మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది బెజవాడ టీడీపీ పరిస్థితి. ఇప్పటికే నేతలు కలిసిరాక.. పార్టీ కార్యక్రమాలు జరగడం లేదు. పట్టుమని పదిమంది కూడా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరికి వారే మోనార్క్లుగా రాజకీయం వెలగబెడుతున్నారనే విమర్శలు వస్తున్నా.. ఏ ఒక్కరూ చలించడంలేదు. ఒక ఎమ్మెల్యే (తూర్పు), ఒక ఎంపీ ఉన్నారనే మాటే తప్ప.. పార్టీలో జవసత్వాలు నింపేందుకు కానీ, కార్యకర్తల కష్టాలు తీర్చేందుకు కానీ.. …
Read More »బీసీ ఉద్యమాలు.. ఒక రాజకీయ వ్యూహం!
బీసీలు.. ఈ మాట అనగానే రాజకీయ పార్టీలకు, నేతలకు ఎనలేని ప్రేమ పొంగిపోతుంది. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామనికూడా వారు ప్రకటించుకుంటారు. అయితే.. వాస్తవంలోకి వచ్చే సరికి.. ఏపీలో ఏ ప్రబుత్వం ఉన్నా.. బీసీలు ఎప్పటికప్పుడు ఉద్యమం పేరిట దూకుడుగా ఉంటూనే ఉన్నారు. మరి దీనికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. బీసీల కు ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేస్తామని కూడా ఇటీవల కాలంలో బీసీ సంఘాల నాయకులు కేసన శంకర్రావు …
Read More »బాబు తేల్చని ‘రాజకీయం’.. అక్కడ పరిస్థితి దారుణం!
రాజకీయంగా అపర చాణిక్యుడు అనేపేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత.. చంద్రబాబు.. అనుసరిస్తున్న ఉదాశీన వైఖరితో .. పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత.. పలువురు నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. చాలా మంది నేతలు.. ఇతర పార్టీల్లో చేరారు. మరికొందరు తటస్థంగా మారారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీని పట్టించుకుని ముందుకు నడిపించే నేతలు కరువయ్యారు. అయితే.. కొన్నాళ్ల కిందట.. పార్టీ పార్లమెంటరీ.. …
Read More »వైసీపీలో బిగ్ బాంబ్ పేలనుందా ?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఈ టైటిల్ గురించే చర్చ నడుస్తోంది. వైసీపీలో బిగ్ బాంబ్ త్వరలోనే పేలనుందా ? అంటే అవుననే అంటున్నారు. వైసీపీలో పదవుల విషయంలో లెక్కే లేదు. ఏ పదవి వచ్చినా పార్టీ నేతలకే… మరో మూడేళ్ల పాటు ఏ చిన్న పదవి కూడా ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలకు వెళ్లే ఛాన్సే లేదు. నామినేటెడ్ పదవి అయినా, ఎన్నికలు జరిగినా …
Read More »మోడీలో భయం స్పష్టంగా తెలుస్తోందిగా !
వచ్చే ఏడాదిలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడిలో టెన్షన్ ఏ స్ధాయిలో పెంచుతున్నాయో స్పష్టంగా అర్ధమైపోతోంది. తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ప్రక్షాళనను గమనిస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది. తాజా మంత్రివర్గంలో నరేంద్రమోడి 77 మందిని తీసుకున్నారు. వీరిలో ఒక్క యూపీ నుండే 14 మంది మంత్రులున్నారు. 77 మందిలో 14 మంది ఒక్కరాష్ట్రం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే మామూలు విషయం కాదు. అలాగే గతంలో ఏ ప్రభుత్వంలో …
Read More »వారసులు వద్దు అంటున్న జగన్… ?
జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో సారి ఏపీలో గెలవాలని చూస్తున్నారు. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే వైసీపీ గెలుపు మళ్లీ అంత సులువు కాదన్న మాట ఉంది. 2019 ఎన్నికలు వేరు, ఆ ఊపు వేరు. నాడు జగన్ ని ఒక్కసారి అయినా సీఎంగా చూడాలని జనాలు ఆరాటపడ్డారు. అలాగే పార్టీ మొత్తం జగన్ కోసం కష్టపడింది. ఇపుడు మాత్రం అలాంటి వారావరణం లేదు అనే …
Read More »ఏపీ మరీ అన్యాయమైపోయిందా ?
నరేంద్రమోడి దృష్టిలో ఏపి మరీ అన్యాయమైపోయినట్లుంది. లేకపోతే తమిళనాడు పార్టీ చీఫ్ ఎల్. మురుగన్ కు కేంద్రమంత్రిమండలిలో చోటు కల్పించిన మోడి ఏపి విషయాన్ని పూర్తిగా ఎందుకు వదిలేస్తారు ? బీజేపీకి సంబంధించి తమిళనాడు కన్నా ఏపినే కాస్త మెరుగనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ గాలి బలంగా వీచినపుడు ఏపిలో ఒకటో రెండో ఎంపి సీట్లలో గెలిచిన చరిత్ర కమలంపార్టీకుంది. తమిళనాడులో అసలు బోణీనే కొట్టలేదు దశాబ్దాల పాటు. ఇపుడు …
Read More »షర్మిల కొత్త పార్టీ పై పవన్ కామెంట్..!
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కొత్త పార్టీ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్తపార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని అన్నారు. కొత్తపార్టీలు రావాలని, ఆ పార్టీలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా..తన పార్టీ భవిష్యత్తుపై కూడా పవన్ స్పందించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎలా ఉండబోతోందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. జనసేన ఇవాళ …
Read More »రాజధానిపై కేంద్రం తాజా నిర్ణయం ఇదేనా ?
ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా ? అవుననే సమాధానం వస్తోంది. కేంద్రం-రాష్ట్రం మధ్య జరుగుతున్న కరెస్పాండెన్స్ లో ఎక్కడా రాజధాని అమరావతి అని కేంద్రం ప్రస్తావించటంలేదట. ఏ కరెస్పాండెన్స్ లో చూసినా ఏపి అమరావతికి బదులుగా ఏపి రాజధాని హైదరాబాద్ అనే కనిపిస్తోందట. చైతన్యకుమార్ రెడ్డి అనే వ్యక్తి కేంద్రాన్ని సమాచార హక్కు చట్టం …
Read More »అత్యంత చిన్న వయసులో.. కేంద్ర మంత్రి పదవి..!
మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు… ఈ పదవులు అనగానే.. ఒకప్పుడు తలపండిన రాజకీయ నాయకులే కనిపించేవారు. కేంద్ర మంత్రి పదవి దక్కించుకునేవారు కూడా.. దాదాపు పెద్ద వయస్కులే ఉండేవారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. అందుకే.. యువ నాయకులు ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే కాంక్ష, టాలెంట్ ఉంటే చాలు అని ఈతరం నాయకులు నిరూపిస్తున్నారు. తాజాగా… కేంద్ర మంత్రి వర్గ విస్తరణలోనూ యువ నాయకులు …
Read More »మోడీనే బెదిరించాలని చూశాడా ?
కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో చిరాగ్ పాశ్వాన్ బ్లాక్ మెయిలింగ్ నరేంద్రమోడి ముందు పనేయలేదు. కొద్దిరోజులుగా బీహార్ లో లోక్ జన శక్తి (ఎల్జేపీ)లో చాలా గొడవలవుతున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎంపి చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి ఆయన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ అధ్యక్షుడైపోయాడు. అలాగే లోక్ సభలో సభా నాయకుడిగా చిరాగ్ ను తీసేసి మరో ఎంపిని పశుపతి వర్గం …
Read More »కాంగ్రెస్ అసలు సమస్యేంటో తెలుసా ?
చెప్పుకోవటానికి 100 ఏళ్ళని ఘనంగా చాటుకుంటారు. నిజంగా పార్టీలో నేతలంతా కలిసికట్టుగా ఉంటే అది మాటల్లోనే కాదు చేతల్లో కూడా కనిపించేదే. ఇదే సమయంలో 100 ఏళ్ళు దాటడంతో పార్టీకి వయసైపోయిందని, ఔట్ డేటెడ్ అయిపోయిందని ప్రత్యర్ధులు చెణుకులు విసురుతుండటం అందరు చూస్తున్నదే. ఇదంతా ఏ పార్టీ గురించో ఈపాటికే అర్ధమైపోయుంటుంది, అవును జాతీయ పార్టీ కాంగ్రెస్ గురించే. చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంటుందో అంతే బలహీనమైపోయింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates