వినోద్ కాంబ్లి.. 80, 90 దశకాల్లో ఇండియన్ క్రికెట్ను ఫాలో అయిన ఏ అభిమానీ ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. సచిన్తో కలిసే క్రికెట్ సాధన ఆరంభించి.. చాలా ఏళ్ల పాటు అతడితో కలిసే సాగాడు ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్. సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి తన లాగే మెరుపులు మెరిపించాడు. సచిన్ లాంటి క్రమశిక్షణ, పట్టుదల ఉంటే.. అతడి లాగే ఒక దిగ్గజ …
Read More »షాకింగ్.. 14 లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్ నష్టాలు!
కనీ వినీ ఎరుగని రీతిలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా భారత మార్కెట్లు దారుణ పరిస్థితులను చవి చూస్తున్నాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభం అవుతూనే.. నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ నుంచి నిఫ్టీ వరకు.. బీఎస్ఈలో నమోదైన అన్ని సంస్థలు కూడా మార్కెట్లో నష్టాలు చవి చూస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద తుడిచి …
Read More »బంగ్లాదేశ్లో మళ్లీ రగడ.. 24 గంటల్లో 32 మంది మృతి?
ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లకు సంబంధించి అట్టుడుకుతున్న భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమస్య సమసిపోయిందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా మరోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. రాజధాని ఢాకాలో మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన మద్దతు దారులకు, సంఘాల నాయకులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘర్షణల్లో …
Read More »ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
భరతనాట్యం, కూచిపూడి రంగాలలో ఖ్యాతి గడించిన నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్ను మూశారు. ప్రపంచ ప్రఖ్యాత నర్తకిగా వేలాది ప్రదర్శనలతో ఖ్యాతి గడించిన యామినీ కృష్ణమూర్తి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యామినీ కృష్ణమూర్తి శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు నృత్యకారులు, నర్తకులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు …
Read More »పిల్లలతో జర్నీ చేసే పేరెంట్స్ కు రైల్వే మంత్రి స్వీట్ న్యూస్
తన రూపాన్ని మార్చుకుంటోంది భారతీయ రైల్వే. కాకుంటే.. సంక్షేమాన్ని వదిలేసి.. వసతుల పేరుతో సామాన్యులకు భారంగా మారుస్తూ నిర్ణయాలు తీసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. పెద్ద వయస్కులు.. అందునా అరవై దాటిన వారికి ఇచ్చే ప్రయాణ రాయితీని కరోనా నుంచి తీసేసిన మోడీ సర్కారు.. ఈ రోజుకు దాన్ని పునరుద్దరించలేదు. అదే సమయంలో వందే భారత్ ట్రైన్లను తెర మీదకు తీసుకొచ్చి.. రైలు ప్రయాణాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేసింది. ఈ …
Read More »సమీక్ష – బడ్డీ
అల్లు లాంటి పెద్ద కుటుంబం అండదండలు ఉన్నా సినిమాలు చేయడంలో నెమ్మదితనం పాటిస్తున్న శిరీష్ కొంత గ్యాప్ తర్వాత బడ్డీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేయడంతో క్రమంగా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ ఈ మూవీకి టికెట్ రేట్లు తగ్గించి మరీ జనాన్ని మొదటి రోజు థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు. సామ్ అంటోన్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా నిర్మించిన …
Read More »ఒలింపిక్స్లో ఓ సంచలన ఘటన
పారిస్లో ఒలింపిక్స్ ఉత్సాహభరితంగా జరుగుతున్న వేళ ఒక ఉదంతం సంచలనం రేపుతోంది. ఇటలీ బాక్సర్ యాంజెలా ఉన్నట్లుండి బౌట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలిఫ్తో బౌట్ మొదలైన 40 సెకండ్లకే యాంజెలా రింగ్ నుంచి నిష్క్రమించింది. అలా అని ఆమె నేమీ ఖెలిఫ్ నాకౌట్ చేయలేదు. గట్టి దెబ్బ తగిలి కోలుకోలేని స్థితిలో ఉంటే బాక్సర్లు నాకౌట్ అయి నిష్క్రమిస్తారు. కానీ ఇక్కడ అలా …
Read More »డార్క్ టూరిజం : కేరళ స్ట్రాంగ్ వార్నింగ్ !
2008 నవంబర్ 26 నుండి 29 వరకు ముంబయి మహానగరంపై మూడు రోజుల పాటు ఉగ్రవాదులు చేసిన దాడుల గురించి అందరికీ తెలిసిందే. ఈ దాడులలో 173 మంది చనిపోగా, మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. అయితే అక్కడ దాడుల నేపథ్యంలో కొందరు సినిమా పరిశ్రమకు చెందిన వారు వచ్చి ఆ దృశ్యాలను చిత్రీకరించడం, అక్కడ విషాదం నెలకొన్న సమయంలోనే తాము సినిమా తీస్తామని ప్రకటించడం విమర్శలకు దారి …
Read More »దేశంలో ఫస్ట్ టైమ్.. పీఎంపై ప్రివిలేజ్ మోషన్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అడ్డంగా బుక్కయ్యారా? ఆయనపై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సభ్యులకు మరిన్ని ఆయుధాలు అందించారా? ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ వచ్చినా ఆశ్చర్యం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామం.. తర్వాత మోడీ స్పందించిన తీరు.. వంటివి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొనేలా చేశాయి. అసలేం జరిగింది! …
Read More »మస్క్ వర్సెస్ గూగుల్.. పొలిటికల్ ఫైట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న నాయకుల కంటే కూడా వారికి మద్దతిస్తున్న వారి మధ్య పెద్ద ఎత్తున పొలిటికల్ ఫైట్ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు లేని రగడ.. ఇప్పుడు అధికార పార్టీ డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి మార్పుతో తీవ్రస్థాయిలో తెరమీదికి వచ్చింది. డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ పార్టీకి గెలుపు అంచనాలు పెరుగుతున్నాయి. పైగా కమలా …
Read More »నెట్ఫ్లిక్స్ దుమారం.. ఏం జరిగింది?
ప్రపంచ వ్యాప్తతంగా ‘నెట్ ఫ్లిక్’ అంటే తెలియని పట్టణ ప్రజలు ఉండరు. ఒకప్పుడు ఇది ఖరీదైనా.. ఇప్పుడు నేరుగా ఇంట్లోకి వచ్చేసింది. తక్కువ ప్రీమియంలతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాంగా గుర్తింపు పొందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. నెట్ఫ్లిక్స్ వినియోగదారుల సంఖ్య 60 శాతానికి పైగానే ఉంది. కొత్త కొత్త సినిమాలతోపాటు వెబ్ సిరీస్ ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవడంలో నెట్ ఫ్లిక్స్ ముందుంది. అయితే.. ఇప్పుడు ఈ …
Read More »నేపాల్లో కుప్పకూలిన విమానం.. 18 మంది మృతి!
భారత్ కు మిత్ర దేశం, పొరుగు దేశం కూడా అయిన నేపాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని ఖాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ విమానం కుప్ప కూలిపోయింది. కళ్లు మూసి తెరిచే లోగా జరిగిన ఈ విషాద ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఖాఠ్మండు నుంచి పొఖారాకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates