Political News

షర్మిళ ‘కరోనా’ హామీ.. ఒక రేంజ్ ట్రోలింగ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిళ తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టడం చాలామందికి విడ్డూరంగా అనిపించింది. తెలంగాణ కోడలినని ఎంత చెప్పుకున్నా ఆమెను ఇక్కడి జనాలు పెద్దగా ఓన్ చేసుకోలేదన్నది స్పష్టం. తన అన్నయ్య జగన్ మీద కోపం ఉంటే, ఆయన మీద అలిగితే ఏపీలో ఆయనకు పోటీగా పార్టీ పెట్టాలి కానీ.. …

Read More »

ఎంఎల్ఏలే సొంత సర్వేలు చేయించుకుంటున్నారా ?

ఇపుడిదే అంశంపై అధికార వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటనే విషయమై జనాల నాడి పసిగట్టేందుకు ఎంఎల్ఏల్లో చాలామంది సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం. అందుబాటులోని సమాచారం ప్రకారం సుమారు 100 మంది ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారట. వీటిల్లో ఇఫ్పటికే 30 నియోజకవర్గాల్లో సర్వేలు పూర్తయి వివరాలన్నీ ఎంఎల్ఏల చేతికి అందినాయట. ఈ నివేదికల ప్రకారం నియోజకవర్గాల్లో 40 శాతం …

Read More »

తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు ఇండిపెండెంట్ అభ్యర్థి షాక్

టీఆర్ఎస్ భయమే నిజమైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తొలిరౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఇండిపెండెంట్ అభ్యర్థి షాక్ ఇచ్చారు. కారు గుర్తును పోలిన రొట్టెలపీట గుర్తుకు 112 ఓట్లు పోలయ్యాయి. కారు గుర్తును పోలి ఉండటం కారణంగా తమకు నష్టం జరిగినట్లు టీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. అటు హుజురాబాద్ తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో కొనసాగుతున్నారు. ఉప ఎన్నిక …

Read More »

హుజూరాబాద్ తొలి ఫలితం..

అందరూ ఎంతో ఆసక్తిగా.. ఉత్కంటతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం ఖాయమని భావిస్తున్న వేళ.. ఎగ్జిట్ పోల్స్ అందుకు భిన్నమైన మాట చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అందులో కారు జోరు స్పష్టంగా కనిపించింది. మొత్తం 753పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు వైఎస్సారే ఆద్యుడు: చింతా మోహన్

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉండింటే అసలు తెలంగాణ వచ్చేది కాదని అందరిలో ఉన్న భావన. ప్రత్యేక తెలంగాణ కావాలని కాంగ్రెస్ తీర్మానం చేసినప్పటికీ రాజశేఖర్ రెడ్డి ఉన్నాళ్లు ప్రత్యేక తెలంగాణ వాదం అంత బలంగా వినిపించలేదు. ప్రత్యేక తెలంగాణ కావాలని ప్రజలు కోరుకోవడం లేదని ఆయన అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రస్తావించారు. ఇదే విషయంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో సూటిగా ప్రశ్నించిన వీడియోలు ఇప్పటికీ …

Read More »

నారాయ‌ణ‌.. నారాయ‌ణ‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీ నాయ‌కులంద‌రూ ఇప్పుడు చ‌ర్చిస్తున్న విష‌యం ఏమ‌న్నా ఉందా? అంటే.. అది మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ మాత్ర‌మే. 2019లో జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన‌ప్పుడే రెండున్న‌రేళ్ల త‌ర్వాత మ‌రోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టంగా చెప్పారు. ఇప్పుడా స‌మ‌యం ఆసన్నం కావ‌డంతో కొత్త‌గా ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందో? ఉన్న‌వాళ్ల‌లో ఎవ‌రిని ప‌క్క‌న‌పెడ‌తారో? అన్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎక్సైజ్‌, వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రిగా …

Read More »

అన్న‌య్య బాట‌లో ప‌వ‌న్‌

జ‌న‌సేన పార్టీని స్థాపించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని ర‌కాలుగా ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డా.. ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం ఓట్లుగా మార‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా పార్టీని గెలిపించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌వ‌న్‌.. అందుకోసం ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకు త‌న అన్న‌య్య చిరంజీవి బాట‌లో సాగాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. బ‌స్సు యాత్ర‌ తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని …

Read More »

ఆ ముగ్గురికి జ‌గ‌న్ ఛాన్స్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాల‌కు ఎన్నిక‌ల న‌గారా మోగింది. న‌వంబ‌ర్ 29న పోలింగ్ జ‌రుగుతుంద‌ని ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీంతో ఈ మూడు ప‌ద‌వుల కోసం జ‌గ‌న్ ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే ఆస‌క్తి నెల‌కొంది. ప‌ద‌వుల కోసం ఆశ పెట్టుకున్న ఆశావ‌హులు జ‌గ‌న్ క‌టాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే జ‌గ‌న్ ఇప్ప‌టికే …

Read More »

నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో గత 685 రోజులుగా రైతులు, మహిళలు, యువత ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి ‘మహా పాదయాత్ర’ చేపట్టారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది. …

Read More »

డ్రెస్ కోడ్ పై లేడీ డాక్టర్ల నిరసన

ఏదో ఓ నిర్ణయం తీసుకోవటం తర్వాత ఆ విషయమై తీరిగ్గా చింతిచటమో లేకపోతే వాపసు తీసుకోవటమో ఏపి ప్రభుత్వానికి అలావాటైపోయింది. ఇపుడు తాజా విషయం ఏమిటంటే వైద్యులకు డ్రెస్ కోడ్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులందరికీ డ్రెస్ కోడ్ ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు డిసైడ్ చేశారు. ఒకసారి డిసైడ్ అవ్వగానే డాక్టర్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, నర్సులు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా ఉన్నతాధికారులు ఓ …

Read More »

బాబు.. ఆ నాలుగు చోట్ల లీడర్లు ఎక్కడ…?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవ‌ల‌ పార్టీలో ఊహించని మార్పులు చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కొన్నిచోట్ల మార్పులు తప్పదనే దిశగా బాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే బాబు ఏ మాత్రం మొహమాటం పడకుండా పనిచేయని నాయకులని పక్కనబెట్టేసి కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లని పెట్టారు. తాజాగా డోన్ నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాల‌ను మ‌న్నె సుబ్బారెడ్డికి అప్ప‌గించారు. అలాగే పనిచేయని నాయకులని మొహమాటం లేకుండా …

Read More »

చేరిక‌లు.. ప్ర‌చారాలు.. సంద‌డి షురూ!

ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను ఆక‌ర్షించ‌డం.. త‌మ ప్ర‌యోజ‌నాల కోసం నేత‌లు పార్టీలు మార‌డం.. హోరాహోరీ ప్ర‌చారం.. సెల‌బ్రిటీల చేరిక‌లు.. ఇలా దేశ‌వ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైపోయింది. వ‌చ్చే ఏడాది కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు పంజాబ్, గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల‌కు మ‌రికొద్ది నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో …

Read More »