ఆ దేశంలో వ్యాక్సిన్ రెడీ.. ఈ దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు.. ఫలానా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్తో సత్ఫలితాలు.. అని వార్తల గురించి మాట్లాడుకోవడానికే సరిపోతోంది. మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి.. ప్రభుత్వం చేతికి వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయి.. జనాలకు వాటిని ఎప్పుడు వేస్తారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఆగస్టు 15కే వ్యాక్సిన్ అంటూ ఊరించిన నేతలు, ఫార్మా కంపెనీల ప్రతినిధుల మాటలు నీటి …
Read More »బందరు పోర్టు నిర్మాణానికి 36 నెలలే డెడై లైన్ ?
సంవత్సరాల తరబడి వివాదాస్పదంగా ఉండిపోయిన మచిలీపట్నం పోర్టు నిర్మాణం, అభివృద్ది పనులు ఇప్పటికైనా మొదలవుతుందా అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2009 లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం, అభివృద్ధి కాంట్రాక్టు బాధ్యతను నవయుగ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చినా వివిధ కారణాల వల్ల పనులు మొదలుకాలేదు. చివరకు 2014లో జరిగిన రాష్ట్ర విభజన కారణంగా అసలు ప్రాజెక్టు పనులే అటకెక్కాయి. దాన్ని ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుమ్ముదులిపి ప్రాజెక్టును …
Read More »అమరావతి ప్రత్యేక జిల్లా.. వైసీపీ వ్యూహమేంటి?
ఏపీ రాజధాని అమరావతి.. ప్రత్యేక జిల్లా కానుందా? దీనికి సంబంధించిన వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? అంటే.. ఔననే సంకేతాలే వస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజాసంకల్ప యాత్రలోనే ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. దీనికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఇటీవల కాలంలో తాను తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పద మవుతుండడం, ప్రజల్లో గత ఏడాది ఉన్న రేంజ్లో జగన్పై సానుకూల లోపించిన నేపథ్యంలో …
Read More »రోడ్డెక్కిన రాజుల వివాదం
విజయనగరంలో పూసపాటి రాజుల వివాదం రోడ్డెక్కింది. ఇంతకాలం కోర్టుల్లోను, ట్విట్టర్ వేదికలకు మాత్రమే పరిమితమైన అశోక్ గజపతిరాజు-సంచైత గజపతి రాజు వివాదం చివరకు రోడ్డున పడింది. ‘సేవ్ మాన్సాస్ ట్రస్ట్’ పేరుతో అశోక్ సంచైతకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆందోళనలు మొదలుపెట్టారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా సంచైత బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రస్టు ప్రిస్టేజ్ అంతా రోడ్డుపాలైనట్లు అశోక్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా సంచైతపై కోర్టులో …
Read More »దూకుడు తెచ్చిన తంటా.. ఆ మంత్రి తలపట్టుకున్నారే!
రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటే అంత గుర్తింపు నిజమే! కానీ, ఇది అందరికీ వర్తించే సూత్రం అవుతుందా? అందరి విషయంలోనూ దూకుడు మంచిదేనా? అంటే.. వైసీపీ నాయకుడు,మంత్రి కురసాల కన్నబాబు విషయంలో మాత్రం కాదనే అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా కాకినాడలో ఈ విషయం హాట్ టాపిక్గా మారడం గమనార్హం. గత కొన్నాళ్లుగా.. మంత్రికి ఇక్కడ సహాయ నిరాకరణ ఎదురవుతోందనే వార్తలు వస్తున్నాయి. స్థానిక అధికారులు కూడా సహకరించడం లేదనే …
Read More »కోవిడ్ వ్యాక్సిన్.. ఎట్టకేలకు ఒక తీపికబురు
ఇదిగో వ్యాక్సిన్.. అదిగో వ్యాక్సిన్ అనుకుంటూనే ఉన్నాం. నెలలు నెలలు గడిచిపోతున్నాయి. కానీ ఎంతకీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావట్లేదు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లకు ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయని.. అన్ని రకాల అనుమతులూ వచ్చేశాయని.. సామాన్య జనం మీద కూడా ప్రయోగించేశారని వార్తలు వచ్చాయి కానీ.. అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆమోదం పొందే దిశగా ఏ వ్యాక్సిన్ అడుగులేసినట్లు కనిపించలేదు. ప్రఖ్యాత కంపెనీలేవీ వ్యాక్సిన్ విషయంలో అన్ని దశలనూ దాటి ముందంజ …
Read More »గుడ్డి వ్యతిరేకత టీడీపీకి మంచిదేనా ?
రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా కసరత్తు చేయమని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ ఉన్నతస్ధాయి కమిటిని ప్రభుత్వం నియమించింది. కమిటి దాదాపు మూడు నెలలు జిల్లాల కలెక్టర్లు, రెవిన్యు అధికారులతో …
Read More »ఖమ్మం పాలిటిక్స్లో నాడు తుమ్మల.. నేడు పువ్వాడ.. సేమ్ సీన్!
తెలంగాణ-ఏపీ సరిహద్దు జిల్లాగా ఉన్న ఖమ్మం రాజకీయాల్లో నేతలు మారారు. కానీ, రాజకీయ వైఖరులు మాత్రం మారలేదనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు హవా చలాయించారు. ఆయన ఎవరినీ ఎదగనిచ్చేవారు కాదనే టాక్ ఉంది. అంతేకాదు.. ఆయన అనుమతి లేకుండా.. అధికారులు పూచిక పుల్లను కూడా కదలనిచ్చేవారు కాదు. దీంతో ఏ పని కావాలన్నా.. ఎంతటి వారైనా.. తుమ్మల సార్ అనుమతి …
Read More »కేసీఆర్ హవాకు దుబ్బాక బ్రేకులు వేస్తుందా?
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఇటీవల ముగిసిన ఉప ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదు. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితంలో మాత్రం బీజేపీకి అవకాశం ఉందనే సంకేతాలు వచ్చాయి. మరికొన్ని సంస్థలు టీఆర్ఎస్ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అంటున్నాయి. ఒకవేళ.. మొదటి అంచనానే నిజమైతే.. అంటే.. దుబ్బాకలో బీజేపీనే గెలుపు గుర్రం ఎక్కితే.. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దూకుడుకు బ్రేకులు పడతాయనే వ్యాఖ్యలు ఓ …
Read More »తాళ్ళపాక దంపతుల రాజీనామా ..టీడీపీలో కలకలం
తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ పెట్టినప్పటి నుండి యాక్టివ్ గా పనిచేస్తున్న తాళ్ళపాక రమేష్ రెడ్డి దంపతులు రాజీనామా చేయటం పార్టీలో సంచలనంగా మారింది. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని కొత్తగా వచ్చిన వారిని కూడా చంద్రబాబునాయుడు అందలం ఎక్కిస్తున్నాడన్న కోపంతోనే తాము రాజీనామా చేసినట్లు తాళ్ళపాక రమేష్ రెడ్డి చెప్పటం గమనార్హం. గతంలో ఎన్టీయార్ ను బూతులు తిట్టిన వారిని, ఎన్టీయార్ దిష్టిబొమ్మలను దహనం చేసిన వారికి …
Read More »వైసీపీ సోషల్ మీడియా టీంలో అసంతృప్తా ?
జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు 2014 నుండి మొన్నటి ఎన్నికల వరకు అలుపెరగకుండా గట్టిగా కృషి చేస్తున్న సోషల్ మీడియా విభాగాన్ని పెద్దలు నిర్లక్ష్యం చేస్తున్నారనే అసంతృప్తి మొదలైంది. నిజానికి 2014లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించటంలో పార్టీ సోషల్ మీడియా విభాగానిది చాలా కీలక పాత్రనటంలో సందేహం లేదు. అయితే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకనో టీడీపీ పెద్దలు సోషల్ మీడియా విభాగాన్ని …
Read More »తమ్మినేని కోసం బలయ్యేదెవరు? వైసీపీలో చర్చ!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్కు మంత్రి పదవి ఇవ్వాల్సిందే-ఇదీ కొన్నాళ్లుగా వైసీపీ నేతల్లో వినిపిస్తున్న మాట. దీనికి కారణం.. ఆయన రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిలో ఉండి కూడా రాజకీయాల ను మాట్లాడలేకుండా ఉండడమే! గతంలోనూ చంద్రబాబు హయాంలో మంత్రి పదవిని అలంకరించిన ఆయన.. గత ఏడాది ఎన్నికల్లో చాలా ఏళ్ల విరామం తర్వాత నెగ్గిన నేపథ్యంలో బీసీ కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, జగన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates