తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి కూడా అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంది. 2023 ఎలాగూ ఎన్నికల సంవత్సరమే.. ఇక మిగిలింది ఈ యేడాదిలో 8 నెలలు.. వచ్చే యేడాది. అంటే గరిష్టంగా 20 నెలల సమయం మాత్రమే ఉంది. కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని 2019 సెప్టెంబర్లో విస్తరించి ఆరుగురిని కేబినెట్లోకి కొత్తగా చేర్చుకున్నారు. …
Read More »సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే.. జోక్ చేశానంటూ కవరింగ్
ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని సిత్రాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ నేతలకు ఉండే సమస్య ఏమంటే.. వారి నోటి నుంచి ప్రతి మాటా ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. సామాన్యుల మాదిరి ఒక మాట ఎక్కువ తక్కువలు వచ్చినా చిక్కే. చిన్న తేడా వచ్చినా అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితినే కొని తెచ్చుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు. ప్రస్తుతం ఏపీలో …
Read More »ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పవా ?
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పేట్లు లేదు. పోలింగ్ పై కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దెబ్బ పడేట్లు అనుమానంగా ఉంది. దీంతో పాటు మండే ఎండల ప్రభావం కూడా తప్పదనే అనిపిస్తోంది. మామూలుగానే తిరుపతిలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఈసారి ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాంతో పోలింగుకు ఓటర్లు ఏ మేరకు వస్తారనేది కాస్త అనుమానంగా తయారైంది. …
Read More »జగన్ సర్కారుపై లోకేష్ ‘జేసీబీ’ పంచ్ లు
తిరుపత ఉప ఎన్నికల ప్రచారం మూడు తిట్లు.. ఆరు విమర్శలు అన్నట్లుగా సాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా మండిపడుతున్న పార్టీల ప్రచారం.. పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది. తాజాగా టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరైన లోకేశ్ ప్రచారాన్ని నిర్వహించారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ.. జనసేన-బీజేపీల కూటమి తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు …
Read More »జైలు మీకేమైనా కొత్తా జగన్ – ఉండవల్లి
సంచలన వ్యాఖ్యలు చేయటంలో సీనియర్ నేత ఉండవల్లి ముందుంటారు. అద్భుతమైన వాగ్ధాటి.. అంతకు మించి ఆయన మాటల్లో లాజిక్కు కట్టిపారేస్తూ ఉంటుంది. తెలుగు నేల మీద విషయాల మీద విపరీతమైన పట్టుతో పాటు.. అంతకు మించిన విషయం ఏదైనా సరే.. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులువుగా విషయాల్ని ఆయన చెప్పేస్తుంటారు. అలాంటి ఉండవల్లి.. తాజాగా సీఎం జన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ …
Read More »తిరుపతి ఉప పోరులో ‘గ్లాసు’ గుర్తు.. అదెలా సాధ్యం?
ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచేలా మారిన తిరుపతి ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ బరిలో నిలవటం.. ఆమె తరఫున జనసేన అధినేత పవన్ భారీగా ప్రచారాన్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. తన ప్రచారంలో భాగంగా అధికార వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్. దీంతో అధికార పార్టీ వర్సెస్ పవన్ అన్నట్లుగా పోరు నడుస్తోంది. …
Read More »వైసీపీలో ఆ రెడ్డి ఎమ్మెల్యేకు జగన్ బ్రేక్?
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. సొంత పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు. పార్టీలో ఉంటే ఉండొచ్చు.. బయటకు వెళితే వెళ్లవచ్చని అధిష్టానం వార్నింగ్ ఇవ్వడంతో గప్చుప్ అయినా లోపల మాత్రం రగిలిపోతున్నారు. తన సీనియార్టీని పార్టీ గుర్తించలేదని తెగ మదనపడుతోన్న ఆయన ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల వేళ పూర్తి సైలెంట్ అయిపోయారు. ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవరో కాదు నెల్లూరు జిల్లాకు …
Read More »తిరుపతి ఉప ఎన్నిక.. ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్లస్లు… మైనస్లు
ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 17న జరుగుతోంది. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో ఇప్పుడు తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఇక్కడ ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ పోటీ చేస్తున్నాయి. జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. ఇక ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తోన్న …
Read More »ఎందుకు మోడి తమిళనాడును పట్టించుకోవటంలేదు ?
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే మిత్రపక్షంగా బీజేపీ 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. నిజానికి ఎన్నికలు జరుగుతున్న పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. అలాంటి రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్దగా పట్టించుకోవటం లేదు. అన్నాడీఎంకే పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధులను వదిలిపెట్టేస్తే కనీసం తమ పార్టీ అభ్యర్ధుల తరపున కూడా మోడి ప్రచారానికి ఇష్టపడటంలేదు. …
Read More »ఇదే బీజేపీ కొంప ముంచేస్తుందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి జరిగిన రోడ్డుషో, తర్వాత బహిరంగసభ చూసిన తర్వాత అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. తిరుపతి లోక్ సభలో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ తన గెలుపు విషయంలో పవన్ పై చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అయితే తాజా పరిణామాల తర్వాత అలాంటి ఆశలు ఫలించేట్లు కనబడటంలేదు. ఎందుకంటే పవన్ పాల్గొన్న రోడ్డుషో అయినా తర్వాత జరిగిన బహిరంగసభ అయినా చాలా పేలవంగా జరిగింది. పవన్ …
Read More »బెంగాల్లో సీన్ మారుతోంది… అంచనాలు తల్లకిందులయ్యే రిజల్ట్ ?
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువుగా ఆకర్షిస్తోన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. 2016 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 18 ఎంపీ సీట్లను గెలుచుకుని సంచలనం క్రియేట్ చేసింది. ఇక ఇదే ఊపుతో మమతా బెనర్జీని ఎలాగైనా ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ఆరు …
Read More »#Endoftdp ట్రెండింగ్
2019 మే వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం. కానీ అధికారం కోల్పోయి రెండేళ్లు తిరక్కముందే ఆ పార్టీ పతనావస్థకు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనూ ఆ పార్టీకి ఎన్నికల్లో పరాభవాలు ఎదురయ్యాయి. నాయకులు, కార్యకర్తలు డీలా పడ్డారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పతనం వైపు అడుగులేస్తుండటం, పార్టీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోయే పరిస్థితులు రావడం విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల పంచాయితీ, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates