వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మీద నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. తనను ఎవరు విమర్శించినా దీటుగా బదులిచ్చే రోజా.. ఈ కామెంట్లకు బాగా హర్టయినట్లు కనిపించారు. సాక్షి టీవీలో డిబేట్లో దీని గురించి మాట్లాడుతూ ఆమె బోరున ఏడ్చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ అంశం మీద సోషల్ …
Read More »మిథున్ అరెస్టుతో వైసీపీకి నష్టమెంత.. !
వైసీపీ కీలక నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని అరెస్టు చేయడం.. రాజమండ్రి జైలుకు పంపిం చడం కేవలం 36 గంటల్లోనే జరిగిపోయాయి. ఇది అనూహ్యమనే చెప్పాలి. మద్యం కుంభకోణాన్ని విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. ఇప్పటి వరకు 11 మందినిఅరెస్టు చేసినా.. ఇలా 36 గంటల్లోనే నిర్ణయం తీసుకున్న పరిస్థితి లేదు. కానీ.. మిథున్రెడ్డి విషయంలో మాత్రం అధికారులు పక్కా ఆధారాలు ఉండబట్టే ఇలా అరెస్టు చేశారని …
Read More »నిజమే.. వారిలో ఒక్కరూ పాసవలేదు ..!
ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎంతమంది విజయవంతం చేశారు? ఎంత మంది ఇంటికే పరిమితమయ్యారు? అంటే.. చాలా మంది ఫెయిలయ్యారన్నది చంద్ర బాబుకే అందిన నివేదిక తేల్చి చెబుతోంది. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే సహా.. ఇతర మాధ్యమాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా విజయవంతం చేశారన్న విషయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకున్నా రు. దీని పై ఒకటి రెండు నివేదికలు కూడా తెప్పించుకున్నారు. ముఖ్యంగా …
Read More »జగన్ ఆశించేది ఒకటి.. జరుగుతోంది మరొకటి.. !
వైసీపీ అధినేత జగన్ ఏం ఆశిస్తున్నారు? ఏం చేయాలని భావిస్తున్నారు? అంటే.. ఖచ్చితంగా కూటమి సర్కారు పై వ్యతిరేకత పెరుగుతోందని.. అది తమకు మేలు చేస్తుందని.. కాబట్టి.. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని పార్టీ నాయకులకు జగన్ తేల్చి చెబుతున్నారు. ఓకే.. ప్రతిపక్ష నాయకుడిగా జగన్కు ఆమేరకు ఆశలు ఉండడం తప్పుకాదు. అయితే.. మారుతున్న పరిణామాలు.. పెరుగుతున్న కూటమి దూకుడుతో ఈ ఆశలు నెరవేరడం కష్టమని …
Read More »విపక్షల డిమాండ్కు కేంద్రం ఓకే.. వ్యూహమేంటి?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి విపక్షాలు పెట్టిన డిమాండ్కు ఓకే చెప్పింది. 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు పెట్టిన ఏడిమాండ్ను ఓకే చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్పై ఓకే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి దీని వెనుక వ్యూహం ఏంటి? కేంద్రం ఎందుకు దిగి వచ్చింది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అసలు విషయం ఏంటి? …
Read More »మిథున్ రెడ్డికి రిమాండ్.. జగన్ ‘పిట్ట’ పలుకులు!
వైసీపీ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు అరెస్టు చేయడం.. ఆ వెంటనే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిపోయాయి. అయితే.. ఈ ఘటనలపై వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సుదీర్ఘ స్పందన వెలిబుచ్చారు. మిధున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇది ప్రజలతో నిలబడే వారి నోరు మూయించడానికి రూపొందించిన రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదని …
Read More »‘జగన్ను విచారిస్తే.. అన్నీ బయటకు వస్తాయి’
జ్యోతుల నెహ్రూ. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు. ఆ పార్టీలో గత ఐదేళ్లు కూడా ఉన్నారు. అయితే, 2024 ఎన్నికలకు ముందు పార్టీ మారి టీడీపీ గూటికి చేరుకున్నారు. ఈక్రమంలోనే జగ్గంపేట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న జ్యోతుల.. తాజాగా మిథున్ రెడ్డి అరెస్టు, జైలు నేపథ్యంలో స్పందించారు. జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు. అసలు ఈ కేసులో జగనే …
Read More »అసెంబ్లీలో మంత్రి రమ్మీ గేమ్
మహారాష్ట్రలో వ్యవసాయ మంత్రి మాణిక్రావ్ కోకాటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ గేమ్ ఆడుతున్నట్లు వీడియో వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. అధికారంలో ఉన్న బీజేపీ కూటమిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం అసెంబ్లీలో గేమ్స్ ఆడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు. వైరల్ అయిన ఈ వీడియోను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) …
Read More »‘ఇప్పుడు బాబు టైం నడుస్తోంది.. మాకూ టైం వస్తుంది’
ఏపీ సీఎం చంద్రబాబు తమ కుటుంబం పై కక్ష సాధిస్తున్నారని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించి.. జైలుకు పంపించారని అన్నారు. “ఇప్పుడు చంద్రబాబు టైం నడుస్తోంది. మాకు కూడా టైం వస్తుంది. ఇంతకు ఇంత బదులు తప్పదు” అని పెద్దిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైసీపీ …
Read More »మిథున్ రెడ్డికి జైలు.. తీవ్ర ఉత్కంఠ నడుమ తీర్పు!
వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి తీర్పు వెలువరించారు. దీంతో మిథున్ రెడ్డిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే.. దీనికి ముందు సుమారు 4 గంటలకు పైగానే హైడ్రామా నడిచిం ది. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. మిథున్ రెడ్డికోర్టుకు తెలిపారు. …
Read More »ముద్రగడకు ఏమైంది.. మరో సారి క్రాంతి ఎంట్రీ!
కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం(రెడ్డి) అస్వస్థతకు గురయ్యారు. గత కొన్నాళ్లు గా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. పూర్తి వివరాలు అప్పట్లో ఎవరూ బయటకు చెప్పలేదు. తాజాగా ముద్రగడ.. తీవ్ర అస్వస్థతకు గురై.. ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఆయన కుమారుడు ముద్రగడ గిరి తెలిపారు. అయితే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంద న్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని …
Read More »వైసీపీకి నోటీసులు జాతర
వైసీపీ కేసుల స్టోరీ ఇంకా ముగియలేదా? ఆ పార్టీ నాయకులు చేసిన పాపాలు ఇంకా వెంటాడుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు మద్యం కుంభకోణం కేసులో కీలక నాయకులు, గతంలో జగన్ దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులు అరెస్టయి జైళ్లకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి వంతు వచ్చింది. ఈయనను కూడా అరెస్టు చేశారు. ఇక, ఇదే కేసులో మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates