మరో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో హైదరాబాద్ లోని బాబు నివాసానికి అధికారులు చేరుకున్నారు. వాహనాల్లో వెళ్లిన వారు.. చంద్రబాబును కలవాలని చెప్పారు. అందుకు బాబు భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లుగా బాబుకు సమాచారం ఇవ్వటం.. …
Read More »చంద్రబాబుకు సమయం వచ్చిందా ?
ఎంతసేపు రౌడీయిజంతో గెలిచారు, ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుని గెలిచారు అనే అరిగిపోయిన రికార్డు వేసినందు వల్ల ఉపయోగం ఉండదని చంద్రబాబునాయుడు గ్రహించాలి. పంచాయితి ఎన్నికల్లో మద్దతుదారులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని నిజాయితిగా విశ్లేషించుకోవాలి. పార్టీ తప్పులను ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అప్పుడే తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోగలరు. అలా కాకుండా ఎంతసేపు అధికారాన్ని ఉపయోగించుకుని వైసీపీ గెలిచిందని చెప్పటం వల్ల ఉపయోగం ఉండదని …
Read More »యనమల ఇలాకాలో ఘోర పరాజయం..
టీడీపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్రను సొంతం చేసుకున్న నాయకుడు, చంద్రబాబు తర్వాత.. నెంబర్ 2గా వ్యవహరించే నేత.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వ్యూహాలు.. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆయనను మించిన నాయకుడు లేరని ఒక ప్పుడు టాక్. అయితే.. ఆయన కొన్నేళ్లుగా వైట్ ఎలిఫెంట్గా మారిపోయారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం నుంచి అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీ లోకి వచ్చిన యనమల.. …
Read More »విశాఖలో సీన్ రివర్స్.. కారకులెవరు?
అన్ని అనుకున్నట్లు జరిగితే.. విశాఖపట్నం ఏపీకి కాబోయే రాజధాని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కునగరాన్ని ఏపీ రాజధానిగా చేయాలని బలంగా కోరుకోవటం తెలిసిందే. ఆందోళనలు.. నిరసనలు.. విమర్శల్ని లైట్ తీసుకొని మరీ.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఫలితాలు ఆయన రాజధాని కలను నెరవేర్చేలా చేయటమే కాదు.. విశాఖ వైసీపీ నేతల లోగుట్టును బయటపడేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వెల్లడైన …
Read More »బీజేపీకి సీన్ అర్ధమైపోయిందా ?
తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సీన్ ఏమిటో అర్ధమైపోయినట్లుంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో 2123 వార్డులున్నాయి. వీటిల్లో 490 వార్డులు ఏకగ్రీవమైపోయాయి. వీటిల్లో అత్యధికం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన 1632 వార్డుల్లో 1269 చోట్ల అధికార వైసీపీనే గెలిచింది. వైసీపీ తిరుగుబాటు అభ్యర్ధులు 45 వార్డుల్లో గెలిచారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ 265 వార్డుల్లో గెలిచింది. మరో 2 చోట్ల టీడీపీ …
Read More »కమలంతో తెగతెంపుల దిశగా పవన్… మళ్లీ బాబుతో దోస్తానా ?
కమలంతో పవన్ ప్రయాణం ముగిసిందా ? బీజేపీని పవన్ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారా ? ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా పవన్ తెలంగాణ బీజేపీపై విరుచుకు పడడంతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధానమంత్రి పీవీ కుమార్తె సురభివాణికి మద్దతు ప్రకటించారు. ఎన్నికల రోజే పవన్ బీజేపీకి షాక్ ఇవ్వడంతో ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సో దీనిని బట్టి తెలంగాణలో బీజేపీతో పవన్ దాదాపు …
Read More »ఏబీఎన్, టీవీ5లకు ధన్యవాదాలు-కొడాలి నాని
మన టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో ఏవి ఏ పార్టీలకు అనుకూలమో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని ఛానెళ్లు, పత్రికలు నేరుగా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తాయి. కొన్నేమో పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా నిలుస్తాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే అభిప్రాయం జనాల్లో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆ ఛానెళ్ల మీద ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. వాటిపై తీవ్ర …
Read More »వైరల్ గా నాటి జగన్ మాట
ఎన్నికల ఫలితాలు ప్రజల నాడిని చెప్పేవన్నది పాక్షిక సత్యం మాత్రమే. ఒక ఎన్నికలో ఒక పార్టీ గెలుపు ఓటముల్ని ప్రజలు నిర్ణయించేది నిజమే అయినా.. వాస్తవం మరోలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. నిజం కొన్ని సార్లు మనకు నచ్చకపోవచ్చు అయినా నమ్మాల్సిందే. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జగన్ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయాన్నిసాధించింది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఆ విజయాన్ని తక్కువ చేసి చూపటం తప్పే, అతిశయోక్తులు చేసి చెప్పడమూ …
Read More »తాడిపత్రి, మైదుకూరు కూడా వైసీపీకే.. ఎలాగంటే..!
రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి.. జోరుమీదున్న వైసీపీకి పంటికింద రాయిలా.. కంట్లో నలుసులా.. రెండు మునిసిపాలిటీలు మారాయి. వీటిలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కడప జిల్లాలోని మైదుకూరు. ఈ రెండు చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు మెజారిటీ సాధించారు. ఈ క్రమంలో ఇక్కడ వైసీపీ ప్రస్తుతం పరాజయం పాలైంది. అయితే.. ఇక్కడ కూడా.. తమ ఖతా తెరుస్తామని.. వీటిని కూడా తమ బుట్టలో వేసుకుంటామని.. వైసీపీ …
Read More »పుర పోరు దెబ్బతో బీజేపీ-టీడీపీ-జనసేన కోమాలోకేనా..!
ఏపీలో తాజాగా వచ్చిన పురపోరు ఫలితం.. అధికార వైసీపీకి అనుకూలంగా ఉంది. సాధారణ ఎన్నికల ఫలితాల్లాగానే వార్ వన్సైడ్ చేసేసింది. అందునా.. వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అన్ని ప్రధాన పక్షాలు కూడా భారీ ఎత్తున ఆయనపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అవినీతి పెరిగిపోయిందని.. ఇసుక, మట్టి కుంభకోణాలు చేస్తున్నారని, కేంద్రంలోని మోడీ సర్కారుకు అమ్ముడు పోయారని.. ఇలా అనేక కోణాల్లో ఇటు టీడీపీ, అటు …
Read More »రాష్ట్రంలో ఎక్కడ ఓడినా ఫర్లేదు.. కానీ..
స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం వెనుక ఏం జరిగింది ? ప్రజలు సంపూర్ణంగా.. టీడీపీని తిరస్కరించారా ? లేక.. పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు.. ఆధిపత్య జోరు.. అధినేతపై అలకలు.. వంటివి బాగా పనిచేశాయా ? అనే విషయాలపై ఇప్పుడు పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో ఎక్కడ పోయినా.. ఫర్లేదు.. ఈ మూడు మాత్రం పార్టీకి ప్రాణప్రదం.. అన్న చంద్రబాబుకు ఆ మూడు కూడా దక్కక …
Read More »మూడు రాజధానులకు అంగీకరించినట్లేనా ?
తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మూడు రాజధానులకు ఆమోదం తెలిపినట్లే భావించాలి. విజయవాడ, గుంటూరులో ప్రచారం చేసినపుడు అమరావతి సెంటిమెంటును కాపాడుకోవాలంటే టీడీపీకే ఓట్లేయాలని చంద్రబాబునాయుడు జనాలను ఆదేశించారు. మామూలుగా అయితే ఓట్లేయండని అభ్యర్ధిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం విచిత్రంగా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో జనాలను బాగా తిట్టిపోశారు. టీడీపీకి ఎందుకు ఓట్లేయరో చెప్పాలన్నారు. సిగ్గులేదా శరం లేదా రోషం లేదా పౌరుషం లేదా అంటు నోటికొచ్చినట్లు మాట్లాడారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates