Political News

అమ‌రావ‌తి ఐకానిక్ వంతెన.. ముగలెట్టకుండానే కూల్చేస్తున్నారు

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న దీనికి కూల్చేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రాజ‌ధానిని మారుస్తూ.. మూడు రాజ‌ధానులుగా నిర్ణ‌యించారు. దీనిపై ప్ర‌జ‌లు, రైతుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా సీఎంగా చంద్ర‌బాబు గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా తిరిగితోడుతున్న జ‌గ‌న్‌.. రాజ‌ధాని ప‌రిధిలోని క‌ర‌క‌ట్ట స‌మీపంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల కోసం నిర్మించిన ప్ర‌జావేదిక‌ను …

Read More »

రోజాకి ఊహించని షాకిచ్చిన జగన్..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఊహించని షాక్ ఎదురైంది. పార్టీలో ప్రస్తుతం రోజా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నా ఆమెకు కనీసం మంత్రి పదవి ఇచ్చింది లేదు. ఆ విషయంలో ఆమె బాధపడకుండా ఉండేందుకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి కట్టపెట్టారు. కాగా.. ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా ఆమెను తొలగించడం గమనార్హం. ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజాని తొలగించి.. …

Read More »

శ్మ‌శానాన్నీ అమ్మేయాల‌నుకున్న కేసీఆర్‌.. కానీ.. బిగ్ బ్రేక్‌!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని కేసీఆర్‌ ప్ర‌భుత్వం ఆర్థిక క‌ష్టాల్లో ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ భూముల‌ను వేలానికి పెట్టింది. కోకాపేట్‌లో ప్రారంభ‌మైన ఈ భూములమ్మే ప్ర‌క్రియ‌.. ఖానామెట్‌వ‌ర‌కు పెరిగింది. కోకా పేట‌లో కోట్ల రూపాయలు పలికిన ప్రభుత్వ భూముల ధరలు.. ఖానామెట్‌లోనూ అదే పరంపరను కొనసాగించాయి. ‘ఇ-ఆక్షన్‌’లో ఎకరానికి అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. కోకాపేటలో ఎకరానికి అత్యధికంగా రూ.60.20 కోట్లు రాగా.. ఇక్కడ రూ.5 కోట్లు తగ్గాయి. ఖానామెట్‌లో 14.91 …

Read More »

జగన్ బెయిల్ రద్దయితే ఏమవుతుందో తెలుసా ?

అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయితే జరగబోయేదేమిటో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఎలాగైనా బెయిల్ రద్దుచేయించి జగన్ను మళ్ళీ జైలుకు పంపేందుకు వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై నారాయణ మీడియాతో మాట్లాడుతు రఘురామ తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ రద్దుచేయించి మళ్ళీ జైలుకు పంపాలన్న రఘురామ ప్రయత్నాన్ని తప్పుపట్టారు. ఎంపి ప్రయత్నాలు ఫలించి ఒకవేళ …

Read More »

సీఎం పేషీ ప‌రువు తీస్తున్న జ‌గ‌న్‌ ఆప్తులు..!

రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్ కార్యాల‌యం అంటే.. కేవ‌లం పాల‌న‌కు మాత్ర‌మే కేంద్రంగా ఉండాల్సిన అవ‌సరం ఉంది. ఇది సాధార‌ణంగా ఏ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో అయినా.. జ‌రిగేదే. పాల‌న‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌కు, విధివిధానాల నిర్ణ‌యాల‌కు సీఎంవో వేదిక‌గా ఉండాలి. అయితే.. కొన్నాళ్లుగా ఏపీ సీఎం జ‌గ‌న్ కార్యాల‌యం మాత్రం రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారింద‌నే వాదన బ‌లంగా వినిపిస్తోంది. కొంద‌రు అధికారులు.. స‌ల‌హాదారులు పైచేయిసాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి …

Read More »

ప‌వ‌న్ వ్యూహాత్మ‌క రాజ‌కీయం.. స‌క్సెస్ అయ్యేనా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా ? రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌నే విష‌యంలో ఆయ‌న స్ప‌ష్ట‌మైన క్లారిటీతో ఉన్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జ‌ల వివాదాలు స‌హా అనేక విభ‌జ‌న స‌మ‌స్య‌ల విష‌యంపై అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతోంది. ఈ విష‌యంలో ఎవ‌రు జోక్యం చేసుకున్నా.. తెలంగాణ‌తో బంధాలు తెంపుకోవాల్సి ఉంటుంది. బ‌హుశ అందుకే.. ప్ర‌ధాన …

Read More »

కేటీఆరా.. అంటే ఆయనెవరు..?

కేటీఆర్ ఎవరో తనకు తెలీదన్నారు.. వైఎస్ షర్మిల. తన పార్టీనేతలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో.. తనకు అసలు కేటీఆర్ ఎవరో తనకు తెలీదంటూ ఆమె మాట్లాడటం గమనార్హం. కేటీఆర్ గురించి మీడియా మిత్రులు ఏదో ప్రశ్న లేవనెత్తగా.. అసలు కేటీఆర్ అంటే ఎవరు..? ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే …

Read More »

కరోనా థర్డ్ వేవ్ తట్టుకోవడం చాలా కష్టం..!

కరోనా మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆసుప‌త్రుల్లో బెడ్స్ లేక‌, ఆక్సిజ‌న్ అంద‌క‌, రోజురోజుకు పెరుగుతున్న కేసుల‌తో జ‌నం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెడ్ ఇప్పించండి అంటూ పైర‌వీలు చేశారు. ఆస్తులు, పుస్తెల‌మ్మి కూడా ప్రైవేటు ఆసుప‌త్రుల బిల్లులు క‌ట్టారు. కొన్ని చోట్ల అయితే క‌రోనా మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేసేందుకు కూడా క్యూలైన్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే, క‌రోనా …

Read More »

మోడికి వ్యతిరేకంగా మమత మొదటి స్టెప్ ?

Mamata

ఉమ్మడి ప్రత్యర్ధిని ఎదుర్కొనేందుకు ఇద్దరు ఏకమవుతున్నారా ? ఢిల్లీ కేంద్రంగా మొదలైన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నరేంద్రమోడిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు బద్ధ శతృవులైన కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ చేతులు కలుపుతున్నట్లే ఉన్నాయి. ఈనెల 25వ తేదీన సోనియాగాంధీ-మమత భేటీ జరగబోతోందని సమాచారం. 19వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో ఎన్డీయేని ఇరుకునపెట్టడానికి తృణమూల్ ఎంపీలు రెడీ అవుతున్నారు. 25వ తేదీన …

Read More »

జగన్ కు డేంజర్ బెల్స్ ?

తొందరలోనే జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగటం ఖాయమనే అనిపిస్తోంది. అయితే ఈ డేంజర్ బెల్స్ మోగించేది మామూలు జనాలు కాదు ఉద్యోగులే అనే ప్రచారం పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూసే పీఆర్సీ గురించి ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. దీనికి అదనంగా బకాయిలున్న డీఏల విషయంలో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. నిజానికి ఉద్యోగులకు రెండు బకాయిలను 2018 లోనే పీఆర్సీ వేయాల్సింది చంద్రబాబు …

Read More »

ఎంపీ రఘురామకు నోటీసులు.. ఇప్పుడేం జరగనుంది?

కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ ఎండింగ్ స్టేజ్ కు వచ్చేసినట్లేనా? అన్న భావన కలిగేలా తాజా పరిణామాలు ఉండటం గమనార్హం. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే.. తాము గెలిచిన పార్టీ పట్ల విధేయతతో ఉండటం.. పార్టీ లైన్ కు తగినట్లుగా వ్యవహరించటం చాలా కీలకం. అందుకు భిన్నంగా తనకు తోచినట్లు మాట్లాడటం.. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయటం.. పార్టీ అధినేతపై అదే పనిగా …

Read More »

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం షాక్‌

రొట్టెముక్క కోసం గొడవపడ్డ రెండు పిల్లులు చివరికి దాన్ని కోతి పాలు చేసినట్లు.. జల వివాదాన్ని తారస్థాయికి చేర్చిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నీటి ప్రాజెక్టుల‌న్నీ కృష్ణా, గోదావ‌రి బోర్డుల ఆధీనంలోకి వెళ్ల‌నున్నాయి. వాటి నిర్వ‌హ‌ణ‌తో స‌హా అన్ని విష‌యాల‌పై ఇక పెత్త‌న‌మంతా ఆ బోర్డుల‌దే. ప్రాజెక్టుల నుంచి నీటి బొట్టు వాడుకోవాల‌న్నా.. ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకోవాల‌న్నా ఇప్పుడిక …

Read More »