కరోనా వైరస్ తీవ్రత రాబోయే మే నెలలో మరింత భయంకరంగా ఉండబోతోందా ? అవుననే అంటున్నారు అమెరికా మిషిగన్ యూనివర్సిటిలోని అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి కారణంగా యావత్ దేశమంతా వణికిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. ప్రపంచంలో మరేదేశంలో లేనంతగా ఇక్కడ రోజుకు 3.35 లక్షల కేసులు నమోదవుతున్నాయి. రోజుకు లక్షలాది కేసులు నమోదవుతాయని ఎవరు అంచనా …
Read More »ఎస్యూవీ అమ్మేసి ప్రాణాలు కాపాడుతున్నాడు
కరోనా కాలంలో ఎందరో మానవతా వాదులు బయటికి వచ్చారు. తమ స్థాయితో సంబంధం లేకుండా సేవా భావాన్ని చాటి హీరోలుగా నిలిచారు. ఏడాది ముందు వరకు ఒక మామూలు నటుడిగా ఉన్న సోనూ సూద్.. కరోనా కాలంలో అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా నిలిచాడు. ఇప్పటికీ తన దాతృత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా బారిన పడ్డప్పటికీ.. రోజూ తనకు వచ్చే వేలాది విజ్ఞప్తులను పరిశీలించి వీలైనంత వరకు …
Read More »ఆక్సిజన్ ఎవరికి అవసరమో తెలుసా ?
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు వైరస్ కేసులు పెరిగిపోతుందటం, మరోవైపు ఆక్సిజన్ అందక రోగులు చనిపోతుండటం అందరిలోను భయాందోళనలు పెరిగిపోతున్నది. నిజానికి కరోనా వైరస్ సోకి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆక్సిజన్ కు గతంలో ఎప్పుడు లేనంత డిమాండ్ పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సోకిన రోగులందరికీ …
Read More »కొవిడ్ కల్లోలం.. హృదయం ద్రవించే ఒక ఫొటో
మనిషి చనిపోతే వారిని ఈ లోకం నుంచి సాగనంపే విషయం ప్రతి మతానికీ ఓ సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయాలను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తేనే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు ఆయా మతస్థులు. చివరి గడియల్లో వెంట ఉండాలని.. చనిపోయిన మనిషిని చివరి చూపు చూసుకోవాలని.. దగ్గరుండి ఆ వ్యక్తికి వీడ్కోలు పలకాలని కుటుంబ సభ్యులే కాదు.. సన్నిహితులందరూ ఆశిస్తారు. వీటన్నింటికీ …
Read More »కరోనా కల్లోలం.. వైద్యురాలి వీడియో వైరల్
గత ఏడాది ఈ సమయానికి కరోనా భయంతో జనాలు ఎలా వణికిపోయారో తెలిసిందే. లాక్ డౌన్ దెబ్బకు అందరూ ఇంటిపట్టునే ఉంటూ కరోనా కల్లోలం గురించి తెలుసుకుంటూ బయటికి అడుగు పెట్టాలంటే భయపడిపోయారు. ఎక్కడ ఏది ముట్టుకోవాలన్నా.. ఎవరిని కలవాలన్నా.. ఏం చేయాలన్నా అనుమానమే. కానీ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం తగ్గుతూ రావడంతో జనాల్లో భయం పోయింది. సెకండ్ వేవ్ విజృంభిస్తోందన్నా జనాల్లో ఒకప్పటిలా భయం …
Read More »టీకా వేసుకున్నాక.. కరోనా వచ్చే రిస్కు ఇంతేనట!
ఓవైపు కరోనా ఆందోళన.. మరోవైపు వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు. ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. దేన్నిపట్టించుకోకుండా ప్రభుత్వం చెప్పే మాటను నమ్మేటోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు భిన్నంగా ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే వారికి మాత్రం తిప్పలు తప్పువు. అదే సమయంలో.. ప్రభుత్వం చెప్పేదానికి.. తమ కళ్ల ముందు కనిపించే అంశాల్ని లింకు వేసుకునే వారికి వచ్చే సందేహాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ ప్రపంచంలో చాలానే …
Read More »రాష్ట్రంలో రెడ్ అలర్ట్ తప్పదా ?
దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాగే ఏపిలో కూడా కరోనా వైరస్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతోంది. రోజుకు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. రికార్డుల ప్రకారం 35 మంది చనిపోయారు. ఏపికి నాలుగువైపులా తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఒడిస్సా రాష్ట్రాలున్నాయి. వీటిల్లో తమిళనాడు, కర్నాటక, తెలంగాణాలో ప్రతిరోజు వేలాదికేసులు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం ఏపిపైన కూడా పడుతోంది. మొదటి దశలో …
Read More »కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎంతకమ్ముతున్నారంటే..
నెల రోజుల ముందు దేశవ్యాప్తంగా చాలా చోట్ల వ్యాక్సినేషన్ సెంటర్లు వెలవెలబోయాయి. కరోనా ప్రభావం తగ్గిపోయిందని, ఇక భయం లేదని భావించి జనాలు వ్యాక్సినేషన్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ధాటికి కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు జనాల్లో మళ్లీ భయం కనిపిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. కానీ డిమాండుకు తగ్గట్లు సరఫరా లేదు. ఐతే ఉత్పత్తి పెంచడానికి కేంద్ర …
Read More »కేసీఆర్ కర్ఫ్యూ మాటకు హైదరాబాద్ రెస్సాన్స్ ఇదే
కేసులు పెరిగిపోతున్నాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించండి మహా ప్రభో.. అన్న విన్నపాల్ని పట్టించుకోని కేసీఆర్ సర్కారు.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలకు వెంటనే స్పందించటం.. మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. ఈ జీవో విడుదల కావటానికి కొన్ని గంటల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పాజిటివ్ గా తేలటం షాకింగ్ గా …
Read More »‘చావు’ బిజినెస్.. తప్పనలేం.. కాదనలేం..!
దేశాన్ని కరోనా కాలం పట్టిపీడిస్తోంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కరోనా బారిన పడి.. ఎవరైనా మృతి చెందినా.. వారికి సరైన రీతిలో దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆత్మీయులు పోయారన్న ఆవేదన.. వెంటాడుతున్నా.. కరోనా భీతి .. మనషులను నిలువునా కాల్చేస్తోంది. దీంతో అయిన వారికి అంతిమ సంస్కారం చేసేందుకు సైతం వెనుకాడుతున్న వారు కనిపిస్తున్నారు. చనిపోయిన …
Read More »వైరల్ వీడియో.. రైల్వే ట్రాక్పై అద్భుతం
నిన్నట్నుంచి సోషల్ మీడియాను ఒక మీడియా ముంచెత్తుతోంది. ఒక రైల్వే స్టేషన్లో అవతలి నుంచి రైలు దూసుకొస్తుండగా.. ట్రాక్ మీద పడ్డ పిల్లాడిని ఆ స్టేషన్లో విధులు నిర్వర్తించే పాయింట్స్ మ్యాన్ క్షణాల వ్యవధిలో ప్రాణాలకు తెగించిన తీరు అబ్బుర పరుస్తోంది ఈ వీడియోలో. ముంబయిలోని వాంగని రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. మయూర్ షేల్కే అనే పాయింట్స్ మ్యాన్ అసాధారణ సాహసంతో హీరో అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. …
Read More »సెకండ్ వేవ్: ఇలాంటి లక్షణాలు వస్తే.. అలెర్టు అవ్వాల్సిందే
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సెకండ్ వేవ్.. షాకుల మీద షాకులు ఇస్తోంది. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో పాజిటివ్ ల జోరు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. మొదటి వేవ్ లో కరోనా సోకిన వారికి కనిపించిన లక్షణాలకు.. సెకండ్ వేవ్ వేళ.. కనిపిస్తున్న లక్షణాల్లో కాస్తంత మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. నిత్యం కరోనా రోగులకు చికిత్స చేస్తున్న పలువురు వైద్య నిపుణులు.. తమ వద్దకు వస్తున్న …
Read More »