విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు వైసీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలవ్వబోతోంది. ఈనెల 20వ తేదీన వైజాగ్ లోని జీవీఎంసి గాంధీ విగ్రహం దగ్గర మొదలయ్యే పాదయాత్ర స్టీలు ప్లాంట్ దగ్గర ముగుస్తుంది. 25 కిలోమీటర్ల పాదయాత్రలో వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డే స్వయంగా నడుస్తారట. 25 కిలోమీటర్ల పాదయాత్రకు తానే నాయకత్వం వహిస్తానని విజయసాయి చెప్పారు. విజయసాయి పాదయాత్రంటే ఇతర నేతలు కూడా పాల్గొంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే …
Read More »రేవంత్ సభలో సూరీడు… వాటీజ్ గోయింగ్ ఆన్?
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంటోంది. ఇలాంటి ఘటనల పరంపరలో బుధవారం నాడు వాటన్నింటిని తలదన్నెలా ఓ ఘటన జరిగింది. దివంగత సీఎం వైఎఎస్ రాజశేఖరరెడ్డి సేవకుడిగా ఆయన వెన్నంటే నడిచిన సూరీడు అలియాస్ సూర్యనారాయణ రెడ్డి… వైఎస్ కు వైరి వర్గం టీడీపీలో ఏళ్ల తరబడి సాగి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి సభలో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ సభా వేదికపైకి …
Read More »ఏపీ బీజేపీ నేతల డ్రామాకు నడ్డా చెక్ !
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంతపార్టీ నేతలకే పెద్ద షాక్ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తు కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై గడచిన 15 రోజులుగా విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఉక్కు ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళనలకు రాజకీయపార్టీలు కూడా జత కలిశాయి. అధికార, ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నా బీజేపీ+జనసేన మాత్రం ఎక్కడా …
Read More »విశాఖలో సరికొత్తగా కనిపించిన చంద్రబాబు
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. డెస్సింగ్ విషయంలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు అస్సలు క్రమం తప్పరు. యూనిఫారం మాదిరి ఒకేలాంటి దుస్తుల్ని ఆయన ధరిస్తుంటారు. పార్టీ రంగు అయిన పసుపుకు చాలా లైట్ గా ఉంటే పసుపు.. గోధుమ రంగులో ఉంటే ఫ్యాంట్.. షర్టు వేసుకోవటం ఆయనకు అలవాటు. నిజానికి చంద్రబాబు అన్నంతనే కళ్ల ముందు ఆయన రూపం అలానే కనిపిస్తుంది. అలాంటి చంద్రబాబు తాజాగా విశాఖ పర్యటనకు …
Read More »జగన్ ఏం చెబితే అది చేస్తా.. : బాబు సంచలనం
తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో హీట్ పెంచుతున్న విశాఖ ఉక్కు ఉదంతంలో ఇప్పటివరకు జరిగిన వాటికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టటం.. తాజాగా …
Read More »నిమ్మగడ్డ ఎఫెక్ట్… టీడీపీ ఇలా.. వైసీపీ అలా కుమిలిపోతున్నాయా?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఒక్కో రకంగా ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. దీనికి కొత్తగా నోటిపికేషన్ ఇవ్వాలని అదికార వైసీపీ తప్ప.. మిగిలిన అన్ని పార్టీలూ డిమాండ్ చేశాయి. అయినప్పటికీ.. నిమ్మగడ్డ మాత్రం గత ఏడాది స్థానిక ప్రక్రియ ప్రారంభమైన చోట నుంచి.. ఎక్కడ నిలిపివేశారో.. అక్కడి నుంచే …
Read More »అన్న కుటుంబానికి ఎసరు పెట్టిన తమ్మినేని కుటుంబం!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. బంధాలు, బాంధవ్యాలు కూడా రాజకీయాల్లో కనిపించడం లేదు. అన్నదమ్ములు సవాళ్లు చేసుకుంటున్నారు. తండ్రీ కూతుళ్లు కూడా ఎన్నికల్లో తలపడుతున్నారు. అయితే.. ఎంత దూకుడుగా రాజకీయాలు చేసినా.. మరీ అంత కుటుంబ సంబంధాలను తెంచేసుకుంటున్నారని అనలేం. ఎక్కడో ఒక చోట రాజీ పడుతున్నారు. అయితే.. వీటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు. ఈ విషయం శ్రీకాకుళంలో …
Read More »ముహూర్తబలం చూస్తున్న షర్మిల
షర్మిల ముహూర్తబలం కోసం చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణాలోని వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో భేటీలు నిర్వహిస్తున్న షర్మిలకు చాలామంది చాలా సూచనలు చేస్తున్నారట. అంతిమంగా ఎవరు ఏమి చెబుతున్నా పార్టీ ప్రకటనకు ముందుగానే కీలకమైన నేతలను తనతో కలిసి నడిచేందుకు చేయి కలపాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. పనిలో పనిగా పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తబలాన్ని చూస్తున్నట్లు చెబుతున్నారు. ముందు పాదయాత్ర చేయాలా ? లేకపోతే పార్టీని ప్రకటించాలా …
Read More »పల్లా దీక్ష భగ్నం.. ఉక్కు ఉద్యమంపై జగన్ సర్కార్ దూకుడు !!
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయం తెరమీదికి రాగానే.. ఆ ప్రాంత ప్రజలు సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు.. పల్లా శ్రీనివాస రావు.. ఆమరణ దీక్షకు దిగారు. ఈ దీక్ష పీక్ స్టేజ్కు చేరింది. పల్లాకు మద్దతుగా టీడీపీ భారీగా శ్రేణులను తరలించడం తోపాటు.. కీలక నేతలు సైతం విశాఖకు చేరుకుని.. పల్లాకు మద్దతు తెలిపారు. ఈ …
Read More »జగన్ నాయకత్వంలో నడుస్తా – అచ్చెన్నాయుడు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు ప్రైవేటు పరం చేసేందుకు వేగంగా పావులు కదపటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు సంబంధించి బాధ్యత మీదంటే మీదంటూ ఏపీ అధికార.. విపక్ష నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం తెలిసిందే. మీ వైఫల్యం వల్లే ఇదంతా అని ఇరు పక్షాలు పోటీపడి మరి తిట్టేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు …
Read More »విశాఖ ఉక్కు.. సాయిరెడ్డికి సవాలే.. రీజనేంటంటే!
విశాఖ ఉక్కును పోస్కో సంస్థకు విక్రయించేందుకు జరు గుతున్న పరిణామాల వెనుక విజయసాయిరెడ్డి కూడా ఉన్నారంటూ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెద్ద ఎత్తు న ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన దీని నుంచి బయట పడేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇటీవల ఆయన విశాఖ ఉక్కు కార్మికులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారు. దీంతో అక్కడి కార్మికులు.. పార్టీలకు అతీతంగానే ఆయన కాన్వాయ్ను చుట్టుముట్టారు. నిజానికి విజయసాయికి ఇది ఊహించని పరిణామం. …
Read More »అసలైన యుద్ధం మొదలయ్యేది ఇపుడే
ఇపుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఒక పద్దతి. తొందరలో మొదలవ్వబోయే యుద్ధం మరో పద్దతి. ఇపుడే అసలైన ఎన్నికల యుద్ధం మొదలవ్వబోతోంది. పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. దాదాపు 15 రోజుల క్రితం మొదలైన పంచాయితీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతు గుర్తులు లేవో గెలిచిన వారంతా తమ వారే అని అధికార వైసీపీ, కాదు కాదు తమకు 38 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates