ఏపీ రాజకీయాల్లో పార్టీ చీఫ్గా పురాతన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ఏడాది 2025లో ఆమె రాజకీయంగా పుంజుకున్నారా? పార్టీపై పట్టు, నేతలపై అవగాహన సాధించారా? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ నెలలు, సంవత్సరాల క్యాలెండర్ తిరుగుతుంటే నాయకుల పనితీరుపై అంచనాలు కూడా పెరగాలి. అదే సమయంలో వారి …
Read More »ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు
కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీయగా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేసిన ప్రశంసలు పార్టీలో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ …
Read More »వారు గీత దాటితే కటకటాలే
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మేకను నరికి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోకు అభిషేకం చేశారు. మేక తలకాయ పట్టుకుని వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. రాజకీయ ముసుగులో జగన్ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ఆమె మీడియా …
Read More »ఒకప్పుడు నేతలకు.. ఇప్పుడు పిల్లలకు..
హైదరాబాద్లోని గండిపేట ప్రాంతంపై తనకు ఎంతో మక్కువ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గండిపేటలో ఒకప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఉండేదని చెప్పారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ ఇచ్చి వారిని మేలైన నేతలుగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఎన్టీఆర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అందుకే తనకు గండిపేట అంటే అమితమైన మక్కువ అని అన్నారు. …
Read More »2025: ట్రంప్ ఏడాది పాలన.. అగ్రరాజ్యంలో అసమ్మతి!
రాష్ట్రంలో అయినా.. దేశంలో అయినా.. పాలకులపై ప్రజల్లో అసంతృప్తి ఎప్పుడు పెల్లుబుకుతుంది? అంటే.. చెప్పడం కష్టమేమీ కాదు. ఓ రెండేళ్ల పాలన తర్వాతో.. మూడేళ్ల పాలన తర్వాతో సహజంగానే పాలకుల విధానాలపై ప్రజల్లో అసంతృప్తి..సంతృప్తులను కొలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, చిత్రంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కేవలం నెలల వ్యవధిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. చేసిన ప్రకటనలు.. వంటివి తీవ్రస్థాయిలో కుదిపేశారు. …
Read More »ఫ్యాక్ట్ చెక్: ఇంద్రకీలాద్రికి కరెంట్ కట్?
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి విద్యుత్ బిల్లుల అంశంపై ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది భక్తులు సందర్శించుకునే ఈ ఆలయానికి బిల్లులు బకాయిలు ఉన్నాయనే కారణంతో గంటసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం.. ఆ వెంటనే పునరుద్ధరించటం జరిగిపోయాయి. దీనికి సంబంధించి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా దుర్గ గుడి యాజమాన్యం అప్పారావుపేటలోని, పాముల కాలువ వద్ద …
Read More »2025: బీఆర్ఎస్.. ఉత్థానం.. పతనాలు!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి 2025లో ఏం జరిగింది? 2023లో ఎదురైన పరాభవం, పరాజయం తర్వాత పార్టీ ఏమైనా పుంజుకుందా? లేక మరింత వెనుకంజలోనే ఉందా? అనేది ఆసక్తికరం. ఈ క్రమంలో కీలకమైన ఐదు ఘట్టాలను చర్చిస్తే పార్టీ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. 1) ఉన్న సీటును కోల్పోవడం:ఒకవైపు 2023లో బీఆర్ ఎస్ తరఫున గెలిచిన 10 మంది పార్టీకి దూరమయ్యారు. దీనిపై పోరాటం చేస్తున్న పార్టీకి …
Read More »జేసీ న్యూ ఇయర్ ఆహ్వానాన్ని మాధవీ మన్నిస్తారా?
టాలీవుడ్ సినీ నటి మాధవీలత వర్సెస్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జేసీపై మాధవీలత విమర్శలు చేయడం…ఆ తర్వాత మాధవీ లతపై జేసీ అభ్యంతరకర కామెంట్లు చేయడం వివాదానికి దారి తీసింది. అయితే, ఆ తర్వాత ఒకరికి ఒకరు సారీ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఈ సారి …
Read More »చంద్రబాబు గ్రాఫ్.. 2025లో ఎలా ఉందంటే..!
ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఈ ఏడాది కీలక సంవత్సరం అనే చెప్పాలి. గత ఏడాది జూన్లో బాధ్యతలు చేపట్టినప్పటికీ, అప్పటికే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడం, ప్రభుత్వ విధానాలను సమన్వయం చేయటం, అధికారుల బదిలీలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఏడాది పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకోగలిగారు. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అవగాహనను పెంచుకున్నారు. ముఖ్యంగా వైసీపీ …
Read More »కూటమి ప్రభుత్వం పై రఘురామ అసంతృప్తి?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019–24 మధ్య కాలంలో వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామను సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టి కస్టడీలో హింసించిన ఘటన షాకింగ్గా మారింది. ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి …
Read More »కేసీఆర్ పేరు కేటీఆర్ కాకపోతే ఇంకెవరు వాడుకుంటారు
మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసని రేవంత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను ఉమ్మడి ఏపీలోని గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి నొప్పెందుకు అని కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్, పుణె, అమెరికాలో చదివానని..రేవంత్ మాదిరి చదువు, సంధ్య …
Read More »వైసీపీ గిరిజన ఓటు బ్యాంకుకు పవన్ గండి
గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. గిరిజనుల డోలీ మోతలకు చరమగీతం పాడే దిశగా పవన్ అడుగులు వేశారు. గిరిజన గ్రామాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేపట్టడం, తద్వారా గిరిజన గ్రామాలను ప్రధాన మార్గాలతో అనుసంధానం చేయడం వంటి కార్యక్రమాలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే పల్లె పండగ 2.0 లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates