Political News

ఆనం.. క‌క్క‌లేక‌, మింగ‌లేక

వైసీపీలో జ‌గ‌న్ తీరుతో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు బ‌య‌ట‌కు క‌క్క‌లేక‌, మింగ‌లేక చందంగా ఉన్నారు. ఆరే జ‌గ‌న్ కంటే ముందు 25 ఏళ్ల నుంచి రాజ‌కీయం చేస్తున్నాం.. క‌నీసం త‌మ‌కు గుర్తింపు, గౌర‌వం ఇవ్వ‌డం లేదే అని వాపోతున్న వారి సంఖ్య ఎక్కువే. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇలాంటి కొంద‌రు నేత‌లు జ‌గ‌న్ కంటే చాలా సీనియ‌ర్లు. వీరంతా కూడా జ‌గ‌న్ కేబినెట్లో …

Read More »

మళ్ళీ లాక్ డౌన్ పెట్టేస్తున్నారు

కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఓ ఆటాడుకుంటోంది. తగ్గినట్లే తగ్గడం మళ్ళీ విజృంభిస్తుండటంతో చాలా దేశాలకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. కరోనా మహమ్మరి సమస్య ఎప్పటికి పోతోందో కూడా ప్రపంచానికి తెలియంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే తమ దేశాల్లో కరోనా వైరస్ తగ్గిపోయింది కాబట్టి మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొన్ని దేశాలు ప్రకటించిన విషయం గుర్తుందికదా. ఇపుడా దేశాల్లో మాస్కులు పెట్టుకోమని కాదు ఏకంగా లాక్ డౌనే విధించేశాయి. …

Read More »

చంద్రబాబు బాటలోనే జగన్

మిగిలిన విషయాల్లో ఎలాగున్నా ఉద్యోగుల పెన్షన్ విషయంలో మాత్రం చంద్రబాబానాయుడునే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారా ? అనే డౌటు పెరిగిపోతోంది. ఉద్యోగులకు చంద్రబాబు వ్యతిరేకం అనే బలమైన ముద్రఉంది. ఇపుడు జగన్ పైన కూడా అలాంటి ముద్రే పడే ప్రమాధం కనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు విషయంలో ఇచ్చిన హామీని తప్పటమే. అప్పట్లోనే సీపీఎస్ రద్దు చేసి …

Read More »

ప్లాయిడ్ హత్యకు కారణమైన పోలీసుకి దిమ్మ తిరిగే శిక్ష

అగ్రరాజ్యమైన అమెరికాను ఒక ఊపు ఊపేయటమే కాదు.. తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న ట్రంప్ సర్కారుకు చుక్కలు చూపించిన ఉదంతాల్లో నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ అమానుష హత్య ఒకటిగా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ పోలీసుల అధికారి చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. తానేం తప్పు చేయలేదని.. తనను వదిలేయాలని కోరటమేకాదు.. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నట్లుగా విలవిలలాడినప్పటికీ..కర్కసంగా వ్యవహించిన పోలీసులు అధికారి డెరిక్ చౌవిన్ కు సంచలన శిక్షను ఖరారు చేసింది కోర్టు. సూపర్ …

Read More »

కొంచెం లేట‌యినా.. కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో లాక‌ప్ డెత్‌కు గురైన మ‌రియ‌మ్మ కేసు విష‌యంలో కొంచెం లేట‌యినా.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. లాకప్‌డెత్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా… మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు.. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం …

Read More »

గ‌జ‌ప‌తులు ఎంగిలి మెతుకుల కోసం ఎగ‌బ‌డ్డారు- సాయిరెడ్డి

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు.. విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ.. అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్ప‌టి వర‌కు చేసిన విమ‌ర్శ‌ల‌ను దాటి భారీ రేంజ్‌లో దుయ్య‌బ‌ట్టారు. గ‌జ‌ప‌తులు బానిస‌ల‌ని.. బ్రిటీష్ వారి ఎంగిలి మెతుకుల కోసం ఎగ‌బ‌డ్డార‌ని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. వ‌రుస ట్వీట్ల‌తో సాయిరెడ్డి రెచ్చిపోయారు. ఒక‌వైపు.. సాయిరెడ్డిని నిలువ‌రించాలంటూ.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి తీవ్ర ఒత్తిడి …

Read More »

డిమాండ్లను మోడి అంగీకరిస్తారా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడితో జమ్మూ-కాశ్మీర్ నేతల సమావేశం కీలకమైనదనే చెప్పాలి. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. అయితే అన్నింటిలోను ఐదు అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు ప్రతిపక్షపార్టీల నేతలు చెప్పారు. ఐదే ప్రతిపక్షాలు పట్టుబట్టిన అంశాలపై నరేంద్రమోడి సానుకూలంగా స్పంధిస్తారా అనేది మాత్రం డౌటనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కాశ్మీర్ నుండి …

Read More »

వైఎస్ కూడా ఇలా చేయ‌లేదు.. జ‌గ‌న్‌పై బాబు ఫైర్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై మ‌రోసారి ఆవేద‌న‌, ఆక్రంద‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తు న్న తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా ఇలా ఎప్పుడూ చేయ‌లేద‌ని అన్నారు. తాజాగా పార్టీ శ్రేణులు, మీడియాతో వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సహా… ఏపీని పాలించిన ముఖ్యమంత్రులెవరూ సీఎం జగన్ తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదన్నారు. రెండేళ్లలోనే …

Read More »

చైనా మ‌రో పైశాచికం.. క‌రోనా విష‌యంలో ఏం చేస్తోందంటే

డ్రాగ‌న్ కంట్రీ చైనా.. మ‌రో పైశాచానికి తెర‌దీసిందా? క‌రోనా పుట్టుక‌కు.. కేంద్ర‌మైన చైనా.. ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. వూహాన్ న‌గ‌రంలో తొలి కేసు న‌మోదు కావ‌డం మొద‌లు.. ప్ర‌పంచం మొత్తం క‌రోనా గుప్పిట్లోకి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఫ‌లితంగా ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలి.. ఉద్యోగాలు పోయి.. కుటుంబాల‌కు కుటుంబాలే ఆప్తుల‌ను పోగొట్టుకుని రోడ్డున ప‌డ్డ విల‌యం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ విప‌రీతానికి చైనానే కార‌ణ‌మ‌ని.. …

Read More »

కేజ్రీవాల్ తప్పుడు లెక్కలు.. తేల్చిన ఆడిట్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా బీభత్సం సృష్టించలేదు. ముఖ్యంగా దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ మరింత ఎక్కువగా కనపడింది. కరోనా రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆక్సీజన్ కోసం ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రంతో చిన్నపాటి యుద్ధమే చేసింది. ఢిల్లీ కి ఆక్సీజన్ ఇవ్వాలంటూ.. హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో… కేంద్రం కూడా దిగి వచ్చి తర్వాత ఆక్సీజన్ అందించింది. …

Read More »

వైఎస్ పై శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ వ్యాఖ్యలు

సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం రాజకీయాల్లో మామూలే. జరుగుతున్న అంశాలకు సంబంధం లేని వారి పేర్లను తెర మీదకు తీసుకొచ్చి.. నోటికొచ్చినట్లు తిట్టటం మామూలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా సరే.. …

Read More »

కేసీఆర్ పై ఈటల ప్రశంసలు.. ఫేక్ లేఖ హస్తం ఎవరిది?

మాజీ మంత్రి ఈటల రాజేందర్… ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన.. కారు దిగేసి.. కషాయం గూటికి చేరారు. ఈ క్రమంలో… ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. పలు రకాల ఆరోపణలుచేశారు. పార్టీ మారే క్రమంలో.. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమే అని అందరూ అనుకున్నారు. అయితే.. సడెన్ గా ఈ రోజు ఈటల పేరిట.. సీఎం కేసీఆర్ ని …

Read More »