దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అభివర్ణిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం కాగా.. ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటల వేళకు.. చెదురుముదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతూనే ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 91 శాతం పోలింగ్ నమోదై.. అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక.. ఈ రోజు …
Read More »తెల్లవారుజామున అయ్యన్న.. ఆయన కుమారుడు అరెస్టు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ అరెస్టు చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి.. ఆయనకు నోటీసులు అందజేశారు. అనంతరం ఆయన్ను.. ఆయన కుమారుడు రాజేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకూ ఇంతటి హైడ్రామా ఎందుకు? అయ్యన్నపాత్రుడిని ఎందుకు అరెస్టు చేశారు? ఆయన మీద …
Read More »డేంజర్ లో పవన్ కల్యాణ్ ప్రాణాలు?
షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? ఆయన ప్రాణాలు ఇప్పుడు డేంజర్ లో ఉన్నాయా? ఆయన పై దాడి చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందా? ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వాహనాలు తిరగటమే కాదు.. కొందరు వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చి సందేహం కలిగేలా సంచరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు.. వాహనాలతో …
Read More »వివేకా హత్య కేసులో సంచలనగా మారిన షర్మిల వాంగ్మూలం
గత నెల ఏడో తేదీని వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎందుకు ఢిల్లీకి అన్న ప్రశ్నకు అందరికి చెప్పిన సమాధానం తెలంగాణలో అతి గొప్ప ప్రాజెక్టుగా చెప్పే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుందని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. జరిగింది ఇది మాత్రమే కాదు.. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి తనకు తెలిసిన సమాచారం.. తనకు …
Read More »నాన్నగారి బాటలో వైసీపీ తనయులు..
వైసీపీలో చాలా మంది నాయకులు తండ్రుల బాటలో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. వీరిలో చాలా మంది సీనియర్ల బిడ్డలు ఉండడం గమనా ర్హం. అయితే, వీరిలో ఎవరువిన్ అవుతారు.. ఎవరు ఫెయిల్ అవుతారనే చర్చకన్నా ముందు. అసలు సీఎం జగన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది ప్రశ్న. ఇది ఇంకా తేలలేదు. అయినప్పటికీ.. తగ్గేదేలే అంటూ.. నాయకుల తనయులు దూకుడుగానే ఉన్నారు. ఉమ్మడి కృష్ణాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి …
Read More »ప్రశ్నించిన వ్యక్తిని చితక్కొట్టిన సీఎం జగన్ మేనమామ..
ఆయన ముఖ్యమంత్రి జగన్కి స్వయానా మేనమామ.. తమ ప్రభుత్వం చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడపగడపకు కార్యక్రమంలో పర్యటిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం చేసే గొప్పలు చెప్పుకునేందుకు వెళ్లిన ఆయనకు.. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వెళ్లిన ప్రతిచోట ప్రశ్నల వర్షం కురవడంతో.. సహనం నశించిన ఆయన బూతు పురాణం మెుదలెట్టాడు. అంతేకాదు, ఒక వ్యక్తిని చేత్తో టపా టపా వాయిస్తూ చితక్కొట్టేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. …
Read More »‘ఏపీలో మే లేదా డిసెంబరులో ఎన్నికలు’
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. వచ్చే ఏడాది మే లేదా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆయన తన పార్టీ నేతలకు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసారు. ఈ నెల 4న తేదీన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామలో నిర్వహించ తలపెట్టిన “బాదుడే బాదుడు కార్యక్రమ” …
Read More »హాట్ టాపిక్గా విజయవాడ ఎంపీ టిక్కెట్…!
విజయవాడ ఎంపీ టికెట్ అంటే ప్రస్తుతం ఒక హాట్ సీట్ లెక్క. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉన్నా విజయవాడ లెక్కవేరే అంటున్నారు వైసీపీ నాయకు లు. దీనిని ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించలేదు. గత ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదు. కొన్నాళ్లు ప్రభుత్వకార్యక్రమాల్లో హల్చల్ చేసినా తర్వాత ఆయన వ్యాపారాలు, వ్యవహారా్ల్లోనే ఉంటున్నారు. దీంతో …
Read More »మునుగోడు చిత్రం.. ఓటుకు నోటు కోసం గొడవ
ఎన్నికల సమయంలో ఓటు కోసం నోటు పంచడం అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది ఇప్పుడు. నిత్యావసరాలు పెరిగినట్లే ఒక ఎన్నిక నుంచి ఇంకో ఎన్నికకు వచ్చేసరికి ఓటు రేటు కూడా పెరిగిపోతోంది. ఈ రేట్ల విషయంలో తెలంగాణ పైపైకి ఎగబాకుతుండడం విశేషం. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎలా డబ్బు, మద్యం ఏరులై పారింద తెలిసిందే. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కొత్త …
Read More »బాలయ్య ‘అన్స్టాపబుల్’లో షర్మిళ?
ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ టాక్ షో ఏది అంటే మరో మాట లేకుండా ‘అన్స్టాపబుల్’ పేరు చెప్పేయొచ్చు. ఓటీటీలో టాక్ షో ఏంటి.. అందులోనూ బాలయ్య హోస్ట్ ఏంటి.. ఎవరు చూస్తారు ఈ షో అన్న వాళ్లంతా కూడా ఇప్పుడు ఆ షోకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అలా ప్రశ్నించిన వాళ్లు కూడా ఆ షోకు అడిక్ట్ అయిపోతున్నారు. ఆ స్థాయిలో షోకు రెస్పాన్స్ తీసుకొచ్చారు మేకర్స్, …
Read More »తూర్పులో జనం నాడి మారుతోందా… !
రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పుంజుకుంది. ఇది అనూహ్యమనే మాట వినిపించింది. ఎందుకంటే.. ఇక్కడ చాలా నియోజకవర్గా ల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా గెలుస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే.. గత ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిస్తే.. ఉమ్మడి తూర్పులో 12 నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటింది. ఇక, రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు స్థానా్లోనూ వైసీపీ …
Read More »ఏపీలో 3 పార్టీలకూ మహిళా నేతలు కావలెను…!
అవును.. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల్లోనూ మహిళా నాయకులు కావలెను! అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మహిళా నాయకుల కొరత వేధిస్తోందని.. ఇటీవల చూచాయగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకాదు..త్వరలోనే మరింత ప్రక్షాళన చేయనున్న నేపథ్యం లో మహిళా నాయకులు అవసరం అవుతారని..వారిని తయారు చేయాలని పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడుకు సూచించారు. ప్రస్తుతం ఉన్న వారిని చూస్తే.. వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాథ, శ్రీకాకుళం జిల్లాలోని …
Read More »