Political News

వ‌ర్ల వ‌ర్సెస్ ప‌న‌బాక‌: ఎంపీ టికెట్ రేసులో పోటా పోటీ

టీడీపీలో మ‌ళ్లీ టికెట్ల పోర ప్రారంభ‌మైందా? నాయ‌కులు పోటీ ప‌డుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధానమే వ‌స్తోంది.. టీడీపీ నేత‌ల నుంచి. తిరుప‌తి పార్ల‌మెంటు స‌భ్యుడు, వైసీపీ నాయ‌కుడు బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు.. రెండు రోజుల కింద‌ట అనారోగ్యం కార‌ణంగా హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఈ సీటుకు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే, దీనికి సంబంధించి ఆరు మాసాల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో టీడీపీ కీల‌క‌మైన ఇద్ద‌రు నేత‌లు …

Read More »

చైనాకి ఆ నలుగురి షాక్… భారత్ బలం పెరుగుతోంది

India China

డ్రాగన్ దేశం దురాగతాలను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాలు ఏకం అవుతున్నాయి. కొద్ది నెలలుగా భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యాలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో అందరు చూస్తున్నదే. మొదట లడ్డాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ తర్వాత ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలోను దుస్సాహసానికి పాల్పడుతోంది. చైనా మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నాలు చేసినపుడల్లా మన సైన్యాలు ధీటుగా సమాధానం చెబుతున్న కారణంగా డ్రాగన్ పన్నాగాలు ముందుకు సాగటం లేదు. లేకపోతే మన …

Read More »

శ్రీవారికి ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని లేదు: ఐవైఆర్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్ సమర్పించనవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిక్లరేషన్ అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇపుడు ఎందుకు తీసి వేస్తున్నారని ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అసహనం …

Read More »

టిడిపి లాయర్లే జడ్జీలయ్యారా ? వైసిపి ఎంపి సంచలనం

తెలుగుదేశంపార్టీకి లాయర్లుగా పనిచేసిన వాళ్ళే తర్వాత జడ్జీలయ్యారంటూ వైసిపి ఎంపి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మిథున్ పై ఆరోపణలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. టిడిపికి సన్నిహితంగా ఉన్న లాయర్లే తర్వాత జడ్జీలైనపుడు న్యాయవ్యవస్ధ నుండి నిష్పాక్షిక తీర్పులను ఎలా ఆశించగలమంటూ మిథున్ వేసిన ప్రశ్న సంచలనంగా మారింది. చట్టసభల అధికారాలను ఏపిలో హై కోర్టులు తీసేసుకుంటున్నాయంటూ ఎంపి మండిపోయారు. ప్రస్తుతం …

Read More »

వ్యాక్సిన్ డెలివరీ అంత కష్టమా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ సరైన ఫలితం వచ్చిన వ్యాక్సిన్ ఒక్కటి లేదు. ఓవైపు జోరుగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత.. దాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందించటం ఎలా? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వందల కోట్ల మందికి వ్యాక్సిన్ అందచేయాల్సి ఉంటుంది. దాన్ని భరించే శక్తి చాలా దేశాలకు లేదు. దీంతో.. …

Read More »

కండువా కప్పుకోరు.. కానీ పార్టీ మారనున్న తెలుగు తమ్ముడు

అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల మాదిరి వాలే నేతల్ని చేరదీసి..పదువులు ఇచ్చే చంద్రబాబుకు.. తర్వాతి కాలంలో అలాంటి వారిస్తున్న షాకులు అన్ని ఇన్ని కావు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీడీపీ హయాంలో పదవులు పొందక తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలుగు తమ్ముళ్లు.. ఒక్కొక్కరిగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చూస్తున్నదే. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బ తీయటానికి అధికార పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని పఠిస్తుంటుంది. అందుకు …

Read More »

మన ప్రముఖుల డేటా ఆలీబాబా ద్వారానే డ్రాగన్ కు చేరిందా ?

అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. దేశంలోని సుమారు 10 వేలమంది ప్రముఖుల వ్యక్తిగత, అధికారిక డేటా మొత్తాన్ని చైనా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. భారత్ తో ప్రత్యకంగా పోరాటం చేయలేని డ్రాగన్ దేశం దొంగదెబ్బ తీయటానికి రెడీ అయిపోయిందట. చైనా దేశానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ గ్రూపు, వాణిజ్యసంస్ధ ఆలీబాబా ద్వారా మనదేశంలోని అత్యంత ప్రముఖుల డేటాను తీసేసుకుందని ప్రభుత్వానికి నివేదిక అందింది. మనదేశంలో …

Read More »

వీర్రాజుకు అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయా ?

అధ్యక్షుడిగా నియమితుడైన దగ్గర నుండి రెండు నెలలు హ్యాపీగానే గడిపేసిన సోమువీర్రాజుకు అప్పుడే తలనొప్పులు మొదలయ్యయా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటమే తలనొప్పులకు ప్రధాన కారణమని అంటున్నారు. వీర్రాజు ఏర్పాటు చేసిన 40 మందితో కార్యవర్గంలో 10 మంది ఉపాధ్యక్షులు, పదిమంది కార్యదర్శులు, 5 మంది ప్రధాన కార్యదర్శులు కీలకంగా ఉన్నారు. అయితే ఆ పోస్టుల్లోకి అధ్యక్షుడు ఎంపిక చేసిన …

Read More »

హిందువులను ఏపీ ప్రభుత్వం అణచివేస్తోంది: జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా హిందూ ఆలయాలు, ఆచారాలు, ఆస్తులు, చారిత్రక రథాలపై జరుగుతున్న దాడులు దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంతర్వేది ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో, అంతర్వేది వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా సీరియస్ గా ఉంది. దేవాలయాలపై దాడుల విషయంలో వైసీపీ వైఖరిపై ఏపీ బీజేపీ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాలపై …

Read More »

పులివెందులలో పది వేల మందితో సభ పెడతా-రఘురామ

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ (నరసాపురం) రఘురామ కృష్ణంరాజు.. తనను విమర్శించి నాయకులకు మరోసారి తనదైన శైలిలో బదులిచ్చారు. తన తోలు తీస్తామంటూ వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘నా తోలు తీస్తామంటూ కొందరు నాయకులు మాట్లాడతారు. కానీ నేనలా మాట్లాడలేను. ఎందుకంటే తోలు తీయడం నా వృత్తి కాదు. అలా మాట్లాడుతున్న …

Read More »

`వైఎస్సార్ సీపీ`కి రఘురామకృష్ణరాజు మరో షాక్

వైసీపీ నేతలకు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన వైసీపీ ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ నుంచి రఘురామను బాయ్ కాట్ చేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఇక, రఘురామను అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసీపీ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలపై రఘురామ దీటుగా జవాబిస్తున్నారు. తన తోలు తీస్తామంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై రఘురామ ఘాటుగా …

Read More »

రజినీ కాంత్.. నాన్న-పులి

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చ రెండు దశాబ్దాల కిందట మొదలైంది. 90ల్లోనే ఆయన రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాలు ఇచ్చారు. కానీ ఆ విషయంలో ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. వస్తానని చెప్పడు, రాననీ తేల్చడు. రాజకీయాల్లోకి రావాలని రజినీకి లోపల ఉన్నప్పటికీ.. జయలలిత, కరుణానిధి లాంటి రాజకీయ దిగ్గజాల్ని ఢీకొట్టేందుకు ధైర్యం చాలకే ఆయన ఆగిపోయారని సన్నిహితులు అంటారు. చివరికి జయలలిత మరణించి, కరుణానిధి మంచానికి పరిమితమైన …

Read More »