Trends

బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?

ఇంట్లో బైక్‌ను స్టార్ట్‌లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో శనివారం రాత్రి జరిగింది. త్యాగరాజ వీధికి చెందిన మురళి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల మెకానిక్ వద్ద మరమ్మతు చేయించాడు. ఇంజిన్‌లో సమస్య ఉండటంతో బైక్‌ను బోర్ చేసిన అనంతరం రాత్రంతా స్టార్ట్‌లో …

Read More »

భార్య కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ… 4 కోట్ల విరాళం

​కష్టం ఎదురైనప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోరాడే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రానికి చెందిన 78 ఏళ్ల రిచర్డ్ పుల్లీ అటువంటి కోవకు చెందిన వ్యక్తి. తన భార్య మెడికల్ బిల్లులు కట్టేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో, ఈ వయసులో ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారారు. ఆయన పడుతున్న శ్రమను చూసి చలించిన నెటిజన్లు ఏకంగా 5 లక్షల డాలర్లు (సుమారు రూ. 4.6 కోట్లు) విరాళంగా …

Read More »

‘నెలసరి’ సెలవులపై సుప్రీం చెప్పింది కరెక్టేనా?

కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో కోణంలో కాస్త ఆలోచించి చూసినప్పుడు.. ముందు అనుకున్నదానిలో దొర్లిన లోపాలు ఇ్టే అర్థమవుతాయి. ఇప్పుడు అలాంటి పనే చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఒక విషయానికి సంబంధించి  సానుకూల అంశాలతోపటు ప్రతికూల అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ప్రస్తావించి.. హెచ్చరించిన వైనం చూసిప్పుడు సుప్రీం కోర్టు చెప్పిన …

Read More »

ఇడ్లీ, వడ తింటే… దాంతోపాటు గ్యాస్ బిల్లు కూడా

సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్‌గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా బిల్లులో చేర్చిన ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెన్నైలోని ఓ హోటల్‌లో సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ తీసుకున్న కస్టమర్‌కు గ్యాస్ ఛార్జీగా రూ.9.52ను బిల్లులో చేర్చినట్టు కనిపిస్తోంది. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు సుమారు రూ.80గా చూపించడంతో ఈ బిల్లు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల అంతర్జాతీయంగా …

Read More »

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ అమ్మాయి కొన్ని రోజుల్లోనే సెలబ్రెటీ స్టేటస్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీ సినిమా అవకాశాలు సైతం అందుకుంది. మోడల్‌గానూ మారింది. అలాంటి అమ్మాయి సడెన్‌గా ఇప్పుడు కేరళకు వచ్చి ఫర్మాన్ ఖాన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అబ్బాయి …

Read More »

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఇప్పుడు స‌డెన్‌గా పెళ్లి చేసుకుని అంద‌రికీ షాకిచ్చింది మోనాలిసా. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా.. ఫ‌ర్మాన్ ఖాన్ అనే కేర‌ళ ముస్లిం యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఫేస్ బుక్ ద్వారా వీళ్లిద్ద‌రికీ జ‌రిగిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఏడాదిగా వీరి ప్రేమాయ‌ణం సాగుతుండ‌గా.. మోనాలిసా …

Read More »

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ ప్రాంతంలోని హాస్టళ్లు గ్యాస్ కొరతతో …

Read More »

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు.. హోటళ్లు మూతపడుతున్న దుస్థితి. అవును.. దేశంలో చమురు.. గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నట్లుగా కేంద్రం ఒకవైపు చెబుతుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. ఇరాన్ యుద్దం మొదలైంది ఫిబ్రవరి 28న అయినప్పటికీ.. వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో మార్చి ఏడో తేదీ …

Read More »

గ్యాస్ లేక రెస్టారెంట్లు బంద్..కేంద్రం కీలక నిర్ణయం

ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న యుద్ధం ప్రభావం భారత్ తోపాటు పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలోని అనిశ్చిత వాతావరణం ప్రభావం ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులపై తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే భారత్ లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలెండర్ల ధర 115 రూపాయలు పెరగడంతో పాటు సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో, బెంగళూరు, చెన్నై, ముంబైలలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. …

Read More »

మెడికో దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమర్ సహస్ను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారం, వివాహం విషయంలో జరిగిన విభేదాలే ఈ విషాదానికి కారణమయ్యాయని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం, అనంతపురం మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీ …

Read More »

తండ్రి భావోద్వేగం.. 20 కోట్ల మంది మనసుల్ని దోచేసింది

సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. నిజాయితీగా ఉండే ఏ భావోద్వేగాన్ని అయినా ఆదరించి.. అభిమానించే తీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది ద్వేషం కావొచ్చు.. ప్రేమ కావొచ్చు. ఆ వ్యత్యాసాన్ని అంచనా వేసే విషయంలో జరిగే పొరపాట్లకు ఎందరో సెలబ్రిటీలు అప్పటివరకు హీరోలుగా ఉన్నోళ్లు జీరోలయ్యే పరిస్థితి. …

Read More »

టీమ్ ఇండియా విజయం వెనుక కన్నీటి గాథలు

దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత ఇప్పుడు అందరిని కలచివేస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, రింకు సింగ్ తమ కుటుంబాల్లో ఎదురైన తీరని విషాదాన్ని పక్కన పెట్టి దేశం కోసం మైదానంలోకి దిగారు. వ్యక్తిగత బాధను దిగమింగుకొని జట్టు ప్రయోజనాల కోసం వారు ప్రదర్శించిన తెగువ ప్రతి క్రికెట్ అభిమానిని కంటతడి పెట్టిస్తోంది. ఆటపై ఉన్న …

Read More »