Trends

న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌ పేరుతో లింకులు… ఓపెన్ చేశారా అంతే!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు పంపించుకుంటున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు ఈ అవకాశాన్ని తమ మోసాలకు వాడుకుంటున్నారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్, గిఫ్ట్, ప్రత్యేక ఆఫర్ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లింకులు పంపిస్తూ అమాయకులను మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఆ ఫైల్‌ను ఓపెన్ చేస్తే ఫోన్‌లో హానికరమైన …

Read More »

ఇచ్చిన హామీ 10 రోజుల ముందే పూర్తి చేసిన పవన్

నెలా పదిహేను రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న హామీని 10 రోజుల ముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కోనసీమ కొబ్బరి రైతులతో గత నెల మాట్లాడిన సందర్భంగా 45 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతానని ఇచ్చిన హామీని ఆయన 10 రోజుల ముందుగానే అమలు చేసి, 35 …

Read More »

హద్దు దాటి మాట్లాడి 2 లక్షల సబ్స్క్రైబర్లను పోగొట్టుకున్నాడు

సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే.. హద్దులు దాటి మాట్లాడితే ఏమవుతుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల విషయం నెలకొన్న వివాదం సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. కొందరు సమర్థించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం గురించి చెబుతూ.. తాను వాడిన అభ్యంతరకర పదాల విషయంలో శివాజీ సారీ చెప్పారు. ఐతే ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ …

Read More »

తెలంగాణ చరిత్రలో మొదటి ఉరిశిక్ష!

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఫ‌స్ట్ టైమ్ ఓ హ‌త్య కేసులో దోషిగా తేలిన వ్య‌క్తికి స్థానిక కోర్టు ఉరి శిక్ష విధించింది. కాగా.. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అనేక నేరాలు జ‌రిగాయి. అనేక హ‌త్య‌లు కూడా చోటు చేసుకున్నాయి. ఇక‌, మ‌హిళ‌ల‌పై అత్యాచారం కేసులు కూడా న‌మోద‌య్యాయి. అయితే.. కొన్ని కేసుల్లో నిందితులు ఎన్ కౌంట‌ర్ అయ్యారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ల‌మైన ఇలాంటి నేరాల కేసుల్లో ఉరి లేదా …

Read More »

సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖలు, బీజేపీ నేతపై కేసు

మతపరమైన అంశాలపై  వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ప్రజలు భక్తి ప్రపత్తులతో కొలుచుకునే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కేసులు ఎదుర్కోవడం తరచుగా జరుగుతోంది. తాజాగా  షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పులువురిపై కేసులు నమోదయ్యాయి. నటి మాధవీ లతపై ఎఫ్ఐఆర్ చేశారు. పలువురు యూట్యూబర్లపై కూడా కేసులు ఫైల్అయ్యాయి. వీరంతా సరూర్ నగర్ లో విచారణలకు కావాలని ఆదేశించారు. మాధవీలత ఒక్కరిపైనే కాకుండా, ఆమె …

Read More »

చావు ఇంట్లో విందు.. ఆ రైతా తిన్నవాళ్లకు ఏమైందంటే?

ఉత్తర ప్రదేశ్ లోని బదాయూ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఆ బాధలో ఉంటారు, కర్మకాండల తర్వాత భోజనాలు చేస్తారు. కానీ ఇక్కడ ఆ భోజనమే ఇప్పుడు ఊరంతటికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంత్యక్రియల సమయంలో వడ్డించిన రైతా తిన్న దాదాపు 200 మంది గ్రామస్తులు ఇప్పుడు ఆసుపత్రి బాట పట్టారు. పిప్రౌలి అనే గ్రామంలో డిసెంబర్ 23న జరిగిన ఒక …

Read More »

అందాల అరకు హౌస్ ఫుల్

తూర్పు కనుమల నడుమ ప్రకృతి సోయగాలతో విరజిల్లుతున్న అరకు వ్యాలీ వరుస సెలవులు, ఇయర్ ఎండ్ వేడుకల నేపథ్యంలో పర్యాటకులతో కిటకిటలాడుతోంది. విశాఖపట్నం‌కు సుమారు 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రముఖ పర్యాటక కేంద్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. దీంతో అరకు లోయ పూర్తిగా హౌస్‌ఫుల్‌గా మారగా, హోటళ్లు, లాడ్జీలు …

Read More »

మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌దు: బాబా వాంగా భ‌విష్య‌వాణి

బాబా వాంగా.. అంత‌ర్జాతీయంగా పేరున్న సిద్ధాంతి. భ‌విష్య‌వాణిని వినిపించ‌డంలో సుప్ర‌సిద్ధురాలు. పూర్తిగా అంధురాలైన బాబా వాంగాకు ప్ర‌పంచ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఆమె ఇప్పుడు లేరు. 1996లోనే మృతి చెందారు. కానీ, ఆమెరాసిన పుస్త‌కంలోని విష‌యాల‌ను ఏటా బ‌య‌ట పెడుతున్నారు. తాజాగా 2026కు సంబంధించిన భ‌విష్య‌వాణిని వాంగా పుస్త‌కం నుంచి బ‌య‌ట పెట్టారు. దీనిలో ప‌లు విష‌యాలు ఉన్నాయి. ప్ర‌ధానంగా మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌ద‌ని ఆమె వెల్ల‌డించారు. …

Read More »

పెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆర్చన అనే 16 ఏళ్ల బాలిక నవంబర్ 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదట ఆమె తండ్రి రెడ్డి రాజు, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనుమానం …

Read More »

2025@మోడీ: కొన్ని ప్ల‌స్సులు… కొన్ని మైన‌స్‌లు!

మ‌రో నాలుగు రోజుల్లో క్యాలెండ‌ర్ మారుతోంది. 2025కు గుడ్‌బై చెబుతూ.. కొత్త సంవ‌త్స‌రానికి ఆహ్వానం ప‌ల‌క‌నున్నాం. ఈ నేప‌థ్యంలో గ‌డిచిన ఏడాది కాలంలో ఏం జ‌రిగింద‌నేది మ‌న‌నం చేసుకోవ‌డం.. కొత్త సంవ‌త్స‌రంలో స‌రికొత్త ఆలోచ‌న‌లు, ల‌క్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగ‌డం అనేది.. ఎవ‌రికైనా అల‌వ‌డాల్సిన అంశం. ఈ నేప‌థ్యంలో 2025లో ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ ఈ దేశానికి చేసింది..సాధించింది.. ఏంటి అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ప్ర‌ధానంగా ఈ ఏడాది 5 …

Read More »

చీరకట్టు అందాలతో కట్టిపడేస్తున్న బేబమ్మ

కృతి శెట్టి సంప్రదాయ వేషధారణలో కనిపిస్తే అది ఆమెకు సహజంగానే అలవాటైనట్టే ఉంటుంది. ఈ ఆకుపచ్చ రంగు సిల్క్ చీరపై ఉన్న బంగారు చెక్స్, దానికి జత చేసిన గాఢమైన మరూన్ బ్లౌజ్ కలిసి చూడముచ్చటగా ఉన్నాయి. రంగుల కలయిక పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది, అదే సమయంలో ప్రశాంతంగానూ ఉంటుంది. తొందరగా ఆకట్టుకోదు, కానీ చూసే కొద్దీ నెమ్మదిగా మనసులో నిలిచిపోతుంది. స్టైలింగ్ మొత్తం సింపుల్‌గా ఉంది. బంగారు …

Read More »

థాయ్‌లాండ్ లో విష్ణు విగ్రహం ధ్వంసం చేసిందెవరు?

థాయ్‌లాండ్ కంబోడియా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న ఒక విష్ణు విగ్రహాన్ని థాయ్ మిలిటరీ జేసీబీలతో కూల్చివేసిన వీడియోలు బయటకొచ్చాయి. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పందించింది. ఇది మతపరమైన దాడి కాదని, కేవలం భద్రతా చర్యల్లో భాగంగానే చేశామని క్లారిటీ ఇచ్చింది. ఆ విగ్రహం 2014లో కట్టారని, దానికి అధికారికంగా ఎలాంటి మతపరమైన గుర్తింపు లేదని థాయ్ అధికారులు చెబుతున్నారు. ఆ భూమి …

Read More »