Political News

ఇప్పుడు ప్లేట్, ఫేట్ రెండూ మారుతున్నాయి

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చాలా ముందు చూపే ఉన్న‌ట్టుగా ఉంది. ఎప్పుడో రెండు మాసాల త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌ను ఆయ‌న ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టుగా ఉన్నారు. రెండు నెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ఇప్పుడే అంచ‌నా వేసుకున్న‌ట్టుగా ఉన్నారు. అందుకే చాలా వ్యూహాత్మ‌కంగా జాతీయ స్థాయిలో రాజ‌కీయా ల‌ను క‌దుపుతున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ముందు చూపుతోనే.. జ‌గ‌న్ ఇండియా కూట‌మి పార్టీల‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని తాజాగా జ‌రుగుతున్న విశ్లేష‌ణ‌. ఇటీవ‌ల ఆయ‌న …

Read More »

ఏపీలో ‘ఈ-పాల‌న‌’

ఏపీలో చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కారు.. ఇక ఈ-పాల‌న దిశ‌గా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించింది. ఇప్పటి వ‌ర‌కు ఫిజిక‌ల్‌గా తీసుకునే నిర్ణ‌యాలు.. స‌మీక్ష‌లు, స‌మావేశాలు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించేందుకు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతున్నారు. కొత్త నిర్ణ‌యాలు తీసుకునేందుకు కూడా దోహ‌ద‌ప‌డుతున్నాయి. ఇక‌, ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని నడిపించేందుకు కూడా ఈ స‌మావేశాల్లో నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అయితే.. ఒక్కొక్క‌సారి కీల‌క మంత్రులు అనివార్య కారణాల‌తో స‌మీక్షా స‌మావేశాల‌కు, మంత్రి మండ‌లి స‌మావేశాల‌కు కూడా రాలేక …

Read More »

ముహూర్తం-మెనూ రెడీ.. పేద‌వాడి పొట్ట‌కు స్వ‌తంత్రం!

పేద‌వాళ్ల ఆక‌లి తీర్చాల‌న్న స‌దుద్దేశంతో ఏపీలో కూట‌మి స‌ర్కారు అన్న క్యాంటీన్ల‌ను తీసుకువ‌చ్చింది. ఆగ‌స్టు 15న దేశానికి స్వాతంత్రం ద‌క్కిన రోజును పుర‌స్క‌రించుకుని పేద‌వాటి పొట్ట‌కు కూడా స్వ‌తంత్రం తీసుకురావాల‌న్న ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి క్యాంటీన్ల‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. తొలి రోజు ఆయ‌న గుడివాడ నియోజ‌వ‌ర్గంలో అతిపెద్ద క్యాంటీన్‌ను ప్రారంభించ‌నున్నారు. మ‌రుస‌టి రోజు నుంచి 99 క్యాంటీన్ల‌ను మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభించ‌నున్నారు. …

Read More »

క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. టీడీపీ నేత దారుణ హ‌త్య‌

ఏపీలో ఘోరం చోటు చేసుకుంది. టీడీపీ నాయ‌కుడు, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ నియోజ‌కవ‌ర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అనుచ‌రుడు, 45 ఏళ్ల‌ వాకిటి శ్రీను దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున నియోజ‌క‌వ‌ర్గంలోని శివారు ప్రాంతం హోసూరులో బ‌హిర్భూమికి వెళ్లిన శ్రీనును కొంద‌రు వ్య‌క్తులు అనుస‌రించి.. క‌ళ్ల‌లో కారం చ‌ల్లి వెంట తెచ్చుకున్న క‌త్తుల‌తో దారుణంగా హ‌త్య చేశారు. అయితే.. ఎవ‌రు చేశార‌న్న‌ది మాత్రం ఇంకా తెలియ‌లేదు. సుమారు …

Read More »

‘జోగి’ కులం కార్డుకు టీడీపీ స్ట్రాంగ్ రియాక్ష‌న్‌!!

వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి జోగి ర‌మేష్ కేసుల్లో చిక్కుకున్నారు. ఆయ‌న కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్ప‌టికే జోగిపై చంద్ర‌బాబు ఇంటిపై దాడికి ప్ర‌య‌త్నించార‌న్న కేసు ఉండ‌నే ఉంది. ఇప్పుడు.. ఆయ‌న‌కు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. విచార‌ణ‌కు రావాల‌ని కూడా పిలిచారు. ఈ ప‌రిణామాల‌తో జోగి ఉక్కిరిబిక్కిరికి గుర‌య్యారు. ఒకే రోజు త‌న కుమారుడిని అరెస్టు చేయ‌డం, …

Read More »

బిర్యానీని వదలని జగన్

సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్టారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చి రెండు మాసాలే అయింద‌ని చెబుతూనే.. ఇంత‌లోనే ప్ర‌జ‌ల్లో భారీ వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్ బిర్యానీ పెడ‌తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు ప‌చ్చ‌డి మెతుకులు కూడా పెట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌ను మోసం …

Read More »

వైసీపీకి చెక్ పెడుతున్న మాజీ మ‌హిళా మంత్రి…!

రాజ‌కీయాలు మారుతున్నాయి. ఏదీ నిన్న‌టిలా ఉండే స‌మ‌స్యేలేదు. త‌మ‌కు అవ‌కాశం ద‌క్కితే చాలు.. విస్త‌రించే ప‌నిలో నాయ‌కులు ఉంటారు. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా లోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్‌.. మాజీ మంత్రి ప‌రిటాల సునీత దూకుడు పెంచారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న కుమారుడు శ్రీరామ్‌కు ఆమె అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీకి చోటు లేకుండా చేయాల‌న్న …

Read More »

క‌ర‌ణం – పొలిటిక‌ల్ క‌ల‌క‌లం … !

క‌రణం బలరామకృష్ణమూర్తి.. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు. టిడిపి తో ప్రస్థానం ప్రారంభించిన కరణం బలరామకృష్ణమూర్తి అంతకుముందు కాంగ్రెస్లోనూ పనిచేశారు. టిడిపిలో సుదీర్ఘకాలం అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజకీయంగా చక్రం తిప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై విజయం సాధించిన బలరామకృష్ణమూర్తి తర్వాత కాలంలో వైసీపీ పంచన చేరిపోయారు. ఈ క్రమంలోనే తన కుమారుడు కరణం …

Read More »

జూనియ‌ర్ జ‌గ‌న్‌కు-సీనియ‌ర్ బాబుకు మ‌రో తేడా ఇదే!

అవునన్నా కాద‌న్నా.. చంద్ర‌బాబుతో పోల్చిన‌ప్పుడు.. జ‌గ‌న్ జూనియ‌రేక‌దా! సో.. ప‌నితీరులోనూ అదే కని పించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జూనియ‌ర్‌గా ఆయ‌న ఐదేళ్లు ప‌నిచేసి.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర గొన‌లేక‌పోయార‌నే వాద‌న సొంత పార్టీలోనే అనేక మంది నాయ‌కులు నోరు విప్పి మ‌రీ చెప్పేస్తున్నారు. ఇక‌, సీనియ‌ర్ మోస్ట్‌(ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో) నాయ‌కుడైన చంద్ర‌బాబు త‌న‌దైన పంథాలో ముందు కు సాగుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు? అంటారా? ఇక్క‌డే …

Read More »

దువ్వాడ గొడవ.. మాధురి భర్త లైన్లోకి

గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వెల మాధురి అనే పెళ్లయిన మహిళతో సంబంధం గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తమను వదిలేసి శ్రీనివాస్.. మాధురితో ఉంటుండడంపై ఆయన భార్యాపిల్లలు రోడ్డెక్కి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మీడియాలో మార్మోగుతోంది. తామిద్దరు కలిసి ఉంటున్న విషయాన్ని శ్రీనివాస్, మాధురి మీడియా ముందు ఒప్పేసుకున్నారు కూడా. ఐతే శ్రీనివాస్‌ను భార్యాపిల్లలు రెండేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతోనే మరో మహిళకు …

Read More »

దానంపై కేసు.. పోలీసుల‌కు వార్నింగిచ్చిన నాగేంద‌ర్‌

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేసిన వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. త‌న‌పై కేసు పెట్టిన వారిని ఊరుకునేది లేద‌ని నాగేంద‌ర్ తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. అధికారుల‌కు ప్ర‌విలేజ్‌(శాస‌న స‌భా హ‌క్కులు ఉల్లంఘించ‌డం) నోటీసులు ఇస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. అస‌లు ఏం జ‌రిగింది? గ‌త శ‌నివారం.. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని జూబ్లీహిల్స్ డివిజ‌న్‌లో ఉన్న నంద‌గిరిహిల్స్‌లో …

Read More »

కోదండరాంను వెంటాడుతున్న దాసోజు !

తెలంగాణ శాసనమండలిలో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేటెడ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించాలని అప్పటి ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. అయితే రాజకీయ నాయకులైన వీరిని ఎమ్మెల్సీగా నియమించడం కుదరదు అంటూ గవర్నర్ తమిళిసై ఆ సిఫారసును తోసిపుచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో తమిళిసై ఆ నిర్ణయం తీసుకున్నారు. …

Read More »