హైదరాబాద్ క్రికెట్ అభిమానుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ మంచి వార్త అందించింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లే అభిమానుల రవాణా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 డిపోల నుంచి మొత్తం 60 బస్సులను ఆటగాళ్లు, ప్రేక్షకుల సౌకర్యార్థం నడపనున్నారు. ఈ సర్వీసులు ఐపీఎల్ మ్యాచ్లు జరిగే రోజుల్లో మాత్రమే అందుబాటులో …
Read More »భద్రాచలంలో కూలిన భవన నిర్మాణం… ఆరుగురు మృతి
తెలంగాణలో శ్రీ సీతారామ స్వామి కొలువై ఉన్న భద్రాచలంలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భవన నిర్మాణ కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరింత మంది కూలీలు భవనం శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించే పనిని చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని సజీవంగా బయటకు …
Read More »ఇకపై భారత్ తరహాలో అమెరికాలో ఎన్నికలు? ట్రంప్ కీలక ఆదేశం!
అమెరికా ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వచ్చే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు సంతకం చేశారు. దీనితో ఎన్నికల ప్రాసెస్లో పౌరసత్వ ధ్రువీకరణ, మెయిల్-ఇన్ బ్యాలెట్ల లెక్కింపులో కొత్త మార్గదర్శకాలు ప్రవేశించనున్నాయి. గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇలావుంటే, తాజా ఆర్డర్ ప్రకారం ఓటర్లు తమ అమెరికన్ పౌరసత్వాన్ని స్పష్టంగా …
Read More »మహిళను హత్య చేసిన పూజారి, కోర్టు సంచలన తీర్పు
2023లో సంచలనం సృష్టించిన సరూర్నగర్ అప్సర హత్యకేసులో నిందితుడైన పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. సాయికృష్ణ వృత్తిరీత్యా ఓ ఆలయంలో పూజారి. అదే ఆలయానికి తరుచూ వెళ్లే అప్సరతో పరిచయం ప్రేమగా మారింది. శారీరకంగా దగ్గరవడంతో ఆమె పెళ్లి కోరిక వ్యక్తం చేయడం ప్రారంభించింది. కానీ అప్పటికే వివాహితుడిగా, పిల్లల తండ్రిగా ఉన్న సాయికృష్ణ… అప్సర ఒత్తిడికి సిద్ధంగా లేకపోయాడు. …
Read More »యువతి ‘బస్ట్’ తాకితే నేరం కాదా?.. మనం ఏ యుగంలో ఉన్నాం: సుప్రీం ఫైర్
దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి యువతులకు లభించిన స్వేచ్ఛే కారణమని ఇటీవల ఓ కోర్టు వ్యాఖ్యానించి.. చేతులు కాల్చుకుంది. ఇదేసమయంలో ప్రతిష్టాత్మక అలహాబాద్ హైకోర్టు ఏకంగా.. యువతుల బస్ట్ తాకితే.. అది నేరం కాదని వ్యాఖ్యానించడమే కాకుండా.. ఈ కేసులో ఓ విద్యార్థి సంఘం నాయకుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది. అతనిపై ఉన్న కేసును కొట్టి వేసే పిటిషన్పై విచారణ చేస్తామని ప్రకటించింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను …
Read More »అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం… ఐసీసీ గ్రీన్ సిగ్నల్?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. మొత్తం 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యం గల ఈ భారీ స్టేడియం అమరావతిలోని 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీ భాగంగా నిర్మితమవుతుంది. నరేంద్ర మోడీ స్టేడియంతో సమానంగా ఉండే ఈ స్టేడియం భారత క్రికెట్ …
Read More »తమీమ్ ఇక్బాల్.. వైద్యులు వద్దంటున్నా వెళ్లిపోయి
బంగ్లాదేశ్ లెజెండరీ క్రికెటర్లలో ఒకడైన తమీమ్ ఇక్బాల్ నిన్న ఓ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ మైదానంలో కుప్పకూలడం.. ఆ తర్వాత విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరడం.. అతడికి గుండెపోటు వచ్చిందని గుర్తించిన వైద్యులు అత్యవసర చికిత్స అందించడం తెలిసిందే. తమీమ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. లైఫ్ సపోర్ట్ మీద అతడికి చికిత్స జరుగుతోందని తెలిసేసరికి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కంగారు పడ్డారు. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన …
Read More »సోషల్ మీడియాను ఊపేస్తున్న భార్యభర్తల గొడవ
సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత వ్యవహారం సైతం పెద్ద చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఇప్పుడు ఓ భార్యాభర్తల గొడవ అలాగే హాట్ టాపిక్గా మారింది. చెన్నైకి చెందిన ప్రసన్న-దివ్య అనే జంటకు సంబంధించిన విడాకుల గొడవ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వాళ్లిద్దరూ తమిళ వ్యక్తులైనప్పటికీ.. దేశవ్యాప్తంగా వీరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అక్రమ సంబంధం లీడ్ టాపిక్ కావడమే అందుకు …
Read More »27 కోట్ల విలువైన కెప్టెన్ మొదటి మ్యాచ్లో డిజాస్టర్
ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ పరిస్థితి ఆశించిన దానికంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కి నాయకత్వం వహించిన పంత్, ఈ సీజన్కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు వెళుతూ భారీ డీల్ తో వార్తల్లోకి వచ్చాడు. ఏకంగా రూ.27 కోట్లతో అతను టోర్నీలోనే అత్యధిక రేటుతో కొనుగోలైన ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతని పాత్రపై ఆశలు అమాంతం పెరిగాయి. అయితే మొదటి మ్యాచ్నే చూస్తే ఆ …
Read More »అషుతోష్ శర్మ.. పంత్ ఆశను తగలబెట్టేశాడు
ఐపీఎల్ 4వ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మొదట్లో ఎంత కిక్ ఇచ్చిందో సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో నుంచి చివరి వరకు అదే రేంజ్ థ్రిల్ ఇచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సాధించిన విజయం ఆల్ టైమ్ బెస్ట్ చేసింగ్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. మార్ష్ (72) – పూరన్ 75 (30) ధాటికి లక్నో 209 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో దిగిన …
Read More »CSK vs MI: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. వైరల్ వీడియో కలకలం!
ఐపీఎల్ 2025 సీజన్ ఓ అద్భుతమైన మ్యాచ్తో ప్రారంభమైందనుకునేలోపే, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది చెన్నై – ముంబై మ్యాచ్. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో సీఎస్కే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినా, మ్యాచ్ ముగిసిన వెంటనే చెన్నై టీమ్పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. ముంబై ఫ్యాన్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రకారం.. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బంతిపై ఏదో …
Read More »మైదానంలో గుండెపోటు.. విషమ స్థితిలో ఇక్బాల్
తమీమ్ ఇక్బాల్.. అంతర్జాతీయ క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ సీనియర్ క్రికెటర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 36 ఏళ్ల తమీమ్.. సోమవారం ఢాకా ప్రిమియర్ లీగ్లో భాగంగా మ్యాచ్ సందర్భంగా గుండె పోటుకు గురయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేయడానికి కెప్టెన్గా మైదానంలోకి వచ్చాడు తమీమ్. ఉన్నట్లుండి అతడికి …
Read More »