Political News

కోటంరెడ్డి హత్యకు ప్లాన్..? కుట్ర వెనుకున్నది ఎవరు?

ఏపీలో 11 సీట్లకే పరిమితమైనప్పటికీ వైసీపీ నేతల అరాచకాలు అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పేందుకు మరో నిలువెత్తు సాక్ష్యం ఇది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ ఎన్నికల్లో తనకు గట్టి పట్టున్న నెల్లూరు రూరల్ నుంచి మరోమారు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలతో సంబందం లేకుండా గెలుస్తూ వస్తున్న కోటంరెడ్డిని హత్య చేసేందుకు ఓ వైసీపీ నేత ఏకంగా భారీ ప్లానే వేశారు. ఆ వైసీపీ నేత ఎవరన్నది తెలియకున్నా… ప్లాన్ లో పాలుపంచుకునే …

Read More »

`రుషికొండ ప్యాలెస్‌`ను ఏం చేయాలో తెలీట్లా!: పవన్

వైసీపీ పాల‌నా కాలంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ముఖ పర్యాట‌క ప్రాంతం రుషికొండ‌పై నిర్మించిన ప్యాలెస్ ను ఏం చేయాలో తెలియడం లేద‌ని జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. దీని నిర్మాణానికి 500 కోట్ల‌కు పైగానే ప్ర‌జా ధ‌నం వెచ్చించార‌ని తెలిపారు. విశాఖ‌లో సేన‌తో సేనాని కార్యక్రమం నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రుషికొండ‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. ప్యాలెస్‌లోని ప్ర‌తి గదినీ ప‌రిశీలించారు. …

Read More »

బెజవాడ నేతల పై లోకేష్ అసహనం.. కారణం ఏమిటి..!

విజయవాడ నేతలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీపై కూడా ఆయన అసహనంతో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలను టిడిపి నాయకులు కైవసం చేసుకున్నారు. సాధ్యం కాదు అనుకున్న చీరాల, విశాఖపట్నం వంటి చోట్ల కూడా టిడిపి నాయకులు జెండా పాతారు. ప్రస్తుతం 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టిడిపి పరిధిలోకి వచ్చాయి. జనసేన …

Read More »

ఇదేం పద్ధతి: భూమన పై జగన్ ఫైర్..!

వైసీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను పదజాలంతో దూషించడంతో పాటు అవినీతి, అక్రమాలు, వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఆయన ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది పార్టీలో చర్చగా మారగా, వైసీపీ అధినేత జగన్ భూమనను హెచ్చరించారన్నది పార్టీ వర్గాల మాట. సీనియర్ …

Read More »

చేసిన మంచిని మ‌రిచి.. న‌న్ను తిడుతున్నారు: ప‌వ‌న్

“చేసిన మంచిని మ‌రిచి.. న‌న్ను తిడుతున్నారు“- అని జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. అయినా.. తాను బాధ‌ప‌డ‌డం లేద‌ని, ఇంకా మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అన్నారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హిస్తున్న `సేన‌తో సేనాని` కార్య‌క్ర‌మంలో ప‌లు విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి దారుణ హ‌త్య‌, అనంత‌ర ప‌రిణాల‌ను ప్ర‌స్తావిస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2017-18 మ‌ధ్య సుగాలి …

Read More »

కొద్ది మందితో పెద్ద ప్లాన్: ప‌వ‌న్ వ్యూహం ఇదేనా?

జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌హారాలు, ప్ర‌జ‌ల్లో ఆ పార్టీకి పెర‌గాల్సిన ఇమేజ్ స‌హా అనేక అంశాల‌పై చర్చించేందుకు డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ వేదిక‌గా సేన‌తో సేనాని కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మం మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. చివ‌రి రోజు బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. తాజాగా గురువారం ప్రారంభ‌మైన తొలిరోజు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ …

Read More »

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా స్పీకర్ ప్రసాదరావు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలను చర్చించాలనే విషయంపై సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనికి అన్ని పార్టీల నేతలను …

Read More »

చంద్ర‌బాబు నిఘా నేత్రం: ఇక త‌ప్పు చేస్తే క‌ష్ట‌మే..!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, వివాదాల‌కు త‌న‌దైన శైలిలో చెక్ పెట్ట‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క, ఇక నుంచి మ‌రో లెక్క అన్న‌ట్టుగా చంద్ర‌బాబు నిర్ణ‌యాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ముగ్గురు ఐఏఎస్‌ల‌తో ఏర్పాటుచేసిన అంత‌ర్గ‌త క‌మిటీ ఇటీవ‌ల ఆయ‌న‌కు నివేదిక స‌మ‌ర్పించింది. నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల దూకుడును క‌ట్ట‌డి చేయ‌డంతో పాటు అభివృద్ధిని ఎలా ప‌రుగులు …

Read More »

కమ్యూనిస్టుల్లో కుల చిచ్చు.. ఏపీలో ఏం జరిగిందంటే!

కమ్యూనిస్టులు అంటేనే కులాలకు, మతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. కుల జాడ్యాలు, మూఢ నమ్మకాల‌కు వ్యతిరేకంగా వారు పోరాటాలు చేసిన సంస్కృతి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కాగితాలకే, గతానికే పరిమితం అయ్యే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లో తాజాగా కుల చిచ్చు రేగింది. ముఖ్యంగా కీలక పదవి విషయంలో కామ్రెడ్స్ రెండుగా చీలిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. …

Read More »

కేంద్ర మంత్రి: ఈ సారి సీమకేనా??

కేంద్రంలో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు రంగం రెడీ అయింది. వ‌చ్చే నెల 9న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఉంది. ఇది పూర్తికాగానే.. ద‌స‌రా సంద‌ర్భంగా(అక్టోబ‌రు తొలివారం) మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి నిర్ణ‌యించుకున్నారని తెలుస్తోంది. త్వర‌లోనే బీహార్‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులోనూ వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాల‌కు చెందిన కీల‌క నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇవ్వాల‌ని భావిస్తున్నారు. త‌మిళ‌నాడు నుంచి అవ‌స‌ర‌మైతే .. రాజ్య‌స‌భ‌కు …

Read More »

మెద‌క్‌-కామారెడ్డిలు అల్లకల్లోలం… ఏమైంది?

తెలంగాణ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు రాజ‌ధాని హైద‌రాబాద్ నీట మునిగింది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జల‌ను ప్ర‌భుత్వం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది. రాజ‌ధాని కావ‌డంతో అధికార యంత్రాంగం హుటా హుటిన స్పందించి.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుంది. కానీ, వ‌ర్షాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగా తయారైంది. స‌హాయ‌క సిబ్బంది త‌క్కువ‌గా ఉండ‌డం.. వ‌ర్షాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. మెద‌క్-కామారెడ్డి …

Read More »

15 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త్ ప్ర‌య‌త్నం.. సాకార‌మ‌య్యేనా?

దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత‌.. భారత్ చేస్తున్న ప్ర‌య‌త్నం.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు పావులు క‌ద‌ప‌డం. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప‌చ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి అంత‌ర్జాతీయ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల సంఘం నిర్వ‌హించే బిడ్డింగ్‌లో పాల్గొనాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఇప్పుడు వేసే బిడ్ ద్వారా 2030లో నిర్వ‌హించే కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌కు భార‌త్ …

Read More »