కేసీయార్ హయాంలో రూపుదిద్దుకున్న గృహలక్ష్మి పధకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. పథకాన్ని రద్దుచేస్తు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన పేదలు ఇళ్ళు కట్టుకోవటానికి వీలుగా కేసీయార్ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్దేశించిందే గృహలక్ష్మి పథకం. అయితే ఈ పథకంలో ఎంతమంది లబ్దిపొందారన్న వివరాలు ప్రభుత్వం దగ్గర పూర్తిగా లేవు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి బాగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపధ్యంలోనే …
Read More »ఏపీ కాంగ్రెస్ తో కలిసి నడుస్తా: షర్మిల
ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ స్వయంగా షర్మిల ఈ విషయాన్ని వెల్లడించారు. ఇడుపులపాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి ముందు ఉంచిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తన కుమారుడి పెళ్లి జరగబోతోందని, …
Read More »జగన్ కు షాక్..టీడీపీ గూటికి దాడి!
ఏపీలో శాసనసభ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలలోని అసంతృప్త నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ రాని నేతలంతా టీడీపీ, జనసేలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ టీంలో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. …
Read More »చంద్రబాబు, పవన్ కలిసి 22 సభలకు ప్లాన్!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నాహాలు మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జనవరి 5వ తేదీ నుంచి చంద్రబాబు ‘రా… కదలిరా’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘రా… కదలిరా’ పోస్టర్లలో టీడీపీ సైకిల్, జనసేన గ్లాసు గుర్తులు పక్కపక్కనే ముద్రించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు బహిరంగ సభలు …
Read More »ఎంతెంత దూరం.. వైసీపీ బ్యాడ్ అవుతోంది ఇక్కడే!
ఏ నాయకుడైనా.. చేజేతులా పార్టీని నాశనం చేసుకుంటారా? నాయకులను వదులు కుంటారా? అంటే.. కాదనే చెప్పాలి. ఎందుకంటే.. పార్టీ అంటే.. జెండాలు, కర్రలు, నినాదాలే కాదు.. నాయకులు! కార్యకర్తలు. ఈ రెండు లేకుండా ఎన్ని జెండాలు కట్టినా.. ఎన్ని నినాదాలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఇలానే మారిపోయింది. నాయకులను దూరం చేసుకుంటున్నారు. కార్యకర్తలను కాదనే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు… లోటస్ పాండ్లో పార్టీ కార్యాలయం ఉంటే.. …
Read More »ఏపీసీసీ చీఫ్ గా షర్మిల?
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి లేదా ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో కీలక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీగా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిలతోపాటు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాలని షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో, అదే రోజున …
Read More »ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. రంగు పడేదెవరకి?
తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా! అన్నట్టుగా మారింది వైసీపీలోని ఎంపీ, ఎమ్మెల్యేల పరిస్థితి. ఇద్దరూ ఒకే పార్టీ తరఫున గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇద్దరూ ఒకే పార్లమెంటు పరిధిలోనూ ఉన్నారు. కానీ, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. ఎన్నికల్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకునే దాకా చేరుకుంది. ఆయనకు టికెట్ ఇవ్వద్దని.. ఒరంటే, కాదు, ఆయనకే టికెట్ …
Read More »మంత్రి గారి వియ్యంకుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ!
ఆయన మంత్రిగారికి వేలు విడిచిన వియ్యంకుడు. చాలా దూరపు బంధువే.. అయినా.. రాజకీయంగా చూస్తే మాత్రం చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. దీంతో సదరు నాయకుడు.. మంత్రిగారి ప్రొద్బలంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ట్రై కూడా చేసేస్తున్నారు. దీంతో కీలకమైన నియోజకవర్గంలో రాజకీయ కాక పెరిగిపోయింది. మరి ఆ విశేషాలు.. తెలుసుకుందామా! ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చోడవరం. ఇక్కడ నుంచి …
Read More »ఎస్టీ స్థానాల్లో లెక్కకు మించిపోయారుగా!
సాధారణంగా ఎస్టీ అసెంబ్లీ స్థానాలను తీసుకుంటే.. అది ఏ పార్టీ అయినా.. పోటీ చేసేందుకు నాయకుల సంఖ్య పెద్దగా ఉండేది కాదు. ఒకరిద్దరు మాత్రమే పోటీ పడేవారు. వారిలోమెరుగైన వారిని పార్టీలు ఎంపిక చేసుకుని టికెట్లు ఇచ్చేవి. ఇతర సామాజిక వర్గాలకు ఇక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి.. ఎస్టీల్లో నే పోటీ కూడా ఉండేది. కొన్ని కట్టుబాట్లు.. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా మిగిలిన నాయకులు సర్దుకు …
Read More »రెండో వికెట్ పడుతోందా?
అధికారపార్టీలో జరుగుతున్న మార్పుల కారణంగా తొందరలోనే రెండో వికెట్ పడిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. రెండో వికెట్ ఎవరిదంటే ఎమ్మిగనూరు ఎంఎల్ఏ ఎర్రకోట చెన్నకేశవరెడ్డిదనే ప్రచారం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటం లేదని ఇదివరకే ఎంఎల్ఏ ప్రకటించారు. అయితే టికెట్ తన కొడుక్కి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని అడిగారు. అందుకు ఇపుడు జగన్ నో చెప్పారట. దాంతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. …
Read More »బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఫిట్టింగ్ పెట్టిందా?
నీవు నేర్పిన విద్యయే అన్న పద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. అందుకనే మంత్రుల పర్యటనల్లో కావాలనే ప్రోటోకాల్ వివాదాన్ని తెస్తోంది. ప్రటోకాల్ పాటించటంపై తొందరలోనే కోర్టులో కేసులు వేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే జనగామ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు. ఆ సమీక్షలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఓడిపోయిన కాంగ్రెస్ నేతను కూడా మంత్రి వేదిక …
Read More »అసమ్మతి నేతలపై వేటు తప్పదా ?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, జరిగిన డెవలప్మెంట్ల ఆధారంగా అసమ్మతి నేతలపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో బాగంగానే ఢిల్లీనుండి వచ్చి సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసమ్మతిపై వేటు వేయటంలో స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతిని మొగ్గలోనే తుంచేయటంలో భాగంగా ఎంతటి నేతలైనా సరే ఉపేక్షించవద్దని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అమిత్ షా స్పష్టంగా …
Read More »