తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ పై ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని, సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నారని విజయుడు ఆరోపించారు. అంతేకాదు, దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంటనే బదిలీలు చేయిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు …
Read More »ఉద్యోగం వదిలేసి వచ్చా.. నన్ను చూడండి బాబు సర్.. !
“సర్.. ఉద్యోగం వదిలేసి వచ్చా. 25 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. నన్ను కొంచెం చూడండి సర్” అని ఒకరు. “గత ఎన్నికల్లో టికెట్ కూడా వదిలేశా. ఇప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే.. నియోజకవర్గంలో మొహం చూపించలేను.” అని మరొకరు!.. ఇలా.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు.. పలువురు నాయకులు.. గోడు వెళ్లబోసుకున్నారు. గత ఆదివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ సీనియర్లు.. ఆయనను …
Read More »ఉగాది నుంచి ఏపీలో ‘పచ్చదనం’
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రాన్ని 50 శాతం మేరకు పచ్చదనంతో నింపే ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఉగాది నుంచి రాష్ట్రంలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటడంతో పాటు.. అటవీ సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిధులను వినియోగించుకోనున్నారు. ‘గ్రీన్ కవర్ …
Read More »డెలివరీ బాయ్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే
గతంలో చాలామంది రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఎన్నికల ప్రచారం సమయంలో చిన్న పిల్లలకు స్నానం చేయించడం వంటి పనులు మొదలు…మురికి కాలువలు శుభ్రం చేయడం వరకు…నానా తిప్పలు పడి తమను తాము మీడియాలో ప్రమోట్ చేసుకునేవారు. అయితే, ఈ సోషల్ మీడియా జమానాలో ట్రెండ్ మారడంతో నేతలంతా సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడడంతో పాటు సరికొత్త ట్రెండ్ లో ప్రజలకు చేరువవుతున్నారు. …
Read More »చిరంజీవి దావోస్ కి ఎందుకు వెళ్లారు?
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది దావోస్ కు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎంపీ టీజీ భరత్, పలువురు అధికారులు…తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోకండి…రేవంత్ …
Read More »లోకేష్ పుట్టిన రోజు.. ఓ మంచి పని
టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈ నెల 23న. అప్పటికి ఆయనకు 42 ఏళ్లు నిండి, 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన పుట్టిన రోజులు ఎలా చేసుకున్నా, ఈ ఏడాది నిర్వహించుకునే పుట్టిన రోజు ప్రజలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ …
Read More »ఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీ
స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది. తాజాగా దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి అల్ మార్రీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, దుబాయ్ల మధ్య ఉన్న ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని చంద్రబాబు చేసిన సూచనలను …
Read More »‘రేవంత్ కి దమ్ముంటే విచారణ వీడియో బయట పెట్టాలి’
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు నేడు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు హరీశ్ రావును విచారణ జరిపారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీశ్ రావు…రేవంత్ రెడ్డిపై, ఆయన బావమరిదిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణం గురించి తాను బయటపెట్టిన రోజే తనకు …
Read More »నాడు జగన్ నేడు కేటీఆర్… సేమ్ టు సేమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు మధ్య హరీశ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితోపాటు పోలీసులకు, అధికారులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటారో చేసుకోవాలని, ఆయనను వదిలిపెట్టబోమని …
Read More »జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది కానీ…
నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇద్దరూ గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్నారు. అయితే మరో కేసు పెండింగ్లో ఉండటంతో, బెయిల్ వచ్చినప్పటికీ జైలు నుంచి వెంటనే విడుదలయ్యే పరిస్థితి …
Read More »తన బాస్ ఎవరో చెప్పిన మోడీ
“ఆయనే నా బాస్. పార్టీలో నేను ఆయన కింద పనిచేస్తాను.“ అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా బీజేపీ ఈ ప్రకటన చేసింది. అనంతరం.. నితిన్.. ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నితిన్ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. తన …
Read More »విచారణ వేళ విజయసాయి ట్వీట్… బీజేపీపై ప్రశంసలు!
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఇటీవల ‘కోటరీలు’, ‘వెనిజులా అధ్యక్షుడు’ అంటూ చేసిన ట్వీట్ ద్వారా వైఎస్ జగన్ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. కోటరీల ప్రస్తావన ఇది తొలిసారి కాకపోవడంతో, ఆయన ఎవరిని ఉద్దేశించారన్న దానిపై రాజకీయంగా విస్తృత చర్చ సాగింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates