఏకంగా బ్రిటన్-భారత్ దేశాల మధ్య కీలకమైన ఒప్పందం కూడా జరిగింది. ఒకే ఒక్క కేసులో కుదిరిన ఈ ఒప్పందానికి సంబంధించి రోజుల తరబడి ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చలు కూడా జరపడం మరింత విశేషం. దీంతో ఈ ఫిఫ్టీ-ఫిఫ్టీ జైలు శిక్ష కహానీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. నిజానికి …
Read More »ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ఫేవరెట్ తెలుగు సినిమా ఏంటంటే…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి జనంలో ఆసక్తి కలగడానికి కారణం పేరే. గుకేష్ పుట్టింది తెలుగు కుటుంబమే అయినా బాల్యం, చదువు మొత్తం చెన్నైలోనే జరిగాయి. ఫ్యామిలీ మూలాలు తిరుపతి జిల్లా సత్యవీడులో ఉండటం వల్ల గుకేష్ కు బహు భాషలు వచ్చు. తండ్రి వృత్తిరిత్యా డాక్టర్. టోర్నమెంట్స్ కోసం కొడుకు పలు ప్రదేశాలు …
Read More »అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ గుడ్బై!
టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. డ్రెస్సింగ్ రూమ్లో సహచర ఆటగాళ్లతో భావోద్వేగ క్షణాలను పంచుకున్న అశ్విన్, తన కెరీర్ ముగింపు గురించి చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా అశ్విన్ తన కెరీర్లో తాను సాధించిన విజయాలను, టీమిండియాకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. బీసీసీఐ కూడా …
Read More »అంతరిక్షంలో సునీతా విలియమ్స్.. మరింత ఆలస్యం!!
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) గడపాల్సిన సమయం అనూహ్యంగా పెరిగింది. 2025 మార్చి వరకు ఆమె ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎనిమిది రోజుల ప్రయోగాల కోసం జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ ద్వారా బచ్ విల్మోర్తో కలిసి సునీత ఐఎస్ఎస్కు వెళ్లారు. ఈ ప్రయాణం అనంతరం జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉండగా, క్యాప్సూల్లో హీలియం లీకేజీ …
Read More »అమెరికాలో 11 మంది భారతీయులు మృతి
ఘోర విషాద ఉదంతం వెలుగు చూసింది. అమెరికాలో పదకొండు మంది భారతీయులు అనుమానాస్పద రీతిలో మరణించారు. జార్జియాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. స్కై రిసార్ట్ గా ఫేమస్ అయిన గూడౌరిలోని రెస్టారెంట్ లో పని చేసే పన్నెండు మంది సిబ్బంది అనుమానాస్పద రీతిలో మరణించారు. వీరిలో పదకొండు మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ షాకింగ్ ఉదంతాన్ని భారతీయ అధికారులు ధ్రువీకరించారు. ఘటన …
Read More »అసలు టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ ఉన్నాడా?
టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శనపై అభిమానులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బౌలింగ్ విభాగం మంచి ప్రదర్శన చూపించినప్పటికీ, బ్యాటింగ్ విభాగం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. తాజాగా గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్ ప్లేయర్లు పతనమవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ వంటి ప్రధాన బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం అభిమానులకు అసహనం కలిగించింది. ముఖ్యంగా, ఆటగాళ్లు తప్పిదాలు …
Read More »మస్క్ నుండి కొత్త బాంబ్ !
ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో కొత్త ఈమెయిల్ సేవను ప్రారంభించేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్స్ మెయిల్’’ సృష్టిస్తే ఎలా ఉంటుంది?’’ అని ఓ యూజర్ చేసిన సూచనకు మస్క్ స్పందిస్తూ, ‘‘ఇది జీమెయిల్, ఇతర ఈమెయిల్ సేవలకు కఠినమైన పోటీని కల్పిస్తుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్లో యాపిల్ మెయిల్ 53.67% …
Read More »ధోనీ జీతం కన్నా గుకేశ్ కట్టే ట్యాక్సే ఎక్కువ?
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కించుకున్నాడు. దాంతోపాటు, 3 మ్యాచ్లు గెలిచినందుకు రూ. 5.04 కోట్ల నగదు బహుమతి లభించింది. దీంతో, భారత ప్రభుత్వానికి రూ. 4.67 కోట్ల ట్యాక్స్ చెల్లించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ ఐపీఎల్-2025 లో దక్కించుకున్నదానికన్నా గుకేశ్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారని సోషల్ మీడియాలో …
Read More »