Political News

ముంబైలో లోకేష్ బిజీ బిజీ: పెట్టుబ‌డుల వేట‌!

టీడీపీ యువ నాయ‌కుడు, ఏపీ ఐటీ శాఖ‌ మంత్రి నారా లోకేష్ మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు పారిశ్రామిక వేత్త‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఆయ‌న ఒక‌ర‌కంగా వేట చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ముంబైలో ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేష్ కూడా.. ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. ఆయ‌న వెంట మంత్రి టీజీ భ‌ర‌త్ కూడా ఉన్నారు. పెట్టుబ‌డుల విష‌యంలో …

Read More »

జూబ్లీహిల్స్‌పై క‌మ‌లనాథుల దృష్టి… టికెట్ ఎవ‌రికి?

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  ఈ క్ర‌మంలో ప్ర‌ధాన పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల ఎంపికై క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ న‌లుగురి పేర్ల‌తో పార్టీ అధిష్టానానికి నివేదిక పంపించింది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ కూడా త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేసింది. మాజీ ఎమ్మెల్యే, దివంగ‌త మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి సునీత‌కు బీఆర్ ఎస్ టికెట్ …

Read More »

బిహార్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మొత్తం రెండు ద‌శ‌ల‌లో నిర్వ‌హించనున్న ఈ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ ఢిల్లీలో తాజాగా వెల్ల‌డించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల‌కుగాను.. రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబ‌రు 6, 11న ఈ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. ఇక‌, సోమ‌వారం నుంచే ఎన్నిక‌ల కోడ్ అమల్లోకి …

Read More »

నేను ఓడిపోయిన‌ప్పుడు ఆయ‌న వెన్నంటి ఉన్నారు: ప‌వ‌న్

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను 2019 ఎన్నిక‌ల్లో రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటి చేసినా.. ఓడిపోయాన‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో చాలా నిర్వేదానికి..నిరాశ‌కు గురైన‌ట్టు చెప్పారు. అలాంటి స‌మ‌యంలో త‌న‌కు వెన్నంటి ఉండి.. ధైర్యం చెప్పి.. భ‌విష్య‌త్తుపై  ఆశ‌లు చిగురించేలా చేసిన వ్య‌క్తి .. సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వి. గోపాల గౌడేన‌ని పేర్కొన్నారు. త‌న రాజ‌కీయ …

Read More »

జూబ్లీహిల్స్ పోరుకు రంగం సిద్ధం.. పోలింగ్ ఎప్పుడంటే…

హైద‌రాబాద్‌లో కీల‌క‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న ఈ ఉప ఎన్నిక‌కు డేట్ ఫిక్స్ చేసింది. న‌వంబ‌రు 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల‌కు పోలింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపింది. అయితే.. నామినేషన్ల ప్ర‌క్రియ‌.. ఉప‌సంహర‌ణ వంటి కీల‌క అంశాల‌పై మరోసారి నోటిఫికేష‌న్ వెలువ‌డ నుంది. ఇక‌, ఈ ఎన్నిక‌ల ఫలితాల‌ను.. న‌వంబ‌రు 14న వెల్లడిస్తారు. మొత్తం ఈవీఎం ఆధారంగానే జూబ్లీహిల్స్ …

Read More »

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీం నిర్ణ‌యం: రేవంత్ గెలిచిన‌ట్టా?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న‌ది తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. దీనిపైనే ఆశ‌లు భారీగా కూడా పెట్టుకున్నారు. అయితే, రిజ‌ర్వేష‌న్ అంశం ఒక ప‌ట్టాన కొలిక్కిరావ‌డం లేదు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాలు స‌ర్కారుకు క‌లిసి వ‌చ్చినా.. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో ఉన్న గ‌వ‌ర్న‌ర్‌, రాష్ట్ర‌ప‌తి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఈ బిల్లుకు ఆమోదం తెల‌ప‌లేదు. దీంతో ప్ర‌త్యేకంగా ఓ జీవోను తీసుకువ‌చ్చారు. దీనిపై మ‌ల్కాజిగిరి …

Read More »

ప‌నే కాదు.. ప‌ద్ధ‌తీ బాగుండాలి ఎమ్మెల్యే మేడమ్స్‌..!

రాజకీయ నాయకులు ప్రజల మధ్యకు రావడం, పనులు చేయటం కామన్. ఆయా నాయకులకు ఇవి అవసరం కూడా. అయితే పనులు చేయటం వరకు బాగానే ఉన్నా దూకుడుగా వ్యవహరించడం మాత్రం ఏ నాయకుడికి కలిసివచ్చే అంశంగా చెప్పలేం. ఇదే ఇప్పుడు టిడిపి నాయకులకు శాపంగా మారిందని చెప్పాలి. కొందరు నాయకులు దూకుడుగా ఉంటున్నారు. మరి కొందరు నాయకులు ప్రజలకు చేరువవుతున్నారు. ఇంకొందరు మాత్రం అటు పనులు చేస్తూనే ఇటు వివాదాలను …

Read More »

నేను చెబితే కానీ.. క‌ద‌ల‌రా?: బాబు ఆగ్ర‌హం

మంత్రుల వైఖ‌రిపై కొన్నాళ్లుగా అస‌హ‌నంతో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒకే రోజు రెండు ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. ఈ రెండు అంశాలు ప‌త్రిక‌ల్లో భారీ ఎత్తున క‌వ‌ర్ అయ్యాయి. అయితే.. ఈ విష‌యాల‌పై మంత్రులు స్పందించ‌క‌పోవ‌డాన్ని తాజాగా సీఎం చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. “నేను చెబితే కానీ.. క‌ద‌ల‌రా?” అంటూ.. అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఆయా అంశాల‌పై త‌న‌కు …

Read More »

తిరుమల త‌ర‌హాలో శ్రీశైలం

అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు.. శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.. ఇప్పుడు ఎన్నివేల మంది భ‌క్తులు వెళ్లినా.. ప్రశాంతంగా స్వామిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అభి వృద్ధి చేశారు. నిత్యాన్న‌దానం నుంచి ఉద‌యం పూట టిఫిన్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ అభివృద్ధిలో గ‌త ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వాలు కీల‌క పాత్ర పోషించాయి. ఇది రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఒప్పుకొనే మాట‌. అదేవిధంగా ఇప్పుడు మ‌రో ప్ర‌ముఖ ఆల‌యాన్ని కూడా అభివృద్ధి …

Read More »

కాంగ్రెస్‌కు టికెట్ క‌ష్టం: ‘జూబ్లీహిల్స్‌’కు న‌లుగురితో జాబితా!

హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీ హిల్స్‌కు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ కాంగ్రెస్‌.. అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో గ‌తంలో ఉన్న తిప్ప‌లే ప‌డుతోంది. ఓ న‌లుగురిని ఎంపిక చేయ‌డం.. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి.. ఫైన‌ల్ చేయించ‌డం.. కామ‌న్‌గా మారింది. వాస్తవానికి పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందే ఫైన‌ల్. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కూడా న‌లుగురు …

Read More »

బాబుకు భారం: మ‌హిళ‌ల కోసం రోజుకు 8 కోట్లు

ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డం తేలికే.. కానీ, వాటి అమ‌లుకు వ‌చ్చే స‌రికి మాత్రం త‌ల ప్రాణం తోక‌కు వ‌స్తోంది. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సును ప్ర‌క‌టించినా.. త‌ర్వాత కాలంలో ప్ర‌భుత్వాలు ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నాయి. మొద‌ట్లో బాగానే ఉన్నా.. ఉచితం భారం రాబోయే రోజుల్లో స‌ర్కా రు మెడ‌కు గుదిబండ‌లా మారుతున్నాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వానికి కూడా షాకే త‌గిలింది. త‌మ‌కు 360 కోట్ల రూపాయ‌లు బ‌కాయి ఉన్నారంటూ.. …

Read More »

‘శీష్’ మ‌హల్‌కు ప‌రిష్కారం.. మ‌రి ‘రుషికొండ’ ప్యాలెస్ సంగ‌తేంటి?

శీష్ మ‌హ‌ల్‌(అద్దాల బంగ‌ళా).. ఈ మాట కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో జోరుగా వినిపించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని ఆరో భ‌వంతి ఇది. అప్ప‌టి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఈ బంగ‌ళాకు.. 200 కోట్ల రూపాయల ప్ర‌జాధ‌నాన్ని వెచ్చించి.. అత్యంత ఆధునిక వ‌స‌తుల‌తో పున‌ర్నిర్మాణం చేశారు. దీనిపై బీజేపీ నేత‌లు అప్ప‌ట్లో నిప్పులు చెరిగారు. ఢిల్లీ అస‌లే అప్పుల్లో …

Read More »