Trends

నిద్రమాత్రలు పనిచేయలేదని షాట్ పెట్టి భర్తను చంపేసింది

ఢిల్లీ నగరంలోని ఉత్తమ్‌నగర్‌ ప్రాంతంలో సంచలనం రేకెత్తించిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను తొలగించేందుకు కిరాతకంగా ప్రణాళిక రచించింది. మొదట భోజనంలో నిద్రమాత్రలు కలిపి హత్య చేయాలనుకున్నారు. కానీ అది ఫెయిల్ కావడంతో, చివరకు విద్యుత్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీశారు. ఈ ఘటన నవంబర్ 13న చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తమ్‌నగర్‌కు చెందిన సుస్మితకు, భర్త …

Read More »

సోషల్ మీడియా పోస్టులు.. వాటిపై కేసులు ఉండ‌వ్‌!

సోష‌ల్ మీడియాలో వ్య‌క్తులు చేసే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు వంటివాటిపై ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున కేసులు న‌మోదవుతున్నాయి. జైళ్ల‌లో పెడుతున్నారు. ఏపీ విష‌యానికి వ‌స్తే.. 2019 నుంచి కూడా సోష‌ల్ మీడియా వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌ల‌పై కేసులు న‌మోదు కావ‌డం.. జైళ్ల‌లో పెడుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. సోష‌ల్ మీడియాను భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌లో కీల‌క భాగ‌మ‌ని పేర్కొంది. ఆర్టిక‌ల్ 19 ప్ర‌కారం …

Read More »

ట్రంప్ పాకిస్తాన్‌ పర్యటన.. రెండు దశాబ్దాల తర్వాత ఇలా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌ను సందర్శించనున్నారన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్‌ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌ను వైట్‌హౌస్‌లో కలవడమే కాకుండా, ఆ తరువాత పాకిస్తాన్ పర్యటనను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది జరిగితే, 2006లో జార్జ్ బుష్ వచ్చిన తర్వాత పాకిస్తాన్‌కు వచ్చే రెండో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందుతారు. అయితే …

Read More »

పోర్షే కారు కేసులో మైనర్‌ బాలుడిని అడల్ట్‌గా ఎందుకు చూడట్లేదు?

2024 పుణేలో ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న పోర్షే కారు ప్రమాదానికి కారకుడైన 17 ఏళ్ల బాలుడిపై తిరిగి చర్చ మొదలైంది. బాలుడిని పెద్దవాడిగా (అడల్ట్) శిక్షించాలన్న డిమాండ్ పెరిగినా, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు మాత్రం తేల్చేసింది. అతడిపై నమోదైన కేసులు ఏదీ ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్షను కలిగించేవి కావని పేర్కొంది. అందుకే, అతడిని మైనర్‌గానే విచారించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో బాలుడు మద్యం సేవించి దాదాపు 180 …

Read More »

డ్ర‌గ్స్‌-గంజాయి: దొరికిపోతున్న ఏఎస్పీ, డీసీపీల పిల్ల‌లు!

స‌మాజాన్ని స‌రైన దారిలో పెట్టాల్సిన పోలీసులే.. దారి త‌ప్పుతున్నారు. బ‌యట ఏం జ‌రుగుతోందో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో వారి కుటుంబాలు గాడి త‌ప్పుతున్న విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. ఏపీలోనూ.. తెలంగాణ‌లోనూ.. ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఓ ఏఎస్ఐ కుమారుడికి ఉగ్ర‌వాదుల‌తో లింకులు ఉన్న విష‌యం వెలుగు చూసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంది. ఇది మ‌రుపున‌కు రాక‌ముందే.. విశాఖ జిల్లాకు చెందిన ఓ …

Read More »

1993 ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవారా?

1993, మార్చి 12…ముంబై బాంబు పేలుళ్ల ఘటన జరిగి దాదాపు 32 ఏళ్లు కావస్తోంది. అయినా సరే, ఆ పేలుళ్ల గురించి వార్తల్లో వింటే చాలు ఆ పేలుళ్ల బాధితులు, పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు. ఒక్క రోజులోనే ముంబైలోని 12 ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో మొత్తం 257 మంది చనిపోగా..1400 మంది గాయపడ్డారు. అయితే, వేలాదిమందికి పీడకలగా మిగిలిన …

Read More »

బ్రేకింగ్: నిమిష ఉరిశిక్ష వాయిదా

మిడిల్ ఈస్ట్ దేశాలలో హత్య వంటి నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ క్రమంలోనే యెమెన్ లో ఓ యెమెన్ జాతీయుడిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియకు అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ఆమెను కాపాడేందుకు బ్లడ్ మనీ రూపంలో ఆమె కుటుంబం చేసిన ప్రయత్నాలు దాదాపుగా విఫలమయ్యాయి. నిమిషకు ఉరిశిక్ష రద్దు చేయాలని …

Read More »

లార్డ్స్ టెస్టు.. చేతులారా చేజార్చుకున్న టీమిండియా

చేతివరకు వచ్చిన మ్యాచ్ ను చివరలో చేజార్చుకుంది టీమిండియా. చివరి నిమిషాల్లో ఒక్క చిన్న తప్పిదం ఓ టెస్టు మ్యాచ్‌ను ఎలా మార్చేస్తుందో లార్డ్స్ టెస్టు మరోసారి రుజువు చేసింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇది మూడో మ్యాచ్. భారత్‌కు ఈ గేమ్ చాలా కీలకమైనది. కానీ జడేజా చివరలో పోరాటం చేసినా ఫలించలేదు. గెలుపు దగ్గరకి వచ్చి చేజార్చుకోవడం అందరికీ బాధ కలిగించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 …

Read More »

15 వేళ మందిని తొలగించిన మైక్రోసాఫ్ట్.. ఇది మరో హెచ్చరిక

ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయని చాలామందికి భయం. ఇప్పుడు అదే నిజం చేస్తూ మైక్రోసాఫ్ట్ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. కేవలం ఈ ఏడాదిలోనే 15 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించిన ఈ టెక్ దిగ్గజం… మిగిలిన ఉద్యోగులకు కూడా ఒక్క క్లియర్ సూచన ఇచ్చింది “AI లో నైపుణ్యం పెంచుకోండి, లేదంటే బయటకు వెళ్లండి.” 2025 నాటికి కంపెనీ ఏఐ కోసం 80 బిలియన్ డాలర్లు …

Read More »

వచ్చింది హాలిడే ట్రిప్‌కు కాదు.. దేశం కోసం – గంభీర్

విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం పై వచ్చిన విమర్శల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల కొంతమంది ఆటగాళ్లపై దృష్టిసారించింది. ఈ అంశంపై ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించగా, అతని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశం తరపున ఆడేందుకు వచ్చాం కానీ హాలిడే టూర్‌కు కాదని గంభీర్ తేల్చిచెప్పారు. తాజాగా చటేశ్వర్ పుజారాతో జరిగిన ముఖాముఖి …

Read More »

ఈ బ్యాగ్ 65 కోట్లు!

పాతది, వాడినదే అయినా.. దానికి ధర మాత్రం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ జేన్ బిర్కిన్ కోసం 1984లో ప్రత్యేకంగా తయారు చేసిన హెర్మెస్ బ్యాగ్ ఇటీవల ఊహించని ధరకు అమ్ముడై ఓ చరిత్ర సృష్టించింది. మచ్చలు నిండిన పురాతన శైలితో ఉన్న ఈ బ్లాక్ లెదర్ బ్యాగ్ చివరకు దాదాపు ₹65 కోట్లకు విక్రయమై చరిత్రలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌గా గుర్తింపు పొందింది. పారిస్‌లో …

Read More »

సిగాచీ విషాదం.. ఇది అన్నింటికంటే ఘోరం

హైదరాబాద్ శివార్లలోని పాశమైలారం ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అగ్నికి ఆహుతి అయ్యారు. అందులో ఇప్పటిదాకా 44 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఆ మృతదేహాలు ఏవీ కూడా ఒక ఆకారంతో ఉన్నవి, గుర్తు పట్టేవి కావు. ఎముకలు కూడా బూడిదైపోయి.. చిన్న చిన్న ఆనవాళ్లు దొరికితే వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు …

Read More »