బీఆర్ఎస్ మళ్ళీ రివర్సవబోతోందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు కేటీయార్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో మెజారిటి నేతలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చటం పెద్ద తప్పుగా చెప్పారట. తాజాగా ఎంఎల్ఏ కడియం శ్రీహరి మాట్లాడినపుడు కూడా టీఆర్ఎస్ స్ధానంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేయటం పెద్ద తప్పన్నారు. పార్టీ పేరులో నుండి తెలంగాణా …
Read More »వైసీపీ ఎత్తులను పసిగట్టకపోతే.. టీడీపీకి ఇబ్బందేనా..!
ఏపీ అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులను మారుస్తోంది. కీలక నేతలకు కూడా సీఎం జగన్ ఎలాంటి హామీలూ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుని పోతున్నారు. ఎన్నికలకు రెండు మాసాల ముందుగానే .. అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు బంధువులు వరసయ్యేవారిని కూడా ఆయన గెలవరు అను కున్నా.. ప్రజల్లో నాడి తగ్గిందని భావించినా వెంటనే పక్కన పెడుతున్నారు.ఈ విషయంలో ఎక్కడా జగన్ రాజీ పడడం …
Read More »వైసీపీలో గురువు టీడీపీకి జంప్.. శిష్యుడు దారెటో..!
కైలే అనిల్ కుమార్. ఉమ్మడి కృష్నాజిల్లాలోని పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే..ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఈయనకు టికెట్ ఇస్తారని కొందరు.. ఇవ్వరని మరికొందరు టెన్షన్ పెడుతున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన అనిల్.. గత ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ విజయం సాధించారు. అయితే..ఈయనకు గురువుగా భావించే.. మరో నేత.. కొలుసు పార్థసారథి.. అప్పట్లోఅన్నీ తానై ఈయనను గెలిపించారని అంటారు. ఇప్పుడు కొలుసు …
Read More »అక్షింతలు పంచితే మేం కూడా గెలిచేవాళ్లవేమో: కేటీఆర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అక్షింతలు పంచి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని అన్నారు. ప్రస్తుతం అయోధ్య లో ఈ నెల 22న బాల రాముని విగ్రహం ప్రతిష్ఠ కానుంది. దీనిని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా అక్కడి అక్షింతలను ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. …
Read More »నిర్భయంగా మీ ఊరెళ్లండి: హైకోర్టు
వైసీపీ రెబల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. కనుమూరి రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టు అభయం ఇచ్చింది. సంక్రాంతిని పురస్కరించుకుని తన సొంత నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గానికి వెళ్తానని.. అయితే.. ఏపీ పోలీసులు తనపై కేసులుపెట్టి నిర్బంధించే అవకాశం ఉందని.. దీనిని నిలువరించాలని.. ఆయన కొన్ని రోజుల కిందట పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. …
Read More »కాపులను కన్నా క్యాచ్ చేస్తారా ?
పల్నాడు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున బరిలో దిగనున్న మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ దూకుడు పెరిగిందనే అంచనాలు వస్తున్నాయి. తాజాగా సామాజిక వర్గాల పరంగా టీడీపీ చేపట్టిన ఓరల్ సర్వేలో ఇక్కడి మెజారిటీ కాపు సామాజిక వర్గం నాయకులు కన్నాకే జై కొట్టినట్టు తెలిసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కన్నా..పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా …
Read More »కేటీయార్ మెడకు చుట్టుకోవటం ఖాయమా ?
కేసీయార్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ అవినీతి మాజీ మంత్రి కేటీయార్ మెడకు చుట్టుకోబోతోందా ? ఇపుడిదే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గనుక సీరియస్ గా విచారణ చేయిస్తే కేటీయార్ తగులుకోవటం ఖాయమని అర్ధమవుతోంది. ఎందుకంటే ఫార్ముల ఈ రేస్ నిర్వహణకు కర్త, కర్మ, క్రియ అంతా కేటీయార్ అనే ఇపుడు బయటపడింది. అయితే ఈ రేస్ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పి కాంగ్రెస్ …
Read More »విజయవాడపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్
విజయవాడ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని.. పార్టీకి గుడ్ బై చెప్పడం.. ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్ను కలుసుకోవడం.. తెలిసిందే. ఇక, తాజాగా వైసీపీ విడుదల చేసిన మూడో జాబితాలో కేశినేని పేరు కూడా ఉండడంతో ఈ విషయాన్ని చంద్రబాబు చాలా సీరియస్గానే తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాన్ని వదులుకునేందుకు వీల్లేకుండా …
Read More »రాజ్యసభ బరిలో టీడీపీ ?
తొందరలో జరగబోయే రాజ్యసభ ఎంపీ ఎన్నికలో టీడీపీ పోటీచేయాలని అనుకుంటోంది. రాబోయే ఏప్రిల్ లో ముగ్గురు ఎంపీలు రిటైర్ అవబోతున్నారు. ఏప్రిల్ లో ఖాళీ అవబోతున్న ఎంపీల స్ధానాలను మార్చిలోనే భర్తీ చేయటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ రెడీ అవుతోంది. ఫిబ్రవరి చివరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు రాజ్యసభ ఎంపీలకు జరగబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. జనరల్ …
Read More »ఈ నెల 18న టీడీపీలోకి పార్ధ సారధి?
వైసీపీలో టికెట్ దక్కని, సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన నేతలు పార్టీని వీడుతున్న వైనం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వైసీపీకి సీనియర్ రాజకీయవేత్త, ఎమ్మెల్యే పార్థసారథి రాంరాం అనబోతున్నారని టాక్ వస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యేందుకు …
Read More »బెజవాడ నుంచి సై..: సుజనా
వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో తాను బెజవాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రముఖ పారివ్రామిక వేత్త, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి(సత్యనారాయణ) వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానన్నారు. పార్టీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడలో ఏ స్తానం నుంచి అయినా.. పోటీకి రెడీగా ఉన్నట్టు బీజేపీ అధిష్టానానికి సైతం చెప్పినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి పోటీ …
Read More »జగన్ రెడీ అవుతున్నారా ?
ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇందుకు ఈనెల 25వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్నీ పార్టీ మెంటు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూటుమ్యాప్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన పర్యటనను ఉత్తరాంధ్ర నుండే మొదలుపెట్టబోతున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగసభ చొప్పున 26 సభలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించేట్లుగా రూట్ మ్యాప్ రెడీ అయ్యింది. ఈ పర్యటనల్లోనే …
Read More »