యువత రాజకీయాల్లోకి రావాలి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున యువతకు అవకాశం ఇస్తాం.. 40 శాతం టికెట్లు కేటాయిస్తాం.. ఇవీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. వీటిని బట్టి చూస్తుంటే వచ్చే ఏపీ ఎన్నికల్లో యువతకు బాబు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై సీనియర్లు దృష్టి పెట్టకపోవడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోవడం లాంటి కారణాల వల్ల ఆయా నియోజకవర్గాల్లో యువతను …
Read More »బాబు, బీజేపీని కలిపేది అతనేనా?
ఎన్నికలకు.. చంద్రబాబు పొత్తులకు అవినాభావ సంబంధం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆయన ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన సందర్భాలు చాల తక్కువ. ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఆయన పొత్తులు పెట్టుకోవడం ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు జనసేన కూడా అందుకు సిద్ధమంటోంది. ఇక మరోవైపు బీజేపీని కూడా కలిపేసుకోవాలని బాబు తెగ ఆరాటపడుతున్నారు. కానీ బీజేపీ నాయకత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. …
Read More »జాబితా రెడీ.. ముహూర్తం ఫిక్స్.. మంత్రి వర్గానికి ఫేర్వెల్
జగన్ కేబినెట్లో మంత్రుల మార్పునకు ముహూర్తం ఫిక్సయిపోయింది. ఇప్పటికే కొత్తగా పదవులు తీసుకునే మంత్రుల జాబితా కూడా రెడీ అయిపోయిందని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా.. పరిస్థితి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. జగన్ మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నాయకురాలికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైంది. అదే విధంగా స్పీకర్ తమ్మినేనిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. …
Read More »చంద్రబాబు చెప్పిన 40 40 40 లెక్కేమిటంటే..?
టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా భాగ్య నగరి వీధుల్లో పసుపు కళకళలు చాలా రోజులకు తళుకులీనాయి. ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా చంద్రబాబు ప్రసంగించారు. కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకు ఏడు పదుల వయస్సులోనూ అంటే 70 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఎంతో ప్రయత్నించారు. శ్రేణులలో ఉత్సాహంతో పాటు కార్యాచరణను పెంపొందించేందుకు కూడా చంద్రబాబు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇవాళ కూడా శ్రమించారు కూడా! ఆయన అంతర్మథనంలో భాగంగా పార్టీకి సంబంధించి నాలుగు కాదు …
Read More »టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదు.. 27 ఏళ్ల సంబరమే: సజ్జల
ఎన్టీఆర్ ఉన్న టీడీపీ వేరు.. ఇప్పటి టీడీపీ వేరని.. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలనేది ఇప్పటి టీడీపీ పాలసీ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదని.. 27 ఏళ్ల సంబరమేనంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్పై ప్రేమను అదేసమయంలో చంద్రబాబుపై అక్కసును వెళ్లగక్కడం గమనార్హం. ‘వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. ఆయనకు మీడియా …
Read More »ఆవిర్భావ వేళ : ఆనాటి రాముడు ఈనాటి చంద్రుడు
ఎన్టీఆర్ ను మించిన లీడర్ లేరు. రారు కూడా! రాలేరు కూడా ! అదంతా ఓ కల. వైఎస్సార్ కు సైతం ఆయన ఓ ఆదర్శం అంటే అది అతిశయం కాదు. వైఎస్సార్ కే కాదు వైఎస్సార్సీపీకి కూడా ఆయనే ఆదర్శం అని రాయాలి. ఎందుకంటే జగన్ సైతం అంగీకరించింది, ఎలుగెత్తి చాటింది ఎన్టీఆర్ ఆ రోజు వినిపించిన ఆత్మగౌరవ నినాదాన్నే! అందుకే ఆయన ఆ రోజు కాంగ్రెస్ పెద్దలను …
Read More »మేం గాజులు తొడుక్కుని లేం.. మళ్లీ జగనే సీఎం
ఏపీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం నాయకుడు.. ధర్మాన కృష్ణ దాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవకపోతే.. తమ కుటుంబం.. తన తమ్ముడి(ధర్మాన ప్రసాద్)తో సహా.. రాజకీయాల నుంచి తప్పుకొంటామని వ్యాఖ్యానించా రు. “మేం చేతులకు గాజులు తొడుక్కుని లేం. చూస్తూ కూర్చోం.. వచ్చే ఎన్నికల్లో.. జగన్ను మళ్లీ సీఎం చేసుకునేందుకు.. ఏం చేయాలో మాకు …
Read More »టీడీపీ 40 ఏళ్ల పండుగ.. చంద్రబాబు ఏమన్నారంటే..!
తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీగా రికార్డు సృష్టించిన.. టీడీపీకి నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. ఆత్మ విశ్వాసంతో తెలుగు దేశం పార్టీని రామారావు స్థాపించారని స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భవించి 40 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »గుడ్ మార్నింగ్.. గుడ్ న్యూస్ చెప్పేనా?
పొద్దున లేవగానే నియోజకవర్గంలో పర్యటన.. ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకోవడం.. అక్కడే అధికారులతో మాట్లాడడం.. ఇలా సామాజిక మాధ్యమాల్లో వీడియోలతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాపులర్గా మారారు. తన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు సంపాదించారు. తన మార్నింగ్ వాక్తో ఆయన పేరు ప్రజల్లో నానుతోంది. ఇప్పుడా మార్నింగ్ వాక్ కార్యక్రమమే ఆయనకు మంత్రి పదవి తెచ్చి పెట్టేలా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అనంతపురం జిల్లా …
Read More »ఏపీ సలహదారుగా నోబెల్ గ్రహీత?
ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేయటానికి మరో ఆర్ధికవేత్త ఎస్తేర్ డఫ్లో రెడీ అయ్యారు. ఈమె ప్రఖ్యాత ఆర్ధికవేత్తే కాకుండా నోబెల్ పురస్కార గ్రహీత కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఎస్తర్ పనిచేయనున్నారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మరి ఎస్తర్ ఏ స్ధాయిలో పనిచేస్తారు ? ఆమె ఇవ్వబోయే సూచనలు, సలహాలు ఏమిటి ? అవి ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలు ఎవరికీ అర్ధం కావటం లేదు. …
Read More »పోరాటంలోనే పదవుల వేట.. టీడీపీ తమ్ముళ్లకు తగునా?
ప్రస్తుతం రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అనేక అంశాలపై నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమం లో వైసీపీ సర్కారుపై తమదైన శైలిలో నాయకులు విజృంభిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో తమ్ముళ్లు చేస్తున్న నిరసనలపై.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎవరికివారు నిరసనల్లోనూ.. మైలేజీ వెతుకుతున్నారనేది నెటిజన్ల వాదన. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఇది మంచిదే. ఏ పార్టీ మాత్రం …
Read More »కాంగ్రెస్ ఎదగాలని కోరుకుంటున్న బీజేపీ సీనియర్ నేత
కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపేమో నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను దేశం నుండి పారదోలాలని పిలుపిస్తున్నారు. ఇదే సమయంలో ముంబాయ్ లో గడ్కరీ మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతమవ్వాలని సూచించారు. ఓటములు ఎదురువుతున్నాయని నీరసపడి పోకుండా మళ్ళీ బలోపేతమవ్వటానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేయాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ పిలుపుకు గడ్కరీ పిలుపు పూర్తి విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates