Political News

ఆ న‌లుగురు.. సైలెంట్ అయ్యారే.. టెంపో ఏమైంది?

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల కార‌ణంగా హ‌ఠాత్తుగా న‌లుగురు ఎమ్మెల్యేలు కొన్ని రోజుల పాటు రాజ‌కీయ తెరపై హ‌ల్చ‌ల్ చేవారు. వారంతా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ.. ఆ ఎమ్మెల్యేల‌పై వేటు వేశారు. అయితే.. ఈ నిర్ణ‌యంతో వైసీపీ సాధించింది ఏమీ క‌నిపించడం లేదు. అదేస‌మ‌యంలో స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు సింప‌తీ పెరిగింద‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. అయితే.. ఆ అనూహ్య మెరుపులు హ‌ఠాత్తుగా క‌నిపించ‌డం మానేశాయి. …

Read More »

జగనన్నకు చెబితే ఏమవుతుంది ?

jagan

జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమం మేనెల 9వ తేదీ నుంచి మొదలవ్వబోతోంది. తమ సమస్యలను జనాలు నేరుగా జగన్మోహన్ రెడ్డితోనే చెప్పుకోవచ్చట. జనాలు చెప్పే సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ ప్రకారం అధికారయంత్రాంగం పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతి కలెక్టర్ ఆధీనంలో ప్రభుత్వం రు. 3 కోట్లను కేటాయించింది. ఈ ప్రోగ్రామ్ కు ప్రభుత్వం 1902 అనే హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటుచేసింది. ఇదే విషయమై జగన్ ఉన్నతాధికారులతో …

Read More »

సమయం లేదు మిత్రమా కమలమా, కమ్యూనిజమా..

ఇద్దరు అగ్రనేతలు కలిశారంటే ఏదో జరుగుతుందని అర్థం. వ్యూహాత్మక ముందడుగు వేసేందుకే భేటీ అయ్యారని అర్థం. ఇరు పార్టీల ప్రయోజనానికి పనిచేసే కార్యాచరణ రూపొందించుకుంటున్నారని అర్థం, రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని లెక్కలు వేసుకున్నారని అర్థం. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ వెనుక ఉన్నది కూడా అదే అర్థం. ఐదారు అంశాలు పవన్ కల్యాణ్ సడన్ గా చంద్రబాబు నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి ప్రకటన లేకుండానే …

Read More »

నాకు రాజ‌కీయ జీవితం ఇచ్చింది చంద్ర‌బాబే: రాజా సింగ్‌

తెలంగాణ‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు రాజ‌కీయ జీవితం ప్ర‌సాదించింది టీడీపీనేన‌ని తెలిపారు. టీడీపీ వ‌ల్లే తాను ఇంత‌వాడిని అయ్యాన‌ని చెప్పారు. ఏపీలో ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం అవుతారని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడిన రాజాసింగ్‌.. తాను పార్టీ మారుతున్న‌ట్టు వ‌చ్చిన ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని తెలిపారు. తెలంగాణ …

Read More »

ఎన్టీఆర్‌ను ఎవ‌రూ పొగ‌డ‌కూడ‌దా?

తాజాగా త‌లైవా ర‌జ‌నీకాంత్ వ్య‌వ‌హారం.. ఏపీలో మాట‌ల మంట‌లు రేపుతోంది. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి కార్య‌క్ర‌మాల‌కు.. టీడీపీ అంకురార్ప‌ణ చేసింది. ఏప్రిల్ 28 నుంచి మే 28 వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాల‌ను గ్రామ గ్రామాన‌.. ప‌ల్లెలు ప‌ట్ట‌ణాల్లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు బాస‌ట‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌ని తీర్మానం చేసింది. దీనిలో భాగంగా.. విజ‌య‌వాడ శివారులో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి అంకురార్ప‌ణ స‌భ‌ను నిర్వ‌హించారు. దీనికి …

Read More »

ర‌జ‌నీ కామెంట్స్‌పై.. మీమ్స్ ఎటాక్‌.. ఏం జ‌రిగింది?

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఏపీలో ప‌ర్య‌టించారు. టీడీపీఅధినేత చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన ఆయ‌న ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఎన్టీఆర్‌ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని కొనియాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్‌-2040 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పారు. అంతేకాదు.. 1996లో చంద్రబాబు తన విజన్‌-2020 ప్రణాళిక …

Read More »

నా లాంటి వాణ్ణి ఏ పార్టీ కూడా భ‌రించ‌లేదు: రాజాసింగ్

బీజేపీ నాయ‌కుడు, ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో సెల్ఫీ వీడియో ఒకటి పోస్టుచేశారు. త‌నలాంటి వాణ్ణి ఏ పార్టీ కూడా భ‌రించ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం తాను బీజేపీలోనే ఉన్నాన‌ని.. బీజేపీని వీడే ప్ర‌శ్నే లేద‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. దీనికి ముందు ఏం జ‌రిగిందంటే.. రాజాసింగ్ త్వ‌ర‌లోనే తెలంగాణ టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని.. దీనికి సంబంధించి.. చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని.. చంద్ర‌బాబు కూడా దీనికి …

Read More »

ఆఫ్‌ది రికార్డు.. : ఎమ్మెల్యేల ఘోష!

వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మ ఘోష పెడుతున్నారు. త‌మ మాట‌కు విలువ లేకుండా పోయింద‌ని త‌ల్ల‌డిల్లుతు న్నారు. తాము ఇలా అయిపోవ‌డానికి ఆయ‌నే కార‌ణం అంటున్నారు వైసీపీలోని కీల‌క నాయ‌కులు. పైకి పేరు చెప్పేందుకు కొంద‌రు సాహ‌సం చేయ‌క‌పోయినా.. త‌మ‌ను నానార‌కాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఒక స‌ల‌హాదారుపై వారు విరుచుకుప‌డుతున్నారు. “మేమేదో.. మాకు తెలుసు. మ‌ధ్య‌లో ఆయ‌న పెత్త‌నం మాకెందుకు?” అని మెజారిటీ ఎమ్మెల్యేలు.. ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల …

Read More »

చింతకాయల విజయ్ కి అనకాపల్లి టికెట్ ?

ఉత్తరాంధ్రపై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. సీమ, కోస్తాంధ్ర కంటే కూడా ఉత్తరాంధ్రలో పార్టీ బలం పెరిగిందని చంద్రబాబు సహా పార్టీ అగ్రనేతలంతా అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు టీడీపీ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల వేట కూడా మొదలైంది. ప్రతీ నియోజకవర్గమూ ముఖ్యమేనని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో అనకాపల్లి లోక్ సభా …

Read More »

జగన్‌కు షాకిచ్చిన బాలినేని

ఏపీ సీఎం జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు ఆయన బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి ఆయన తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఆ బాధ్యతల నుండి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, బాలినేని స్వల్ప …

Read More »

వైసీపీది ఇంత పెద్ద స్కెచ్ వేసిందా? నిజ‌మేనా..!

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. నాయ‌కుల‌కు.. పార్టీల‌కు మ‌ధ్య సంబంధాలు.. నాయ‌కుల దూకుడు, పార్టీల వ్యూహాలు.. వెర‌సి.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే..తాజాగా వైసీపీ స‌ర్కారు విష‌యంలో.. ఓ కీల‌క విష‌యంపై మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఓట‌ర్ల‌ను తిక‌మ‌క‌పెట్టి.. త‌మ‌కు అనుకూలంగా ప‌రిస్థితిని క‌ల్పించుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా స్కెచ్ వేసిందనేది ఈ వార్త‌ల సారాంశం. అయితే.. ఇది సాధ్య‌మేనా? అనేది చ‌ర్చ‌. విష‌యం …

Read More »

తాడేపల్లి టాక్: అవినాశ్ రెడ్డి అవుట్.. దుష్యంత్ రెడ్డి ఇన్?

బాబాయ్ మర్డర్ కేసులో పీకల్లోతున కూరుకుపోయిన అవినాశ్ రెడ్డి అందులోంచి బయటపడడం కష్టమేనని సీఎం జగన్ రెడ్డికి అర్థమైపోయింది. ఎన్నిసార్లు దిల్లీ వెళ్లినా ఇలాంటి ఇష్యూస్‌లో సాయం చేసేది లేదన్న సమాధానం రావడంతోపాటు.. తమ్ముడిని కాపాడుకోవడం కంటే కడప లోక్ సభ సీటు కాపాడుకోవడంపై దృష్టిపెట్టమని సెంటర్ నుంచి సజెషన్ రావడంతో ఇప్పుడు జగన్ రెడ్డి ఆ పనిలో పడ్డారు. దీంతో పీకల్లోతున కూరుకుపోయిన బ్రదర్ అవినాశ్ రెడ్డిని ఆ …

Read More »