Political News

మూడు పెళ్లిళ్లు.. మూడు పొత్తులు.. పవన్ కు గ్రంధి పంచ్ లు!

వెనుకా ముందు చూసుకోకుండా తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతలు కొందరు ఉంటారు. ఆ కోవలోకి వస్తారు ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఆయన మీడియా ముందుకు వస్తే చాలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ ఆయన మరోసారి నోరు విప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై సంచలన విజయాన్ని నమోదు చేసిన …

Read More »

పాతికేళ్ల అధిక్యానికి తెర.. టీడీపీ కంచుకోట బద్దలు

ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా.. ఏపీలో ఎక్కడైనా సరే ఫ్యాన్ గాలి వీసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై అదే పనిగా సాగిన విష ప్రచారాన్ని ప్రజలు నమ్మనట్లుగా కనిపిస్తోంది. తాజాగా వెల్లడైన మున్సిపల్ పోల్స్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా టీడీపీ దారుణంగా దెబ్బ తింటే.. అధికార వైసీపీ మాత్రం విజయ దుందుబి మోగించింది. దీంతో.. పలు కొత్త రికార్డులు నమోదైన …

Read More »

హైదరాబాద్ కు తాడిపత్రి పాలిట్రిక్స్.. అర్థరాత్రి సీక్రెట్ గా తరలింపు

ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలన్ని ఒక ఎత్తు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన ఎన్నిక ఒక ఎత్తుగా చెప్పాలి. ఎందుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయ గుర్తింపు ఉన్న జేసీ కుటుంబానికి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నిక.. వారు కోరుకున్నట్లే సానుకూల ఫలితం వచ్చినా.. అధిక్యత త్రుటితో తప్పింది. దీంతో.. ఎవరైతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారో వారే తాడిపత్రి మున్సిపాల్టీని సొంతం చేసుకునే వీలుంది. దీంతో.. స్పందించిన జేసీ సోదరులు …

Read More »

పాపం…ఫిరాయింపుల గతేమవుతుందో ?

పశ్చిమబెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ పై చర్చ పెరిగిపోతోంది. అదేమిటంటే ఫిరాయింపుల భవిష్యత్తుపై. నిజానికి ఉన్నదన్నుట్లుగా మమతాబెనర్జీనీ ఎదుర్కొనే సత్తా బీజేపీ అగ్రనేతలకు లేదనే చెప్పాలి. మమతను ఎదుర్కొనే శక్తి లేదు కాబట్టే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయింపులను బీజేపీ అగ్రనేతలు ప్రోత్సహించారు. 24 గంటలూ రాజకీయాల్లో విలువలు, నిజాయితి గురించి గొంతెత్తి మాట్లాడే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆమోదంతోనే ఫిరాయింపులు జరిగిన విషయం …

Read More »

బీజేపీకి మొదలైన టెన్షన్

మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమ ప్రభావం బీజేపీపై మొదలైంది. పశ్చిమబెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రైతుసంఘాలు కమలంపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. ఏ పార్టీకైనా ఓట్లేయండి కానీ బీజేపీకి మాత్రం వేయవద్దంటు రైతుఉద్యమ సంఘం ఆధ్వర్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా కీలక నేత యోగేంద్ర యాదవ్ ప్రచారం మొదలుపెట్టారు. యోగేంద్ర ఆధ్వర్యంలో బెంగాల్లోని రైతుసంఘాలు బీజేపీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున మొదలుపెట్టింది. బెంగాల్ ఎన్నికల్లో …

Read More »

పవన్ కు ఇంత వ్యూహం ఉందా ! ?

ఇదే అర్ధం కావటంలేదు జనసేన అభిమానులకు. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో మిత్రపక్షమైన బీజేపీ తరపున అభ్యర్ధి పోటీ చేస్తున్న విషయం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని స్వయంగా పవనే ప్రకటించటంతో ఇక అయోమయానికి చోటు లేకపోయింది. కానీ ఇంతకాలం ఉపఎన్నికలో తమ పార్టీనే పోటీ చేయాలని పట్టుబట్టిన పవన్ చివరకి వచ్చేసరికి ఎందుకని పోటీ అవకాశం మిత్రపక్షానికి వదిలేశారు ? నిజానికి తిరుపతి లోక్ సభ ఎన్నికలో …

Read More »

నియోజ‌క‌వ‌ర్గంలో ఆ ఎంపీ ఎక్క‌డ‌?.. ప్ర‌జ‌లు ల‌బోదిబో!!

కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మ‌చిలీప‌ట్నం. ఇక్క‌డ నుంచి 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ విజ‌యం సాధించారు. పార్ల‌మెంటులో మ‌చిలీప‌ట్నం పోర్టు స‌హా అనేక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించి.. ప‌రిష్క‌రించేందుకు కృషి చేశారు. అయితే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ స‌హా.. అధికార టీడీపీకి ప్ర‌జ‌లు దూరం కావ‌డంతో కొన‌క‌ళ్ల నారాయ‌ణ ఓడిపోయారు. ఇక‌, ఇక్క‌డ నుంచి బాల శౌరి.. వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. అయితే.. …

Read More »

వైసీపీలో అంద‌రూ ఎంపీల‌కు త‌ల‌నొప్పే ?

వైసీపీలో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు ఉన్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ ఎంపీలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌ల నుంచి తీవ్ర అస‌మ్మ‌తి ఎదుర్కొంటున్నారు. పార్టీలో కీల‌కంగా చ‌క్రం తిప్పే ఎంపీల‌కు సైతం ఈ అస‌మ్మ‌తి త‌ప్ప‌డం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ను విజ‌యసాయి, మంత్రి అవంతి, జిల్లా ఎమ్మెల్యేలు పూర్తిగా డ‌మ్మీల‌ను చేసేశార‌న్న చ‌ర్చ ఉంది. ఆయ‌న కూడా …

Read More »

విజ‌య‌వాడ తేడా వ‌స్తే.. కేశినేని మ‌రింత ఒంట‌రేనా?

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పేరుకే టీడీపీ నేత అయినా.. కొన్నాళ్లుగా ఆయ‌న పార్టీలో ఒంట‌రిగానే ఉంటున్నారు. ఎవ‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఆయ‌న‌ను చుట్టుముడుతున్నాయి. అదే స‌మయంలో ఇత‌ర నేత‌లు కూడా ఆయ‌నను క‌లుపుకొని పోయేందుకు ముందుకు రావ‌డం లేదు. ప్ర‌ధానంగా ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా.. స‌హా తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ వంటివారు కూడా కేశినేనికి …

Read More »

తుమ్మ‌ల రాజ‌కీయం ఎటు? ప‌రిణామాలు మార‌తాయా?

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. ఒక‌ప్పుడు ఖ‌మ్మం జిల్లాను శాసించిన ఆయ‌న ఇప్పుడు ఎటూ కాకుండా పోతున్నార‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎక్కువ‌గా వినిపిస్తోంది. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా క‌మ్మ సామాజిక వ‌ర్గంలో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయ‌న అనంత‌ర కాలంలో తెలంగాణ ఉద్య‌మ పార్టీ టీఆర్ఎస్‌లోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే ఉప ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి విజ‌యం సాధించి.. మంత్రి ప‌ద‌విని సైతం సొంతం చేసుకున్నారు. అయితే.. టీఆర్ఎస్‌లో త‌న‌కంటూ.. …

Read More »

పవన్-షర్మిల మధ్యే పోటీనా ?

వినటానికి విచిత్రంగా ఉన్న రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారమైతే ఇదే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చాలా సంవత్సరాలే అయినా ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా క్రియాశీలం కాలేదు. రాష్ట్రకమిటిని కూడా పూర్తిస్ధాయిలో నియమించకపోవటమే ఇందుకు నిదర్శనం. ఏదో ఓ ఐదుగురితో సమన్వయ కమిటి అనేదాన్ని వేసేసి రోజులు నెట్టుకొచ్చేస్తున్నారు. ఇక షర్మిల విషయానికి వస్తే తొందరలోనే తెలంగాణాలో పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ ప్రకటించటంతో పాటే ముందుగా రాష్ట్ర …

Read More »

విడ‌ద‌ల ర‌జ‌నీ మార్క్ ట్విస్ట్‌… మ‌రిదికి మునిసిప‌ల్ చైర్మ‌న్ ?

చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ నుంచి… వైసీపీలోకి రావడం.. రాజ‌కీయ గురువు పుల్లారావుపై గెల‌వ‌డం.. ఆ త‌ర్వాత సొంత పార్టీ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌తో వార్ ఇవ‌న్నీ ఆమెను రాజ‌కీయంగా రాష్ట్ర స్థాయిలో హైలెట్ చేశాయి. అన్నింటికి మించి ఆమె సోష‌ల్ మీడియా ప్ర‌చారంతో ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉన్నారు. ఈ వ‌రుస సంచ‌ల‌నాల ప‌రంప‌ర‌లో …

Read More »