Trends

ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది

అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన రామాలయం ఎక్కడ ఉంది అంటారా? అమితాసక్తి గొలుపుతున్న ఈ అయోధ్య రామాలయాన్ని చూడాలంటే మనం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా దాకా వెళితే సరిపోతుంది. శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం పెద్దపల్లి గ్రామంలో అయోధ్య రామాలాన్ని పోలిన రామాలయం సెట్ ఏర్పాటు …

Read More »

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు ఓ సామాన్యుడి ధైర్యం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడింది. మంటలు అంటుకుని బస్సు మొత్తం పొగతో నిండిపోయిన ఆ భయానక సమయంలో, ఒక ప్రయాణికుడు చూపిన సమయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చావు కళ్లముందు కనిపిస్తున్నా వణుకు లేకుండా, తనతో పాటు ఉన్న తోటి ప్రయాణికులను కాపాడి నిజమైన …

Read More »

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా రష్యా వంటి ఇతర దేశాల నుండి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు కొత్త ఒప్పందాలను ఖరారు చేస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో, మన దేశ అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ధరకే చమురును అందించే దేశాలతో చర్చలు జరుపుతోంది. దీనివల్ల …

Read More »

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC)కి రూ. 10 లక్షల జరిమానా విధించడమే …

Read More »

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కనీసం 10 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి పామూరు వైపు …

Read More »

ఐపీఎల్ బ్యూటీ వార్.. కావ్య మారన్ Vs అనన్యా బిర్లా!

​IPL సీజన్ వచ్చిందంటే చాలు గ్రౌండ్ లో ఆటగాళ్ల మధ్య పోరు కంటే, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఈసారి ఈ వార్ ప్లేయర్ల నుంచి యజమానుల వైపు మళ్లింది. ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఐపీఎల్‌లోనే అత్యంత అందమైన ఓనర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ కొత్త యజమానిగా అనన్యా బిర్లా ఎంట్రీ ఇవ్వడంతో నెట్టింట సరికొత్త …

Read More »

‘గుంపులో గోవిందా’.. పెట్రోల్ క్యూల వెనుక అసలు గేమ్?

రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం, పెట్రోలియం అసోసియేషన్ క్లారిటీ ఇచ్చినా.. బంకుల వద్ద జనం బారులు తీరడం ఆగడం లేదు. నిజానికి మన దగ్గర ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, కానీ ఒక వింత పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. లేని డిమాండ్‌ను ఉన్నట్లుగా భ్రమపడటమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. కావాలని బ్యాక్ గ్రౌండ్ లో సరుకు చకచకా అమ్మేసుకోవలనే ప్లాన్ లో …

Read More »

పెట్రోల్ బంకులు బంద్? అసలు నిజమేంటి?

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రోజులుగా భారత్ లో వంటగ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆ సెగ పెట్రోల్, డీజిల్ కు కూడా తాకింది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాదులో చాలా బంకుల్లో స్టాక్ లేకపోవడంతో పెట్రోల్, …

Read More »

విజయవాడలో కలకలం.. ఉగ్ర భావజాల నెట్‌వర్క్ బహిర్గతం

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉగ్ర భావజాల కార్యకలాపాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో ఒక గుప్త గ్రూపును ఏర్పాటు చేసి, యువతలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది. జిహాద్ కోసం యువతను సిద్ధం చేయడమే వీరి …

Read More »

ఐపీఎల్ 2026: అతి పెద్దోళ్ళు vs అతి చిన్నోళ్లు

క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ కి ఉన్న క్రేజే వేరు. ఇక్కడ ఒకవైపు అనుభవజ్ఞులైన దిగ్గజాలు ఉంటే, మరోవైపు ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెడుతున్న కుర్రాళ్లు ఉంటారు. ఈ 2026 సీజన్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టోర్నీలో ఆడుతున్న పెద్ద వయస్కుడికి, చిన్న వయస్కుడికి మధ్య ఏకంగా 29 ఏళ్ల తేడా ఉంది. మార్చి 28 నుంచి మొదలయ్యే ఈ పోరులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నుండి 44 ఏళ్ల …

Read More »

చివరకు సుప్రీం అనుమతితో కన్నుమూసిన హరీష్

సుప్రీంకోర్టు అనుమతితో ‘పాసివ్ యుతనేషియా’ (కారుణ్య మరణం) పొందిన తొలి భారతీయుడిగా హరీష్ రాణా మంగళవారం మధ్యాహ్నం 4:10 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో, కేవలం కృత్రిమ ఆహారంపై బతుకుతున్న హరీష్‌కు ఈ మరణంతో శాశ్వత విముక్తి లభించింది. మన దేశ న్యాయ, వైద్య చరిత్రలో ఇదొక అరుదైన విషయం. ఒక వ్యక్తి గౌరవప్రదంగా మరణించే హక్కును అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు ద్వారా …

Read More »

అరెస్ట్ భయం.. RCBలో అతను లేనట్లే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ పేసర్ యష్ దయాల్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అతడు జట్టుతో చేరడం లేదని ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ స్పష్టం చేశారు. గతేడాది ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకపోవడం జట్టు బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు కాంట్రాక్టులో …

Read More »