సీఎం జగన్ను కలుసుకునేందుకు ఈ నాలుగేళ్లలో ఏ సామాన్యుడు ప్రయత్నించినా.. అది దుర్లభంగానే మారింది. ఇక, నిరసనలు.. ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో సీఎం జగన్కు సామాన్యుల ఆక్రందనలు తెలియడం లేదు. అయితే.. అనూహ్యంగా బుధవారం మాత్రం సీఎం జగన్కు నిరసనల సెగ తగిలింది. ఏకంగా.. ఎంతో భద్రతలో ఉన్న జగన్ కాన్వాయ్ను రైతులు అడ్డగించారు. తమకు న్యాయం చేయాలంటూ.. రోడ్డుపై పడుకుని కాన్వాయ్ను నిలువరించే ప్రయత్నం చేశారు. …
Read More »జగన్కు షర్మిళ మరో ఝలక్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే ఒకట్రెండు సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగేలా మాట్లాడింది ఆయన సోదరి షర్మిళ. వివేకా హత్య కేసు నుంచి అవినాష్ రెడ్డిని ఎలాగైనా బయటపడేయాలని జగన్ ప్రయత్నిస్తుంటే.. షర్మిళ మాత్రం అవినాష్కు ఈ కేసులో సంబంధం ఉందన్నట్లుగానే మాట్లాడుతోంది మొదట్నుంచి. అవినాష్ అండ్ కో ఆరోపిస్తున్నట్లుగా వివేకా హత్య కేసుకు, ఆస్తుల వ్యవహారానికి సంబంధం లేదని, కడప …
Read More »జగన్ నోరు తెరిస్తే.. అబద్ధం: చంద్రబాబు ఫైర్
వైసీపీ అధినేత, సీఎం జగన్ నోరు తెరిస్తే.. అబద్ధాలు మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తొలుత ముస్లిం కుటుంబాలతో భేటీ అయ్యారు. వారికి పలు హామీలు ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి మసీదుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, కరెంట్ బిల్లులో సబ్సిడీ ఇవ్వాలనే విషయాన్ని తప్పకుండా పరిశీలనలోకి తీసుకొని పార్టీ అధికారంలోకి వచ్చా హామీ నెరవేరుస్తామన్నారు. మైనారిటీలతో ప్రత్యేక సమావేశం చేయడంతో పాటు వారి …
Read More »కడపపై ప్రత్యేక కన్ను.. ఐప్యాక్ సర్వే.. నేతల్లో టెన్షన్!
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఇప్పటి వరకు వైసీపీకి తిరుగులేని జిల్లాగా పేరు తెచ్చుకుంది. అంతేకా దు.. కొన్నినియోజకవర్గాల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం కూడా పట్టారు. అయితే.. అలాంటి జిల్లాపై ఇప్పుడు సీఎం జగన్కు అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. దీనికి కారణం.. టీడీపీ ‘వైనాట్ పులివెందుల’ నినాదంతో కడపపై ఫోకస్ పెంచడమే. ఇటీవల చంద్రబాబు సైతం ఇక్కడ పర్యటించారు. ఇక, వైనాట్ పులివెందుల నినాదంతో పార్టీ నాయకులు …
Read More »కర్ణాటకలో తాజా సర్వే.. బీజేపీ పరిస్థితి దారుణం!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాలే సమయం ఉంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు దూకుడుగా ఉన్నాయి. ప్రచారం ముమ్మరం చేశాయి. కీలక నేతలు రంగంలోకి దిగారు. స్టార్ క్యాంపెనర్లుగా ఉన్న సినీ ప్రముఖులు సైతం ప్రచారం చేస్తున్నారు. ఇదిలావుంటే.. మరో 15 రోజుల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఎవరు అధికారం దక్కించుకోనున్నారనే విషయంపై తాజాగా ఒక సర్వే బయటకు వచ్చింది. నిజానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన …
Read More »పొత్తును ఎందుకు వద్దనాలి.. టీడీపీ కార్యకర్తల మనోగతం
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై చర్చ మళ్లీ ఊపందుకున్న నేపథ్యంలో పార్టీల కార్యకర్తలు కూడా ఆశావహ దృక్పథంతో ఎదురు చూస్తున్నారు. నిన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో చంద్రబాబు సానుకూల సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు కూడా జోష్ మీదకు వచ్చాయి. టీవీ చర్చల్లో పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా, కార్యకర్తలు కూడా వారికి వంత పాడుతున్నారు. మోదీని మాత్రమే చంద్రబాబు పొడిగారని, పొత్తుపై కమిట్మెంట్ ఇవ్వలేదని టీడీపీ వ్యతిరేక …
Read More »అవినాష్ అరెస్టయితే.. ఏపీలో జరిగే మార్పేంటి..?
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. ఆయనను అరెస్టు చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. అంతేకాదు.. సీబీఐ ఎంతో సంయమనంతో వ్యవహరిస్తోందని కూడా కితాబునిచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తే.. సీబీఐ ఎంపీ అవినాష్ను అరెస్టు చేయడం ఖాయమనే తెలుస్తోంది. నేడో …
Read More »భారత్ జనాభా: జర్మనీ వివాదాస్పద కార్టూన్.. కేంద్రం సీరియస్
భారత్లో జనాభా.. తాజాగా చైనాను దాటేసింది. సుమారు 50 లక్షల మందికి పైగా చైనా కంటే భారత్లో జనాభా పెరిగారని.. ఇటీవలే అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. అయితే.. జనాభా నియంత్రణకు కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఎలా తగ్గించాలనే విషయంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే పదేళ్లలో జనాభా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మేధో మథనం చేస్తోంది. అయితే.. ఇంతలోనే.. తాజాగా భారత్ …
Read More »అవినాష్ రెడ్డి అరెస్టు పై బెట్టింగులే బెట్టింగులు!
ఏపీలో ఏం జరిగినా బెట్టింగు రాయళ్లు రంగంలోకి దిగుతున్నారు. కోడి పందేల నుంచి క్రికెట్ వరకు దేనినీ వారు వదిలి పెట్టడం లేదు. ఇలానే.. ఇప్పుడు సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ.. సీఎం జగన్కు తమ్ముడు వైఎస్ అవినాష్రెడ్డి వ్యవహారం కూడా .. బెట్టింగులకు దారి తీసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా? చేయరా? అనేది తీవ్ర …
Read More »తన మిత్రుడుకి 22 అంతస్తుల బిల్డింగ్ బహుమతి ఇచ్చిన అంబానీ
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన చిరాకాల మిత్రుడు మోదీకి ముంబయిలో రూ. 1500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల భవనాన్ని కానుకగా ఇచ్చారు. అయితే, అంబానీ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ అందుకుంటున్న ఈ మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కాదు.. మనోజ్ మోదీ. అవును.. 40 ఏళ్లుగా రిలయన్స్లో పనిచేస్తున్న మనోజ్ మోదీ.మనోజ్ మోదీకి దక్షిణ ముంబయిలోని నేపియన్ సీ రోడ్లో ఉన్న 22 అంతస్తుల బృందావన్ …
Read More »గుంటూరు బరిలో సుజనా చౌదరి ..?
ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలక నేత సుజనా చౌదరి గుంటూరు లోక్ సభా స్థానం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ మరోసారి పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలియడంతో సుజనా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. గుంటూరు నగరంలో ఇటీవల టీడీపీ, బీజేపీ నేతల తేనీటి విందు జరిగింది. టీడీపీ నేత ఆలపాటి …
Read More »సొంత జిల్లాలో ఎంత బలంగా ఉన్నాం? జగన్ సర్వే
2024లోనూ మళ్లీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్న ఏపీ సీఎం జగన్ అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తమకు తిరుగులేదనుకునే సొంత జిల్లా విషయంలోనూ ఆయన చాలా ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తున్నారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రం ప్రకారం ఆయన సొంత జిల్లా కడపపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీకే టీంతో కడప జిల్లాలో సర్వే చేయిస్తున్నారట. ఇప్పటికే పీకీ టీం కడపలోని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates