Political News

ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌ల‌ పై మ‌ళ్లీ నోరు పారేసుకున్న జ‌గ‌న్‌

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పెళ్లిళ్ల‌పైన వైసీపీ విమ‌ర్శ‌ల వ‌ర్షానికి అడ్డుక‌ట్ట ప‌డ‌టం లేదు. తాజాగా సీఎం జ‌గ‌న్ మ‌రోసారి ప‌వ‌న్ భార్య‌ల గురించి నోరు పారేసుకున్నారు. న‌ర్సీప‌ట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టుల‌ను సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న మ‌రోమారు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. ‘ఈ రాష్ట్రం కాక‌పోతే ఆ రాష్ట్రం, ఈ ప్ర‌జ‌లు కాక‌పోతే ఆ …

Read More »

బాబు ‘ఏజ్‌’ పై సీఎం జ‌గ‌న్‌ కామెంట్లు

టీడీపీ అధినేత Chandrababu వ‌య‌సుపై వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ’73 ఏళ్ల ముస‌లాయ‌న‌’ అంటూ.. కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. జోగునాథునిపాలెం వద్ద 9 వంద‌ల 86 కోట్ల రూపాయ‌ల విలువైన‌ ప్రాజెక్టులకు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం జోగినాథునిపాలెంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన‌న్నారు. …

Read More »

నాణ్యమైన బ్రాండ్లు తక్కువ ధర..బాబు ప్రామిస్

మందు కొట్టకుండా సమాజంలో చాలా మంది ఉండలేరు. సాయంత్రమైతే తెలుగు రాష్ట్రాల్లో బ్రాందీ షాపులు కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. రకరకాల బ్రాండ్ల మద్యం మార్కెట్లో కనిపిస్తుంది. కొన్ని కొత్త బ్రాండ్లు కూడా ఇప్పుడు మద్యం దుకాణాల్లో కనిపిస్తున్నాయి. మద్యం వ్యాపారంలో విపరీతమైన ఆదాయం ఉంటుంది. అందుకే బ్రాందీ షాపుల కాంట్రాక్టులు చేజిక్కించుకునేందుకు సిండికేట్లుగా ఏర్పడి మరీ లాలూచీ పడిన రోజులు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా.. మద్యం వ్యాపారులు అడ్డదారులు …

Read More »

అమ్మ మాట నిల‌బెట్టుకున్న మోడీ.. ఏ ప్ర‌ధానీ చేయ‌ని ప‌ని!

ప్ర‌ధాన మోడీ మంత్రి మాతృమూర్తి హీరాబెన్ శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 3.30గంట‌ల స‌మ‌యంలో అహ్మ దాబా ద్‌లోని ఓఆసుప‌త్రిలో మృతి చెందారు. సాధార‌ణంగా ఎవ‌రి ఇంట్లో అయినా.. ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటే.. ఆ కుటుంబంలోని వారంతా.. ఇత‌ర‌ప‌నులు ప‌క్క‌న పెట్టి.. ఈ కార్య‌క్ర‌మాల్లో ఉండిపోతా రు. అయితే.. ప్ర‌ధాని మోడీ మాత్రం త‌న షెడ్యూల్‌ను మార్చాలేదు. త‌న ప‌నికి ఆటంకంగా భావించ‌లేదు. ప్ర‌ధానిగా ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్న షెడ్యూల్ …

Read More »

ఆ ‘నాలుగు’ చుట్టూ.. టీడీపీలో హాట్ టాపిక్‌!

ఔను.. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలపై ఆ జిల్లా TDP త‌మ్ముళ్ల మ‌ధ్య హాట్ టాపిక్ న‌డుస్తోంది. ఇవి ఎవ‌రికిస్తారు? ఇస్తే.. ఎవ‌రు పోటీ చేస్తారు? పోటీ చేస్తే.. గెలుస్తారా? అస‌లు మ‌న‌కు ఛాన్స్ ఉందా? ఇదీ.. ఇప్పుడు ఆ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల‌ను వేధిస్తున్న నాలుగు ప్ర‌శ్న‌లు. ఆ నియోజ‌క‌వ‌ర్గాలే.. తెనాలి, స‌త్తెన‌ప‌ల్లి, ప్ర‌త్తిపాడు గుంటూరు తూర్పు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తు ఉంటుంద‌ని.. …

Read More »

టీడీపీ అభ్యర్థిగా కొలికిపూడి?

తెలుగుదేశం పార్టీలో అనధికార సభ్యుడిగా కొనసాగుతున్న కొలికిపూడి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా సోషల్ మీడియా బ్యాచ్ కోడై కూస్తోంది. అందులోనూ టీడీపీ పట్టున్న, ప్రతిష్టాత్మకమైన నందిగామ సీటును కేటాయిస్తారని చెబుతున్నారు. దీనిపై పార్టీ వర్గాలు మాత్రం పెదవి విప్పడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన కొలికిపూడి.. ఇప్పుడు ఐఎఎస్ …

Read More »

ప్ర‌ధాని మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ క‌న్నుమూత

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఇక‌లేరు. ఈ రోజు తెల్ల‌వారు జామున 3 గంట‌ల 30 నిమిషాల స‌మ‌యంలో అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 28న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు గురువారం ప్రకటించారు. కానీ.. ఇంతలోనే హీరాబెన్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కాగా… గుజరాత్‌లోని మెహసానాలో ఉన్న వాద్‌నగర్ …

Read More »

కొత్త ఏడాదిలో అమిత్ షా దండయాత్ర

ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒక పక్క పొత్తుల కసరత్తు చేస్తూనే మరో పక్క సొంత బలాన్ని అంచనా వేసుకుంటోంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలను ఢిల్లీ పిలిపించుకుంటూ, సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు రూటు మార్చిందని చెబుతున్నారు… జనవరి 8న రాక కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఏపీ పర్యటనకు వస్తున్నారు. కొత్త సంవత్సరంలో …

Read More »

నరబలి తో పోల్చిన స‌జ్జ‌ల

దేనినైనా.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకోగ‌ల దిట్ట వైసీపీ కీల‌క నాయ‌కుడు.. స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ఆయ‌న మాట‌లు వేడిగా ఉండ‌క‌పోయినా..వాడిగా ఉంటాయి. ఆయ‌న చించేసుకుని మాట్లాడ‌డు. కానీ, చిరిగిపోయే మాట‌లే ఎక్కువ‌గా ఉంటాయ‌ని పార్టీ నాయ‌కులు అంటుంటారు. తాజాగా టీడీపీ కందుకూరు ఎపిసోడ్‌పై.. ఆయ‌న సుతిమెత్త‌గానే అయినా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు కావాల‌ని.. ఉద్దేశపూర్వకంగానే ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహించారని, కందుకూరులో జన సంద్రం అని ప్రచారం చేసుకోవాలనుకున్న ప్లాన్‌ బెడిసి కొట్టిందని స‌జ్జ‌ల …

Read More »

నా కుర్చీ నాదే.. వైసీపీపై ఆనం ఫైర్‌

Anam Ramanarayana Reddy

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి Anam Ramanarayana Reddy సొంత ప్ర‌భుత్వంపై మ‌రోసారి ఫైర‌య్యారు. ఎన్నిక‌లు ఇంకా జ‌ర‌గ‌కుండానే.. త‌న‌ను ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి సాగ‌నంపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న స్థానంలో మాజీ సీఎం నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి కుమారుడు రాం కుమార్‌రెడ్డి టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని ప్ర‌చారం చేయ‌డంపై మండిప‌డ్డారు. తాజాగా… సచివాలయ వాలంటీర్లు, వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో ఆయన …

Read More »

కేసీఆర్ స‌ర్‌కి నిద్ర కూడా ప‌ట్ట‌దుగా… అంత‌లా ఆకాశానికి!!

అదేంటి చిత్రంగా! అనుకుంటున్నారా? అంతే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను త‌న సొంత పార్టీ వారే పొగుడుతున్నారు. ఇక మిగిలిన వారు ఎవరూ కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌ను అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నా.. ఎవ‌రూ ప‌న్నెత్తు పొగ‌డ్త కూడా పొగ‌డడం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా.. తాను ఊహించ‌ని రీతిలో దేశ ప్ర‌థ‌మ పౌరురాలు.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. కేసీఆర్‌ను ఏకంగా.. ఆకాశం దాటించి.. అంత‌రిక్షం వ‌ర‌కు …

Read More »

అంద‌రిదీ ఒకే మాట‌.. ‘స్క్రిప్టు’ రాసిందెవ‌రు?

ఔను.. నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన మృత్యు హేల‌పై వైసీపీ నాయ‌కులు అంద‌రిదీ ఒకే మాట‌. మంత్రులు మూకుమ్మ‌డిగా చెబుతున్న మాట‌.. చేస్తున్న ఆరోప‌ణ‌.. ‘చంద్ర‌బాబుకు ప‌బ్లిసిటీ పిచ్చి ప‌ట్టింద‌ని!’- మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్‌మాత్రం ఢిల్లీలో ఉండి.. సంతాపం ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం కూడా ప్ర‌క‌టించారు. కానీ, మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు వ‌రుస పెట్టి మాత్రం చంద్ర‌బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఇది …

Read More »