Political News

మంత్రికి మద్దతు కరువైందా ? ఒంటరైపోయినట్లేనా ?

కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ విషయమే పార్టీలో ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందుతునిగా ఉన్న కార్తీక్ నుండి కోటి రూపాయల బెంజి కారును మంత్రి కొడుకు బహుమతిగా తీసుకున్నాడనే ఆరోపణలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రిపై చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. తన ఆరోపణలకు మద్దతుగా అయ్యన్న నాలుగు ఫొటోలను కూడా జతచేయటంతో …

Read More »

చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి..ఉత్తరాంధ్ర నేతల్లో చర్చ

వైజాగ్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా పశ్చిమ ఎంఎల్ఏ గణబాబును ఎంపిక చేసి చంద్రబాబునాయుడు తప్పు చేశారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. గణబాబును అధ్యక్షునిగా నియమించ వద్దని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదట. ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పేమిటి ? ఏమిటంటే గణబాబు టిడిపిని వదిలేసి వైసిపిలో చేరటం ఖాయమని ఎప్పటి నుండో పార్టీలో చర్చ జరుగుతోంది. కాకపోతే వైసిపి నుండి గ్రీన్ …

Read More »

పోలిట్ బ్యూరోకి గల్లా రాజీనామా..

సీనియర్ నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టిడిపి పొలిటో బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం రాజీనామా చేసిన గల్లా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆమె చాలా కాలంగా చంద్రబాబునాయుడు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆమె అటు చంద్రగిరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకావటం లేదు. ఇటు చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఏదో రూపంలో తన …

Read More »

రాజుల కోట‌లో కాపు మంత్రాంగం.. సీతారామ‌ల‌క్ష్మి వ్యూహాలు సాగేనా?

తాజాగా రాష్ట్ర టీడీపీలో చేసిన ప్ర‌యోగంపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీ దెబ్బ‌తిన్న తీరు చూస్తే.. గ‌డిచిన రెండు ద‌శాబ్దాల్లో పార్టీ ఇలా ఇబ్బంది ప‌డిన ప‌రిస్థితి క‌నిపించ‌దు. ఈ నేప‌థ్యంలోనే పార్టీకి అత్య‌వ‌స‌రంగా కాయ‌క‌ల్ప చికిత్స అవ‌స‌రమ‌ని అంద‌రు నేత‌లు అభిప్రాయ‌పడ్డారు. ప్ర‌జ‌ల్లో పార్టీ ఓడిపోవ‌డం ఒక్క‌టే కాదు.. పార్టీలోనూ నైరాశ్యం ఏర్ప‌డింది. దీనిని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తేనే త‌ప్ప‌.. పార్టీ ప‌రుగులు …

Read More »

మసీదు ఎలా కూలిపోయింది ? సీబీఐ దర్యాప్తు ఇంత అద్వాన్నమా ?

దాదాపు 28 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటనపై తాజాగా సీబీపీ ప్రత్యేక కోర్టు ఇఛ్చిన తీర్పు తర్వాత అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లక్నోలోని ప్రత్యేక కోర్టు మసీదు కూల్చివేత ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులపై సీబీఐ ఆధారాలు సమర్పించలేదని చెప్పటం సంచలనంగా మారింది. ఓ వ్యూహం ప్రకారం మసీదును కూల్చివేసినట్లు కానీ, కూల్చివేతలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై సరైన సాక్ష్యాలు లేవని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. పైగా …

Read More »

కుమారుడి కోస‌మా? పార్టీ కోస‌మా? కొన‌క‌ళ్ల కాళ్ల‌కు బంధం!

ప‌ద‌వి.. ద‌క్క‌డ‌మే మ‌హాభాగ్యం అనుకునే రోజులు ఇవి! లెక్క‌కు మిక్కిలి నేత‌లు.. సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌లు.. వెర‌సి ఏ పార్టీ అయినా.. ప్రభుత్వంలో అయినా.. నాయ‌కుల‌కు ప‌ద‌వులు ద‌క్క‌డం అంటే.. కృష్ణాష్ట‌మి నాడు ఉట్టి కొట్టినంత ప‌నిగా మారింది. అయితే, ద‌క్కిన ప‌ద‌విలో ఎంత మంది నాయ‌కులు హ్యాపీగా ప‌నిచేస్తున్నారు? ఎంద‌రు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు? అంటే.. ప్ర‌శ్నార్థ‌క‌మే. ఎందుకంటే.. పార్టీల‌కు, పార్టీల అధినేత‌ల‌కు కొన్ని టార్గెట్లు ఉంటే.. నాయ‌కుల‌కు …

Read More »

కోదండం మాష్టారికి కాంగ్రెస్ మద్దతు.. గేమ్ ప్లాన్ ఏమిటి?

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన టీజేఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కోదండం మాష్టారు తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని భావించటం తెలిసిందే. ఇందులో భాగంగా చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అన్ని పార్టీలతోనూ.. ప్రజాసంఘాల మద్దతును కోరుతున్న సంగతి తెలిసిందే. చివరకు జాతీయ స్థాయిలో తాను వ్యతిరేకించే బీజేపీ మద్దతును కూడా ఆయన కోరటం అందరిని ఆశ్చర్యానికి గురి …

Read More »

వివాదాస్పదమవుతున్న సంచైత నిర్ణయం

మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు తాజా నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ట్రస్టు ఆధ్వరంలో గడచిన 150 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తున్న ఎంఆర్ ఎయిడెడ్ కాలేజిని అన్ ఎయిడెడ్ కాలేజీగా మార్చాలంటూ ట్రస్టు నుండి ప్రభుత్వానికి అభ్యర్ధన అందటమే వివాదానికి కారణమైంది. విజయనగరం రాజులు స్వయంగా నిర్మించి నిర్వహించిన ఈ కాలేజికి మంచిపేరుంది. దీని నిర్వహణంతా ట్రస్టే చూసుకుంటున్నా సిబ్బంది జీతబత్యాలు మాత్రమే ప్రభుత్వమే చూసుకుంటోంది. అంటే సుమారు …

Read More »

ఏబీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత

చాలా మీడియా సంస్థలు పెద్దగా కవర్ చేయని ముఖ్యమైన వార్తల్లో ఇదొకటిగా చెప్పాలి. కీలకమైన ఒక తీర్పునకు సంబంధించిన వార్తలు మీడియా సంస్థల్లో పెద్దగా కనిపించకపోవటం గమనార్హం. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్సు చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు మీద ఆరోపణల సంగతి తెలిసిందే. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడటం.. అందుకు సంబంధించిన ఆరోపణలతో ఆయన సస్పెండ్ కావటం తెలిసిందే. సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆయనపై వచ్చిన …

Read More »

పవన్ ఇలా చేస్తాడా… చెంపలేసుకున్న నారాయణ

సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెంపలేసుకున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నందుకట. నిజానికి రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ఏదో ఓ స్దాయిలో రెండుపార్టీలు లాభపడతాయి. కానీ విచిత్రమేమిటో రెండుపార్టీలు ఘోరంగా నష్టపోయాయి. అప్పటికే సిపిఐకి ఉన్నదేమీ లేదులేండి కొత్తగా నష్టపోవటానికి. కానీ ఎన్నికలైపోయిన ఏడాదిన్నర తర్వాత పొత్తు పెట్టుకుని తప్పు చేశామని ఇపుడు నారాయణ చెంపలేసుకోవటం ఏమిటో అర్ధం …

Read More »

బాబు ఎత్తు.. జ‌గ‌న్ పై ఎత్తు..!

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఎవ‌రి సొంత‌మూ కాదు. తాడి త‌న్నేవాడికి త‌ల‌త‌న్నేవాడు ఉంటాడ‌న్న‌ట్టుగా రాజ‌కీయాల్లోనూ ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌కు పై ఎత్తులు వేసేందుకు నాయ‌కులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రాష్ట్రంలోని పార్ల‌మెంటు నియోజ‌క‌వర్గాల‌ను కేంద్రంగా చేసుకుని ఇంచార్జులను నియ‌మించింది. త‌ద్వారా.. పార్టీపై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోయేందుకు చంద్ర‌బాబు భారీగానే క‌స‌ర‌త్తు చేశారు. ఈ వ్యూహం ఫ‌లిస్తే.. టీడీపీకి 2014 నాటి క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌నేది ఆ …

Read More »

కరోనా మరణాలను భారత్ దాచిపెడుతోంది: ట్రంప్

కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యం వహించారని, అందుకే లక్షలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కరోనా వైరస్‌ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని…కరోనాతో జీవితాలు ముగిసిపోలేదని, ఆర్థికాభివృద్ధి ఆగిపోలేదని….కరోనా ఓ ఫ్లూ వంటిదని ట్రంప్ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని విపక్షాలు విమర్శించాయి. కరోనాకు భయపడి దేశం మొత్తం లాక్ డౌన్ …

Read More »