Political News

పాపం..అవమానాలను తట్టుకోలేకపోయారా ?

కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించటానికి అసంతృప్తే కారణమా ? బాబుల్ తీసుకున్న నిర్ణయం వెలువడగానే సంచలనంగా మారింది. ఎందుకంటే మొన్నటి మంత్రివర్గ ప్రక్షాళనలో నరేంద్రమోడి ఈ అసన్సోల్ ఎంపిని మంత్రిపదవిలో నుండి తీసేశారు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా బాబుల్ ప్రస్తావించకుండా తాను రాజకీయాలకు గుబ్ బై చెబుతున్నట్లు ప్రకటించేశారు. అంతేకాకుండా తొందరలోనే అసన్సోల్ నియోజకవర్గం ఎంపిగా కూడా రాజీనామా చేయబోతున్నట్లు చేసిన ప్రకటన బీజేపీలో …

Read More »

కేసీయార్ కు తలనొప్పిగా మారిన ‘దళితబంధు’ ?

అవును కేసీయార్ ఎంతో ప్రిస్టేజిగా తీసుకున్న దళితబంధు పథకం ఇపుడు తలనొప్పులు తెస్తున్నట్లే ఉంది. దళితులను ఆకర్షించేందుకు కేసీయార్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు కూడా చెప్పారు. ఉపఎన్నికలు జరగబోతున్న కారణంగా హుజూరాబాద్ ను కేసీయార్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారని అందరికీ అర్ధమైపోయింది. అయితే ఎవరు ఊహించని విధంగా రెండువైపుల నుండి సమస్యలు మొదలయ్యాయి. అదేమిటంటే మొదటిదేమో దళిత సంఘాల నుండి …

Read More »

క‌ళ్యాణ‌దుర్గం లో తిరిగి పట్టు సాధిస్తున్న టీడీపీ

అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఇక్క‌డ టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. 2014లో విజ‌యం ద‌క్కించుకున్న ఉన్నం హ‌నుమంత‌రాయ చౌద‌రిని ప‌క్క‌న పెట్టి గ‌త 2019 ఎన్నిక‌ల్లో మాదినేని ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడుకు చంద్ర‌బాబు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ ట‌ఫ్‌గా ఉండ‌డం వైసీపీ దూకుడు, జ‌గ‌న్ హ‌వా నేప‌థ్యంలో ఇక్క‌డ టీడీపీ ఓడిపోయింది. అయితే.. గ‌డిచిన రెండేళ్ల‌లో.. …

Read More »

బాబు ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టే టైం వ‌చ్చేసిందా ?

యనమల రామక్రిష్ణుడు సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీలో ఆయన చంద్రబాబు తరువాత అంతటి వారుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్ధిక వ్యవహారాల్లో తాను దిట్టనని కూడా ఆయన చాటుకుంటారు. మరో వైపు స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో యనమల శాసనసభా వ్యవహారాల్లో టీడీపీకి ఎన్నో సార్లు వ్యూహాల్లో సాయం చేశారు. అలా విపక్షాన్ని ఫల్టీ కొట్టించారు. అంతవరకూ ఎందుకు 2020లో శాస‌నమండలిలో చివరి నిముషంలో మూడు రాజధానుల బిల్లు పాస్ …

Read More »

హుజూరాబాద్‌లో బీజేపీ వ్యూహం..

రాజ‌కీయాల్లో ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌డం.. నేత‌ల‌కు వ‌న్న‌తో పెట్టిన విద్య‌. తాడిత‌న్నేవాడు ఉంటే.. వాడి త‌ల‌త‌న్నేవాడు ఉంటాడ‌న్న‌ట్టుగా.. రాజ‌కీయ నేత‌లు.. ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ.. త‌మ వ్యూహాల‌ను అమ లు చేసుకోవ‌డం మ‌న‌కు తెలిసిందే. తాజాగా తెలంగాణ‌లోని హుజూరాబాద్‌కు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఎందుకు ఉప ఎన్నిక జ‌రుగుతోంది? అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌య‌ట‌కు పంపేయ‌డంతో.. ఆయన కేసీఆర్‌ …

Read More »

కేసీఆర్ త‌ర్వాతి ప్ర‌క‌ట‌న‌.. బీసీ బంధు!

ద‌ళిత బంధు ప‌థ‌కంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కంపై అనుకూల , ప్ర‌తికూల వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఏదేమైనా ఈ స్కీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేశార‌న్న‌ది నిజం. ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ స్వ‌యంగా ఒప్పుకొన్నారు కూడా. ఇదిలా ఉంటే, ద‌ళితుల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న సంక్షేమం రీతిలోనే బీసీల కోసం బీసీ బంధు ఎజెండా తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏకంగా …

Read More »

కేంద్రం దూకుడుతో జ‌గ‌న్‌కు మ‌ళ్లీ కొత్త చిక్కే ?

కేంద్రం దూకుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కొంప ముంచుతోంది. అవ‌స‌ర‌మైన విష‌యాల్లో.. ముఖ్యంగా జ‌గ‌న‌కు అంతో ఇంతో మైలేజీ ఇచ్చే విష‌యాల్లో కేంద్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ.. ఇరుకున పెడుతుండ‌గా.. శాస‌న మండ‌లి విష‌యంలోమాత్రం.. జ‌గ‌న్ స‌ర్కారు చేసిన తీర్మానాన్ని ఆమోదించే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు ఇస్తుండ‌డం ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇప్పుడు చేయాలి ? అనే విష‌యం అధికార పార్టీలో అంత‌ర్మ‌థ‌నానికి దారితీస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. …

Read More »

హైద‌రాబాద్ ఆస్ప‌త్రికి ఈట‌ల‌… ఆ ఆస్ప‌త్రిలో చేర‌లేదు

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ త‌న ప్రజా దీవెన యాత్రతో హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ ను పెంచిన సంగ‌తి తెలిసిందే. అయితే, 12వ రోజు పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక దగ్గర ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ప్రత్యేక బస్సులో ప్రాథమిక చికిత్స అందించారు. అనంత‌రం ఆయ‌న్ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అయితే, హైద‌రాబాద్ లో ఆయ‌న చేరిన ఆస్ప‌త్రి గురించి సోష‌ల్ …

Read More »

కేసీయార్ కు షాక్ తప్పదా ?

ఎంతో ప్రిస్టేజిగా అనుకుంటున్న దళితబంధు పథకమే చివరకు కేసీయార్ కు ఫాకిస్తుందా ? ఏమో పరిస్ధితులు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. లక్ష కోట్ల రూపాయలతో దళితబంధు పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కేసీయార్ ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసేందే. పైలెట్ ప్రాజెక్టుగా ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయబోతున్నట్లు స్వయంగా కేసీయారే ప్రకటించారు. దాంతో ఈ పథకం అచ్చంగా ఎన్నికల పథకమనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సరే కేసీయార్ ప్రకటన, ప్రతిపక్షాల …

Read More »

మోడికి మరో షాక్ తప్పదా ?

నరేంద్రమోడికి మరో షాక్ తప్పేట్లు లేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ అంశంపై విచారణ చేయటానికి సుప్రింకోర్టు అంగీకరించింది. ఆగష్టు మొదటివారం నుండి ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరపనున్నట్లు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. గడచిన పదకొండు రోజులుగా పెగాసస్ వ్యవహారంతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు ప్రముఖులు, జర్నలిస్టులు ఇలా మొత్తం 50 …

Read More »

మాజీ సీఎంకే ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు..!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మార‌నున్నారా? త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్ట‌నున్నారా? ఈ క్ర‌మం లో మార్పులు, చేర్పుల దిశ‌గా కాంగ్రెస్ అధిష్టానం ఇప్ప‌టికే దృష్టి పెట్టిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రెండు రోజుల కింద‌ట కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీ రాజ‌కీయాల‌పై ఆరాతీసింది. ఇక్క‌డ ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే క‌ష్ట‌మేన‌ని తేల్చింది. ఈ క్ర‌మంలోనే …

Read More »

ప్రతిపక్షాలకు బీజేపీ బుద్ధులు చెబుతోందా ?

‘సభను మార్కెట్లాగ మార్చేద్దామా’ ? ఇది తాజాగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులను ఉద్దేశించి సంధించిన ప్రశ్న. గడచిన 12 రోజులుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై పార్లమెంటు దద్దరిల్లిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన ఎంపిలు ఒకవైపు లోక్ సభలోను అలాగే ఇటు రాజ్యసభలో కూడా పెగాసస్ ఆరోపణలపై విచారణ చేయాలని, ప్రధానమంత్రి సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే …

Read More »