తెలంగాణలో సరికొత్త వివాదం తెరమీదికి వచ్చింది. రెండేళ్ల కిందట.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న అమరరాజా బ్యాటరీల కర్మాగారం(ఇది టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందింది) విడిభాగాల తయారీ కేంద్రాన్ని అప్పట్లో తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇది ఏపీలోనూ.. తెలంగాణలోనూ.. రాజకీయంగా అప్పట్లో దుమారం రేపింది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే.. అమరరాజా కంపెనీ పొరుగురాష్ట్రానికి పోయిందని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. …
Read More »ఏపీలో చిత్రం: రెండు నెలల తర్వాత బాధ్యతలు చేపట్టిన మంత్రి
ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మిగిలిన వారంతా కలిపి 25 మంది ఉన్న విషయం తెలిసిందే. ఒక పదవి ఇంకా ఖాళీగానే ఉంది. అయితే.. ఇప్పటి వరకు అందరూ బాధ్యతలు తీసుకున్నారని భావించారు. కానీ, ఒక మంత్రి మాత్రం.. ప్రభుత్వం ఏర్పడిన రెండు మాసాల దాకా కూడా బాధ్యతలు చేపట్టలేదన్న విషయం తాజాగా …
Read More »`దువ్వాడ` వివాదంలో భారీ ట్విస్టు? మాధురి ఆత్మహత్యాయత్నం?
వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలకు కేంద్ర బిందువుగా… ఆరోపణలు ఎదుర్కొం టున్న దివ్వెల మాధురి బిగ్ ట్విస్టు ఇచ్చారా? ఆమె అనూహ్యంగా ఆసుపత్రికి చేరడం వెనుక రీజనేంటి? పైగా వైద్యాన్నినిరాకరించడం వెనుక రీజనేంటి? అనేది ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఆమెను పలువురు పలాసలోని వైద్యశాలలో చేర్పించారు. తన కారును ప్రమాదానికి గురిచేసి ఆత్మహత్యకు ప్రయత్నించార నేది సమాచారం… ఆసుపత్రిలో వైద్యం నిరాకరిస్తున్న మాధురి వీడియోలు ప్రస్తుతం హల్చల్ …
Read More »పవన్ కష్టం దువ్వాడకు ఇప్పుడు అర్థమవుతోందట
“నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకుంటే.. ఒక్కొక్క మగాడు వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏక పత్నీ వ్రతం.. మన మతం. ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో సంసారం చేయడం అన్నది మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్’’ అంటూ ఒకప్పుడు ఓ టీవీ ఛానెల్ చర్చలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కట్ చేస్తే …
Read More »అదానీ.. సెబీ చీఫ్ మీద హిండెన్ బర్గ్ తాజా బాంబ్
వీకెండ్ వేళ.. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి బాంబ్ పేల్చటం.. శనివారం సోషల్ మీడియాలో తాము కీలక విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే. మొదట వివరాల్ని వెల్లడించకుండా.. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని చెప్పిన ఆ సంస్థ ఆ తర్వాత ఆ వివరాల్ని వెల్లడించింది. తాజాగా పేల్చిన బాంబ్.. అదానీ మీదా.. సెబీ ఛీప్ మీదా కావటం షాకింగ్ గా మారింది. సాక్ష్యాత్తు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్ …
Read More »కాంగ్రెస్ లో ఫ్రెండ్స్ ఆప్ కాంగ్రెస్ యూఎస్ఎ కలకలం !
రాజకీయాల్లో అధికార పార్టీ మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద అధికార పార్టీ ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ అధికార పార్టీ మీద ఆ పార్టీకి చెందిన అభిమానులే ఆరోపణలు చేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ? తాజాగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా వివిధ కంపెనీలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల మీద ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఎ నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన బహిరంగలేఖ కలకలం రేపుతున్నది. …
Read More »జగన్కు… ఆళ్ల నాని- ఒక పాఠం…!
వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో అయినా..ఉద్యోగాల్లో అయినా.. ఇవన్నీ కామనే. తమకు అవకాశం ఉంటే ఉంటారు. లేకపోతే వెళ్తారు. కానీ, ఆళ్ల విషయానికి వస్తే.. ఇతర నేతలకు.. ఈయనకు తేడా ఉంది. ప్రధానంగా మూడు కీలక లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి విధేయత, రెండు వివాదాలకు దూరం, మూడు జగన్పై అపార నమ్మకం, విశ్వాసం, నాలుగు చిన్న వయసు. ఇన్ని …
Read More »జనసేన అష్టదిగ్భంధం.. పవన్ నిర్ణయం ..!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల దూకుడుకు ఆయన అష్టదిగ్భంధం వేశారు. సహజంగానే పార్టీ అధికారంలోకి వచ్చాక.. అది ఏ పార్టీ అయినా.. కార్యకర్తలు, నాయకుల దూకుడు ఎక్కువగానే ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే నాలుగేళ్లలో కనిపిస్తుంది. రాక రాక వచ్చిన అధికారం, పదేళ్లకుపైగా నిరీక్షణం వంటి కారణాల నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్ …
Read More »సిస్టమాటిక్ గ్యాప్లో చంద్రబాబు!
సీఎం చంద్రబాబు.. ఒక వ్యవస్థీ కృత గ్యాప్లో పడిపోయినట్టు తెలుస్తోంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే సాంకేతికత ఆయన సొంతం. అయితే.. ఇది నిన్నమాట. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఓ వ్యవహారం.. ఆయనకు.. ప్రజలకే కాదు.. ప్రముఖలకు మధ్య గ్యాప్ పెంచేస్తున్నవారు ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రముఖ ఉద్యమ కారిణి, ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణణ్ చేసిన ట్వీట్ చూస్తే.. చంద్రబాబు వరకు కొన్ని విషయాలు చేరడం లేదన్న అనుమానాలు …
Read More »హామీలేమయ్యాయి? :బాబుకు జగన్ ప్రశ్న.. టీడీపీ కౌంటర్ ఇదే!
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చెబుతున్నారని.. ఇప్పుడు రాష్ట్రం బాధ్యతను ప్రజలకే వదిలేస్తున్నానని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తల్లికి వందనం, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంటు నిధుల ఊసే లేకుండా పోయిందని …
Read More »జగన్కు రాజకీయాల్లో ఓనమాలు తెలియవు: గోనె
వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నాయకుడు జగన్ను కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తగులుకున్నారు. ఎన్నికల సమయంలోనూ జగన్పై విరుచుకుపడ్డ ఆయన ఇప్పుడు మరోసారి మాటల తూటాలు పేల్చారు. జగన్కు రాజకీయాల్లో ఓనమాలు తెలియవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరడమేంటని.. దీనిని బట్టే ఆయన రాజకీయ పరిపక్వతను అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ మాటలు విని జనం …
Read More »టీడీపీ దూకుడును అందుకునేలా బీజేపీ వ్యూహం!
టీడీపీ బాటలోనే బీజేపీనే నడుస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కూటమి పార్టీలు.. సర్కారు ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ దూకుడుగా ఉంది. ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువైంది. వారంలో ఐదు రోజుల పాటు పార్టీకార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా సామాన్యులకు పార్టీ, ప్రభుత్వం రెండూ కూడా చేరువయ్యాయి. దీనివల్ల ఇటు పార్టీకి, అటు ప్రభుత్వంలో టీడీపీకి కూడా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates