రోజుకు వేల సంఖ్యలో పోజిటివ్ కేసులు.. పదుల సంఖ్యలో మరణాలు.. కరోనా సెకండ్ వేవ్తో తెలంగాణ అల్లాడిపోతోంది. ఒకవై పు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మాస్కులు ధరించినా.. భౌతిక దూరాన్ని విస్మరిస్తు న్నారు. కొందరు మాస్కులు కూడా పెట్టుకోకుండా సంచరిస్తున్నారు. ఇక, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ల కొరత ఇంకా వెంటాడుతూనే ఉంది. అంటే. మొత్తంగా అప్రకటిత.. కరోనా కబంద హస్తాల్లో తెలంగాణ పౌరులు …
Read More »అప్పుడు వేస్ట్ అన్న వ్యాక్సిన్కే ఇప్పుడు డిమాండ్
కొన్ని నెలల కిందట త్వరలో ఇండియాలో వ్యాక్సినేషన్ మొదలవుతుందని ఆశిస్తున్న తరుణంలో.. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ఇండియాలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నంలో ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత అదార్ పూనవాలా ఒక కామెంట్ చేశాడు. ఇండియాలో తయారవుతున్న మరో వ్యాక్సిన్ మంచి నీళ్లతో సమానం అన్నట్లు ఆయన వ్యాఖ్యానించాడు. ఆయన ఆ వ్యాక్సిన్ పేరు చెప్పకపోయినా.. అది భారత్ బయోటెక్ అభివృద్ధి …
Read More »సీనియర్లకు చంద్రబాబు ఎందుకు చులకనయ్యారు? ఇదో పెద్ద చర్చ
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒక చిత్రమైన చర్చ తెరమీదికి వచ్చింది. తాజాగా జరిగిన రెండు పరిణామా లు… ఒక అరెస్టు.. నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు సెంట్రిక్గా ఈ చర్చ తెరమీదికి రావడం, అందు నా.. సీనియర్ల విషయం కావడం అత్యంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టీడీపీ అంటే.. చంద్రబాబు+లోకేష్ +సీనియర్లు(కురువృద్ధులు) అనే మాట సర్వత్రా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరికీ రెండో మాట కూడా …
Read More »లవ్ కు అడ్డొస్తున్నాడని తమ్ముడ్ని దారుణంగా చంపేసిన నటి
మానవ సంబంధాలు అంతకంతకూ దారుణంగా మారుతున్నాయి. సినిమాల ప్రభావమో.. టీవీ సీరియల్స్ పుణ్యమో.. వ్యక్తిగత స్వార్థం ముందు మరేదీ ముఖ్యం కాదన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. క్షణిక సుఖం కోసం అయినోళ్లను అత్యంత దారుణంగా చంపేసే వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇలాంటి వాటిల్లో ఒక నటి నేరుగా ఉండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. శాండల్ వుడ్ లో సంచలనంగా మారిన ఈ దారుణ హత్యోదంతంలోకి వెళితే.. మూడేళ్ల …
Read More »జగన్ను వెంటాడుతున్న వైసీపీ ఎంపి
పరిస్దితులు బాగాలేనపుడు తాడే పామై కరుస్తుందనేది నానుడి. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఇపుడీ నానుడే నిజమవుతుందా ? అనే చర్చ జోరుగా మొదలైంది. ఎలాగంటే వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై ఇపుడిదే చర్చ జరుగుతోంది. జగన్ బెయిల్ ను రద్దుచేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలంటు వేసిన పిటీషన్ పై వచ్చే వారంనుండి విచారణ ప్రారంభించటానికి సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. జగన్ బెయిల్ రద్దు చేసి …
Read More »సుప్రింకోర్టు మోడినే టార్గెట్ చేసిందా ?
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత నియంత్రణను సుప్రింకోర్టు తన చేతిలోకి తీసుకున్నట్లేనా ? తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు డైరెక్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోడిని టార్గెట్ చేసిందేనా ? అన్న చర్చ పెరిగిపోతోంది. కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపధ్యంలో సుప్రింకోర్టు సూమోటోగా విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతు దేశంలో కరోనా సంక్షోభం పెరిగిపోతున్న నేపధ్యంలో సుప్రింకోర్టు ప్రేక్షక పాత్ర వహించలేదన్నారు. కరోనా సంక్షోభ సమయంలో తాము …
Read More »సీఎంకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
అవును ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు. ఒకరు పదిపైసలు పనిచేసి రూపాయి ప్రచారం చేసుకుంటారు. మరొకరు అర్ధరూపాయి పనిచేస్తారు. ఇంకొకరు 90 పైసలు పనిచేసి రూపాయి ప్రచారం చేసుకుంటారు. ఇదే సమయంలో మరొకరు రూపాయి పనిచేసి కూడా ప్రచారానికి దూరంగానే ఉంటారు. చివరికోవచు చెందిన ముఖ్యమంత్రే నవీన్ పట్నాయక్. అవును ఒడిస్సాను గడచిన 20 ఏళ్ళుగా పరిపాలిస్తున్న నవీన్ పట్నాయక్ పనికి ముందు ప్రచారానికి చివరన అన్నట్లుగా ఉంటారు. తాజాగా …
Read More »టీడీపీ ధైర్యం.. జగన్ దూకుడేనా ?
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. పార్టీలు ప్రజల్లో పెద్దగా బలం సంపాయించుకునేందుకు ప్రయత్నించినా.. చేయకపోయినా.. ప్రత్యర్థి పార్టీ చేసే తప్పలను తమకు అనుకూలగా మార్చుకుంటే.. చాలు అధికారంలోకి వచ్చేందుకు దారి ఏర్పడుతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కూడా ఈ లోపాలను తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగారు. తనను విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నిలువరించ డం.. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, తనపై …
Read More »కరోనా బారిన పడి జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు?
విపత్తు వచ్చినప్పుడు అత్యవసర శాఖకు చెందిన అధికారులకు రెట్టింపు పని ఉంటుంది. వారికి ప్రభుత్వ రక్షణ ఉంటుంది. కానీ.. జర్నలిస్టులకు అలాంటి పరిస్థితి ఉండదు. పనికి పని.. ఒత్తిడికి ఒత్తిడి ఉంటుంది కానీ.. జరగరానికి ఏదైనా జరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటివరకు ఎన్నో విపత్తులకు ఎదురొడ్డి పని చేసిన జర్నలిస్టులకు తొలిసారి కరోనా రూపంలో పెను ముప్పు పొంచి ఉంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. కరోనా సెకండ్ …
Read More »శవాల గుట్టలు పేరుకున్నా.. లాక్డౌన్ పెట్టను
కరోనా నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతు న్నారు. దీంతో గత ఏడాది దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ను విధించాయి. అయితే.. నెమ్మదినెమ్మదిగా దీనిని సడలిస్తూ.. వచ్చారు. ఈ క్రమంలోనే బ్రిటన్లోనూ గత ఏడాది లాక్డౌన్ విధించారు. ఇక, మొదటిసారి కంటే కూడా రెండోసారి లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేసి.. కరోనాను చాలా వరకు …
Read More »టీకాల్లో ఆలస్యం తప్పదా ?
18 ఏళ్ళు నిండిన వాళ్ళు కరోన వైరస్ టీకాలు వేసుకోవటానికి మరో నెలరోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందకంటే వాళ్ళకు అవసరమైన టీకాలు ఇప్పుడిప్పుడే అందేట్లులేదు. ప్రభుత్వం ప్రకటించిన లెక్క ప్రకారమే 18 ఏళ్ళు నిండినవాళ్ళకు టీకాలు వేయాలంటే సుమారు 2 కోట్ల టీకాలు అవసరం. అంటే రెండు డోసులకు కలిపి 4 కోట్లకు పైగా టీకాలు కావాలి. ఇపుడు 45-60 ఏళ్ళమధ్య వారికి టీకాలు వేయటానికే సరపడా వ్యాక్సిన్ …
Read More »తొందరలో కేంద్రం కీలక నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రప్రభుత్వం తొందరలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశాలున్నాయా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు, అత్యున్నతస్ధాయి వర్గాల ఆలోచనలు చూస్తుంటే దేశంలో హెల్త్ ఎమర్జీన్సీ విధించే విషయమై కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. నాలుగురోజల క్రితం సుప్రింకోర్టు కూడా దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే విషయమై చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా దేశం మొత్తంమీద కరోనా సమస్య పెరిగిపోతున్నది. దేశంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates