ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. విశ్లేషకులు ఈ మాటే చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వరదలు-పరిహారం విషయాలు రాజకీయంగా దుమారం రేపుతున్నా.. మరోవైపు ఓడిపోయిన నాయకులు, వైసీపీ నేతలు.. తమ దారులు తాము చూసు కుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ నాయకులు జనసేనవైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండలేక చాలా మంది జంప్ చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభాను వంటి కీలక నాయకులు …
Read More »జగన్కు షర్మిల ‘ఫీవర్’!!
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎటు నుంచి ఎప్పుడు ఎలా పొంచి ఉంటారో చెప్పలేం. మన అనుకున్నవారే.. ప్రత్యర్థులుగా మారిన సందర్భాలు రాజకీయాల్లో కామనే. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వారు.. తర్వాత.. విభేదించుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ పరిస్థితిని మించిన స్థితిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు. ఆయన సొంత సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల నుంచి గతంలో ఎన్నడూ ఎదరవని …
Read More »హైడ్రా ‘కూల్చివేతల’ సీరియల్ బంద్?
రేవంత్ ప్రభుత్వానికి వాస్తవం అర్థమవుతున్నట్లుంది. ఒకేసారి రెండు ప్రక్షాళనలు చేసేందుకు ఏ పాలకుడు ఇష్టపడడు. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఒకే టైంలో రెండు భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ చెరువుల్ని సంరక్షించుకోవటం.. చెరువుల్ని చెరబట్టినోళ్ల సంగతి చూసేందుకు హైడ్రాను రంగంలోకి దించితే.. మరో వైపు మూసీ ప్రక్షాళనకు భారీ ప్రాజెక్టును టేకప్ చేశారు ఈ రెండు అంశాల్లోనూ కామన్.. ఇప్పుడు నివాసం ఉంటున్న వారు తమ …
Read More »మల్లారెడ్డి, ఒవైసీ కాలేజీలను కూడా కూల్చేస్తాం..
చెరువులు, కుంటలు, సరస్సులను ఆక్రమించి లేదా.. వాటిని పూర్తిస్థాయిలో పారనివ్వకుండా భూమిని ఆక్రమించి చేసిన నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శనివారం, ఆదివారం లక్షిత ప్రాంతాల్లో హైడ్రా దూకుడు ప్రదర్శి స్తోంది. అయితే.. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ శనివారం, ఆదివారం కొంత దూకుడు తగ్గించింది. అంతేకా దు.. చాలా రోజుల తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు …
Read More »రేవంత్కు ఏబీఎన్ రాధాకృష్ణ వార్నింగ్
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో.. హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత ఒకటి. సీఎం సూచనలతో హైడ్రా చాలా దూకుడుగా అక్రమ కట్టడాలను కూల్చి వేస్తూ దూసుకెళ్తోంది. సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన వందల కోట్ల విలువ చేసే ఎన్ కన్వెన్షన్ సహా పలు కట్టడాలను నిబంధనలను అతిక్రమించి నిర్మించారనే కారణంతో హైడ్రా కూల్చి వేసింది. ఐతే బడా బాబుల నిర్మాణాలను కూల్చి …
Read More »వారసుడికి పట్టాభిషేకం చేస్తున్న సీఎం స్టాలిన్
అధినేత ఎవరైనా తమ రాజకీయ వారసుడికి పట్టాభిషేకం చేసే విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంటారు. అందుకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారెవరైనా తమ సంతానాన్ని తమ స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా రంగం సిద్దం చేస్తుంటారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు సీఎం స్టాలిన్. తన కొడుకు ఉదయనిధి మారన్ ను తమిళనాడు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా చేసేందుకు వీలుగా ముహుర్తాన్ని …
Read More »బాబు రాకతో మళ్లీ లులూ జోష్
ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పెట్టుబడులకు జోష్ పెరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మూడు మాసాల్లోనే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే కొన్ని పాత కంపెనీలు తిరిగి రాక ప్రారంభించగా.. మరికొన్ని ప్రతిపాదనలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దుబాయ్కు చెందిన లులూ గ్రూప్ కూడా మరోసారి ఏపీపై దృష్టి పెట్టింది. తాజాగా లులూ గ్రూప్ చైర్మన్.. ఎం.ఎ.యూసుఫ్ అలీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. …
Read More »తీగ దొరికింది డొంక ప్యాలెస్లో వుంది: షర్మిల
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం డా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి.. ప్యాలెస్ దోపిడీ బట్టబయలు కావాలి.. అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా గనుల శాఖ మాజీ డైరెక్టర్(జగన్ హయాంలో పనిచేసిన) వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ పాలనా కాలంలో ఇసుక నుంచి …
Read More »జగన్ ‘మానవత్వం’పై ఎన్ని కౌంటర్లో..
“నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం” అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐతే ఇలాంటి సినిమాల్లో డైలాగులుగా పెడితే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో జగన్ లాంటి వాళ్లు వాడితే విడ్డూరంగా ఉంటుంది అంటూ నెటిజన్లు నిన్నట్నుంచి తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. జగన్ అధికారంలో ఉండగా చేసిన పనులన్నీ గుర్తు చేస్తూ.. ఆయనకు లేనిదే మానవత్వం …
Read More »స్వర్ణాంధ్రప్రదేశ్@2047.. ప్రజల సూచనలు కోరుతున్న బాబు
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో రాష్ట్ర ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర సాధనకు సూచనలు ఇవ్వమంటూ ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఆయన ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీ వద్ద సూచనలు ఉన్నాయా..? అయితే మీరు ఇప్పుడు వాటిని నేరుగా …
Read More »జగన్కు ‘సంతకం’ సమస్య.. ఓటు బ్యాంకు ఎఫెక్ట్!
తిరుమల పర్యటన విషయంలో మాజీ సీఎం జగన్కు పెద్ద సమస్యే వచ్చింది. డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలన్న నిబంధనను అమలు చేయడం ఆయనకు ప్రాణసంకటంగా మారిపోయింది. “నేను అన్యమతస్థుడిని అయినా.. తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉంది” అని డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ సంతకమే ఇప్పుడు జగన్కు ఇబ్బందిగా మారింది. దాని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా తిరుమల పర్యటననే జగన్ రద్దు చేసుకున్నారు. …
Read More »విశాఖ ఉక్కుకు అభయం.. బాబు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్!
విశాఖపట్నంలో కొన్ని దశాబ్దాల కిందట ఏర్పడిన ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియ దాదాపు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మొగ్గ తొడిగిన ఈ ప్రతిపాదనను అడ్డుకునేందుకు అప్పటి సీఎం జగన్ ఏదో మొక్కుబడిగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. దీంతో విశాఖ ఉక్కు వ్యవహారం రాజకీయ దుమారం దిశగా అడుగులు వేసింది. మరోవైపు 1350 రోజులుగా ఇక్కడి కార్మికులు ధర్నాలు, నిరసనలు చేస్తూ.. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates